Rohit Sharma : భారత క్రికెట్‌లో  ఏ కెప్టెన్‌కూ సాధ్యంకాని రికార్డు నెలకొల్పిన హిట్‌మ్యాన్

YouSay Short News App

భారత క్రికెట్‌ చరిత్రలో ఏ కెప్టెన్‌కూ సాధ్యంకాని అరుదైన రికార్డును టీమిండియా సారథి రోహిత్‌ శర్మ నెలకొల్పాడు

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ - ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ రెండో రోజు ఆటలో సెంచరీ సాధించి కొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

కెప్టెన్‌గా మూడు ఫార్మాట్ల(వన్డే, టెస్ట్, టీ20)ల్లో సెంచరీలు చేసిన తొలి భారత కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయంగా నాలుగో కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు.

కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన రికార్డు ఇప్పటివరకు ముగ్గురి పేరిట ఉంది.

తొలుత శ్రీలంక మాజీ కెప్టెన్‌ తిలకరత్నే దిల్షాన్‌ ఈ ఘనత సాధించగా.. ఆ తర్వాత సౌతాఫ్రికా మాజీ సారథి డుప్లెసిస్‌, పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ కెప్టెన్లుగా ఈ ఘనత సాధించారు. తాజాగా రోహిత్‌ ఈ దిగ్గజ కెప్టెన్ల సరసన చేరాడు.

టెస్ట్‌ జట్టు కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌ సాధించిన తొలి సెంచరీ ఇదే. తాజా సెంచరీతో హిట్‌మ్యాన్‌ భారత దిగ్గజ కెప్టెన్లు గంగూలీ, ధోని, కోహ్లిలకు సాధ్యంకాని అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

టెస్ట్‌ల్లో దాదాపు రెండేళ్ల తర్వాత రోహిత్ సెంచరీ బాదాడు. కెరీర్‌లో 9వ టెస్ట్‌ శతకాన్ని నమోదు చేశాడు.

ఈ సెంచరీ చేసేందుకు 171 బంతులు ఆడిన రోహిత్‌ 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అంతర్జాతీయ కెరీర్‌లో 43వ శతకాన్ని పూర్తి చేశాడు.

ఈ మ్యాచ్‌లో రోహిత్‌ ఇన్నింగ్సే హైలైట్‌. ఓపెనర్‌గా బరిలోకి దిగిన హిట్‌మ్యాన్‌ ఓ పక్క వికెట్లు పడుతున్నా.. బ్యాటింగ్‌ను కొనసాగిస్తూ సెంచరీ పూర్తి చేశాడు.

ఆస్ట్రేలియా స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగి వారిపై ఆదిపత్యం చెలాయించాడు

చివరగా 212 బంతుల్లో 120 పరుగులు చేసిన రోహిత్.. కమిన్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు