TS BUDGET: కీలక అంశాలు

YouSay Short News App

తెలంగాణ ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి గానూ రూ.2,90,396 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది. రెవెన్యూ వ్యయం రూ.2,11,685, మూలధన వ్యయం రూ.37,325గా ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు వివరించారు.

సుసంపన్న వ్యవసాయ రాష్ట్రంగా కీర్తి గడిస్తున్న రాష్ట్రంలో సాగుకు భారీగానే నిధులు కేటాయించారు. త్వరలోనే రైతు రుణ మాఫీ కూడా చేస్తామని భరోసా ఇచ్చారు

వ్యవసాయానికి రూ.26,831 కోట్లు

బడ్జెట్‌లో కీలక కేటాయింపులు-విషయాలు

ఎకరానికి ఏటా రూ.1.5లక్షల నికర ఆదాయాన్నిచ్చే పామాయిల్‌ సాగును రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు పెంచడమే లక్ష్యంగా రూ.1000 కోట్లు కేటాయించారు.

పామాయిల్‌ సాగుకు రూ.1000 కోట్లు

1200 చెక్‌డ్యాంలు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, ఖమ్మం సీతారామ ప్రాజెక్టు, కాళేశ్వరం మొదలైన ప్రాజెక్టులతో కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో ముందకెళ్తున్నామని చెబుతూ..రూ.26,885 కోట్లు కేటాయించారు.

నీటి పారుదల రంగానికి రూ.26,885 కోట్లు

24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్‌ అందిస్తూ, వ్యవసాయానికి ఉచిత కరెంటు పంపిణీ చేస్తున్న సర్కారు ఈ సారి విద్యుత్‌ శాఖకు రూ.12,727 కోట్లు కేటాయించింది.

విద్యుత్‌ శాఖకు రూ.12,727 కోట్లు

57 ఏళ్లు పైబడిన వారందరితో పాటు ఒంటరి మహిళ, దివ్యాంగులకు ఇస్తున్న ఫించన్ల కోసం రూ.12000 కోట్లు కేటాయింపు చేశారు.

ఆసరా ఫించన్లకు రూ. 12వేల కోట్లు

తెలంగాణలో దళితుల అభ్యుదయం కోసం ప్రతి కుటుంబానికి రూ.10లక్షలు ఇచ్చే లక్ష్యంతో తీసుకొచ్చిన దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించారు.

దళితబంధుకు రూ.17,700 కోట్లు

ఎస్సీ ప్రత్యేక నిధికి ఈసారి ఘనంగా కేటాయించారు. ఏకంగా రూ.36,750 కోట్లను ప్రత్యేక ప్రగతినిధి చట్టానికి ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఎస్టీ ప్రగతికి రూ.15,233 కోట్లు కేటాయింపులు చేశారు.

ఎస్సీ ప్రగతి- రూ.36,750 కోట్లు, ఎస్టీ ప్రగతి రూ.15233 కోట్లు

జనాభాలో అత్యధిక భాగం ఉండే బీసీలకు కేటాయింపులు కాస్త నిరాశనే చెప్పాలి. రూ.6,229 కోట్లు బడ్జెట్‌ బీసీల ప్రగతికి కేటాయించారు.

బీసీ సంక్షేమం - రూ.6229 కోట్లు

పల్లె ప్రగతి, పంచాయతీరాజ్ శాఖకు రూ.31,426 కోట్లు విద్యారంగానికి రూ.19,093 కోట్లు వైద్య, ఆరోగ్యరంగానికి రూ.12,161 కోట్లు పురపాలక శాఖకు రూ.11, 372 కోట్లు హోం శాఖకు రూ.9,599 కోట్లు ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ రూ.3,210 కోట్లు

మరికొన్ని కీలక కేటాయింపులు

మహిళా శిశు సంక్షేమానికి రూ.2,131 కోట్లు మైనార్టీ సంక్షేమానికి రూ.2,200 కోట్లు హరితహారానికి రూ.1,471 కోట్లు రోడ్లు భవనాలకు రూ.2,500 కోట్లు పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు కేసీఆర్ కిట్ కోసం రూ.200 కోట్లు కొత్తగా నియమించే ఉద్యోగుల జీతభత్యాలకు రూ.1000 కోట్లు

ఏప్రిల్‌ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సెర్ఫ్‌ ఉద్యోగుల వేతన సవరణ చేయబోతున్నట్లు అసెంబ్లీ వేదికగా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు.

కీలక నిర్ణయాలు:

సొంతింటి కలగంటున్న వారికి తీపికబురు అందించారు. సొంత జాగా ఉన్నవారికి రూ.3 లక్షలు త్వరలోనే అందిస్తామని హరీశ్‌రావు తెలిపారు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.