డబ్ల్యూపీఎల్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ స్వల్ప స్కోరుకే చాపచుట్టేసింది. మొత్తం 20 ఓవర్లు ఆడి 9 వికెట్లు కోల్పోయి 105 పరుగులు మాత్రమే చేసింది. జట్టులో కిమ్ గార్త్(32), జార్జియా వేర్హామ్(22), హర్లీన్ డియోల్(20) మాత్రమే రాణించారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో మారిజాన్నే కాప్ 5 వికెట్లు పడగొట్టి గుజరాత్ను కుప్పకూల్చింది. శిఖా పాండే 3 వికెట్లతో రాణించింది. 106 పరుగుల లక్ష్యంతో ఢిల్లీ బరిలోకి దిగనుంది.