టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్కి మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ ధైర్యం నూరి పోశాడు. గతేడాది డిసెంబరులో పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చావు అంచుల దాకా వెళ్లి వచ్చాడు. ఇప్పుడు క్రమంగా కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ పంత్ని కలిశాడు. త్వరగా కోలుకోవాలని యువీ ఆశించాడు. వారిద్దరూ సరదాగా కాసేపు ముచ్చటించారు. ఈ ఫొటో చూసిన నెటిజన్లు ‘ఓ పోరాట యోధుడు.. మరో పోరాట యోధుడితో’ అంటూ కామెంట్ చేస్తున్నారు. యువరాజ్ కూడా ప్రాణాంతక క్యాన్సర్ని అధిగమించిన విషయం తెలిసిందే.