YouSay Short News App

వచ్చే రెండెళ్లలో  ప్రభాస్ అప్‌ కమింగ్ సినిమాలు ఇవే...

తొలిసారి పోలీస్ ఆఫిసర్‌గా ప్రభాస్

బాహుబలి సినిమాతో ప్రభాస్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. దీంతో రూట్‌ మార్చి బడా డైరెక్టర్లను లైన్‌లో పెట్టాడు యంగ్ రెబల్ స్టార్. వరుస పెట్టి పెద్ద ప్రాజెక్టులకు ఓకే చెబుతున్నాడు.

ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్‌ K వంటి భారీ బడ్జెట్‌ చిత్రాల్లో నటిస్తున్నాడు. ప్రభాస్‌కు సంబంధించి రాబోయే రెండేళ్లలో వచ్చే చిత్రాలివే.

రాధే శ్యామ్ తర్వాత అంతకన్నా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ఆది పురుష్ రూ. 500 కోట్లతో దర్శకుడు ఓం రౌత్ తీర్చిదిద్దుతున్నాడు. 2023 జూన్ 16న విడుదలవుతుంది.

ఆది పురుష్‌

రాముడి పాత్రలో ప్రభాస్, కృతి సనన్‌ సీత పాత్రలో, సైఫ్ రావణుడిగా కనిపించనున్నారు. కానీ, కొన్ని నెలల క్రితం విడుదలైన టీజర్‌ పెద్దగా ఆకట్టుకోలేదు.

కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో చేతులు కలిపాడు ప్రభాస్. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పూర్తయ్యింది.

సలార్

రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో హాంబలే ఫిల్మ్ నిర్మిస్తోంది. శృతిహాసన్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2023సెప్టెంబర్ 28న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తెలుగులో సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబోలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ K. సైన్స్‌ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. డార్లింగ్ సరసన దీపికా పదుకొణె నటిస్తోంది.

ప్రాజెక్ట్‌ K

ప్రాజెక్ట్‌ K సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ రూ. 500 కోట్లతో నిర్మిస్తున్నారు. దీనికోసం ఓ గ్యారేజీని సిద్ధం చేసింది చిత్రబృందం. 2024 సమ్మర్‌లో విడుదల చేయనున్నారు.

ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్న చిత్రం స్పిరిట్. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు.

స్పిరిట్‌

2023 చివర్లో ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఎందుకంటే ప్రభాస్ మూడు సినిమాలతో, దర్శకుడు యానిమల్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. టీ సీరీస్‌ నిర్మాణంలో తెరకెక్కే అవకాశం ఉంది.

పాన్ ఇండియా ప్రాజెక్టులకు మధ్యలో వస్తున్న గ్యాప్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు బాహుబలి. కమర్షియల్ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వం వహించనున్నాడు.

మారుతి సినిమా

మారుతి సినిమాను ఇప్పటికే పట్టాలు ఎక్కించాడు ప్రభాస్. మెుదటి షెడ్యూల్‌లో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి.

మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రభాస్ చిత్రంతో హిందీలోకి అడుగుపెడుతున్నారు. షారుఖ్ ఖాన్‌ చిత్రం పఠాన్ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్ డైరెక్షన్‌లో ప్రభాస్ నటిస్తాడని అనౌన్స్ చేశారు.

పఠాన్ డైరెక్టర్‌తో

ప్రస్తుతం డార్లింగ్ చాలా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటంతో 2024లో ఈ చిత్రం పట్టాలెక్కనుంది. ఇందులో కూడా పఠాన్ తరహా యాక్షన్ ఉంటే  ఆ ఏడాది ఊపేస్తుంది.