Happy Wedding Anniversary మహేశ్‌ బాబు-నమ్రత శిరోద్కర్‌

YouSay Short News App

టాలివుడ్‌ సూపర్‌స్టార్‌ కపుల్‌ మహేశ్‌ బాబు- నమ్రత శిరోద్కర్‌ ఇవాళ పెళ్లిరోజు జరుపుకుంటున్నారు. అన్యోన్యతకు మారుపేరైన  ఈ జంట గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..

మహేశ్‌ తొలిచూపులోనే పడిపోయాడు!

మహేశ్‌ సూపర్‌ స్టార్‌ కృష్ణ కుమారుడిగా సినిమా కుటుంబంలో పుట్టినట్లే…నమ్రత శిరోద్కర్‌ కూడా సినిమా కుటుంబంలోనే పెట్టారు.

మహారాష్ట్రలో 1972లో ముంబయిలో జన్మించిన నమ్రత శిరోద్కర్ ప్రముఖ నటి మీనాక్షి శిరోద్కర్‌ మనవరాలు. నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్‌ కూడా సినిమాల్లోనే ఉన్నారు.

మహేశ్‌ చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి రాగా.. నమ్రత మోడలింగ్‌తో కెరీర్‌ ప్రారంభించారు. 1993లో ఫెమీనా మిస్ ఇండియా కిరీటంతో నమ్రత తళుక్కున మెరిశారు.

‘పురాబ్‌ కి లైలా పశ్చిమ్‌ కి చైలా’ సినిమాతో 1998లో తెరంగేట్రం చేసిన నమ్రతకు 2000 సంవత్సరంలో తన తొలి తెలుగు సినిమా ‘వంశీ’ సెట్‌లో మహేశ్‌ బాబు పరిచయమయ్యారు.

మహేశ్‌, నమ్రతను చూసిన తొలి చూపులోనే ప్రేమలో పడ్డారు. నమ్రతకు కూడా మహేశ్‌పై మంచి అభిప్రాయమే ఏర్పడింది.

సినిమా షూటింగ్‌ ముందుకు సాగుతున్నకొద్దీ వీరిద్దరి మధ్య ప్రేమ కూడా పెరుగుతూ పోయింది. సినిమా పూర్తయ్యేసరికి వీరు ప్రేమికులుగా మారారు.

వంశీ తర్వాత 5 ఏళ్ల పాటు మహేశ్‌- నమ్రత ప్రేమ ప్రయాణం కొనసాగింది. అతడు సినిమా షూటింగ్‌ సమయంలో 2005 ఫిబ్రవరి 10న వీరి వివాహం జరిగింది.

మహేశ్‌ కన్నా నమ్రత నాలుగేళ్లు వయసులో పెద్ద. మహేశ్‌ ఇప్పుడు 47 సంవత్సరాలు కాగా నమ్రతకు ఇప్పుడు 51 ఏళ్లు.

2006 ఆగస్టు 31న ఈ జంటకు తొలి సంతానంగా గౌతమ్ జన్మించాడు. 2012 జూలై 20న సితారా వీరి కుటుంబంలోకి వచ్చింది.

పెళ్లికి ముందే నమ్రత సినిమాలు ఆపేశారు. 2004లో ఆమె చివరిసారి కెమెరాపై కనిపించారు.

సినిమా తెరపై కనిపించకపోయినా ప్రస్తుతం నిర్మాణ రంగంలో నమ్రత అడుగుపెట్టారు. గతేడాది ‘మేజర్‌’ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.

మహేశ్‌ నిర్వహిస్తున్న అనేక ఫౌండేషన్లకు సంబంధించిన పనులను నమ్రత చూసుకుంటారని సమాచారం. అందుకే ఫ్యాన్స్‌ ఈమెను లేడీ బాస్‌ అని ముద్దుగా పిలుచుకుంటారు.

మహేశ్‌-నమ్రత జంట ఇలాగే కలిసి మెలిసి సంతోషంగా దాంపత్య జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటూ YouSay తరఫున జంటతారలకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు