ఇంగ్లీష్లో చదవండి
మూవీ & ఓటీటీ అప్డేట్స్
స్ట్రీమింగ్ ఆన్SunNextఫ్రమ్
Watch
స్ట్రీమింగ్ ఆన్Hotstar
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
మహేష్ బాబు
అతిధిఅమృత రావు
అమృతఅన్నీ
యువ అమృతమురళీ శర్మ
ఇన్స్పెక్టర్ అజయ్ శాస్త్రి/ఖైజర్ఆశిష్ విద్యార్థి
డానీ భాయ్కోట శ్రీనివాసరావు
ఖైజర్ కింద పనిచేసే ఎమ్మెల్యేఅజయ్
ఖైజర్ సోదరుడునాసర్
హోం మంత్రిబ్రహ్మానందం
శివరామ్సునీల్
అమృత కాబోయే భర్తరవి ప్రకాష్
అతిధి స్నేహితుడుసుబ్బరాజు
గన్ని భాయ్మాధవి లత
అమృత స్నేహితురాలుఅశ్మిత కర్ణానిఅమృత తల్లి
రాజేంద్రన్
హెంచ్మాన్ప్రభాకర్
గూన్బేబీ కర్మన్ సంధు
హేమ
శంకర్ మెల్కోటే
ఇంద్రాయుధ మండల్ (అతిధి పాత్ర)
వేణు మాధవ్
రాజీవ్ కనకాల
అమృత తండ్రి (అతిధి పాత్ర)మలైకా అరోరా
సిబ్బంది
సురేందర్ రెడ్డి
దర్శకుడురమేష్ బాబు
నిర్మాతమణి శర్మ
సంగీతకారుడుసమీర్ రెడ్డి
సినిమాటోగ్రాఫర్కథనాలు
Konidela Pawan Kalyan Ane Nenu: బాహుబలిని తలపించిన పవన్ ప్రమాణ స్వీకారం.. ఆనందంతో ఉప్పొంగిన చిరంజీవి!
అంధ్రప్రదేశ్లో నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) ముఖ్య అతిథిగా విచ్చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, టీడీపీ - జనసేన - భాజపా ముఖ్యనేతలు, సినీ ప్రముఖులు, కార్యకర్తలు హాజరయ్యారు. ముందుగా నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఒక్కొక్కరుగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ 'పవన్ అనే నేను'.. అంటూ ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా అపూర్వమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
బాహుబలి రేంజ్లో..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలో జరిగిన నూతన మంత్రి వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పవన్ ప్రమాణ స్వీకారం చేయించారు. పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో ప్రాంగణంలోని వారంతా లేచి నిలుచుని చప్పట్లతో అభినందనలు తెలియజేశారు. జయజయ ధ్వానాలతో ప్రాంగణం మారుమోగిపోయేలా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘పవన్ అనే నేను’ అని జనసేనాని అనగానే సభా ప్రాంగణమంతా ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. బాహుబలి సినిమాలో ప్రభాస్ సర్వ సైన్యాధ్యాక్షుడిగా ప్రమాణం చేసే సన్నివేశాన్ని ఈ ఘటన గుర్తు చేసింది.
https://twitter.com/i/status/1800799485137944671
చిరు.. ఆనంద బాష్పాలు
పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో సోదరుడు మెగాస్టార్ చిరంజీవి పట్టరాని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తన తమ్ముడి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందని భావిస్తూ ఆనందంతో ఉప్పొంగారు. కాగా, ప్రమాణ స్వీకారం అనంతరం పవన్ వేదికపై ఉన్న అతిథులందరికీ అభివాదం చేశారు. ఆపై సోదరుడు మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి కాళ్లకు నమస్కరించారు. తాను ఎంత ఎదిగిన అన్న ముందు చిన్నవాడినేనన్న విధంగా చిరు పట్ల తనకున్న కృతజ్ఞతను తెలియజేశారు. అనంతరం చిరు.. పవన్ను ప్రేమగా దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకున్నారు. ఈ దృశ్యం సభా ప్రాంగణంలోని వారందరినీ ఉద్వేగానికి గురి చేసింది.
https://twitter.com/i/status/1800778127129595985
అపూర్వ కలయిక
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. మరో గెస్ట్గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవిని ఆప్యాయంగా పలకరించారు. అంతకుముందు ప్రధాని మోదీ వద్దకు వెళ్లిన పవన్.. తన అన్న గురించి ప్రస్తావించారు. దీంతో వెంటనే మెగాస్టార్ను గమనించిన మోదీ.. స్వయంగా పవన్తో కలిసి అతడి వద్దకు వెళ్లారు. కొద్దిసేపు చిరంజీవితో ముచ్చటించారు. అనంతరం మెగా బ్రదర్స్ చేతులు పైకెత్తి ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణమంతా మరోమారు హర్షధ్వానాలతో మారుమోగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను మెగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1800806930975449376
అతిథుల కోలాహలం
చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth) ముఖ్య అతిథి హోదాలో చిరు పక్కన స్టేజీపైన కూర్చున్నారు. మెగా పవర్ స్టార్ రామ్చరణ్ (Ram Charan) కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నారా లోకేశ్ భార్య, బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణితో రామ్చరణ్ కొద్దిసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇక నందమూరి బాలకృష్ణ కూడా హిందూపురం ఎమ్మెల్యేగా టీడీపీ తరపున గెలిచి.. కార్యక్రమంలో సందడి చేశారు. యంగ్ హీరోలు నిఖిల్, నారా రోహిత్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు.
https://twitter.com/i/status/1800778957174051224
23 మందితో నూతన మంత్రివర్గం
ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా.. పవన్ కల్యాణ్, లోకేష్ సహా మెుత్తం 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో తెదేపా నుంచి 19 మంది ఉండగా.. జనసేన నుంచి ముగ్గురు, భాజపా నుంచి ఒకరు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. సగానికిపైగా కొత్తవారికి అవకాశం లభించింది. ముగ్గురు మహిళలకు చోటు కల్పించారు. బీసీలు ఎనిమిది మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు మంత్రిపదవి కల్పించారు.
జూన్ 12 , 2024
Deviyani Sharma: “సేవ్ ది టైగర్స్” ఫేమ్ దేవియాని శర్మ గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
‘సేవ్ ద టైగర్స్’ (Save The Tigers S1 & S2)సిరీస్తో అందరి దృష్టిని ఆకర్షించిన నటి ‘దేవియాని శర్మ’ (Deviyani Sharma). ఇందులో చైతన్య కృష్ణ (Chaitanya Krishna)కు జోడీగా నటించిన ఈ భామ.. తన గ్లామర్తో ఆకట్టుకుంది. నటిగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఈ బ్యూటీ గురించి తెలుసుకునేందుకు తెలుగు ఆడియన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు (Some Lesser Known Facts about Deviyani Sharma) సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
దేవియాని శర్మ ఎవరు?
టాలీవుడ్కు చెందిన ప్రముఖ యువ నటి.
దేవియాని శర్మ ఎక్కడ పుట్టింది?
న్యూఢిల్లీ
దేవియాని శర్మ పుట్టిన తేది?
మే 30, 1993
దేవియాని శర్మ వయసు ఎంత?
ఈ భామ వయసు ప్రస్తుతం 31 సంవత్సరాలు (2024)
దేవియాని శర్మ తల్లిదండ్రులు ఎవరు?
సునీల్ శర్మ, నీనా శర్మ
దేవియాని శర్మ తోబుట్టువులు ఉన్నారా?
ఈ బ్యూటీకి ఒక సోదరి ఉంది. ఆమె పేరు సోనం శర్మ
దేవియాని శర్మ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది?
ఈ నటి విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే జరిగింది.
దేవియాని శర్మ ఏం చదివింది?
ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసింది.
దేవియాని శర్మ ఎత్తు ఎంత?
165 సెం.మీ
దేవియాని శర్మ ప్రస్తుతం ఎక్కడ ఉంటోంది?
2019 నుంచి ఆమె హైదరాబాద్లోనే నివసిస్తోంది.
దేవియాని శర్మ సినిమాల్లోకి రాకముందు ఏం చేసింది?
కెరీర్లో ప్రారంభంలో ఈ బ్యూటీ మోడల్గా చేసింది. కొన్ని వాణిజ్య ప్రకటనల్లో సైతం నటించింది.
దేవియాని శర్మ తొలి చిత్రం?
2020లో వచ్చిన ‘భానుమతి & రామకృష్ణ’ (Bhanumathi & Ramakrishna)సినిమాలో ఓ అతిధి పాత్రతో తొలిసారి తెరంగేట్రం చేసింది.
దేవియాని శర్మ తొలి వెబ్సిరీస్?
2020లో జీ5లో స్ట్రీమింగ్లోకి వచ్చిన 'అనగనగా' (Anaganaga).. ఆమె చేసిన తొలి సిరీస్. ఇందులో లీడ్ రోల్లో కనిపించి దేవియాని గుర్తింపు పొందింది.
దేవియాని శర్మ ఇప్పటివరకూ చేసిన చిత్రాలు/ సిరీస్లు?
‘భానుమతి & రామకృష్ణ’, 'రొమాంటిక్' (Romantic), సైతాన్ (Shaitan), సేవ్ ద టైగర్స్ 1 & 2 (వెబ్సిరీస్)
దేవియాని శర్మకు పాపులారిటీ తీసుకొచ్చిన చిత్రం/ వెబ్సిరీస్?
హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్లోకి వచ్చిన ‘సేవ్ ద టైగర్స్’ ఆమెకు తెలుగులో మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ సిరీస్ ద్వారా అందం, అభినయంతో దేవియాని యూత్ను ఆకర్షించింది.
దేవియాని శర్మ హామీలు ఏంటి?
దేవియానికి ట్రావెలింగ్, పెయింటింగ్ అంటే చాలా ఇష్టమట.
దేవియాని శర్మకు ఇష్టమైన పెంపుడు జంతువు?
డాగ్
దేవియాని శర్మ పేవరేట్ హీరో, హీరోయిన్ ఎవరు?ఈ విషయాన్ని దేవియాని శర్మ ఏ ఇంటర్యూలోనూ పంచుకోలేదు.
దేవియాని శర్మ ఇన్స్టాగ్రామ్ ఖాతా?
https://www.instagram.com/deviyyani/?hl=en
https://www.youtube.com/watch?v=4ZnkBGYa4Gg
ఏప్రిల్ 04 , 2024
Chiranjeevi - Balakrishna: బాలకృష్ణతో మల్టీస్టారర్.. చిరంజీవి ఛాలెంజ్ను స్వీకరించిన డైరెక్టర్?
టాలీవుడ్ అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆదివారం (సెప్టెంబర్ 1) బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ (NBK 50 Years Celebrations) కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చి బాలకృష్ణ నట జీవితం, ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సైతం ముఖ్య అతిథిగా విచ్చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో దర్శకుడు బోయపాటితో పాటు ఇతర కథా రచయితలకు బంపరాఫర్ ఇచ్చారు. ప్రస్తుతం ఇది టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
బాలయ్యతో మల్టీస్టారర్కు గ్రీన్ సిగ్నల్
బాలకృష్ణ సినీ స్వర్ణోత్వవ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి క్రేజీ కామెంట్స్ చేశారు. బాలయ్య 50 ఏళ్ల వేడుకలో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఇది కేవలం బాలయ్యకు సంబంధించిన వేడుక మాత్రమే కాదని యావత్ తెలుగు సినీ పరిశ్రమ వేడుక అని అన్నారు. ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ సినిమాలకు బాలయ్య మారుపేరుగా మారారని కొనియాడారు. ‘ఇంద్ర’ సినిమా చేయడానికి ఒకరకంగా బాలకృష్ణనే తనకు ప్రేరణ అని చిరు చెప్పుకొచ్చారు. ఇంద్రసేనా రెడ్డి, సమరసింహారెడ్డి పాత్రలతో ఎవరైనా డైరెక్టర్ గానీ, రచయిత గానీ మంచి కథతో వస్తే తాను నటించడానికి సిద్ధమని మెగాస్టార్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ‘నీవూ రెడీనా’ అని అనగానే బాలకృష్ణ సైతం డబుల్ ఓకే అంటూ సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో డైరెక్టర్ బోయపాటి శ్రీనును ప్రత్యేకంగా సూచిస్తూ మీరు కథ రాస్తే నటించడానికి రెడీ అంటూ ఛాలెంజ్ చేశారు. అదే సమయంలో వైవీఎస్ చౌదరి పేరును కూడా చిరు ప్రస్తావించారు.
https://twitter.com/i/status/1830519890249421017
బోయపాటే ఎందుకు?
బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ఇండస్ట్రీ నుంచి చాలామంది డైరెక్టర్లు హాజరయ్యారు. అయితే వారిని కాదని బోయపాటి శ్రీను పేరునే చిరు ప్రస్తావించడానికి ఓ బలమైన కారణమే ఉంది. ప్రస్తుత డైరెక్టర్లలో యాక్షన్ సినిమాలకు కేరాఫ్గా బోయపాటి ఉన్నారు. పైగా బాలకృష్ణ లాంటి సీనియర్ నటుడితో ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను తీశారు. దీంతో బోయపాటి అయితేనే ఈ భారీ మల్టీస్టారర్కు న్యాయం చేయగలరని చిరు భావించి ఉండవచ్చు. అందుకే ‘ఓయ్ బోయపాటి.. ఛాలెంజ్’ అంటూ ముందుగా ఆయన పేరునే ప్రస్తావించినట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో సీనియర్ డైరెక్టర్ వై.వీ.యస్. చౌదరి, ఇతర కథా రచయితలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ పరోక్షంగా చిరు సూచించారు.
రంగంలోకి వై.వి.ఎస్..?
ఇంద్ర, సమరసింహారెడ్డి సినిమాలను ఆధారంగా చేసుకొని చిరంజీవి, బాలయ్య పాత్రలను రాయడానికి తాను సిద్దమే అంటూ దర్శక, నిర్మాత వైవీఎస్ చౌదరీ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా మెుదలుపెట్టినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. వైవీఎస్ చౌదరీ విషయానికి వస్తే ఆయన నందమూరి కుటుంబానికి వీరాభిమాని. అంతేగాదు ఆ ఫ్యామిలీతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. బాలయ్య, హరికృష్ణతో ఆయన గతంలో సినిమాలు కూడా తీశారు. అయితే కొద్దికాలంగా ఇండస్ట్రీకి దూరమైన ఆయన తాజాగా కొత్త ప్రాజెక్ట్ను ప్రకటించారు. తన కథతో చిరు. బాలయ్యను ఒప్పించగలిగితే టాలీవుడ్లో నెవర్ బిఫోర్ మల్టీస్టారర్ రావడం పక్కా అని చెప్పవచ్చు.
ఫ్యాన్ వార్పై చిరు క్రేజీ కామెంట్స్
సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ ఇటీవల బాగా ఎక్కువైంది. ఈ నేపథ్యంలో బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఈవెంట్లో చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఫ్యాన్స్ గొడవలు పడుతుంటారు. హీరోల మధ్య ఎటువంటి మంచి బంధం ఉంటుందో తెలియడం కోసం కొన్ని వేడుకలు చేసుకునేవాళ్లం. అందుకే మా అభిమానులు కూడా కలిసి కట్టుగా ఉంటారు. మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా బాలయ్య వస్తారు. మాతో కలిసి డ్యాన్స్ కూడా చేస్తారు. 50 సంవత్సరాల ఈ ప్రయాణం ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్యకే సొంతం. భగవంతుడు ఆయనకు ఇదే శక్తిని ఇస్తూ 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను' అని మెగాస్టార్ అన్నారు.
సెప్టెంబర్ 02 , 2024
Allu vs Mega Families: మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ స్ట్రాంగ్ కౌంటర్? చిరు బర్త్డే విషెస్లోనూ కానరాని ఎఫెక్షన్!
పాలు, నీళ్లలా కలిసి ఉండే అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య మనస్పర్ధలు తలెత్తినట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ ఎన్నికల సమయంలో పవన్కు వ్యతిరేకంగా వైకాపా అభ్యర్థికి బన్నీ మద్దతు తెలపడం, ఓటు వేయాలని ప్రచారం కూడా చేయడం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా అల్లు అర్మీ, మెగా ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కల్యాణ్ పరోక్షంగా ‘పుష్ప’ సినిమాపై విమర్శలు చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే అల్లు అర్జున్ తాజాగా చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. సోషల్ మీడియాలో మరోమారు ఫ్యాన్ వార్కు కారణమయ్యాయి. దీంతో అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న వివాదం మరోమారు బట్టబయలైందన్న ప్రచారమూ ఊపందుకుంది. ఈ దెబ్బతో రెండు కుటుంబాల మధ్య ఉన్న రిలేషన్ కటీఫేనా అన్న అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.
‘నా మనసుకు నచ్చితే వస్తా’
రావు రమేశ్ ప్రధాన పాత్రలో నటించిన 'మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం' ప్రిరీలిజ్ ఈవెంట్కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ వేడుకలో సందడి చేశారు. సుకుమార్ భార్య తబిత సమర్పణలో వస్తోన్న సినిమా కావడంతో వారిద్దరూ ఈవెంట్కు హాజరయ్యారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్కు చురకలు అంటించారు. ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమాని సుకుమార్ భార్య తబిత ప్రెజెంట్ చేస్తున్నారు. మేం పుష్ప 2 క్లైమాక్స్ షూట్లో ఉండగా ఆమె వచ్చి సుకుమార్, మిమ్మల్ని కాకుండా నేను నా సినిమా ఈవెంట్కు ఎవరిని పిలవగలను అని అన్నారు. ఇప్పటి వరకూ నేను నటించిన వాటిలో అతికష్టమైన క్లైమాక్స్ పుష్ప 2ది. అలాంటి పరిస్థితిలోనూ ఆమె ఆహ్వానించారని వచ్చా. ఇష్టమైన వారిపై మన ప్రేమ చూపించాలి. మనం నిలబడగలగాలి. నాకు ఇష్టమైతే నేనొస్తా. నా మనసుకు నచ్చితే వస్తా’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. వైకాపా అభ్యర్థి తరపున ప్రచారం చేసిన బన్నీ పవన్ కోసం కూడా చేయవచ్చు కదా అన్న విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే బన్నీ ఈవిధంగా బదులిచ్చి ఉండొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
https://twitter.com/i/status/1826302303244091491
‘నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి’
ఇదే ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన అభిమానులైన అల్లు అర్మీ గురించి బన్నీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారిని ఆకాశానికెత్తుతూ మాట్లాడారు. ‘మై డియర్ ఫ్యాన్స్. నా ఆర్మీ. ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. హీరోని చూసి చాలామంది ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా. నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్లవుతున్నా మీరు చూపే ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ఎప్పటికీ రుణపడి ఉంటా. మరోసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. తప్పకుండా ఎక్కువ సినిమాలు చేస్తా. తెరపై తరచూ కనిపిస్తా' అని అన్నారు. అయితే గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ఫ్యాన్స్ గురించి బన్నీ ఎప్పుడు మాట్లాడలేదు. వైకాపా నేతకు మద్దతు తెలిపినప్పటి నుంచి బన్నీని జనసైనికులతో పాటు మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ వచ్చారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేశారు. ఆ సమయంలో అల్లు అర్మీ తమ హీరోకి మద్దతుగా నిలిచి గొప్పగా పోరాడింది. మెగా ఫ్యాన్స్ ఆరోపణలకు ఎక్కడికక్కడ చెక్ పెడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్కు తనదైన శైలిలో ఐ లవ్ యూ చెబుతూ బన్నీ కృతజ్ఞతలు చెప్పి ఉండొచ్చు. అయితే బన్నీ స్పీచ్లో గమనించాల్సిన అంశం ఇంకోటి కూడా ఉంది. ఆయన గతంలో ఎప్పుడు మెగా ఫ్యాన్స్, అల్లు ఆర్మీని సెపరేట్ చేసి మాట్లాడింది లేదు. కానీ ఈ సారి అల్లు అర్మీ అంటూ బన్నీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో మెగా ఫ్యాన్స్లో చీలికలను బన్నీ ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
చిరుకి సింపుల్ విషెస్..!
నేడు (ఆగస్టు 22) మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మెగా అభిమానుల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. దాదాపు 30 ఏళ్ల పాటు తెలుగులో టాప్ హీరోగా నిలిచిన తమ హీరోకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కూడా మెగాస్టార్కు బర్త్డే విషెస్ చెప్పారు. అయితే తనకు లైఫ్ ఇచ్చిన చిరంజీవికి సింపుల్గా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై మెగా అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బన్నీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ 'మన మెగాస్టార్ చిరంజీవి గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే' అంటూ బన్నీ పోస్టు పెట్టాడు. అయితే గతంలో బన్నీ ఈ విధంగా ట్వీట్ ఎప్పుడు పెట్టలేదు. చిరు బర్త్డే అంటే ఎంతో హడావిడి చేసే బన్నీ ఇలా సింపుల్గా విషెస్ చెప్పి చేతులు దులిపేసుకోవడం వెనకు ఇరు కుటుంబాల మధ్య తలెత్తిన వివాదమే కారణమై ఉండొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు.
https://twitter.com/alluarjun/status/1826438293350711467
బన్నీకి పవన్ చురకలు!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల కర్ణాటకలో పర్యటించారు. ఈ సందర్బంగా నిర్వహించిన ప్రెస్మీట్లో పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరోలు అడవులను కాపాడేవారని పవన్ కల్యాణ్ అన్నారు. అయితే ఇప్పటి సినిమాల్లో హీరోలు అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. అలా పరిస్థితి మారిపోయిందంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ టాలీవుడ్లో వైరల్గా మారాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాను ఉద్దేశించే పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది. దీనిపై జనసైనికులు, మెగా ఫ్యాన్స్ - అల్లు ఆర్మీ మధ్య పెద్ద ఫ్యాన్ వారే జరిగింది.
ఆగస్టు 22 , 2024
Anjali : ఆయనపై ఎప్పటికీ నాకు అదే ఉంటుంది.. బాలకృష్ణ ఇష్యూపై అంజలి కామెంట్స్!
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) ప్రీ రిలీజ్ ఈవెంట్లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వ్యవహార శైలిపై నెట్టింట తీవ్ర దుమారం రేగింది. ప్రముఖ నటి అంజలి (Actress Anjali)ని బాలకృష్ణ నెట్టివేయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంజలి పట్ల బాలయ్య అనుచితంగా ప్రవర్తించారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను రెండ్రోజులుగా వైరల్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. తాజాగా హీరోయిన్ అంజలి కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. ట్రోలర్స్కు ఇండైరెక్ట్గా గట్టి కౌంటర్ ఇచ్చింది.
‘మేము గొప్ప స్నేహితులం’
స్టార్ హీరోయిన్ అంజలి (Anjali).. బాలకృష్ణపై వస్తోన్న విమర్శలపై పరోక్షంగా స్పందించింది. ఎక్స్ వేదికగా ఓ ప్రత్యేక పోస్టు పెట్టింది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ-రిలీజ్ ఈవెంట్కి అతిథిగా వచ్చినందుకు బాలకృష్ణ గారికి నా ధన్యవాదాలు. బాలకృష్ణ గారికి నాకు ఒకరి పట్ల ఒకరికి పరస్పర గౌరవం ఉంది. మేము చాలా కాలం నుంచి గొప్ప స్నేహితులం. ఆయనతో మళ్లీ వేదిక పంచుకోవడం అద్భుతంగా అనిపించింది’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా బాలయ్యతో పాటు ఉన్న ఓ మెమోరబుల్ వీడియోను అభిమానులతో పంచుకుంది. దీంతో అంజలి పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. అంజలి పోస్టును షేర్ చేస్తూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.
https://twitter.com/yoursanjali/status/1796260781551682021
నెటిజన్లు భిన్నాభిప్రాయాలు
అంజలి పోస్టుపై కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఇంత ఆలస్యంగా స్పందించడం ఏంటని ఆమెపై మండిపతున్నారు. బాలకృష్ణ తోసేసిన వ్యవహారం రెండ్రోజులుగా సోషల్ మీడియాను ఊదరకొడుతున్న క్రమంలో కాస్త త్వరగా స్పందించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. నటి స్పందించే లోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని బాలయ్య ఫ్యాన్స్ వాపోతున్నారు. మరోవైపు బాలయ్య యాంటి ఫ్యాన్స్ నటి అంజలిపై సానుభూతి చూపిస్తున్నారు. కొందరి ఒత్తిడి తట్టుకోలేకనే ఆమె ఈ పోస్టు చేయాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు.
https://twitter.com/GoneWorse/status/1796158320778117123
నిర్మాత ఏమన్నారంటే..
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నిర్మాత నాగవంశీ కూడా బాలయ్య వైరల్ వీడియోపై ఇటీవలే స్పందించారు. ఫొటోకు పోజు ఇచ్చేందుకు వెనక్కి జరగాలని బాలయ్య చనువుకొద్దీ అలా చేశారని అన్నారు. నలుగురు వ్యక్తులు ఉన్నప్పుడు తమకున్న పరిచయం, చనువును బట్టి అలా ఎవరైనా చేస్తారని చెప్పారు. ఆ చర్యకు ముందూ.. వెనక ఉన్న పూర్తి వీడియోను చూడకుండా ఇలాంటి వాటిని ప్రచారం చేయడం తగదన్నారు. ఆ తర్వాత బాలకృష్ణ, అంజలి హైఫై అంటూ చేతులతో చప్పట్లు కొడుతున్న దృశ్యాన్ని ఎవరూ చూపించలేదని చెప్పారు. పూర్తి వీడియోను ఓ సారి చూసేయండి.
https://twitter.com/DeepikaBhardwaj/status/1796143784851325044
నేషనల్ వైడ్గా వైరల్
నటుడు బాలకృష్ణ.. నటి అంజలిని ఏ ఉద్దేశ్యంతో తోసిన అది.. నేషనల్ వైడ్గా మాత్రం ట్రెండ్ అయింది. ప్రముఖ జాతీయ మీడియాలు సైతం ఆ వీడియోను ప్రసారం చేశాయి. ఎంత చనువు ఉన్నా ఒక నటితో అలా ప్రవర్తిస్తారా అంటూ జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం పక్కకు వెళ్లింది. అంతా బాలయ్య-అంజిలి గురించే చర్చించుకున్నారు.
మే 31 , 2024
Rashmika Mandanna: ‘నీ యబ్బ.. నువ్వు నా ఫ్యామిలీరా’.. రష్మిక క్లారిటీ ఇచ్చిందోచ్!
వెండితెరపై మంచి జోడీగా పేరున్న జంటల్లో విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న ముందు వరుసలో ఉంటారు. ‘గీతా గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట.. అతి తక్కువ సమయంలోనే బెస్ట్ ఫ్రెండ్స్గా మారిపోయారు. అయితే వీరి మధ్య స్నేహానికి మించి ఇంకేదో ఉన్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. విజయ్ - రష్మిక డీప్ లవ్లో ఉన్నట్లు మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. తాము కేవలం స్నేహితులమేనని పలు సందర్భాల్లో వీరు స్పష్టం చేసిన్పపటికీ ఈ రూమర్లకు బ్రేక్ పడలేదు. అయితే తాజాగా రష్మిక మందన్న చేసిన వ్యాఖ్యలు విజయ్, ఆమెకు మధ్య ఏదో ఉందన్న సంకేతాలు ఇచ్చాయి.
‘నీ యబ్బ.. నువ్వు నా ఫ్యామిలీరా’
విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన 'గం గం గణేశా'.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మిక మందన్న ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ వేడుకలో రష్మికను ఆనంద్ పలు ప్రశ్నలు అడిగాడు. ఇటీవల రష్మిక పోస్టు చేసిన పెట్ డాగ్ ఫొటోల్లో విజయ్ పెట్ కూడా ఉంది. ఆ ఫొటోలు చూపించి వాటిలో ఏది నీ ఫేవరేట్ అని అడగ్గా రష్మిక.. ఆరా (రష్మిక పెట్ డాగ్) నా ఫస్ట్ బేబీ, స్మార్ట్ (విజయ్ పెట్ డాగ్) నా సెకండ్ బేబీ అని చెప్పింది. తర్వాత నీ ఫేవరేట్ కో-స్టోర్ ఎవరు అని ఆనంద్ ప్రశ్నించాడు. అప్పుడు రష్మిక మైక్ పక్కన పెట్టి నీ యబ్బ అని సరదాగా తిట్టింది. వెంటనే మైక్ తీసుకొని “ఆనంద్ నువ్వు నా ఫ్యామిలిరా.. ఇలా స్పాట్లో పెడితే ఎలా” అని చెప్పడంతో అక్కడి వారంతా కేకలు పెట్టారు. ఫ్యాన్స్ వెంటనే రౌడీ, రౌడీ స్టార్ అని అరడవంతో రౌడీ బయ్ నా ఫేవరేట్ అని విజయ్ను ఉద్దేశించి చెప్పింది. ప్రస్తుతం రష్మిక - ఆనంద్ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
https://youtu.be/LGt6bCE2ZMo?si=uV2RIkLzfv8Kjj_p
క్లారిటీ ఇచ్చేసినట్లేనా?
రష్మిక లేటెస్ట్ కామెంట్స్తో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తమ హీరోతో ఉన్న రిలేషన్పై ఇన్నాళ్లకు రష్మిక నోటి నుంచి ఓ క్లారిటీ వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. ఆనంద్ దేవరకొండతో ‘మనం ఓ ఫ్యామిలీ’ అంటూ చెప్పడం ద్వారా విజయ్తో తన ప్రేమయాణాన్ని రష్మిక రివీల్ చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో విజయ్, రష్మిక విడివిడిగా పోస్టు ఫొటోలు ఒకే లోకేషన్వి కావడంతో వారు డేట్లో ఉన్నట్లు వార్తలు పుకార్లు మెుదలయ్యాయి. ఇందులో వాస్తవమేదో తెలియక అటు విజయ్ ఫ్యాన్స్, ఇటు రష్మిక ఫ్యాన్స్ తలలు బాదేసుకునేవారు. ఇన్నాళ్లకు తమకు కావాల్సిన సమాధానం వచ్చిందని ఇరువురు ఫ్యాన్స్ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. విజయ్ - రష్మిక రీల్ లైఫ్లోనే కాదు.. రియల్ లైఫ్లోనూ చూడముచ్చటగా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.
మెంటల్ క్యారెక్టర్ చేయాలి: రష్మిక
ఆనంద్ దేవరకొండకు 'బేబీ' (Baby) ద్వారా బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ సాయి రాజేష్ (Sai Rajesh) కూడా ఈ ఈవెంట్కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన గురించి రష్మిక మాట్లాడుతూ 'నేను బేబీ సినిమా చూశాను. ఆ సినిమా చూశాక మీతో సినిమా చేయాలని అనుకున్నాను. అలాంటి సినిమా చేయడం అంటే అంత ఈజీ కాదు. మీ హార్డ్ వర్క్, డెడికేషన్ నాకు తెలుసు. మెుదటిసారి బేబీ చూసినప్పుడు ఏడ్చేశా. ఒక నటిగా ఆ సినిమా చూశాక.. ఒక మెంటల్ క్యారెక్టర్ అయినా మీ డైరెక్షన్లో చేయాలనిపించింది' అని రష్మిక వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://twitter.com/i/status/1795146872748728505
‘గం గం గణేశా’ రిలీజ్ ఎప్పుడంటే?
ఇక గం గం గణేశా చిత్రానికి వస్తే.. ఈ మూవీకి ఉదయ్ శెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో ఆనంద్ దేవరకొండ సరసన ప్రగతి శ్రీవాత్సవ, నయన్ సారిక నటించారు. ఈ సినిమాలో జబర్దస్త్ ఫేమ్ ఇమ్మాన్యుయేల్, బిగ్ బాగ్ ఫేమ్ ప్రిన్స్ యావర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే ‘గం గం గణేశా’ సినిమా నుంచి రిలీజయిన టీజర్, ట్రైలర్స్తో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మే 31న ఈ సినిమా గ్రాండ్గా విడుదల కానుంది.
మే 28 , 2024
Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ సినిమా? క్లారిటీ!
యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల వచ్చిన 'ఫ్యామిలీ స్టార్' (Family Star) చిత్రం.. కలెక్షన్లు రాబట్టడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో విజయ్ కెరీర్ పరంగా బిగ్గెస్ట్ సక్సెస్ కోసం విజయ్ ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం అతడి దృష్టంతా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందనున్న లవ్ ఎంటర్టైనర్ మీదనే ఉంది. ఈ క్రమంలోనే ‘సలార్’, ‘కేజీఎఫ్’ వంటి బ్లాక్ బాస్టర్లు అందించిన ప్రశాంత్ నీల్తో విజయ్ భేటి కావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. వీరి కాంబోలో ఏమైనా సినిమా ఉంటుందా? అన్న ఆసక్తి టాలీవుడ్ వర్గాల్లో మెుదలైంది.
ఎందుకు కలిశారంటే!
హైదరాబాద్ ఫిల్మ్నగర్లో ఉన్న విజయ్ దేవరకొండ ఇంటికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వెళ్లి కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతుందన్న పుకార్లు మొదలయ్యాయి. ముఖ్యంగా హ్యాట్రిక్ ఫ్లాపులతో సతమతమవుతున్న విజయ్.. ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్తో పని చేయబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ‘సలార్ 2’లో విజయ్ అతిథి పాత్ర పోషించబోతున్నట్లు టాలీవుడ్లో స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఈ పాత్ర గురించి చర్చించడానికే ప్రశాంత్ నీల్.. విజయ్ ఇంటికి వెళ్లారని సమాచారం. 'సలార్ 2' క్లైమాక్స్లో విజయ్ కనిపిస్తాడని అంటున్నారు. ఆయన రోల్ సినిమాకు చాలా కీలకంగా ఉండనుందని టాక్. అయితే దీనిపై మూవీ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
చిక్కుల్లో విజయ్ కెరీర్!
విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన గత మూడు చిత్రాలు ‘లైగర్’ (Liger), ‘ఖుషి’ (Kushi), ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star).. బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. ముఖ్యంగా రెండేళ్ల కిందట వచ్చిన లైగర్ భారీ నష్టాలను మిగిల్చింది. తాజాగా రిలీజైన ‘ఫ్యామిలీ స్టార్’ కూడా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. దీంతో నిర్మాత దిల్ రాజు కూడా భారీగా నష్టాలు చవిచూసినట్లు ఇండస్ట్రీలో టాక్ ఉంది. మరోవైపు తనకు ‘గీత గోవిందం’ లాంటి హిట్ ఇచ్చిన పరశురాం కూడా విజయ్ లక్కును మార్చలేకపోయాడు. దీంతో విజయ్కు బ్లాక్ బాస్టర్ తప్పనిసరిగా మారింది. మరో ప్లాపు విజయ్ ఖాతాలో పడితే అతడి కెరీర్ సమస్యల్లో పడవచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
విజయ్ ఫ్లాప్స్కు చెక్ పడేనా?
విజయ్(Vijay Deverakonda) తన తర్వాతి చిత్రం 'VD12'ను గౌతం తిన్ననూరి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్.. పాన్ ఇండియా స్థాయిలో రూపొందించనుంది. ఇందులో విజయ్కు జోడీగా 'ప్రేమలు' బ్యూటీ మమితా బైజు (Mamita Baiju)ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల వచ్చిన ‘ప్రేమలు’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అయ్యింది. ఓవర్సీస్లోనూ మంచి వసూళ్లను సాధించడంతో ఈ అమ్మడి మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో మమితా బైజును తీసుకుంటే సినిమాకు బాగా కలిసొస్తుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. పైగా కొత్త తరహా లవ్ స్టోరీ కావడం, విజయ్ మమితా తొలిసారి జోడీ కడుతుండటం సినిమాకు ప్లస్ అవుతుందని చిత్ర యూనిట్ అభిప్రాయపడుతోంది. మరి ఈ కేరళ బ్యూటీ విజయ్ ఫ్లాప్స్కు చెక్ పెడుతుందో లేదో చూడాలి.
https://telugu.yousay.tv/exclusive-premalu-heroine-romance-with-vijay-deverakonda.html
ఏప్రిల్ 24 , 2024
Lal Salaam Movie Review In Telugu: రజనీకాంత్ సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు : రజనీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్, కపిల్ దేవ్, నిరోషా రాధా, సెంథిల్, జీవిత, తంబి రమేష్ తదితరులు
దర్శకత్వం: ఐశ్వర్య రజనీకాంత్
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
సినిమాటోగ్రఫీ : విష్ణు రంగస్వామి
నిర్మాత: సుభాస్కరణ్ అల్లిరాజా
విడుదల తేదీ : 09 ఫిబ్రవరి, 2024
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో (Lal Salaam Movie Review In Telugu) నటించిన లేటెస్ట్ చిత్రం ‘లాల్ సలామ్’ (Lal Salaam). ఈ సినిమాకు ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. విష్ణు విశాల్, విక్రాంత్ ముఖ్యపాత్రలు పోషించారు. భారత మాజీ క్రికెటర్ కపిల్దేవ్ కూడా అతిథి పాత్రలో నటించారు. క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్ మూవీ ఇవాళ థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాతో ప్రముఖ హీరోయిన్ జీవితా రాజశేఖర్ రీ ఎంట్రీ ఇచ్చారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? రజనీ మరోమారు తన నటనతో మెప్పించాడా? కూతురికి విజయాన్ని అందించాడా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ
తిరు (విష్ణు విశాల్), మెుయిద్దీన్ భాయ్ (రజనీకాంత్) కొడుకు షంశుద్దిన్ చిన్నప్పటి నుంచి ప్రత్యర్థులు. మెుయిద్దీన్ భాయ్ స్థాపించిన త్రీ స్టార్ క్రికెట్ జట్టులో కీలక ప్లేయర్లుగా ఉంటారు. తిరు సక్సెస్ పట్ల అసూయ పడే కొందరు వ్యక్తులు అతడు జట్టు నుంచి బయటకొచ్చి కొత్త టీమ్ పెట్టుకునేలా ప్రేరేపిస్తారు. ఈ క్రమంలో తిరు.. ఎంసీసీ టీమ్ను ఏర్పాటు చేస్తాడు. అయితే ఈ జట్లు రెండు విభిన్న మతాలను (హిందూ - ముస్లిం) రిప్రెజెంట్ చేస్తాయి. ఊర్లో ఈ రెండు జట్ల మ్యాచ్ అంటే అది ఇండియా - పాక్ మ్యాచ్ను తలపిస్తుంది. ఈ క్రమంలో ఓ మ్యాచ్ తిరు-షంశు జీవితాలను మలుపు తిప్పుతుంది. జాతీయ జట్టుకు ఆడాలన్న షంశు కలను ప్రశ్నార్థకం చేస్తుంది. ఇంతకీ ఆ మ్యాచ్లో ఏం జరిగింది? మతాల వారిగా విడిపోయిన ఊరు, జట్లను మెుయిద్దీన్ భాయ్ ఎలా కలిపాడు? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే?
