పార్లమెంట్లో ఎప్పటి నుంచో ఓ సాంప్రదాయం కొనసాగుతోంది. అది లోక్ సభలో గ్రీన్ కార్పెట్, రాజ్యసభలో రెడ్ కార్పెట్ వినియోగించడం. ప్రస్తుతం కొత్త పార్లమెంట్లోనూ ఈ సాంప్రదాయం కొనసాగనుంది. లోక్ సభ సభ్యులు ప్రజల ద్వారా ఎన్నికవుతారు. దీంతో వారికి గుర్తుగా గ్రీన్ కార్పెట్ను వినియోగిస్తున్నారు. రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికవుతారు. రాజ్యసభ పెద్దల సభ. వారి గౌరవానికి సూచికగా రెడ్ కార్పెట్ను ఉపయోగిస్తారు.
-
© ANI Photo
-
© ANI Photo