• TFIDB EN
  • బాణం
    UATelugu1h 50m
    మాజీ నక్సలైట్ కొడుకు అయిన భగత్ ఒక చిన్న పట్టణంలో నివసిస్తుంటాడు. స్థానిక గ్యాంగ్‌స్టర్ దౌర్జన్యాల నుంచి ప్రజలను కాపాడేందకు IPS అధికారి కావాలని నిర్ణయించుకుంటాడు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    నారా రోహిత్
    భగత్ పాణిగ్రాహి
    వేదిక
    శుభ లక్ష్మి
    సాయాజీ షిండే
    చంద్రశేఖర్ పాణిగ్రాహి
    రాజీవ్ కనకాల
    ఏసీపీ గుడిపూడి వెంకటేశ్వరరావు
    రణధీర్ రెడ్డి
    శక్తి పట్నాయక్
    శ్రీ విష్ణు
    అకాడమీ అధికారి
    భాను చందర్
    భగత్‌ని IPS ఆఫీసర్‌గా మార్చడానికి ప్రేరేపించిన IPS అధికారి
    AVS
    భగత్ పొరుగు మరియు అతని ఇంటి యజమాని
    గిరిశుభ లక్ష్మి భర్త
    శివన్నారాయణ నారిపెద్ది
    శుభ లక్ష్మి మామగారు
    చరణ్దీప్
    ఒక అనుచరుడు
    సిబ్బంది
    చైతన్య దంతులూరిదర్శకుడు
    ప్రియాంక దత్నిర్మాత
    మణి శర్మ
    సంగీతకారుడు
    మార్తాండ్ కె. వెంకటేష్
    ఎడిటర్
    కథనాలు
    <strong>Tollywood Couples: నారా రోహిత్‌ - సిరి లేళ్ల తరహాలో ఒక్కటైన సెలబ్రిటీ జంటలు వీరే!</strong>
    Tollywood Couples: నారా రోహిత్‌ - సిరి లేళ్ల తరహాలో ఒక్కటైన సెలబ్రిటీ జంటలు వీరే!
    రీల్‌ లైఫ్‌లో జంటగా చేసిన సెలబ్రిటీలు నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారు. ముందుగా ప్రేమ బంధంతో ఒక్కటై ఆ తర్వాత పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. కృష్ణ- విజయ నిర్మల, రాజశేఖర్‌- జీవిత, నాగార్జున-అమల, శ్రీకాంత్‌-ఊహా, మహేశ్‌ బాబు- నమ్రత ఈ కోవకు చెందిన వారే. అయితే&nbsp;టాలీవుడ్‌లో ఈ సెలబ్రిటీ పెళ్లిళ్లు ఇటీవల కాలంలో బాగా ఎక్కువయ్యాయి. యంగ్‌ హీరో నారా రోహిత్‌ రీసెంట్‌గా యువ నటి సిరి లేళ్లను వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జనరేషన్‌ హీరో- హీరోయిన్లు ఎవరో ఓ లుక్కేద్దాం.&nbsp; నారా రోహిత్‌ - సిరి లేళ్ల ఏపీ సీఎం నారా చంద్రబాబు సోదరుడి కుమారుడైన నటుడు నారా రోహిత్‌ (Nara Rohit) ‘బాణం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. సోలో, ప్రతినిధి, అసుర, సుందరకాండ వంటి చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకున్నారు. రీసెంట్‌గా యువ నటి సిరి లేళ్ల (Siri Lella) ను ఆయన నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి వివాహం డిసెంబర్‌లో జరగనుంది. అయితే ఇటీవల వచ్చిన ‘ప్రతినిధి 2’లో వీరిద్దరు జంటగా నటించారు. షూటింగ్ సందర్భంగా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. హృదయాలు సైతం కలిసిపోవడంతో బంధుమిత్రుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. సిరి లేళ్ల విషయానికి వస్తే ఆమె తెలుగమ్మాయే. ఏపీలోని రెంట చింతల ఆమె స్వగ్రామం. ఆస్ట్రేలియాలో మాస్టర్స్‌ డిగ్రీ చేసిన ఆమె నటనపై మక్కువతో ఇండియాకు తిరిగి వచ్చింది. ‘ప్రతినిధి 2’ ఆడిషన్స్‌లో పాల్గొని హీరోయిన్‌గా ఛాన్స్‌ దక్కించుకుంది.&nbsp; నాగచైతన్య - శోభిత దూళిపాళ్ల అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya), శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala) త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి నిశ్చితార్థం ఇటీవలే బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. వాస్తవానికి 2017లో సమంతను నాగ చైతన్య ప్రేమ వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో 2021లో వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నాగ చైతన్య, శోభిత చాలా సార్లు కలిసి కనిపించారు. వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తోందనే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోని ఎంగేజ్‌మెంట్‌ చేసుకొని&nbsp; స్పందించకపోయినప్పటికీ నిశ్చితార్థంతో వాటికి ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ప్రస్తుతం నాగ చైతన్య ‘తండేల్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. శోభితా ఇటీవల మంకీ మ్యాన్ అనే హాలీవుడ్‌ చిత్రంలో నటించింది. హిందీలో ఆమె లవ్‌, సితారా చిత్రం రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. కిరణ్‌ అబ్బవరం - రహస్య గోరఖ్‌ యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) ‘రాజా వారు రాణిగారు’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఇందులో రహస్య గోరఖ్‌ (Rahasya Gorak)హీరోయిన్‌గా చేసింది. తొలి చిత్రంతోనే అందమైన జంటగా వీరు గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా షూటింగ్‌ సందర్భంగా ఏర్పడిన స్నేహం వీరి మధ్య ప్రేమ చిగురించేలా చేసింది. అలా ఐదేళ్లపాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట ఆగస్టు 22న కర్ణాటకలోని కూర్గ్‌లో వివాహం చేసుకుంది. సినిమాల్లోకి రాకముందు కిరణ్‌, రహస్య ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా పనిచేశారు. నటనపై ఆసక్తితో ఉద్యోగాలకు స్వస్థి చెప్పి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం కిరణ్‌ నటిస్తున్న ‘క’ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది.&nbsp; వరుణ్‌ తేజ్‌ - లావణ్య త్రిపాఠి మెగా బ్రదర్‌ నాగబాబు కుమారుడైన వరుణ్‌ తేజ్‌ (Varun Tej) ‘ముకుంద’ (2014) చిత్రంతో హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆ తరవాత ‘కంచె’, ‘ఫిదా’, ‘లోఫర్‌’, ‘ఎఫ్‌3’ వంటి విజయవంతమైన చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకున్నాడు. ప్రముఖ హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)ని గతేడాది నవంబర్‌లో డెస్టినేషన్‌ మ్యారేజ్‌ చేసుకున్నాడు. అయితే 2017లో వచ్చిన ‘మిస్టర్‌’ చిత్రంలో ఈ జంట తొలిసారి కలిసి నటించింది. ఆ తర్వాత ‘అంతరిక్షం’ సినిమాలోనూ జోడీగా కనిపించి మెప్పించారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మెుదలైన స్నేహం పెళ్లి పీటలపై వైపు అడుగులు వేసేలా చేసింది. ఇటలీ జరిగిన వీరి వివాహానికి మెగా ఫ్యామిలీ మెుత్తం హాజరయ్యింది. ఇదిలా ఉంటే వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం మట్కా చిత్రంలో నటించాడు. ఈ మూవీ నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. లావణ్య ప్రస్తుతం ‘తనల్‌’ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది.&nbsp; ఆది పినిశెట్టి - నిక్కీ గల్రానీ ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి వారసుడిగా యంగ్‌ హీరో ఆది పినిశెట్టి (Aadi Pinisetty) ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. వైవిధ్యమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు. అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’, రామ్‌ హీరోగా చేసిన ‘వారియర్‌’ చిత్రాల్లో విలన్‌గా చేసి ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే నటి నిక్కీ గల్రానీ (Nikki Galrani)ని ఆది 2022 మే నెలలో ప్రేమ వివాహం చేసుకున్నారు. నిక్కీ ఆదితో రెండు చిత్రాలు చేసింది. ‘మలుపు’, ‘మరకతమణి’ చిత్రాల్లో వీరిద్దరు కలిసి నటించారు. మలుపు షూటింగ్‌ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. అది కాస్త పెళ్లి పీటలకు దారితీసింది.&nbsp; వరుణ్‌ సందేశ్‌ - వితిక షేరు యంగ్‌ హీరో వరుణ్‌ సందేశ్‌ (Varun Sandesh) 2007లో విడుదలైన ‘హ్యాపీడేస్‌’తో&nbsp; తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ‘కొత్త బంగారు లోకం’ సక్సెస్‌తో యూత్‌కు మరింత కనెక్ట్‌ అయ్యారు. నటి వితికా షేరు (Vithika Sheru)ను 2015 డిసెంబర్‌ 7న వివాహం చేసుకున్నారు. వీరిద్దరు అదే ఏడాది రిలీజైన 'పడ్డానండి ప్రేమలో మరి' సినిమాలో కలిసి నటించారు. మంచి స్నేహంతో పాటు ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 3లోనూ జంటగా అడుగుపెట్టి మంచి కపుల్‌గా బుల్లితెర ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. వరుణ్‌ సందేశ్ ఈ ఏడాది 'నింద', విరాజి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. వితిక షేరు ప్రస్తుతం యూట్యూబ్‌ వీడియోలు చేస్తూ సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది.&nbsp;
    అక్టోబర్ 17 , 2024
    <strong>Vedika Bikini: బికినిలో వేదిక థండర్ థైస్ అందాలు</strong>
    Vedika Bikini: బికినిలో వేదిక థండర్ థైస్ అందాలు
    గ్లామర్‌ బ్యూటీ వేదిక (Vedhika) మరోమారు సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. తన బికిని ఫొటోలను కుర్రకారు మతిపోగొడుతోంది.&nbsp; తాజాగా ఓ బీచ్‌కు వెళ్లిన వేదిక అక్కడ బికిని (Vedika Bikini Photos)తో హల్‌ చల్‌ చేసింది. ఆ ఫొటోలను నెట్టింట షేర్‌ చేసి అభిమానులకు హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది.&nbsp; జీరో సైజ్‌లో వేదిక (Vedhika Hot) అందాలు చూసి నెటిజన్లు మైమరిచిపోతున్నారు. ఆమె సొగసుల సంపద అదిరిపోయిందంటూ పోస్టులు పెడుతున్నారు.&nbsp; వేదిక ఫొటోలు నెట్టింట వైరల్ కావడం ఇదే తొలిసారి కాదు. గత కొంతకాలంగా ఈ బ్యూటీ షేర్‌ చేస్తోన్న హాట్‌ ఫొటోలు ట్రెండింగ్ అవుతూనే ఉన్నాయి. వేదిక (Vedika Bikini Photos) వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె 1988 ఫిబ్రవరి 21న కర్ణాటకలో జన్మించింది. బ్రాటప్‌ అంతా ముంబయిలో జరిగింది.&nbsp; కెరీర్‌ ప్రారంభంలో వేదిక (Vedhika) మోడల్‌గా చేసింది. పలు వాణిజ్య సంస్థల ప్రకటనల్లో ఆమె నటించింది. ఆపై సినిమాల్లోకి అడుగుపెట్టింది.&nbsp; తమిళంలో 2006లో వచ్చిన 'మద్రాసి' చిత్రంలో ఈ అమ్మడు హీరోయిన్‌గా మారింది. అందులో అంజలి పాత్రలో నటించి ఆకట్టుకుంది.&nbsp; 2007లో రాఘవ లారెన్స్‌ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన ముని సినిమాలో వేదిక నటించింది. ఆ సినిమా తమిళం, తెలుగులో ఒకేసారి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.&nbsp; ఆ తర్వాత కళ్యాణ్‌ రామ్‌ నటించిన 'విజయ దశమి' మూవీతో నేరుగా తెలుగు తెరపై అడుగుపెట్టింది. ఆ సినిమా పెద్ద సక్సెస్‌ కాకపోవడంతో తెలుగులో అవకాశాలు లభించలేదు.&nbsp; దీంతో తమిళం, కన్నడ ఇండస్ట్రీపై ఫోకస్‌ పెట్టిన వేదిక అక్కడ వరుసగా చిత్రాలు చేసి మరింత పాపులర్ అయ్యింది.&nbsp; తద్వారా 2009లో నారా రోహిత్‌ ఫస్ట్‌ ఫిల్మ్‌ 'బాణం'లో&nbsp; హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసింది. ఇందులో సుబ్బలక్ష్మీ పాత్రతో తెలుగు ఆడియన్స్‌ను ఫిదా చేసింది.&nbsp; ఆ తర్వాత తమిళంలో బాలా దర్శకత్వంలో చేసిన 'పరదేశి' చిత్రం నటిగా వేదికకు మంచి క్రేజ్‌ తెచ్చిపెట్టింది. అంగమ్మ పాత్రలో ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది.&nbsp; బాణం సినిమా సక్సెస్‌ అయినప్పటికీ తెలుగులో వేదికకు రెగ్యులర్‌గా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలో ఈ అమ్మడు బిజీ అయిపోయింది.&nbsp; అడపాదడపా తెలుగు చిత్రాల్లో నటిస్తూ ఇక్కడి ప్రేక్షకులను సైతం అలరించింది. బాణం తర్వాత&nbsp;దగ్గరగా దూరంగా, రూలర్‌, బంగర్రాజు, రీసెంట్‌గా 'రజాకార్‌' చిత్రాల్లో వేదిక మెరిసింది.&nbsp; ప్రస్తుతం తెలుగులో ఫియర్‌ అనే చిత్రంలో వేదిక&nbsp; (Vedika Bikini Photos) నటిస్తోంది. షూటింగ్‌ పూర్తయ్యి ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూ సోషల్‌ మీడియాలోనూ వేదిక యాక్టివ్‌గా ఉంటోంది. ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 4.2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.&nbsp;
    డిసెంబర్ 09 , 2024
    <strong>Tollywood Women Producers: టాలీవుడ్‌లో స్టార్ల కుమార్తెల కొత్త ట్రెండ్‌.. ఇండస్ట్రీపై తమదైన ముద్ర!</strong>
    Tollywood Women Producers: టాలీవుడ్‌లో స్టార్ల కుమార్తెల కొత్త ట్రెండ్‌.. ఇండస్ట్రీపై తమదైన ముద్ర!
    సాధారణంగా సినిమా అంటే ముందుగా హీరో, హీరోయిన్‌, దర్శకుడే గుర్తుకు వస్తారు. తర్వాత మ్యూజిక్‌ డైరెక్టర్‌, ఇతర తారాగణం, టెక్నికల్‌ టీమ్‌పై అందరి దృష్టి పోతుంది. చివర్లో ఆ సినిమా నిర్మాత ఎవరు అని సినీ లవర్స్‌ తెలుసుకుంటూ ఉంటారు. వాస్తవానికి ఒక సినిమా నిర్మాణంలో ఎక్కువగా కష్టపడేది నిర్మాతే. సినిమా బాగా రావడం కోసం ఖర్చులో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు హీరోను డైరెక్టర్‌ను ముందుకు తీసుకెళ్లేదే నిర్మాతలే. హీరోలు, డైరెక్టర్లకు ఈ సినిమా పోతే ఇంకోటి అనే ఆప్షన్‌ ఉంటుంది. కానీ నిర్మాతల పరిస్థితి అలా కాదు. ఎక్కడెక్కడి నుంచే డబ్బు కూడగట్టి తీసిన ఫిల్మ్‌ ఫ్లాప్‌ అయితే తిరిగి కోలుకోవడం చాలా కష్టం. అంతటి రిస్క్‌ కలిగిన నిర్మాణ రంగంలోకి స్టార్ల కుమార్తెలు వచ్చేస్తున్నారు. కుమారులు హీరోగా ఎంట్రీ ఇస్తున్న తరుణంలో తాము ఏమాత్రం తక్కువ కాదని నిర్మాణ రంగంవైపు అడుగులు వేస్తున్నారు. యంగ్‌ ప్రొడ్యుసర్స్‌గా సత్తా చాటేందుకు సై అంటున్నారు. వారెవరో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; తేజస్విని నందమూరి టాలీవుడ్‌లో నటుడిగా బాలకృష్ణ (Bala Krishna) చెరగని ముద్రవేశారు. యంగ్‌ హీరోలతో సమానంగా వరుస చిత్రాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన నట వారసత్వాన్ని మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) తీసుకొని టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాతోనే బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని (Tejaswini Nandamuri) నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. మోక్షజ్ఞ తొలి సినిమాకు ఆమె నిర్మాతగా వ్యవహరించనున్నారు. లెజెండ్‌ ప్రొడక్షన్స్‌పై ఆమె దీనిని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్‌ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. నిహారిక కొణిదెల మెగా కుటుంబం నుంచి ఎందరో హీరోలు వచ్చి అలరిస్తున్నారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని భారతీయ సినిమా ఖ్యాతిని పెంచుతున్నారు. ఇప్పుడు నిర్మాణ రంగంలోనూ సత్తా చాటేందుకు మెగా ఫ్యామిలీ వారసురాళ్లు రెడీ అయ్యారు. నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల (Niharika Konidela) ఇటీవల నిర్మాతగా మారింది. పింక్‌ ఎలిఫెంట్ పిక్చర్స్‌ పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించింది. దాని ద్వారా తొలిసారి ‘కమిటీ కుర్రోళ్లు’ అనే చిత్రాన్ని నిర్మించింది. వైవిధ్యభరితమైన కథతో, కొత్త నటీనటులతో ఈ చిత్రాన్ని నిర్మించి ప్రశంసలు దక్కించుకుంది. రూ.6 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన కమిటీ కుర్రోళ్లు చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.18 కోట్లకుపైగా వసూలు చేసింది.&nbsp; సుస్మితా కొణిదెల మెగా కుటుంబం నుంచి మరో నిర్మాత కూడా ఇండస్ట్రీలో ‌అడుగుపెట్టబోతోంది. చిరంజీవి కుమార్తె సుస్మితా కొణిదెల (Sushmita Konidela) ‘గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్’ అంటూ కొత్త నిర్మాణ సంస్థను స్థాపించారు. దీనిపై తొలి చిత్రమే తన తండ్రితో తీయనున్నట్లు ఆమె ప్రకటించారు. త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. కాగా, కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా సుస్మిత కొణిదెలకు మంచి పేరుంది. చిరంజీవి హీరోగా నటించిన పలు చిత్రాలకు ఆమె కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వ్యవహరించి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు నిర్మాణ రంగంలోనూ ఆమె ప్రతిభ చూపడం ఖాయమని మెగా ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు.&nbsp; అశ్వనీదత్‌ వారసురాళ్లు టాలీవుడ్‌లో ‘వైజయంతీ మూవీస్‌’కు ప్రత్యేక స్థానం ఉంది. 50 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సంస్థ ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించింది. అశ్వనీదత్ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడం కోసం ఆయన కుమార్తెలు స్వప్న దత్‌ (Swapna Dutt), ప్రియాంక దత్‌ (Priyanka Dutt)లు సిద్ధమయ్యారు. తాజాగా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)తో ప్రపంచస్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. త్వరలోనే మరిన్ని సినిమాలు తీయనున్నట్లు తెలిపారు. అంతకముందు ‘స్వప్న సినిమా’, ‘త్రీ ఏంజెల్స్‌ స్టూడియో’, ‘ఎర్లీ మన్‌సూన్‌ టేల్స్‌’ వంటి సబ్‌ బ్యానర్లను ఏర్పాటు చేసి ‘మహానటి’, ‘సీతారామం’, ‘బాణం, ‘సారొచ్చారు’ వంటి హిట్‌ చిత్రాలను అశ్వని దత్ కుమార్తెలు నిర్మించారు.&nbsp; ప్రసీద ఉప్పలపాటి&nbsp; దిగ్గజ నటుడు కృష్ణం రాజు కుమార్తె, రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సోదరి ప్రసీద ఉప్పలపాటి (Praseedha Uppalapati) సైతం నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ‘గోపికృష్ణ మూవీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి దానితో ప్రభాస్ హీరోగా ‘రాధేశ్యామ్‌’ (Radheshyam)ను నిర్మించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. మంజులా ఘట్టమనేని సూపర్‌ స్టార్‌ కృష్ణ ఫ్యామిలీ నుంచి కూడా ఓ మహిళ నిర్మాత టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. కృష్ణ కుమార్తె, మహేష్‌ బాబు (Mahesh Babu) సోదరి అయిన మంజుల ఘట్టమనేని (Manjula Ghattamaneni) నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించారు. ఇందిరా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై&nbsp; ‘షో’, ‘నాని’, ‘పోకిరి’, ‘ఏమాయ చేసావె’ వంటి చిత్రాలకు ప్రొడ్యూసర్‌గా వర్క్‌ చేశారు. ఆ తర్వాత నటిగాను మారి పలు చిత్రాల్లో పాత్రలు పోషించారు.&nbsp;
    సెప్టెంబర్ 11 , 2024
    Ramayanam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో రామాయణం రిఫరెన్స్‌లు
    Ramayanam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో రామాయణం రిఫరెన్స్‌లు
    “విపరీతమైన విలువలు పాటించి జీవించిన వాడు మర్యాద పురుషోత్తముడు..రాముడు. ప్రపంచంలో ఇన్ని సార్లు తిరిగి తిరిగి తిరిగి చెప్పిన కథ ఏదైనా ఉందంటే రాముడిదే” ఇది s/o సత్యమూర్తి ప్రమోషన్ల టైంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన మాట. రాముడు అన్నా, రామాయణ, మహాభారతాలు అన్నా త్రివిక్రమ్‌ అమితమైన గౌరవం. ఆ గౌరవాన్ని తాను రైటర్‌గా ఉన్నప్పటి నుంచే తన సినిమాల్లో అక్కడక్కడా చూపిస్తూనే ఉన్నాడు. ఫన్నీగానో, సీరియస్‌గానో, ఎమోషనల్‌గానే తన సినిమాలో చిన్న డైలాగ్ అయినా రామాయణం నుంచి రిఫరెన్స్‌ తీసుకుని రాస్తుంటాడు. అలాంటివి కొన్ని చూద్దాం. నువ్వు నాకు నచ్చావ్‌! ప్రకాశ్‌ రాజ్‌ ఇంటికి వెంకటేశ్‌ వచ్చినపుడు సునీల్‌ తనని ఔట్‌ హౌజ్‌కు తీసుకెళ్తాడు. అక్కడ ఆ ఇంటి గురించి చెబుతూ.. “ అయ్యగారు రాముడైతే అమ్మగారు సీత.. అందుకే ఈ ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు” అంటాడు. వెంటనే వెంకటేశ్‌ సెటైర్‌ వేస్తూ అయితే “ఔట్‌హౌజ్‌ పేరు లంకా” అనేస్తాడు. https://www.youtube.com/watch?v=UVFCtTNU29s అత్తారింటికి దారేది అత్తారింటికి దారేదిలో పవన్ కల్యాణ్ తన అత్తయ్యని ఒప్పించి ఇంటికి తీసుకురావడానికి బయల్దేరుతున్నపుడు… ఎం.ఎస్‌. నారాయణ ఇప్పుడెలా ఒప్పిస్తారు సార్‌ అని అడుగుతాడు. అప్పుడు పవన్ కల్యాణ్‌ “ ఒరేయ్‌ రాముడు సముద్రం దాకా వెళ్లాక బ్రిడ్జ్‌ ఎలా కట్టాలి అని ప్లాన్‌ చేసుకున్నాడు గానీ అడవిలో బ్రిడ్జ్‌కు ప్లాన్‌ గీసుకుని సముద్రం దగ్గరకు వెళ్లలేదురా” అని చెప్తాడు. అంటే అక్కడికెళ్లాక చూసుకుందాంలే అనే చిన్న మాటను గురూజీ ఇలా తన స్టైల్‌లో రాశాడు. https://www.youtube.com/watch?v=9-PckWpekQY జల్సా జల్సాలో ఇలియానాకు అమ్మాయిల గురించి చెబుతూ… ఇప్పుడంటే అమ్మాయిలు అబ్బాయిల వెనకాల పడుతున్నారు గానీ గతంలో కనీసం కన్నెత్తి కూడా చూసేవారు కాదు. అంతెందుకు సాక్షాత్తు శ్రీరాముల వారు ఆల్‌ ది వే లంక దాకా బ్రిడ్జి కట్టుకుని వచ్చి మరీ యుద్ధం చేస్తుంటే సీతమ్మ అశోక చెట్టు కింద పడుకుంది గానీ కనీసం చెట్టు ఎక్కి చూసిందా?” అంటూ చెబుతాడు.&nbsp; https://www.youtube.com/watch?v=ow0cZU-BkrI అ ఆ ‘అ ఆ’లో అనుపమ చెప్పే ఈ డైలాగ్‌ అయితే అందరికీ తెలిసిందే. ‘ రావణాసురుడి మమ్మీ, డాడీ కూడా ‘సూర్పనక’ను సమంత అనే అనుకుంటారు కదే అని రావు రమేశ్ అంటే.. రావణాసురుడి భార్య కూడా తన భర్తను పవన్ కల్యాణ్‌ అనే అనుకుంటుంది అంటూ ఫన్నీగా రామాయణంలో క్యారెక్టర్ల రిఫరెన్స్ తీసుకున్నాడు. https://www.youtube.com/watch?v=qrrldRJc5e8 మన్మథుడు మన్మథుడులో సునీల్‌ తన వదిన జోలికి రాకండి అని వార్నింగ్‌ ఇచ్చే క్రమంలో “ రాముడు పక్కనుండగా సీత జోలికి ఎవడైనా వస్తే లక్ష్మణుడికి కోపం రావడం ఎంత సహజమో. ఇప్పుడు నాకు కోపం రావడం అంతే సహజం’ అంటూ తణికెళ్ల భరణికి వార్నింగ్‌ ఇస్తాడు.&nbsp; https://www.youtube.com/watch?v=vn3CHyPz8Ow అల వైకుంఠపురములో అల్లు అర్జున్‌కు రాంబంటు అని పేరు పెడితే అదేం పేరు అండి అంటూ ఆచార్యుల వారు అడుగుతారు. రాంబంటు అంటే ఆంజనేయ స్వామికి గుడి కట్టి పూజ చేయట్లేదు అని మురళీ శర్మ అంటాడు. ఆయన రాముడికి బంటు అండి అంటూ ఆచార్యులు సమాధానం ఇస్తారు.ఇలా ఇంకా చాలా సినిమాల్లో సింగిల్ లైన్‌లో త్రివిక్రమ్‌ పౌరాణికాలపై తనకున్న ప్రేమను ప్రదర్శించాడు. అజ్ఞాతవాసి “సీతాదేవిని తెచ్చాడని మండోదరి రావణాసురుడికి అన్నం పెట్టడం మానేసిందా?” ( కీర్తి సురేశ్‌తో తన తల్లి) S/O సత్యమూర్తి “రావణాసురుడు సీతను పట్టుకున్నాడు రాముడి చేతిలో చచ్చాడు వదిలేసుంటే కనీసం బతికేవాడు” ( ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌) భీమ్లా నాయక్‌ “ఆ రాముడు కూడా ఇలాగే ఒకటే బాణం ఒకరే సీత అని అడవుల్లో వదిలేశాడు”( పవన్ కల్యాణ్‌తో నిత్య మీనన్‌) అతడు “హనుమంతుడి కన్నా నమ్మకైన వాడు రాముడికి ఇంక ఎవరున్నారు చెప్పు” (సునీల్‌తో మహేశ్‌ బాబు)మీకు ఇంకా ఏమైనా తెలిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
    ఏప్రిల్ 14 , 2023
    Vyjayanthi Movies Hits : ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాణ సంస్థ  వైజయంతీ బ్యానర్‌లో ఇన్ని హిట్ సినిమాలు ఉన్నాయా?
    Vyjayanthi Movies Hits : ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాణ సంస్థ  వైజయంతీ బ్యానర్‌లో ఇన్ని హిట్ సినిమాలు ఉన్నాయా?
    ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం.. థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కల్కి ఈ స్థాయి సక్సెస్‌ సాధించడం వెనక దర్శకుడు నాగ్‌ అశ్విన్‌తో పాటు నిర్మాణ సంస్థ ‘వైజయంతీ మూవీస్‌’ (Vyjayanthi Movies) బ్యానర్‌ పాత్ర కూడా ఎంతో ఉంది. నిర్మాత అశ్వనీ దత్‌ (Aswani Dutt) ఎంతో సాహాసోపేతంగా కల్కి చిత్రాన్ని నిర్మించారు. బడ్జెట్‌ అంతకంతకూ పెరుగుతున్నప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. క్వాలిటీ ఔట్‌పుట్‌ ఇవ్వాలన్న లక్ష్యంతో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కు బడ్జెట్‌ పరంగా పూర్తి స్వేచ్ఛను కల్పించారు. రూ.600 కోట్లకు పైగా వ్యయంతో ఇండియాలోనే అతి భారీ బడ్జెట్‌ ఫిల్మ్‌గా కల్కిని తీర్చిదిద్దారు. కల్కి లాంటి విజువల్‌ వండర్‌ను అందించిన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ పేరు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.&nbsp; [toc] వైజయంతీ మూవీస్‌ ప్రస్థానం అశ్వనీ దత్‌.. నిర్మాతగా తన ప్రస్థానాన్ని అభిమాన హీరో నందమూరి తారక రామారావు ఫిల్మ్‌తోనే ప్రారంభించారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ను నిర్మించి దాని లోగోగా కృష్ణుడి అవతారంలో ఉన్న ఎన్టీఆర్‌ను పెట్టారు. 1975లో వచ్చిన 'ఎదురులేని మనిషి' చిత్రంతో వైజయంతీ మూవీస్‌ సంస్థ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తొలినాళ్లలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలను అందించడంలో మాత్రం వెనకడుగు వేయలేదు. ఈ బ్యానర్‌లో వచ్చిన పలు చిత్రాలు టాలీవుడ్‌లో ఎంతో ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేశాయి. ఇంతకీ ఆ బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలు ఏంటి? తెలుగు చిత్ర పరిశ్రమలో అవి ఎలాంటి మార్క్‌ను క్రియేట్‌ చేశాయి? ఇప్పుడు చూద్దాం.&nbsp; అగ్నిపర్వతం వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ‘అగ్నిపర్వతం’ (Agni Parvatam) ఒకటి. ఇందులో సూపర్‌ స్టార్‌ కృష్ణ డబుల్‌ రోల్స్‌ చేయగా.. రాధ, విజయశాంతి హీరోయిన్లుగా కనిపించారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ ఫిల్మ్‌ అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇందులో సూపర్‌ స్టార్‌ కృష్ణ నట విశ్వరూపం చూపించారు. ఈ చిత్రం కృష్ణ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో కృష్ణ దూకుడుగా చెప్పిన ‘అగ్గి పెట్టుందా?’ డైలాగ్‌ అప్పట్లో మారుమోగింది. అలాగే ‘కదులుతున్న అగ్నిపర్వతం’ సాంగ్‌ కూడా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. నటుడిగా సరికొత్త కృష్ణను పరిచయం చేసింది. మూవీ కథ ఏంటంటే.. ‘జమదగ్ని తన తల్లిని విడిచిపెట్టినందుకు అతని తండ్రిని ద్వేషిస్తాడు. అయితే అతని శత్రువులు సమస్య సృష్టించేందుకు జమదగ్ని సవతి సోదరుడిని తెరపైకి తెస్తారు. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.&nbsp; https://www.youtube.com/watch?v=FaJqLrjanQM జగదేక వీరుడు అతిలోక సుందరి వైజయంతీ మూవీస్‌ రొటిన్‌ చిత్రాలనే కాకుండా ప్రయోగాత్మక ఫిల్మ్స్‌ కూడా తీయగలదని ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం నిరూపించింది. మెగాస్టార్ కెరీర్‌లో మరుపురాని చిత్రంగా నిలిచిపోయింది. సోషియో ఫాంటసీ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం.. అప్పట్లో కలెక్షన్ల మోత మోగించింది. ఈ చిత్రం విడుదలకు ముందు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను వరదలు అతలాకుతలం చేశాయి. అయినా ఈ చిత్రం అఖండ విజయాన్ని నమోదు చేసుకోవడం విశేషం.&nbsp; రూ. 2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ ఫిల్మ్‌.. ఆ రోజుల్లో రూ.15 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాకు ఇళయరాజా అందించిన మధురమైన పాటలు ఇప్పటికీ ఎక్కడోచోట మారుమోగుతూనే ఉన్నాయి. కథ ఏంటంటే ‘నలుగురు అనాథలకు ఆశ్రయిమిచ్చిన రాజు.. గైడ్‌గా పనిచేస్తుంటాడు. రాజుకు అనుకోకుండా ఓ రోజు ఇంద్రుడి కుమార్తె ఇంద్రజకు చెందిన ఉంగరం దొరుకుతుంది. ఆ ఉంగరం కోసం ఇంద్రజ తిరిగి భూమి మీదకు వస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.&nbsp; శుభలగ్నం జగపతిబాబు హీరోగా, ఆమని, రోజా హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం యూనిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. భార్య భర్తలు సంతోషంగా జీవించడానికి డబ్బుతో సంబంధం లేదని నిరూపించింది. డబ్బు కోసం భర్తనే అమ్మేసిన భార్య.. చివరికి మారి భర్తను ఎలా దక్కించుకుంది? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీలోని ‘చిలకా ఏ తోడు లేక’ అనే పాటకు ఉత్తమ గీత రచయితగా సిరివెన్నెలకు నంది పురస్కారం రావడం విశేషం. కథ ఏంటంటే.. ‘డబ్బుపై ఆశతో రాధ తన భర్తను ధనవంతురాలైన లతకు ఇచ్చి పెళ్లి చేస్తుంది. ఫలితంగా ఆమెకు కోటి రూపాయలు లభిస్తాయి. అయితే కాలక్రమంలో భర్త తోడు లేని జీవితం వృథా అని భావిస్తుంది’. గోవిందా గోవిందా నాగార్జున - రామ్‌ గోపాల్‌ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన 'గోవిందా గోవిందా'.. అప్పట్లో బ్లాక్‌ బాస్టర్ సక్సెస్‌ అందుకుంది. వెంకటేశ్వర స్వామి కిరీటం చుట్టూ తిరిగే ఈ సినిమా కథ తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. ఇందులో శ్రీదేవి తెలుగు ఆడియన్స్‌ ఎంతగానో మిస్మరైజ్‌ చేశారు. కథ ఏంటంటే.. ‘భగవంతుడైన వేంకటేశ్వరుడు.. దైవిక ఆయుధాన్ని ఉపయోగించి భూమిపై గందరగోళ పరిస్థితిని పరిష్కరించాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఈ ఆయుధంపై ఉన్న ఆభరణాలను కొంతమంది దుండగులు దొంగిలించినప్పుడు పరిస్థితి దిగజారుతుంది’. ఓటీటీ వేదిక : సన్‌ నెక్స్ట్‌ రాజకుమారుడు వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ ద్వారానే సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా పరిచయం చేశారు. కథానాయకుడిగా అతడి ