POONAM KAUR: నేను తెలంగాణ బిడ్డనే.. అయినా వెలివేస్తున్నారు

YouSay Short News App

పూనమ్ కౌర్... సినిమాలో నటిగా కొద్ది మందికే పరిచయం ఉన్నా.. వివాదాల ద్వారా ఎక్కువ మందికి తెలుసు. ఇప్పుడు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది పూనమ్.

రాజ్‌భవన్‌లో జరిగిన మహిళా దినోత్సవం వేడుకల్లో భాగంగా పూనమ్ కన్నీరు పెట్టుకోవడం సంచలనం అయ్యింది.

తెలంగాణలో పుట్టిన తనను.. పంజాబీ అమ్మాయి అంటూ దూరం పెడుతున్నారని కంటతడి పెట్టుకుంది.

ఇండస్ట్రీలో ముంబై నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఉంటుందని ఆరోపించింది.

తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తీరు మారలేదంటూ పూనమ్ మాట్లాడటం వైరల్ అవుతోంది.తనను పంజాబీ అమ్మాయంటూ వెలి వేశారని ఆరోపించింది

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి  ఓ మోడల్‌. ఫ్యాషన్ డిజైనింగ్‌లో కోర్సు పూర్తి చేసి 2005లో మిస్ ఆంధ్రా టైటిల్ గెలుచుకుంది.

ఎవరీ పూనమ్ కౌర్?

ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన మాయాజాలం చిత్రంలో శ్రీకాంత్ సరసన హీరోయిన్‌గా పరిచయం అయ్యింది పూనమ్. సహాయ పాత్రల్లోనూ మెప్పించింది.

హీరోయిన్‌గా ఎంట్రీ

పూనమ్ కౌర్ ఉత్తమ సహాయనటిగా రెండు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు గెలుచుకుంది. శౌర్య, గగనం చిత్రాల్లో నటనకు ఆమెను అవార్డులు వరించాయి.

ఫిల్మ్‌ ఫేర్‌

వివాదాలతోనే ఆమె ఎక్కువ మందికి చేరువయ్యింది పూనమ్ కౌర్. సినిమాల్లో అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది.

కేరాఫ్ కాంట్రవర్సీ

మూడేళ్ల క్రితం కృష్ణాష్టమి రోజున ఆమె చేసిన  ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. అదే రోజు పవన్ పుట్టిన రోజు కావటం, ఆ ట్వీట్‌కు పీకే లవ్‌ అని హ్యాష్‌ ట్యాగ్ పెట్టడంతో ట్రెండింగ్‌లోకి వచ్చింది పూనమ్‌.

పీకే లవ్‌

పవన్ కల్యాణ్ సినిమా విడుదల రోజు ఓ వ్యక్తితో చేసిన చాటింగ్‌ను స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేసింది అమ్మడు. అందులో బావ సినిమాకు వచ్చాను అక్కా అనే మెసేజ్ తెగ వైరల్ అయ్యింది.

బావ సినిమా

సినీ ఇండస్ట్రీలో ఓ దర్శకుడి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది పూనమ్. అవకాశాలు ఇవ్వకుండా, రాకుండా తప్పుడు వార్తలు రాయించారంటూ గురూజీ అనే హ్యాష్‌ ట్యాగ్‌ ఇచ్చింది.

# గురూజీ

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.