భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక పోరులో రెండో రోజు ఆట నేడు కొనసాగనుంది. తొలిరోజు ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగింది. రోజంతా శ్రమించిన బౌలర్లు కేవలం 4 వికెట్లే తీయగలిగారు. పిచ్ ఫ్లాట్గా ఉండటంతో ఆసీస్ బ్యాటర్లు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అజేయ శతకం సాధించిన ఆసీస్ ఓపెనర్ ఖవాజా(104*)తో పాటు గ్రీన్ (49*) క్రీజులో ఉన్నాడు. రెండో రోజు భారత బౌలర్లు ఎలా రాణిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. జడేజా, అశ్విన్ చెరో వికెట్ తీసుకోగా, షమి రెండు వికెట్లు తీసుకున్నాడు. ఉదయం 9.30గంటలకు మ్యాచ్ పున: ప్రారంభం కానుంది.