AAA Cinemas: అల్లు అర్జున్ కొత్త మల్టీప్లెక్స్ ప్రత్యేకతలు తెలుసా?

YouSay Short News App

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ థియేటర్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఏషియన్ సినిమాస్‌తో కలిసి కొత్త సంస్థని స్థాపించాడు.

ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్(AAA Cinemas) పేరుతో హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఓ మల్టీప్లెక్స్‌ని నిర్మించాడు.

సినీ అభిమానులకు వరల్డ్ క్లాస్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించేందుకు ఈ మల్టీప్లెక్స్ ముస్తాబవుతోంది.

గతంలో ఇక్కడ సత్యం థియేటర్ ఉండేది. దాని స్థానంలో ఏషియన్ సత్యం మాల్ పేరుతో భారీ బిల్డింగుని నిర్మించారు.

బల్కంపేట రోడ్డు నంబర్ 16లో నిర్మించిన ఈ మాల్‌ని జూన్ 14న పూజా కార్యక్రమాలు ప్రారంభించనున్నారు.

జూన్ 15న సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా మాల్ ప్రారంభం కానుంది.

2021 నవంబర్‌లో దీనికి శంకుస్థాపన చేశారు. నాడు అల్లు అర్జున్ చేతుల మీదుగా కార్యక్రమం జరిగింది.

ఒకటో స్క్రీన్‌లో బార్కో లేజర్ ప్రొజెక్షన్‌తో పాటు అట్మాస్(ATMOS) సౌండ్ సిస్టం, రెండో స్క్రీన్‌లో ఎపిక్ లగ్జన్ స్క్రీన్ ఉంది. మిగతావి 4K స్క్రీన్లు.

థియేటర్‌లో కూర్చుని చూస్తుంటే మరో ప్రపంచంలోకి వెళ్లినట్లు అనుభూతిని కల్పించేలా లోపల ఇంటీరియర్‌ని తీర్చిదిద్దారు.

AAA ఫుడ్ కోర్టు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మూడో లెవెల్‌లో దీనిని ఏర్పాటు చేశారు. నాలుగో లెవెల్‌లో AAA సినిమాస్.

జూన్ 16న ఆదిపురుష్ స్క్రీనింగ్‌తో AAA సినిమాస్ మొదలు కానుంది. ఇందులోని మొత్తం 5 స్క్రీన్లలో ఆదిపురుష్‌ని స్ట్రీమింగ్ చేయనున్నారు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran