దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న టాలీవుడ్ నటుల్లో అల్లు అర్జున్ ఒకరు. సోషల్ మీడియాలో బన్నీకి ఉన్న ఫాలోయింగ్ ఏ తెలుగు హీరోకు లేదు. గంగోత్రి సినిమా ద్వారా టాలీవుడ్కు పరిచయమైన బన్నీ పలు సూపర్ హిట్ సినిమాలను తీశారు. తన నటన, డ్యాన్స్, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్తో తెలుగు ఆడియన్స్ను మిస్మరైజ్ చేశారు. మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పటివరకూ అల్లుఅర్జున్ చేసిన అత్యుత్తమ చిత్రాల జాబితా మీకోసం
అల్లుఅర్జున్ను పాన్ ఇండియా స్టార్గా నిలబెట్టిన చిత్రం ‘పుష్ప’. 2021లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బన్నీని జాతీయస్థాయి నటుడిగా నిలబెట్టింది. ఇందులో బన్నీ నటనకు బాలీవుడ్ ఆడియన్స్ సైతం ఫిదా అయ్యారు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. ఫహద్ ఫాసిల్, అనసూయ, సునీల్, జగదీష్ ప్రతాప్ కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమాకు పార్ట్-2 రూపొందుతోంది. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.
అల్లుఅర్జున్ను పాన్ ఇండియా స్టార్గా నిలబెట్టిన చిత్రం ‘పుష్ప’. 2021లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బన్నీని జాతీయస్థాయి నటుడిగా నిలబెట్టింది. ఇందులో బన్నీ నటనకు బాలీవుడ్ ఆడియన్స్ సైతం ఫిదా అయ్యారు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. ఫహద్ ఫాసిల్, అనసూయ, సునీల్, జగదీష్ ప్రతాప్ కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమాకు పార్ట్-2 రూపొందుతోంది. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.
అల్లుఅర్జున్ కెరీర్లో ‘వేదం’ మరుపురాని చిత్రంగా మిగిలిపోతుంది. ఇందులో బన్నీ నటన హృదయాలను హత్తుకుంటుంది. కేబుల్ రాజు పాత్రలో బన్నీ ఒదిగిపోయారు. డబ్బు కోసం తీవ్ర ఇబ్బందులు పడే యువకుడి పాత్రలో సహజసిద్దంగా నటించారు. కొన్ని సీన్లలో బన్నీ తన నటనతో ఏడిపించేస్తారు కూడా. ఈ చిత్రంలో అల్లుఅర్జున్తో పాటు అనుష్క, మంచు మనోజ్ ప్రధాన పాత్రలు పోషించారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు.
అల్లుఅర్జున్ కెరీర్లో ‘వేదం’ మరుపురాని చిత్రంగా మిగిలిపోతుంది. ఇందులో బన్నీ నటన హృదయాలను హత్తుకుంటుంది. కేబుల్ రాజు పాత్రలో బన్నీ ఒదిగిపోయారు. డబ్బు కోసం తీవ్ర ఇబ్బందులు పడే యువకుడి పాత్రలో సహజసిద్దంగా నటించారు. కొన్ని సీన్లలో బన్నీ తన నటనతో ఏడిపించేస్తారు కూడా. ఈ చిత్రంలో అల్లుఅర్జున్తో పాటు అనుష్క, మంచు మనోజ్ ప్రధాన పాత్రలు పోషించారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు.
అల్లుఅర్జున్ - బోయపాటి శీను కాంబోలో వచ్చిన పవర్ఫుల్ యాక్షన్ మూవీ ‘సరైనోడు’. ఇందులో బన్నీ తన నటనతో మాస్ ఆడియన్స్కు పూనకాలు తెప్పించాడు. ముఖ్యంగా ఫైట్ సీన్లలో ఉగ్రరూపం చూపించాడు. బోయపాటి మార్క్ డైరెక్షన్కు బన్నీ నటన తోడవడంతో ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇందులో రకుల్ ప్రీత్సింగ్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. ఆది పినిశెట్టి, శ్రీకాంత్, సాయికుమార్, బ్రహ్మానందం, సురేఖ కీలక పాత్రలు పోషించారు.
అల్లుఅర్జున్ - బోయపాటి శీను కాంబోలో వచ్చిన పవర్ఫుల్ యాక్షన్ మూవీ ‘సరైనోడు’. ఇందులో బన్నీ తన నటనతో మాస్ ఆడియన్స్కు పూనకాలు తెప్పించాడు. ముఖ్యంగా ఫైట్ సీన్లలో ఉగ్రరూపం చూపించాడు. బోయపాటి మార్క్ డైరెక్షన్కు బన్నీ నటన తోడవడంతో ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇందులో రకుల్ ప్రీత్సింగ్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. ఆది పినిశెట్టి, శ్రీకాంత్, సాయికుమార్, బ్రహ్మానందం, సురేఖ కీలక పాత్రలు పోషించారు.
అల్లుఅర్జున్ను టాలీవుడ్లో మరింత నిలదొక్కుకునేలా చేసిన చిత్రం ‘దేశముదురు’. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో బన్నీ చెప్పే డైలాగ్స్కు యూత్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. ఈ మూవీలో బన్నీకి జంటగా హన్సిక నటించింది. ప్రదీప్ రావత్, కోవై సరళ, శ్రీనివాసరెడ్డి, అలీ, జీవా ప్రధాన పాత్రలు పోషించారు.
అల్లుఅర్జున్ను టాలీవుడ్లో మరింత నిలదొక్కుకునేలా చేసిన చిత్రం ‘దేశముదురు’. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో బన్నీ చెప్పే డైలాగ్స్కు యూత్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. ఈ మూవీలో బన్నీకి జంటగా హన్సిక నటించింది. ప్రదీప్ రావత్, కోవై సరళ, శ్రీనివాసరెడ్డి, అలీ, జీవా ప్రధాన పాత్రలు పోషించారు.