డబ్ల్యూపీఎల్లో భాగంగా యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు నమోదు చేసింది. మొత్తం 20 ఓవర్లు ఆడి 4 వికెట్లు కోల్పోయి 211 పరుగులు సాధించింది. ఢిల్లీ ఓపెనర్ మెగ్ లానింగ్ (70, 10 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థ సెంచరీతో విరుచుకుపడింది. జొనాస్సేన్ (42), జెమీమా రోడ్రిగ్స్ (34) రాణించారు. యూపీ బౌలర్లలో షబ్నం ఇస్మాయిల్, రాజేశ్వరీ గైక్వాడ్, సోఫీ ఎకిల్స్టోన్, మెక్గ్రాత్లు తలో వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం యూపీ టార్గెట్ 211 పరుగులుగా ఉంది.