యంగ్ హీరో సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సైంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను జీ5 దక్కించుకుంది. ఈనెల 17నుంచి జీ5లో స్ట్రీమ్ కానుంది. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సుహాస్ సరసన టీనా శిల్పారాజ్ హీరోయిన్గా నటించింది. రైటర్ పద్మభూషణ్ సినిమాకు శేఖర్ చంద్ర, కళ్యాణ్లు మ్యూజిక్ అందించారు.