టాలీవుడ్‌ బిగ్ మూవీస్‌లో బాలీవుడ్ భామలు..కళ్లుచెదిరే రెమ్యూనరేషన్లు!

YouSay Short News App

బాలీవుడ్‌ హీరోయిన్లు తెలుగు చిత్రాల వైపు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌లో బిజీబిజీగా గడిపేస్తున్నారు అందమైన భామలు.

పాన్ ఇండియా స్టార్లు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ సరసన ఆడిపాడేందుకు సై అంటున్న ముద్దుగుమ్మలు... పారితోషికం విషయంలోనూ ఏ మాత్రం తగ్గట్లేదు.

దీపికా పదుకొణె

ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్‌ కే చిత్రంలో లీడ్‌రోల్‌ చేస్తోంది దీపికా. ఈ చిత్రంతోనే టాలీవుడ్‌లో ఆరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యింది.  ఈ సినిమాకు ఏకంగా రూ.13 కోట్లు తీసుకుంటుందని టాక్.

కియారా అద్వాణీ

వినయ విధేయ రామలో చరణ్‌తో కలిసి నటించిన కియారా మరోసారి ఆడిపాడుతోంది. శంకర్‌ తెరకెక్కిస్తున్న RC15 సినిమాలో ఛాన్స్‌ కొట్టేసింది అద్వాణీ. రూ.3.5 కోట్లు పుచ్చుకుంటుందని సమాచారం.

జాన్వీ కపూర్‌

NTR 30లో హీరోయిన్‌గా ఎంపికయ్యింది జాన్వీ కపూర్. తన ఇష్టమైన హీరోతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోనుంది జాన్వీ. సాధారణంగా చిత్రానికి రూ 3-4 కోట్లు తీసుకునే సొగసరి రూ..5 కోట్లు అడిగిందని సినీవర్గాలు చెబుతున్నాయి.

దిశా పటానీ

ప్రాజెక్ట్‌ కేలో నటిస్తున్న మరో హీరోయిన్ దిశా పటానీ. ఆమె కూడా రూ. 5 కోట్లు డిమాండ్ చేసిందని వినికిడి. ఇప్పటికే వరుణ్ తేజ్ లోఫర్‌తో తెలుగులో చేసింది దిశా.

మానుషి చిల్లర్

నిజ జీవిత సంఘటనల ఆధారంగా వస్తున్న వరుణ్ తేజ్‌ VT 13లో నటిస్తోంది మానుషి చిల్లర్. ఇటీవల ఈ విషయాన్ని యూనిట్ ప్రకటించింది. రూ.1.5 - 2 కోట్లు తీసుకుంటుందని టాక్.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.