YouSay Short News App

SRIDEVI: శ్రీదేవితో బాలకృష్ణ అందుకే నటించలేదు...NTR అసలు కారణం కాదు

శ్రీదేవి తన నట ప్రస్థానంలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ పరిశ్రమల్లో  తిరుగులేని అగ్రహీరోయిన్‌గా వెలుగొందింది.

తెలుగులో ఎన్టీఆర్, ANR, కృష్ణ, శోభన్‌బాబు వంటి అగ్రకథానాయకులతో నటించిన శ్రీదేవి తర్వాత తరం హీరోలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

అయితే బాలకృష్ణతో మాత్రం ఆమె నటించలేదు. దీనిపై టాలీవుడ్‌లో అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి

ఎన్టీఆర్ నటించిన హీరోయిన్స్‌తో నటించకూడదని  బాలయ్య అనుకున్నారని ఇప్పటికీ ఓ వార్త చలామణిలో ఉంది. వాస్తవానికి ఇది అసలు కారణం కాదని తెలిసింది.

అదే నిజమైతే ఎన్టీఆర్‌తో నటించిన రాధతో బాలకృష్ణ అనేక సినిమాల్లో నటించారు.

బాలకృష్ణతో… ముద్దుల కృష్ణయ్య, రక్తాభిషేకం వంటి హిట్ చిత్రాల్లో రాధ నటించింది

ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన చండశాసనుడు సినిమాలో రాధ హీరోయిన్‌గా నటించింది.

ఇదీ అసలు కారణం

కె రాఘవేంద్రరావు డెరెక్ట్ చేసిన 'సాహస సామ్రాట్'(1987) సినిమాలో బాలయ్య పక్కన హీరోయిన్‌గా  శ్రీదేవిని  అడిగారు.

ఈ సినిమా చేసేందుకు శ్రీదేవి ఒప్పుకుంది. శ్రీదేవి- బాలయ్య కాంబోపై అప్పట్లో పెద్దఎత్తున సినిమా మ్యాగజైన్‌లలో ప్రచారం జరిగింది

డేట్స్ కుదరకపోవడంతో ఆ సినిమాలో శ్రీదేవి నటించలేదు. శ్రీదేవి తప్పుకోవడంతో బాలయ్య సరసన ఆ సినిమాలో విజయశాంతి నటించింది

భలే దొంగ(1989) మూవీలోనూ హీరోయిన్‌గా  శ్రీదేవిని సంప్రదిస్తే ఆమెకున్న బిజీ షెడ్యూల్ వల్ల ఒప్పుకోలేదు. దీంతో అప్పట్లో బాలయ్య బాగా హర్టయ్యాడు.

తర్వాత సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్‌లో వచ్చిన ఆదిత్య 369మూవీలో శ్రీదేవిని హీరోయిన్‌గా పెడితే పాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్ ఉంటుందని నిర్మాతలు భావించారట కానీ కుదరలేదు

అంతే తప్ప ఎన్టీఆర్‌తో నటించిన హీరోయిన్లతో నటించొద్దనే నియమం బాలయ్య పెట్టుకోలేదనేది నిజం