YouSay Short News App

AA23: అల్లు అర్జున్‌, సందీప్‌ రెడ్డి వంగా బ్లాక్‌బస్టర్‌ లైనప్స్‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అర్జున్‌రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా క్రేజీ కాంబినేషన్‌లో ఓ మూవీ అనౌన్స్ అయింది.

భూషన్ కుమార్ నిర్మాతగా..

టీ సిరీస్ అధినేత భూషన్ కుమార్ ఈ మెగా పాన్ ఇండియా సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నాడు.

ఈ బ్యానర్‌లలో..

టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌లపై సినిమా తెరకెక్కనుంది. క్రిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాణ బాధ్యతలు చూసుకోనున్నారు.

బిజీబిజీగా..

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప2 సినిమాతో బిజీబిజీగా ఉన్నాడు. సందీప్‌ రెడ్డి వంగా రణ్‌బీర్‌ కపూర్‌తో ‘యానిమల్’  తెరకెక్కిస్తున్నాడు.

భారీ ప్రాజెక్టులు

భూషన్ కుమార్ సినిమాకు ముందు అల్లు అర్జున్, సందీప్ రెడ్డి వంగా చేతుల్లో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.

త్రివిక్రమ్/ సురేందర్ రెడ్డి

అల్లు అర్జున్ తన 22వ సినిమాను సురేందర్ రెడ్డితో ప్లాన్ చేసుకున్నాడు. ఇది వర్కౌట్ కాకపోతే త్రివిక్రమ్ సినిమాను పట్టాలెక్కించనున్నాడు.

ప్రభాస్‌తో స్పిరిట్..

‘యానిమల్’ మూవీ అనంతరం సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ మూవీ చేయనున్నారు. ఈ సినిమాను 2024లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

వీరి తర్వాతే..

సురేందర్ రెడ్డి/ త్రివిక్రమ్ సినిమాల అనంతరం ఐకాన్ స్టార్ సందీప్ రెడ్డి వంగా సినిమా మొదలు పెట్టనున్నట్లు టాక్.

2024 సెకండాఫ్‌లో?

అల్లు అర్జున్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చే మూవీ 2024 ద్వితీయార్ధంలో ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది.

మురగదాస్‌తో..

అల్లు అర్జున్‌తో తమ బ్యానర్‌లో సినిమా ఉంటుందని గీతా ఆర్ట్స్ వెల్లడించింది. ఈ సినిమాకు డైరెక్టర్‌గా ‘మురుగదాస్’ని ఎంచుకుంది.

ఐకాన్ లేనట్టే..

వకీల్ సాబ్ డైరెక్టర్ ‘వేణు శ్రీరామ్’తో కూడా ‘ఐకాన్’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. దీనికి ప్రొడ్యూసర్‌గా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నట్లు వెల్లడించారు. అయితే,  ఆ తర్వాత ఈ సినిమా ఊసే లేదు.

సినిమాపై భారీ హైప్..

యానిమల్, స్పిరిట్ సినిమాలు విజయం సాధిస్తే.. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాకు భారీ హైప్ క్రియేట్ అవుతుంది. అటు, బన్నీ సినిమాలు కూడా హిట్ లిస్ట్‌లో ఉండే ఛాన్స్ ఉంది. ఏదేమైనా అభిమానులకు పండగే.

మరిన్ని ఇంట్రెస్టింగ్  వెబ్‌స్టోరీల  కోసం లింక్‌ని క్లిక్ చేయండి.