YouSay Short News App

21 ఏళ్ల తర్వాత భారత్‌కు మిసెస్‌ వరల్డ్‌ కిరీటం

మిసెస్‌ వరల్డ్‌ అందాల పోటీలో ప్రపంచంలోనే అందమైన శ్రీమతిగా కశ్మీర్‌కు చెందిన సర్గమ్‌ కౌశల్‌ నిలిచారు

సర్గమ్ కౌశల్‌ ద్వారా 21 ఏళ్ల తర్వాత భారత్‌కు మిసెస్‌ వరల్డ్‌ కిరీటం దక్కింది

2021 మిసెస్ వరల్డ్ విజేత షాయలిన్‌ ఫోర్డ్‌ సర్గమ్‌ కౌశల్‌కు కిరీటం అలంకరించింది. 2001లో అదితీ గోవిత్రికర్‌ తొలిసారి ఈ కిరీటాన్ని దక్కించుకున్నారు

అమెరికాలోని లాస్‌వేగాస్‌లో జరిగిన ఈ  పోటీల్లో 63 దేశాల శ్రీమతులు పాల్గొనగా కౌశల్‌ అందమే అందలమెక్కింది

‘‘దాదాపు 21  ఏళ్ల తర్వాత మనకు మళ్లీ కిరీటం వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. లవ్‌ యూ ఇండియా, లవ్‌ యూ వరల్డ్‌’’ - సర్గమ్‌ కౌశల్

ఇంగ్లీష్‌ లిటరేచర్‌లో పీజీ చేసిన సర్గమ్ కౌశల్‌ విశాఖలో కొంతకాలం టీచర్‌గా పనిచేశారు

క్యాన్సర్‌ బాధిత పిల్లల కోసం సర్గమ్‌ స్వచ్ఛంద సంస్థలతో కలిసి తనవంతు సేవలు అందిస్తున్నారు

సర్గమ్‌ కౌశల్‌ భర్త ఆది కౌశల్‌ భారత నౌకాదళ అధికారి

మిసెస్‌ వరల్డ్‌  పోటీలు1984 నుంచి జరుగుతున్నాయి