లాల్ సలాం చిత్రంలో రజనీకాంత్ (Lal Salaam Movie Review In Telugu) ప్రత్యేక పాత్రలో కనిపించినా కథను ఆయన పూర్తిగా ఆక్రమించేశారు. మరోమారు తన అద్భుతమైన నటనతో మెప్పించారు. ఒక కొడుక్కి తండ్రిగా, మత పెద్దగా మెుయిద్దీన్ పాత్రలో ఆయన జీవించారు. కనిపించింది కొద్దిసేపే అయినా సినిమాకు రజనీ వెన్నెముకగా మారారు. ఇక ప్రత్యర్థులుగా విష్ణు విశాల్, విక్రాంత్ నటన ఆకట్టుకుంది. వారు ప్రొఫెషనల్ క్రికెటర్స్లా స్క్రీన్పై కనిపించారు. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అతిథి పాత్రలో కనిపించి ప్రేక్షకలకు సర్ప్రైజ్ ఇచ్చారు. నిరోషా రాధా, సెంథిల్, జీవిత, తంబి రమేష్ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్.. రెండు విభిన్న మతాలను (Lal Salaam Movie Review In Telugu) తన కథాంశంగా ఎంచుకోవడం సాహసమనే చెప్పాలి. ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఆమె కథను తీర్చిదిద్దారు. పవర్ఫుల్ సబ్జెక్ట్ను ఆమె ఎంచుకున్నప్పటికీ దానిని సరిగ్గా ప్రజెంట్ చేయడంలో విఫలమయ్యారని చెప్పవచ్చు. విష్ణు-విక్రాంత్ల సీన్లు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయి. కొన్ని అంశాలను క్లారిటీగా చెప్పకపోవడంలోనూ డైరెక్టర్ల వైఫల్యం కనిపిస్తుంది. ఇక రజనీకాంత్ పాత్ర నిడివి మరి తక్కువగా ఉంది. సినిమాలో ఆయన ప్రెజెన్స్ను ఇంకాస్త పెంచి ఉంటే ప్లస్ అయ్యేది. ఇంకా సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది డైలాగ్స్. ముస్లింలను రిప్రెజెంట్ చేస్తూ తాము ఈ దేశ పౌరులమేనంటూ రజనీ చెప్పే డైలాగ్స్ థియేటర్లో చప్పట్లు కొట్టిస్తాయి.
టెక్నికల్గా..
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే (Lal Salaam Movie Review In Telugu).. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది. ముఖ్యంగా రజనీకాంత్ పాత్రకు ఎలివేషన్స్ ఇస్తూ ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. రెహమాన్ BGM.. రజనీపాత్ర మరింత ఎలివేట్ అయ్యేందుకు దోహదపడింది. ఇక విష్ణు రంగస్వామి కెమెరా పనితనం బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
కథ, కథనంరజనీకాంత్ నటనసంగీతం
మైసన్ పాయింట్స్
స్పష్టత లేని సన్నివేశాలుసాగదీత సీన్స్
Telugu.yousay.tv Rating: 3/5
ఫిబ్రవరి 09 , 2024
Jailer 2 Movie: జైలర్ మూవీకి సీక్వెల్ కన్ఫర్మ్.. రజనీ, విజయ్ కాంబోలో మరో మూవీ.. ఇక ఫ్యాన్స్కి పండగే..!
రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కిన ‘జైలర్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ జైలర్ చిత్రానికి థియేటర్లు పెరిగాయి. రజనీకాంత్ మార్క్ స్టైల్, యాక్షన్; అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ సినిమాకు పెద్ద అసెట్గా నిలిచాయి. ప్రధానంగా ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్, సెకండాఫ్లో చివరి 40 నిమిషాలు ఆడియెన్స్ని తెగ ఇంప్రెస్ చేశాయి. ముఖ్యంగా రజనీ ఫ్యాన్స్ ఈ సినిమాతో పండగ చేసుకుంటున్నారు. సినిమాని మళ్లీ మళ్లీ చూస్తూ తమ అభిమాన హీరో యాక్టింగ్ని ఆస్వాదిస్తున్నారు. అయితే, జైలర్ 2 (Jailer 2) కూడా ఉండబోతోందని చెప్పి ఫ్యాన్స్కి మరో ట్రీట్ ఇచ్చాడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.
భారీ తారాగణంతో..
జైలర్ మూవీ భారీ తారాగణంతో తెరకెక్కింది. మలయాళ స్టార్ మోహన్లాల్, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ఈ సినిమాలో అతిథి పాత్రలు పోషించారు. పాత్ర నిడివి కాసేపే అయినా సినిమాపై మంచి ప్రభావాన్ని చూపించారు. నట సింహం నందమూరి బాలకృష్ణతో కూడా జైలర్లో ఓ పాత్ర చేయించాలని నెల్సన్ చూశాడట. కానీ, బాలయ్య మాస్ ఫాలోయింగ్కి ఆ రోల్ సరితూగక పోవడంతో వెనక్కి తగ్గినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో, జైలర్ సీక్వెల్(Jailer Sequel) మూవీలోనూ బిగ్ స్టార్స్ ఉండే అవకాశం ఉంది.
మ్యూజిక్ అతడేనా
నెల్సన్ దిలీప్ కుమార్ తన కెరీర్లో 4 సినిమాలు చేశాడు. జైలర్కి ముందు బీస్ట్, డాక్టర్, కోలామావు కోకిల చిత్రాలు తెరకెక్కించాడు. ఈ నాలుగింటికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం విశేషం. నెల్సన్ తీసిన / తీయబోయే చిత్రాలకు అనిరుధ్ ఆస్థాన సంగీత దర్శకుడిగా మరిపోయాడు. జైలర్ మూవీ సక్సెస్లో మ్యూజిక్ కీ రోల్ పోషించిన విషయం తెలిసిందే. దీంతో జైలర్ సీక్వెల్లోనూ అనిరుధ్నే కొనసాగించే అవకాశం ఉంది. దీంతో పాటు, తొలి సినిమా నుంచి ఒకే డీవోపీతో వర్క్ చేశాడు నెల్సన్. మరి, జైలర్ పార్ట్2 కి కూడా ఆర్.నిర్మల్ డీవోపీగా ఉంటాడేమో చూడాలి.
వీటికి కూడా సీక్వెల్స్?
జైలర్తో పాటు తాను తీసిన తొలి మూడు చిత్రాలకు సీక్వెల్ తెరకెక్కించడానికి నెల్సన్ దిలీప్ కుమార్ ప్లాన్ చేస్తున్నాడట. కొలామావు కోకిల, డాక్టర్, బీస్ట్ సినిమాలకు పార్ట్ 2 తీయాలని చూస్తున్నాడట. మరి, వీటిలోనూ వారినే కొనసాగిస్తారా? లేక ఇతర హీరోలను పెట్టుకుంటాడా? అనేది వేచి చూడాలి. అయితే బీస్ట్ మూవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మరి, పార్ట్ 2కి విజయ్ ఏమంటాడో.
రజనీ, విజయ్లతో మూవీ
కోలీవుడ్లో రజనీ, విజయ్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మాటల్లో చెప్పలేం. వీరిద్దరికీ వీరాభిమానులు ఉన్నారు. కోలీవుడ్లోనే కాక తెలుగు, మలయాళం, కన్నడలోనూ ఈ హీరోల సినిమా వస్తుందంటే ఆసక్తితో ఎదురు చూస్తారు. మరి, ఈ హీరోలు ఇద్దరు స్క్రీన్పై కనిపిస్తే ఎలా ఉంటుంది? నెల్సన్ దిలీప్ కుమార్ కూడా రజనీ, విజయ్లతో కలిసి సినిమా చేయాలని భావిస్తున్నాడట. వీరిద్దరితో సినిమా చేయడం తన కల అని వెల్లడించాడీ డైరెక్టర్. ఈ చిత్రం పట్టాలెక్కితే కోలీవుడ్ చరిత్రలోనే మైలురాయి చిత్రంగా నిలిచే అవకాశం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.
4 రోజుల్లో 300 కోట్లు
జైలర్ మూవీ తొలి 4 రోజుల్లో రూ.300 కోట్లు కలెక్షన్లను వసూలు చేసింది. తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.95.78 కోట్లు, రెండో రోజున రూ.56.24 కోట్లు, మూడో రోజున రూ.68.51 కోట్లు, నాలుగో రోజున రూ.82.36 కోట్లు సాధించింది. మొత్తంగా రూ.302.89 కోట్ల వసూళ్లను రాబట్టింది.
ఆగస్టు 14 , 2023
Payal Rajput: ఒంటిపై నూలు పోగు లేకుండా పాయల్ రాజ్పుత్… ‘మంగళవారం’ సినిమా కోసం అందాల తెగింపు
RX 100 కాంబో మళ్లీ రిపీట్ కాబోతుంది. ఈ సారి మరింత డోసు పెంచారు. “మంగళవారం” అనే టైటిల్ పెట్టి పాయల్ రాజ్పుత్ టాప్ లెస్ ఫోటోను విడుదల చేశారు. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో సినిమా రూపుదిద్దుకుంటుంది.
పాయల్ రాజ్పుత్ మెుదటి సినిమా నుంచే అందాల ఆరబోతతో హద్దుల్లేకుండా చెలరేగిపోతుంది. RX 100లో కార్తీకేయతో రొమాన్స్ చేసి యువతను ఆకర్షించింది ఈ అమ్మడు.
ఆ సినిమా తర్వాత RDX లవ్, అనగనగా ఓ అతిథి చిత్రాల్లో బోల్డ్ క్యారెక్టర్లో నటించింది పాయల్. అందచందాలు ప్రదర్శించి ఆకట్టుకోవాలని చూసింది.
సామాజిక మాధ్యమాల్లోనూ హాట్ఫొటోస్తో చెలరేగుతుంది పంజాబీ సుందరి. బాత్రూమ్లో కేవలం టవల్పై ఉన్న ఫొటోలను పోస్ట్ చేసి షేక్ చేసింది.
ఇటీవల ఆమె బాయ్ఫ్రెండ్తో కలిసి ఉన్న హాట్ పిక్స్ వైరల్ అయ్యాయి. ఇందులోనూ టాప్లెస్గా కనిపించింది పాయల్ రాజ్పుత్.
సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ కలిసి అలాంటి ఫోజులు ఇవ్వటంపై ట్రోల్స్ ఎదుర్కొంది ఈ హీరోయిన్.
జిన్నా సినిమాలోనూ అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గలేదు. వీలైనంత వరకు న్యాయం చేసేందుకు ప్రయత్నించింది.
మంగళవారం సినిమాలో మరోసారి బోల్డ్ క్యారెక్టర్లో నటిస్తుంది ఈ భామ. శైలజ అనే పాత్రలో టాప్లెస్గా చేతి వద్ద సీతాకోక చిలుక ఉన్నట్లు కనిపించే ఫస్ట్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
RX 100 తర్వాత పాయల్ రాజ్పుత్కు తెలుగులో మంచి హిట్ లేదు. అందాల విందు చేసినా ఆఫర్లు మాత్రం పెద్దగా రావటం లేదు.
ఆఫర్లు లేని కారణంగానే బోల్డ్ పాత్రల్లోనూ నటించేందుకు పాయల్ రాజ్పుత్ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
RX 100, మహా సముద్రం చిత్రాలు తీసిన దర్శకుడు అజయ్ భూపతి మంగళవారం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
మంగళవారం సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలం భాషల్లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
ఈ చిత్రానికి కాంతార, విరూపాక్ష సంగీత దర్శకుడు అజనీష్ లోక్నాథ్ స్వరాలు సమకూరుస్తున్నాడు.
అజయ్ భూపతి రిలీజ్ చేసిన ఈ లుక్పై ఆసక్తి నెలకొంది. వర్మ కాంపౌండ్ నుంచి వచ్చిన ఈ దర్శకుడు మెుదట్నుంచే విభిన్నమైన సినిమాలు తీస్తున్నాడు.
ఏప్రిల్ 25 , 2023
Tollywood: సిద్ధు జొన్నలగడ్డ, విష్వక్ సేన్లకు అండగా బాలయ్య, ఎన్టీఆర్.. దాని వెనక మాస్టర్ ప్లాన్ ఉందా?
యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న తెలుగు హీరోల్లో సిద్దు జొన్నలగడ్డ, విష్వక్ సేన్ ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం ఈ ఇద్దరు కుర్ర హీరోలు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అయితే ఈ ఇద్దరి స్టార్స్కి నందమూరి ఫ్యామిలీ నుంచి విశేష మద్దతు లభిస్తోంది. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఈ కుర్ర హీరోలను ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తున్నారు. సినిమా ప్రమోషన్స్కు హాజరవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే కుర్ర హీరోలను సీనియర్లు ప్రోత్సహించడం అనేది ఇండస్ట్రీలో చాలా కామన్. ఇండస్ట్రీలో చాలా మంది యువ నటులు ఉండగా సిద్ధు, విష్వక్లను తారక్, బాలయ్య ప్రోత్సహించడం వెనక చాలా బలమైన కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
కుర్ర హీరోలతో క్లోజ్గా..
కుర్ర హీరోలను ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడు ఆ జాబితాలోకి నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ చేరారు. యువ విష్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డను ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల దేవర ప్రమోషన్స్లో భాగంగా ఈ ఇద్దరి హీరోలతో తారక్ ప్రత్యేక ఇంటర్యూ నిర్వహించారు. దర్శకుడు కొరటాల శివ, తారక్కు పలు ప్రశ్నలు సంధించారు. ఈ ఇంటర్యూకు భలే హైప్ వచ్చింది. అంతకుముందు సిద్దు హీరోగా నటించిన టిల్లు స్క్రేర్ సక్సెస్ మీట్కు తారక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకకు విష్వక్ కూడా హాజరవ్వగా వారిద్దరితో తారక్ ఫొటోలు దిగి హల్చల్ చేశాడు. మరోవైపు రీసెంట్గా బాలకృష్ణను సైతం ఈ ఇద్దరు హీరోలు కలిశారు. విజయవాడ వరదల నేపథ్యంలో ప్రకటించిన సొమ్మును బాలయ్యతో కలిసి ముఖ్యమంత్రికి అందజేశారు. అంతకుముందు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన బాలకృష్ణ.. విశ్వక్ తాను కవలలమంటూ ఆకాశానికి ఎత్తారు. ఇలా ఏ చిన్న అవకాశం దొరికినా సిద్ధు, విష్వక్లకు తారక్, బాలయ్య అండగా నిలుస్తున్నారు.
మాస్టర్ ప్లాన్ ఉందా?
ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ, అడివి శేష్, నవీన్ పొలిశెట్టి, నిఖిల్, కిరణ్ అబ్బవరం వంటి కుర్ర హీరోలు ఉండగా విష్వక్, సిద్ధులనే బాలకృష్ణ, తారక్ ఎంకరేజ్ చేయడం వెనక ఓ మాస్టర్ ప్లాన్ ఉందంటూ నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ మెగా, నాన్-మెగా అనే రెండు వర్గాలుగా విడిపోయిందని సినీ వర్గాల టాక్. మెగా ఫ్యామిలీలో అరడజనుకు పైగా హీరోలు ఉన్నారు. పైగా ఈ జనరేషన్ హీరోల్లో చాలామంది తాము మెగాస్టార్కు పెద్ద అభిమానులమని చెప్పుకుంటూ వస్తున్నారు. దీంతో ఇప్పుడిప్పుడే స్టార్ హీరోలుగా ఎదుగుతున్న విష్వక్, సిద్ధులను ఎంకరేజ్ చేయడం ద్వారా తమకంటూ ఒక గ్రూప్ను క్రియేట్ చేసుకున్నట్లు ఉంటుందని నందమూరి ఫ్యామిలీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు హీరోలు తాము నందమూరి ఫ్యామిలీకి వీరాభిమానులమని ఇప్పటికే పలుమార్లు ప్రకటించుకున్నారు. ముఖ్యంగా తారక్ అంటే తమకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో వారిని ఎంకరేజ్ చేసేందుకు తారక్, బాలకృష్ణ ఆసక్తికనబరుస్తున్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్కు పోటీగా..!
విజయ్ దేవరకొండ సోదరులకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెుదటి నుంచి తన మద్దతు తెలియజేస్తున్నాడు. అర్జున్ రెడ్డి సినిమా అప్పటి నుంచి విజయ్తో బన్నీ అనుబంధం కొనసాగుతూ వస్తోంది. గతేడాది విజయ్ దేవరకొండ సోదరుడు తీసిన బేబీ ప్రమోషన్ ఈవెంట్కు కూడా బన్నీ హాజరయ్యారు. బేబీ వివాదంలో విష్వక్ చిక్కుకున్నప్పుడు అతడి గురించి పరోక్షంగా వ్యాఖ్యలు కూడా చేశాడు. దీంతో విష్వక్ చాలా ఒత్తిడి ఫేస్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తారక్ మద్దతుతో విష్వక్ దాని నుంచి బయటపడినట్లు సమాచారం. అయితే తారక్, బన్నీ ఎంతో స్నేహంగా ఉంటారు. కాకపోతే తమకంటూ ఓ గ్రూప్ ఉండాలన్న ఉద్దేశంతో ఎవరికివారు వ్యక్తిగతంగా యంగ్ హీరోలను ప్రోత్సహించుకుంటూ, గ్రూపులను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
విష్వక్, సిద్ధు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
ప్రస్తుతం విష్వక్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky)లో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా చేస్తోంది. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ రూపొందుతోంది. ఇటీవలే సెకండ్ సాంగ్ కూడా రిలీజై ఆకట్టుకుంది. అలాగే ‘లైలా’ చిత్రంలోనూ విష్వక్ నటిస్తున్నాడు. రామ్నారాయణ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో విష్వక్ అమ్మాయిగా కనిపించనున్నాడు. ఇవి కాకుండా ‘VS13’, ‘VS14’ ప్రాజెక్ట్స్ను త్వరలో పట్టాలెక్కించనున్నాడు. మరోవైపు సిద్ధు జొన్నలగడ్డ చేతిలోనూ ప్రస్తుతం మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘జాక్’, ‘తెలుసు కదా’ చిత్రాల్లో అతడు నటిస్తున్నాడు. వాటి తర్వాత 'టిల్లు క్యూబ్' కూడా సెట్స్పైకి వెళ్లనుంది.
సెప్టెంబర్ 25 , 2024
Best Cameos in Telugu Movies: క్యామియోలకు జీవం పోసిందే మెగాస్టార్ అని తెలుసా? గెస్ట్ రోల్స్తో ఇరగదీసిన స్టార్స్ వీరే!
భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం క్యామియో అనే కొత్త ట్రెండ్ మెుదలైంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలివుడ్ అనే తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్క ఇండస్ట్రీ ఈ ట్రెండ్ను అనుసరిస్తూ సత్ఫలితాలను పొందుతున్నాయి. పక్క ఇండస్ట్రీలకు చెందిన స్టార్ నటులను తీసుకొని తమ చిత్రాల్లో ఒక పవర్ఫుల్ క్యామియో లేదా రోల్ ఇవ్వడం ద్వారా ఆడియన్స్లో హైప్ క్రియేట్ చేస్తున్నాయి. తద్వారా సూపర్ హిట్ విజయాలను అందుకుంటున్నాయి. అయితే ఈ క్యామియోలకు మెుట్ట మెుదట జీవం పోసింది మన మెగాస్టార్ అని చాలా మందికి తెలిసి ఉండదు. రజనీకాంత్ ఫిల్మ్లో గెస్ట్ రోల్ చేయడం ద్వారా అప్పట్లోనే ఈ ఒరవడికి చిరు నాంది పలికారు. ఇంతకీ ఆ చిత్రం ఏంటి? ఇప్పటివరకూ వచ్చిన బెస్ట్ క్యామియో చిత్రాలు ఏవి? అన్నది ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
చిరు క్యామియో
చిరంజీవి హీరోగా నటించిన 'అత్తకు యముడు అమ్మాయికి మెుగుడు' చిత్రం తెలుగులో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించగా కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించారు. కాగా, ఈ సినిమాను తమిళంలో రజనీకాంత్తో అల్లు అరవింద్ రీమేక్ చేశారు. 'మాపిళ్లై' పేరుతో ఇది విడుదలైంది. అయితే ఇందులో మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే క్యామియో ఇచ్చారు. హీరో పెళ్లిని చెడగొట్టడానికి వచ్చిన అల్లరి మూకతో గుడి మెట్ల దగ్గర చిరు ఫైట్ చేస్తాడు. ఆ గుండాలలో శ్రీహరి కూడా ఉండటం గమనార్హం. ఇక చిరు తన స్వంత గళంతోనే తమిళంలో సంభాషణలు చెప్పారు. రజినీ తన అత్తని పరిచయం చేసేటప్పుడు చిరు అతడి చెవిలో, 'మీ అత్త బాగుందిరా!' (తమిళంలో అంటాడు. దానికి రజినీ చిరుని 'కొంప ముంచేలా ఉన్నావు! నువ్వు బయలుదేరరా బాబూ!' అని అనటం ప్రేక్షకులని గిలిగింతలు పెడుతుంది. అయితే అప్పట్లో ఈ క్యామియోను ఎవరూ ఊహించలేదు. చిరు, రజనీ పలు చిత్రాల్లో అప్పటికే కలిసి నటించినప్పటికీ ఇలా అతిథి పాత్రలో చేయడం అదే తొలిసారి. ఇప్పుడు ఇదే పరంపరను పలు ఇండస్ట్రీలు అనుసరించడం గమనార్హం.
https://twitter.com/i/status/1212794102867083265
అదిరిపోయే క్యామియోలతో వచ్చిన చిత్రాలు
మిస్టర్ బచ్చన్
రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ మూవీ కుర్ర హీరో సిద్ధు జొన్నల గడ్డ ఒక స్పెషల్ క్యామియో ఇచ్చారు. సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ సిద్ధు క్యామియో మాత్రం థియేటర్లలో విజిల్స్ వేసేలా చేసింది.
కల్కి 2898 ఏడీ
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో పలువురు స్టార్స్ అదిరిపోయే క్యామియోస్ ఇచ్చారు. యంగ్ హీరో విజయ్ దేవరకొండ, తమిళ నటుడు దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, దర్శకధీరుడు రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ స్క్రీన్పై కొద్దిసేపు మెరిసి ఆశ్చర్యపరిచారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇందులో ఫుల్ లెంగ్త్ పాత్రలు పోషించారు.
సలార్
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ‘సలార్’ చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమాన్ నటించిన సంగతి తెలిసిందే. అయితే అతడిది క్యామియో కాదు. ప్రభాస్కు ఫ్రెండ్గా, ప్రత్యర్థిగా ఫుల్ లెంగ్త్ రోల్లో నటించాడు.
జైలర్
రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘జైలర్’ చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోలు క్యామియో ఇచ్చారు. మలయాళ నటుడు మోహన్లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ అతిథి పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు.
విక్రమ్
కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో రూపొందిన ‘విక్రమ్’ చిత్రంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి, మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. సినిమా సక్సెస్లో కీలక పాత్ర పోషించారు. క్లైమాక్స్లో రోలెక్స్ పాత్రలో సూర్య కనిపించి గూస్బంప్స్ తెప్పించారు.
బ్రహ్మాస్త్ర
రణ్బీర్ కపూర్ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో తెలుగు దిగ్గజ నటుడు అక్కినేని నాగార్జున ఓ స్పెషల్ క్యామియో ఇచ్చి అందర్నీ సర్ప్రైజ్ చేశారు. యాక్షన్స్ సీక్వెన్స్లో తన మార్క్ చూపించి అదరగొట్టాడు.
వాల్తేరు వీరయ్య
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో స్టార్ హీరో రవితేజ ఓ ముఖ్య పాత్రలో నటించారు. తద్వారా చిరుపై తనకున్న అభిమానాన్ని మరోమారు చాటుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
ఆచార్య
మెగాస్టార్ చిరంజీవి గత చిత్రం ‘ఆచార్య’లో రామ్ చరణ్ అతిథి పాత్రలో నటించాడు. అంతకుముందు చరణ్ చేసిన ’మగధీర’, బ్రూస్లీ చిత్రాల్లో చిరు ప్రత్యేక రోల్స్లో కనిపించి సర్ప్రైజ్ చేయడం విశేషం.
లాల్ సింగ్ చద్దా
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాలో అక్కినేని నాగ చైతన్య ఓ ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమా ఆశించిన విజయం సాధించనప్పటికీ చైతూ నటనకు మంచి మార్కులే పడ్డాయి.
లైగర్
విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ‘లైగర్’ చిత్రంలో వరల్డ్ ఫేమస్ బాక్సర్ ‘మైక్ టైసన్’ క్లైమాక్స్లో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేశారు. అయితే అతడ్ని సరిగ్గా వినియోగించలేకపోయారని దర్శకుడు పూరి జగన్నాథ్పై అప్పట్లో విమర్శలు వచ్చాయి.
సెప్టెంబర్ 18 , 2024
Ram Charan: రూట్మార్చిన రామ్చరణ్.. ఫుల్ జోష్లో మెగా ఫ్యాన్స్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) 'ఆర్ఆర్ఆర్' (RRR) సక్సెస్తో గ్లోబల్ స్థార్గా ఎదిగారు. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ను కెరీర్ ప్రారంభం నుంచి ఓ సమస్య వెంటాడుతోంది. ఈ సమస్య నుంచి చరణ్ ఎన్నిసార్లు బయటపడాలని చూసిన కుదరడం లేదు. దీనిపై మెగా ఫ్యాన్స్ సైతం అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆ ప్రాబ్లమ్కు చెక్ పెట్టే దిశగా రామ్చరణ్ సరికొత్త ప్లాన్స్ను రచిస్తున్నాడు. ఆ దిశగా ఓ కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలిసి మెగా ఫ్యాన్స్ సైతం తెగ ఖుషీ అవుతున్నారట. ఇంతకీ ఆ సమస్య ఏంటి? దానిపై చెర్రీ తీసుకున్న నిర్ణయం ఏంటి? అన్నది ఈ కథనంలో తెలుసుకుందాం.
సెట్స్పైకి రెండు చిత్రాలు!
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ చిరు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 17 ఏళ్లు అవుతోంది. ఇప్పటివరకూ ఆయన నుంచి వచ్చింది 13 చిత్రాలు మాత్రమే. మిగతా స్టార్స్తో పోలిస్తే సినిమా సినిమాకు చరణ్ ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారన్న విమర్శ ఉంది. దీని నుంచి ఎన్నిసార్లు బయటపడాలని చూసిన అది వర్కౌట్ కాలేదు. దీంతో ఈ సమస్యకు కచ్చితంగా చెక్ పెట్టాలని చరణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై సంవత్సరానికి రెండు చొప్పున చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఇందులో భాగంగానే ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కాకముందే డైరెక్టర్ బుచ్చిబాబుతో RC16 ప్రాజెక్ట్ను చరణ్ అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈ చిత్రంతో పాటుగానే సుకుమార్ దర్శకత్వంలో మరో మూవీ చేయబోతున్నాడు. ఒకేసారి ఆ రెండు ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని రామ్చరణ్ భావిస్తున్నారట. ఈ రెండు సినిమాలను 2026 లోపే రిలీజ్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు.
ప్రభాస్ను అనుసరిస్తున్నాడా?
ప్రభాస్ కూడా తన ప్రాజెక్టుల విషయంలో గతంలో కంటే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పటిలాగా ప్రాజెక్ట్ తర్వాత ప్రాజెక్ట్ అనే విధానానికి స్వస్థి పలికి ఒకేసారి మూడు ప్రాజెక్ట్స్ను సెట్స్పైకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ మారుతీతో 'రాజాసాబ్' అనే చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల హను రాఘవపూడితో కొత్త ప్రాజెక్ట్ను లాంఛనంగా ప్రారంభించాడు. నవంబర్ కల్లా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లోని 'స్పిరిట్'ను కూడా సెట్స్పైకి తీసుకెళ్లే ప్లాన్లో డార్లింగ్ ఉన్నాడు. తద్వారా ఏక కాలంలో ఈ మూడు చిత్రాల షూటింగ్స్లో పాల్గొని ఒక్కో సినిమాను ఏడాది కంటే తక్కువ వ్యవధిలోనే రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నాడు. మరోవైపు ‘సలార్ 2’, ‘కల్కి 2’ చిత్రాలను కూడా వచ్చే ఏడాది పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది.
ముఖ్య అతిథిగా రామ్చరణ్
దక్షిణాది సినీ అవార్డుల పండుగ ‘ఐఐఎఫ్ఏ ఉత్సవం’ (IIFA Utsavam 2024) కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరుకానున్నారు. అబుదాబిలోని యాస్ ఐలాండ్లో సెప్టెంబరు 27న ఐఐఎఫ్ఏ (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) వేడుక జరగనుంది. ఇక్కడి ఎతిహాద్ ఎరీనా వేదికగా జరిగే ఈ అవార్డుల ఉత్సవంలో రామ్ చరణ్ సందడి చేయనున్నారు. ఈ మేరకు ఐఐఎఫ్ఏ నిర్వాహకులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ ఈవెంట్కు చరణ్తో పాటు పలువురు దక్షిణాది ప్రముఖులు హాజరుకానున్నారు.
ఈ ఏడాది లేనట్లే!
ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' చిత్రంలో రామ్చరణ్ నటిస్తున్నాడు. డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ఈ చిత్రం రిలీజ్ కానున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నిర్మాత దిల్ రాజు కూడా డిసెంబర్లోనే రిలీజ్ చేయనున్నట్లు పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం గేమ్ ఛేంజర్ డిసెంబర్లో రావడం కష్టమేనని అంటున్నారు. డిసెంబర్ 20కి ఇప్పటికే తండేల్, రాబిన్ హుడ్ షెడ్యూల్ అయి ఉన్నాయి. ఆ టైమ్ లో గేమ్ ఛేంజర్ ను రిలీజ్ చేస్తే కలెక్షన్స్ తగ్గే ఛాన్స్ ఉందని మేకర్స్ భావిస్తున్నారట. వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ చేయవచ్చని అంటున్నారు. దీనిపై మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
సెప్టెంబర్ 14 , 2024
Bench Life Series Review: నిహారిక నిర్మించిన ‘బెంచ్ లైఫ్’ సిరీస్ మెప్పించిందా?
నటీనటులు: వైభవ్ రెడ్డి, రితికా సింగ్, చరణ్, ఆకాంక్ష సింగ్, నయన్ సారిక, రాజేంద్ర ప్రసాద్, తనికెళ్ల భరణి, వెంకటేష్ కాకుమాను తదితరులు
రచన, దర్శకత్వం : మానస శర్మ
సినిమాటోగ్రఫీ : ధనుష్ భాస్కర్
సంగీతం : పి.కె. దండి
నిర్మాత : నిహారిక కొణిదెల
నిర్మాణ సంస్థ: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్
ఓటీటీ వేదిక: సోనీలివ్
విడుదల తేదీ : సెప్టెంబర్ 12, 2024
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కొత్త నటీనటులతో సరికొత్త కథాంశాన్ని తెరెకెక్కించి నిహారిక ప్రశంసలు అందుకున్నారు. దీంతో తాజాగా ఆమె నిర్మించిన వెబ్సిరీస్ 'బెంచ్ లైఫ్'పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగుల కష్టాల నేపథ్యంలో ఈ సిరీస్ రూపొందడం, ఐటీ బ్యాక్డ్రాప్ ఉన్న మానస శర్మ అనే మహిళ డైరెక్షన్ చేయడంతో మరింత హైప్ ఏర్పడింది. ఇందులో వైభవ్ రెడ్డి, చరణ్ పెరి, రితికా సింగ్, ఆకాంక్ష సింగ్ ముఖ్య పాత్రలు పోషించారు. సోనీలివ్లో సెప్టెంబర్ 12 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్లోకి వచ్చింది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? నిహారిక ఖాతాలో మరో సక్సెస్ పడినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
బాలు (వైభవ్ రెడ్డి), రవి (చరణ్ పెరి), మీనాక్షి (రితికా సింగ్) ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగులు. మంచి స్నేహితులు కూడా. అదే ఆఫీసులో పని చేసే ఇషా (ఆకాంక్ష సింగ్)ను తొమ్మిదేళ్లుగా బాలు ప్రేమిస్తుంటాడు. కానీ ఆమెకు చెప్పడు. మరోవైపు మీనాక్షి డైరెక్టర్ కావాలని కలలుకంటుంది. కథలు రాసుకొని నిర్మాతల చుట్టూ తిరుగుతుంటుంది. ఈ క్రమంలోనే భార్య (నయన్ సారిక), ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి రవి గోవా వెళ్లాలని ప్లాన్ చేస్తాడు. అందుకు ముగ్గురు ఫ్రెండ్స్ బెంచ్ అడుగుతారు. బెంచ్ వచ్చిన తర్వాత ఏమైంది? కంపెనీలో ప్రసాద్ వశిష్ఠ (రాజేంద్ర ప్రసాద్) రోల్ ఏంటి? భార్యతో రవికి మనస్ఫర్థలు రావడానికి కారణం ఏంటి? రవి తన ప్రేమను ఇషాకు చెప్పాడా? లేదా? డైరెక్టర్ కావాలన్న ఇషా కల ఏమైంది? తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
బాలు పాత్రకు నటుడు వైభవ్ పూర్తిగా న్యాయం చేశాడు. తన కామెడీ టైమింగ్తో ఫన్ జనరేట్ చేశాడు. ఆయన ప్రేమించే అమ్మాయిగా ఆకాంక్ష సింగ్ చక్కగా నటించింది. మనసులోని భావాలను బయటకు చెప్పలేని సెటిల్డ్ యువతిగా ఆకట్టుకుంది. ఈ సిరీస్లో హైలెట్ అంటే చరణ్ పెరి, నయన్ సారిక అని చెప్పవచ్చు. వాళ్లిద్దరి నటనతో పాటు వారి మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. మీనాక్షి పాత్రలో రితిక చక్కగా ఒదిగిపోయింది. ఇష్టంలేని జాబ్ చేయలేక డైరెక్టర్ అయ్యేందుకు కష్టపడే యువతి పాత్రలో ఆమె మెప్పించింది. తులసి ఎప్పటిలా తన పాత్రకు న్యాయం చేశారు. రాజేంద్ర ప్రసాద్ మరోసారి కామెడీ టైమింగ్, ఎమోషన్స్ పరంగా మెప్పించారు. తనికెళ్ల భరణి పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ కథలో కీలమైన సందర్భంలో హుందాగా నటించారు. నిహారిక కొణిదెల, సంగీత్ శోభన్, వెంకట్ అతిథి పాత్రల్లో మెరిశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకురాలు మానస శర్మ యువతరానికి ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఈ సిరీస్ను తీర్చిదిద్దిన విధానం బాగుంది. ప్రతి పాత్రను ఒక అర్థం ఉండేలా రూపొందించారు. ముఖ్యంగా చరణ్ పెరి-నయన్ సారిక జంటకు ఇచ్చిన ముగింపు బాగుంది. అయితే రితికా సింగ్, ఆకాంక్ష సింగ్ పాత్రలకు ఇచ్చిన ఎండింగ్ మరీ సినిమాటిక్గా అనిపిస్తుంది. సహజత్వం కనిపించదు. రాజేంద్రప్రసాద్-వైభవ్ రెడ్డి కామెడీ ట్రాక్ బాగా ప్లస్ అయ్యింది. అలాగే రాజేంద్రప్రసాద్ & నయన్ సారిక పాత్రలతో పండించిన సెంటిమెంట్ సీన్స్ బాగున్నాయి. ఓవరాల్గా డైరెక్టర్ మానస శర్మ మంచి మార్కులే సంపాదించుకుంది. అయితే వైభవ్ నోటి నుంచి వచ్చే బూతులు, ఐటీ ఉద్యోగులకు మాత్రమే కనెక్ట్ అయ్యేలా సిరీస్ ఉండటం మైనస్గా చెప్పవచ్చు.
టెక్నికల్గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్ మంచి పనితీరు కనబరిచాడు. సాఫ్ట్వేర్ ఆఫీస్ వాతావరణాన్ని చక్కగా ప్రజెంట్ చేశాడు. నేపథ్య సంగీతం కూడా బాగుంది. ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్ వంటి ఇతర విభాగాలు కూడా మంచి పనితీరు కనబరిచాయి. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
ప్రధాన తారాగణం నటనడైరెక్షన్ స్కిల్స్కామెడీ
మైనస్ పాయింట్స్
అక్కడక్కడా బోల్డ్ డైలాగ్స్ఐటీ ఉద్యోగులకు మాత్రమే కనెక్ట్ కావడం
Telugu.yousay.tv Rating : 3/5
సెప్టెంబర్ 12 , 2024
The Goat Director: తెలుగు ఆడియన్స్పై ‘ది గోట్’ డైరెక్టర్ అక్కసు.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్). సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళనాడులో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అటు ఓవర్సీస్లోనూ మంచి వసూళ్లను సాధిస్తూ రూ.300 కోట్ల మార్క్ను సైతం అందుకుంది. అయితే తెలుగు, హిందీ భాషల్లో మాత్రం 'ది గోట్'కు గట్టి ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర డైరెక్టర్ వెంకట్ ప్రభు స్పందించారు. తెలుగు, హిందీ ప్రేక్షకులపై అతడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
‘అందుకే నచ్చలేదు’
తెలుగు, హిందీ భాషల్లో ‘ది గోట్’ (The Greatest Of All Time) సినిమా అనుకున్న స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో రూ.22 కోట్లకు ఈ మూవీని కొనుగోలు చేయగా ఇప్పటివరకు రూ.10 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు చూస్తే బ్రేక్ ఈవెన్ కూడా కష్టంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ వెంకట్ ప్రభు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. చెన్నై సూపర్ కింగ్స్, ఎంఎస్ ధోనీకి సంబంధించిన సీన్స్ హైలైట్ చేయడం వల్ల తెలుగు, హిందీ ప్రేక్షకులకు ఇది నచ్చలేదని అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాలు, హిందీ బెల్ట్లో ది గోట్ పనితీరు తక్కువగా ఉండడానికి ఇదే కారణమన్నారు. అంతేకాదు ఐపీఎల్లోని ముంబయి, బెంగళూరు జట్టు అభిమానులు తమ చిత్రాన్ని ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు. తాను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అభిమానిని కావడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. వెంకట్ ప్రభు కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
https://twitter.com/TheAakashavaani/status/1833133203697131918
తెలుగు ఆడియన్స్ ఫైర్..!
డైరెక్టర్ వెంకట్ ప్రభు తాజా కామెంట్స్ను తెలుగు ఆడియన్స్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. తెలుగులో 'ది గోట్' డిజాస్టర్ దిశగా వెళ్లడానికి కారణాలు వేరే ఉన్నాయని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. కంటెంట్ బాగుంటే ఇండస్ట్రీతో సంబంధం లేకుండా అన్ని భాషల చిత్రాలను తాము ఆదరిస్తామని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ‘మానాడు’ చిత్రం తెలుగులో ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందో ఒకసారి గుర్తుచేసుకోవాలని డైరెక్టర్కు సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ధోనికి విపరీతంగా అభిమానులు ఉన్నారని, హైదరాబాద్లో సీఎస్కే మ్యాచ్ జరిగితే ఎల్లో జెర్సీలతో స్టేడియం నిండిపోతుందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా ‘ది గోట్’ ఫెయిల్యూర్కు గల కారణాలేంటో అన్వేషించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలుగులో ఫ్లాప్కు కారణాలు ఇవే!
దర్శకుడు వెంకట్ ప్రభు రొటిన్ స్టోరీతో ది గోట్ను తెరకెక్కించారు. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేశాడు. తండ్రి కొడుకుల పాత్రల్లో కనిపించాడు. అయితే టెర్రరిజం మూలాలతో తెరకెక్కినప్పటికీ ఏజెంట్ సినిమాల్లో కనిపించే ట్విస్టులు ఇందులో ఉండవు. మలుపులు, మెరుపులు ఏ ఒక్కటీ కథనంలో కనిపంచలేదు. కనీసం హీరో చేసే ఆపరేషన్స్లోనూ థ్రిల్ లేదు. పైగా విరామం వరకూ కథంతా సాగతీత వ్యవహారమే. అనవసరంగా వచ్చి పడిపోయే పాటలు, యోగిబాబు కామెడీ ట్రాక్ తెలుగు ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టాయి. అయితే సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, క్లైమాక్స్లో వచ్చే ఐపీఎల్ ట్రాక్ ప్రేక్షకుల్లో కాస్త ఉత్సాహాన్ని నింపాయి.
నో చెప్పిన ధోని!
‘ది గోట్’లో చాలా అతిథి పాత్రలు ఉన్నాయి. హీరో శివ కార్తికేయ (Sivakarthikeyan), హీరోయిన్ త్రిష (Trisha) అతిథులుగా అలరించారు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీని కూడా క్లైమాక్స్లో చూపించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విజువల్స్ ద్వారా మహీని వెండితెరపై చూపారు. నిజానికి ధోనీతో ఒక్క సన్నివేశమైనా సినిమాలో చేయించాలని దర్శకుడు వెంకట్ ప్రభు అనుకున్నారట. అందుకు మహీ ఒప్పుకోకపోవడంతో ఐపీఎల్ విజువల్స్ ద్వారా స్క్రీన్పై చూపించారు. 20 నిమిషాల పాటు ఉండే ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ క్రికెట్ లవర్స్ను ఎంతగానో ఆకర్షించింది.
నెగిటివ్ రివ్యూలపైనా మండిపాటు
‘ది గోట్’ సినిమాపై వచ్చిన నెగిటివ్ రివ్యూలపై దర్శకుడు వెంకట్ ప్రభు స్పందించారు. ‘సినిమాని రూపొందించేందుకు మేం పడిన కష్టం గురించి మాట్లాడరు. కానీ, కొందరు సినిమాపై కావాలనే నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారు. ఈ సినిమాలో ఉన్నన్ని రిఫరెన్స్లు ఏ చిత్రంలోనూ లేవు. ఏ హీరో అభిమాని అయినా ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే రిఫరెన్స్లు తీసుకున్నాం. అతిథి పాత్రల కోసమే చిత్రాన్ని రూపొందించలేదు. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉండేలా కథను తీర్చిదిద్దా. సినిమా ఆడియన్స్ కోసమేగానీ రివ్యూవర్స్కు కాదు’ అని అన్నారు.
సెప్టెంబర్ 10 , 2024
Jayam Ravi Divorce: భార్యతో విడిపోయిన జయం రవి.. విడాకులకు ముందు ఇంత జరిగిందా?
తమిళ స్టార్ హీరో జయం రవికి కోలీవుడ్తో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి పేరుంది. ఆయన హీరోగా చేసిన పలు తమిళ చిత్రాలు తెలుగులోనూ డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయ్యాయి. రీసెంట్గా అతడు నటించిన ‘సైరెన్’ చిత్రం తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే తాజాగా జయం రవి సంచలన ప్రకటన చేశారు. భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్కు గురిచేశారు. ఎక్స్ వేదికగా అతడు పెట్టిన సుదీర్ఘ పోస్టు ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
‘మా ఇద్దరి మంచి కోసమే..’
నటుడు జయం రవి తన భార్య ఆర్తితో విడాకులు తీసుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకుంటున్నట్లు అతడు స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘నేడు మీ అందరితో ఓ వ్యక్తిగత విషయాన్ని పంచుకుంటున్నా. ఈ విషయాన్ని భారమైన హృదయంతో మీకు చెప్పాల్సి వస్తోంది. నేను, నా భార్య ఆర్తి విడాకులు తీసుకోవాలనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. మా ఇద్దరి మంచి కోసమే ఇలా చేస్తున్నాం. ఈ విషయంపై రూమర్స్, ఆరోపణలు మానేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది పూర్తిగా మా వ్యక్తిగత విషయం. సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. మీ అందరికీ వినోదాన్ని పంచడం కోసం కష్టపడతాను. ఎప్పటికీ మీ జయం రవిగా మీ గుండెల్లో ఉంటా. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు' అని జయం రవి పేర్కొన్నారు.
https://twitter.com/actor_jayamravi/status/1833030619481444611
15 ఏళ్ల బంధానికి బ్రేక్
2009 జూన్లో జయం రవి, ఆర్తి పెళ్లితో ఒక్కటయ్యారు. వాళ్లకు ఇద్దరు కొడుకులు ఆరవ్, అయాన్ కూడా ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ జంట విడాకులకు సంబంధించి ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా వారిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయని కోలివుడ్ మీడియా సైతం అనేకసార్లు కథనాలు రాసింది. ఈ క్రమంలోనే వారు వేర్వేరుగా జీవిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. వీరు త్వరలో విడిపోతున్నారంటూ నెట్టింట పెద్ద ఎత్తున కామెంట్స్ వినిపించాయి. వాటికి తాజా పోస్టుతో జయం రవి ముగింపు పలికారు. అయితే ఎందుకు విడిపోతున్న సంగతి ఎక్కడా రివీల్ చేయలేదు. దీంతో కారణం ఏమై ఉంటుందా? అని సెలబ్రిటీలతో పాటు జయం రవి అభిమానులు ఆలోచిస్తున్నారు. అయితే కలిసి ఉంటూ బాధ పడటం కన్నా విడిపోయి ఎవరికి నచ్చినట్లు హ్యాపీగా ఉండటమే బెటర్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు సినిమాతోనే గుర్తింపు
1993లో వచ్చిన 'బావ బామ్మర్ది','పల్నాటి పౌరుషం' (1994) వంటి చిత్రాలతో బాల నటుడిగా జయం రవి పరిచయమయ్యారు. 2002లో టాలీవుడ్లో విడుదలై సూపర్ హిట్ అయిన ‘జయం’ సినిమాను తమిళ్లో రీమేక్ చేశారు. ఇది హీరోగా జయం రవికి ఫస్ట్ ఫిల్మ్. అది మంచి విజయం సాధించడంతో అప్పటినుంచి ఆయన పేరు జయం రవిగా మారిపోయింది. ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమానే హిట్ కావడంతో అతడికి వరుస అవకాశాలు వచ్చాయి. 2015లో వచ్చిన జెండాపై కపిరాజు మూవీలో జయం రవి ఓ అతిథి పాత్రలో కనిపించారు. ఇటీవల వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్ 1 & 2’ చిత్రాల్లో టైటిల్ రోల్ పోషించి పాన్ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ అందరినీ అలరిస్తున్నారు.
సెప్టెంబర్ 09 , 2024
Balakrishna - Ram: టాలీవుడ్లో సరికొత్త కాంబోలు.. మల్టీస్టారర్ల శకం మెుదలైందా?
టాలీవుడ్లో మల్టీస్టారర్ చిత్రాలకు ఎంతో క్రేజ్ ఉంది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్క్రీన్పై కనిపిస్తే అది ఆడియన్స్కు కన్నుల పండుగగా ఉంటుంది. గతంలో ఈ తరహా మల్టీ స్టారర్ చిత్రాలు పెద్ద ఎత్తునే వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో వాటి జోరు తగ్గింది. దీంతో ఆడియన్స్ కూడా మల్టీస్టారర్ మేనియా నుంచి కాస్త పక్కకు జరిగారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మళ్లీ ఆ తరహా చిత్రాలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో సరైన కథ తగిలితే మల్టీ స్టారర్లు చేసేందుకు తెలుగు స్టార్లు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల చిరు-పవన్-చరణ్, రామ్చరణ్-సూర్య కాంబినేషన్స్పై గాసిప్స్ వచ్చాయి. తాజాగా బాలయ్య-రామ్ పోతినేని కాంబో చిత్రంపైనా జోరుగా ప్రచారం మెుదలైంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
మల్టీస్టారర్ లోడింగ్..!
మాస్ ఆడియన్స్లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), రామ్ పోతినేని (Ram Pothineni) ముందు వరుసలో ఉంటారు. నటుడు బాలకృష్ణ గత కొంతకాలంగా మాస్ ఆడియన్స్ను టార్గెట్ చేస్తూ సినిమాలు తీస్తున్నారు. అటు రామ్ కెరీర్ ప్రారంభంలో లవర్ బాయ్ చిత్రాలు చేసినప్పటికీ ఇటీవల యాక్షన్ చిత్రాలపై ఫోకస్ పెట్టారు. ఇస్మార్ట్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ వంటి యాక్షన్ చిత్రాల్లో నటించాడు. అటువంటి ఈ ఇద్దరి హీరోల కాంబోలో ఓ క్రేజీ మల్టీస్టారర్ రాబోతున్నట్లు ఓ వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ఈ ప్రాజెక్ట్లో భాగస్వామి కాబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. అయితే దీనిపై నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, ఈ వార్త నిజమైతే మాస్ ఆడియన్స్కు పండగే అని చెప్పవచ్చు.
గుడ్ ఫ్రెండ్షిప్
హీరో రామ్, నందమూరి బాలకృష్ణకు మధ్య వ్యక్తిగతంగా మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే ఈ విషయం తొలిసారి స్కంద ఆడియో ఫంక్షన్లో బయటపడింది. బోయపాటి, రామ్ కాంబోలో రూపొందిన ‘స్కంద’ ఆడియో రిలీజ్ వేడుకకు బాలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. ఆ సందర్భంగా హీరో రామ్తో ఆయన ఎంతో సన్నిహితంగా మెలిగారు. రామ్ తన స్పీచులో బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక్కడ ఒక్క తరాన్ని అలరించేందుకు అల్లాడుతుంటే బాలయ్య మాత్రం మూడు తరాలను అలరిస్తూనే ఉన్నారంటూ పొగడ్తల్లో ముంచేత్తారు. అటు బాలయ్య రామ్ను ఆకాశానికెత్తారు. ఇలా వయసుతో సంబంధం లేకుండా మంచి స్నేహ బంధాన్ని కలిగి ఉన్న ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఓ సినిమాలో కలిసి నటిస్తే ఇక రికార్డులు గల్లంతేనని ఫ్యాన్స్ అంటున్నారు.
చరణ్ - సూర్య కాంబోపై బజ్!
గ్లోబల్స్టార్ రామ్చరణ్ తేజ్ (Ram Charan), తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ రాబోతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. లవ్ స్టోరీస్ తీయడంలో స్పెషలిస్ట్గా గుర్తింపు పొందిన హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ మల్టీ స్టారర్ను తెరకెక్కించనున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కథను సూర్యకు వినిపించగా అది అతడికి బాగా నచ్చిందని సమాచారం. అయితే రామ్చరణ్కు స్టోరీ వినిపించాల్సి ఉందని తెలుస్తోంది. రామ్చరణ్ కూడా ఓకే చెప్తే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయమని అంటున్నారు. అదే జరిగితే చరణ్ - సూర్య మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్ క్రేజీగా ఉంటుందని అంటున్నారు. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయమని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
మెగా హీరోలతో మల్టీస్టారర్!
మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరైన దర్శకుల్లో హరీష్ శంకర్ (Harish Shankar) ఒకరు. అటువంటి హరీశ్ శంకర్ తన 'మిస్టర్ బచ్చన్' సినిమా ప్రమోషన్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ పాన్ ఇండియా చిత్రం ఎందుకు తీయలేదు? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. పవన్ కల్యాణ్, రామ్ చరణ్, చిరంజీవిల కోసం ఒక స్టోరీని సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అది పట్టాలెక్కితే అన్ని పాన్ ఇండియాల కంటే అదే అతి పెద్ద పాన్ ఇండియా అవుతుందని పేర్కొన్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. అయితే గతంలో చిరు, రామ్చరణ్లు కలిసి ‘ఆచార్య’ చిత్రంలో నటించారు. ‘బ్రూస్లీ’, ‘మగధీర’ చిత్రాల్లో చరణ్ కోసం మెగాస్టార్ ఓ స్పెషల్ క్యామియో కూడా ఇచ్చారు. అటు పవన్ కల్యాణ్ సైతం 'శంకర్ దాదా MBBS', 'శంకర్ దాదా జిందాబాద్' చిత్రాల్లో చిన్న క్యామియో పోషించారు.
ఆగస్టు 03 , 2024
Darling Movie Review: ప్రియదర్శిని ఓ ఆట ఆడుకున్న లేడీ అపరిచితురాలు.. మరి ‘డార్లింగ్’ మెప్పించిందా?
నటీనటులు: ప్రియదర్శి, నభా నటేష్, బ్రహ్మానందం, విష్ణు, కృష్ణ తేజ్, అనన్య నాగళ్ల, మురళీధర్ గౌడ్ తదితరులు
రచన, దర్శకత్వం: అశ్విన్ రామ్
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: నరేష్ రామదురై
మాటలు: హేమంత్
నిర్మాతలు: కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి
విడుదల తేదీ: 19-07-2024
ప్రియదర్శి (Priyadarsi), నభా నటేష్ (Nabha Natesh) లీడ్ రోల్స్లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'డార్లింగ్' (Darling Movie Review In Telugu). ఈ సినిమాకు అశ్విన్ రామ్ (Aswin Ram) దర్శకత్వం వహించారు. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కె. నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య రెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో జూలై 19న ‘డార్లింగ్’ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? హీరోగా ప్రియదర్శి ఆకట్టుకున్నాడా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
రాఘవ్ (ప్రియ దర్శి) చిన్నప్పటి నుంచి పెళ్లి, హనీమూన్ అంటూ కలలు కంటాడు. అందుకోసం కష్టపడి ఓ ట్రావెల్ ఏజెన్సీలో ఏజెంట్గా సెటిల్ అవుతాడు. తండ్రి (మురళీధర్ గౌడ్) చూసిన సైకాలజిస్ట్ నందిని (అనన్య నాగళ్ల)ని పెళ్లి చేసుకునేందుకు రెడీ అవ్వగా చివర క్షణంలో ఆమె ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోతుంది. దీంతో రాఘవ సూసైడ్కు రెడీ అవుతాడు. ఆ సమయంలోనే రాఘవకు ఆనంది (నభా నటేష్) పరిచయమవుతుంది. చూసిన కొద్ది నిమిషాలకే నచ్చేయడం, ఆ విషయం ఆమెకు చెప్పడం, ఇద్దరూ పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోతాయి. అయితే ఆనందికి మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని శోభనం రోజున రాఘవ్కు తెలుస్తుంది. దీని వల్ల రాఘవ్ ఎన్ని తిప్పలు పడ్డాడు? ఆనందిలో ఉన్న ఐదు పర్సనాలిటీస్ (ఆది, మాయ, ఝాన్సీ, పాప, శ్రీశ్రీ) ఎవరు? తెలియాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే.
ఎవరెలా చేశారంటే
రాఘవ పాత్రలో హాస్య నటుడు ప్రియదర్శి మరోమారు ఆకట్టుకున్నాడు. ఆ పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. తనదైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు. కథానాయిక నభా నటేష్ విభిన్నైన కోణాలున్న పాత్రలో అదరగొట్టింది. సినిమా మెుత్తాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించింది. కెరీర్ బెస్ట్ నటనతో మెప్పించింది. స్ప్లిట్ పాత్రల్లోని వేరియేషన్స్ను తనదైన నటనతో చక్కగా చూపించింది. నభా నటేష్, ప్రియదర్శి మధ్య వచ్చే ఫన్నీ సీన్స్ ఆకట్టుకుంటాయి, అయితే నభా నటేష్ పాత్రకు సంబంధించిన డబ్బింగ్ అంతగా కుదర్లేదనిపిస్తుంది. అటు అనన్య నాగళ్ల, మురళీధర్ గౌడ్ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. సుహాస్, బ్రహ్మానందం, నిహారిక కొణిదెల తదితరులు అతిథి పాత్రల్లో తళుక్కుమన్నారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ కాన్సెప్ట్ను దర్శకుడు అశ్విన్ రామ్ వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశారు. తొలి భాగం అంతా పెళ్లి కోసం హీరో పడే పాట్లు, పీటలపై పెళ్లి ఆగిపోవడం, ఆత్మహత్యకు యత్నించడం, ఆనందితో పరిచయం ఏర్పడటం, ఆపై వివాహం కూడా చేసుకోవడం అంతా చకచకా ఫన్నీ వేలో జరిగిపోతాయి. తొలి భాగంలో ఓవైపు నవ్విస్తూనే ఆడియన్స్ థ్రిల్ను సైతం పంచారు దర్శకుడు. అయితే సెకండాఫ్కు వచ్చే సరికి ఒక్కసారిగా స్టోరీ డల్ అయినట్లు అనిపిస్తుంది. పేలవమైన హీరోయిన్ గతం, కథంతా ఒకే దగ్గర తిరుగుతుంటం ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తుంది. కీలకమైన క్లైమాక్స్ విషయంలోనూ డైరెక్టర్ బాగా కన్ఫ్యూజ్ చేసేశారు. ఓవరాల్గా సినిమాలో కొత్తదనం ఉన్నా ఆద్యంతం అలరించడంలో మాత్రం దర్శకుడు అశ్విన్ రామ్ తడబడ్డాడని చెప్పవచ్చు.
టెక్నికల్గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. విజువల్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక వివేక్ సాగర్ అందించిన సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని కల్పించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు వియషంలో ఎక్కడా రాజీపడినట్లు కనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
ప్రియదర్శి, నభా నటేష్ నటనకామెడీసినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
సెకండాఫ్స్క్రీన్ప్లేసంగీతం
Telugu.yousay.tv Rating : 2.5/5
జూలై 19 , 2024
Kalki 2898 AD: విజయ్ దేవరకొండ, దుల్కర్ క్యామియో కన్ఫార్మ్ చేసిన నాగ్ అశ్విన్.. రోల్స్ ఏమిటంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఈ చిత్రం గురువారం (జూన్ 27) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, టీజర్ ఇప్పటికే విడుదలవ్వగా.. వాటికి విశేష ఆదరణ లభిస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్లతో పాటు కుర్ర హీరోలు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ సైతం నటిస్తున్నారని గత కొంత కాలంగా టాక్ వినిపిస్తోంది. అయితే ఇది నూటికి నూరు శాతం నిజమని తెలుస్తోంది. ఈ విషయాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ స్వయంగా వెల్లడించారు.
వీడియో వైరల్..!
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి చిత్రం.. రేపు (జూన్ 27) థియేటర్లలో గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్.. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ పేర్లను ప్రస్తావిస్తూ.. కల్కిలో భాగమైనందుకు ధన్యవాదాలు చెప్పారు. అటు ప్రభాస్ సైతం వారు సినిమాలో అతిథి పాత్రలు పోషించినందుకు థ్యాంక్స్ తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు. విజయ్ క్యామియోతో కల్కి థియేటర్లు బద్దలవుతాయని రౌడీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/AyyoEdits/status/1805955173459656978
విజయ్ పాత్ర అదేనా?
తాజాగా కల్కి రెండో ట్రైలర్ రిలీజ్ కాగా.. అందులో విజయ్ దేవరకొండను చూపకనే చూపించారంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ ట్రైలర్లో మహాభారత సంగ్రామం సీక్వెన్స్ను కొద్దిసేపు చూపించారు. ఇందులో అశ్వత్థామ పాత్ర పోషించిన అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అర్జునుడితో తలపడ్డారు. అయితే అర్జునుడి పాత్ర ముఖాన్ని స్పష్టంగా చూపించలేదు. దీంతో అది విజయ్ కావొచ్చని నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు దర్శకుడు నాగ్ అశ్విన్ స్వయంగా విజయ్ ఉన్నట్లు స్పష్టం చేయడంతో తమ హీరో అర్జునుడిగా కనిపించడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ ప్రశ్నకు జూన్ 27న క్లారిటీ వచ్చే అవకాశముంది.
https://twitter.com/TheDEVERA_fan/status/1804410479642841242
సీనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నారా?
కల్కి సినిమాకు సంబంధించి లేటెస్ట్ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా కనిపించనున్నారని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి వీఎఫ్ఎక్స్లో ఎన్టీఆర్ పాత్రను ఈ చిత్రంలో మేకర్స్ చూపించనున్నారని తెలుస్తోంది. శ్రీకృష్ణుడి పాత్రను ఎన్టీఆర్ చాలా సినిమాల్లో చేశారు. కృష్ణుడు అంటేనే తెలుగు వారికి ఆయనే గుర్తు వస్తారు. శ్రీకృష్ణుడి అవతారంలో ఎన్టీఆర్ ఉన్న విగ్రహాలు కూడా చాలా చోట్ల ఉన్నాయి. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కల్కి 2898 ఏడీ సినిమాలో ఎన్టీఆర్ ఉండాలని మేకర్స్ భావించినట్టు తెలుస్తోంది.
విశ్వామిత్రునిగా రాజమౌళి?
కల్కి చిత్రంలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (S.S. Rajamouli) కూడా ఓ కీలక పాత్ర పోషించినట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. అయితే ఆయన విశ్వామిత్రుని పాత్రలో కనిపిస్తారని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. సినిమాలోని కీలక సన్నివేశంలో రాజమౌళి పాత్ర తెరపైకి వస్తుందని అంటున్నారు. రెండు నుంచి మూడు నిమిషాల నిడివి లోపే రాజమౌళి పాత్ర ముగుస్తుందని సమాచారం. మరోవైపు డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ నుంచి కూడా ఓ క్యామియో ఉంటుందని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఆర్జీవీ పాత్ర చాలా సర్ప్రైజింగ్గా ఉంటుందని చెబుతున్నారు. కల్కి కోసం ఆర్జీవీ ఫస్ట్ టైమ్ యాక్టర్గా మారడం గమనార్హం.
జూన్ 26 , 2024
Kamal Hassan: ‘కల్కి’పై కమల్ హాసన్ క్రేజీ కామెంట్స్.. 27 ఏళ్ల తర్వాత స్టార్ హీరోయిన్ రీఎంట్రీ!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా గ్లోబల్ మార్కెట్ను టార్గెట్ చేస్తూ రూపొందిన చిత్రం 'కల్కి 2898 ఏడి' (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ (Nag Ashwin) డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం.. యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. సైంటిఫిక్ అండ్ ఫ్యూచరిక్ జానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా దిగ్గజ నటుడు కమల్ హాసన్ (Kamal Hassan) నటించారు. దీంతో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే కల్కి గురించి ఇప్పటివరకూ పెద్దగా కామెంట్స్ చేయని కమల్.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కల్కిపై అంచనాలను మరింత పెంచుతున్నాయి
కమల్ ఏమన్నారంటే
దేశం గర్వించతగ్గ నటుల్లో కమల్ హాసన్ ఒకరు. ఆయన యూనివర్సల్ స్టార్గానూ గుర్తింపు పొందారు. అటువంటి కమల్.. కల్కిలో ఓ ఇంపార్టెంట్ రోల్లో కనిపించనున్నారని తెలియగానే సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే తాజాగా కల్కి సినిమాపై స్పందించిన కమల్.. ఈ చిత్రాన్ని హవర్ గ్లాస్తో పోల్చారు. మనం ఎలా టర్న్ చేస్తే అలా సినిమా తిరుగుతుందని వ్యాఖానించారు. ఇలాంటి సినిమాలో నటించడం చాలా ఆసక్తికరమని చెప్పారు. ఇప్పటివరకు చేసిన 230 చిత్రాల్లో ఈ తరహా సినిమాను చేయలేదని చెప్పుకొచ్చారు. కమల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
కల్కిలో భారీ కాస్టింగ్
ప్రతిష్టాత్మంగా రూపొందుతున్న కల్కి చిత్రంలో.. హీరో ప్రభాస్, కమల్ హాసన్లతో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం మరింత మంది స్టార్ నటులు కల్కిలో కనిపించబోతున్నారు. గతంలో ప్రచారం జరిగిన విధంగా ఎస్.ఎస్ రాజమౌళి (SS Rajamouli), ఆర్జీవీ (RGV), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), హీరో నాని (Nani) ఈ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించనున్నారట. వీరితో పాటు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రానాలు కూడా గెస్ట్ రోల్స్లో అలరించబోతున్నట్లు తాజాగా నెట్టింట ప్రచారం జరుగుతోంది. కాగా, ఇప్పటికే సినిమాలోని బుజ్జి అనే రోబొటిక్ వాహనానికి హీరోయిన్ కీర్తి సురేష్ తన వాయిస్ అందించింది. ఇలా ఇంతమంది స్టార్ నటీనటులు కల్కిలో భాగస్వామ్యం కావడంతో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరాయి.
అలనాటి నటి గ్రాండ్ ఎంట్రీ!
కల్కి సినిమాలో కనిపించబోయే స్టార్ క్యాస్టింగ్లలో ప్రధానంగా ఓ నటి పేరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన శోభన (Actress Shobana) కూడా కల్కిలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. నటి శోభన తెలుగులో సినిమాలు చేసిన రెండు దశాబ్దాలు దాటి పోయింది. 1997 తర్వాత ఆమె తెలుగులో ఏ సినిమా చేయలేదు. ఈ క్రమంలో ఇప్పుడు కల్కిలో ఆమె రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. సుమారు 27 ఏళ్ల తర్వాత ఆమె తెలుగు తెరపై మెరవబోతున్నారు. కాగా, ఈ సినిమాలో హాస్య నటుడు బ్రహ్మానందం కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.
జూన్ రెండో వారంలో ట్రైలర్!
విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో కల్కి టీమ్ ప్రమోషన్స్ జోరు పెంచింది. ఇప్పటికే 'బుజ్జి అండ్ భైరవ' అనే యానిమేటెడ్ సిరీస్ను ఓటీటీలో లాంచ్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. దీనికి కొనసాగింపుగా త్వరలో ట్రైలర్ కూడా తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వర్స్క్ కూడా మెుదలైనట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. జూన్ రెండో వారంలో ట్రైలర్ లాంచ్ అయ్యే అవకాశమున్నట్లు సమాచారం. విజువల్ వండర్లా ట్రైలర్ ఉంటుందని, అసలు కంటెంట్ను ఇందులో చూపిస్తారని సమాచారం. మరి ఈ ట్రైలర్ ఏ మేరకు ఆడియన్స్ను అట్రాక్ట్ చేస్తుందో చూడాలి.
జూన్ 04 , 2024