Cyclone Biporjoy : ఆఫీసులు, స్కూళ్లు అన్నీ బంద్.. ముంచుకొస్తున్న మహా ముప్పు!

YouSay Short News App

బిపర్‌జాయ్ తుపాన్‌ గుజరాత్ తీరం వైపు దూసుకొస్తోంది

తుపాను తీవ్రతకు అరేబియా తీర ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు

ఈరోజు సా.4-8 గంటల మధ్య తుపాను తీరం దాటనుంది

ప్రస్తుతం బిపర్‌జాయ్ తుపాను గుజరాత్ తీరానికి 150కి.మీ దూరంలో ఉంది

తీరందాటే సమయంలో గంటకు 130కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.

గుజరాత్ తీరప్రాంతం రాకాసి అలలతో అల్లకల్లోలంగా మారింది. భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి

సౌరాష్ట్ర, కచ్‌ తీరాల్లో సాయంత్రం వరకు సముద్రం కల్లోలంగా ఉండనుంది

తపాను ప్రభావిత ప్రాంతాల నుంచి 74 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు

తీర ప్రాంతాల్లో 144 సెక్షన్‌లో అమల్లో ఉంచారు. ఆలయాలు, ఆఫీస్‌లు స్కూల్స్ మూసివేశారు

తుపాను వల్ల గుజరాత్‌తో పాటు మరో 8 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి

కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గోవా రాష్ట్రాల్లో హైఅలెర్ట్ ప్రకటించారు

అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను కేంద్రాన్ని  ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS) ఫొటోలు తీసింది

తుపాను కేంద్రం చాల విస్తృతంగా ఉండి చురుకుగా ముందుకు కదులుతోంది

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran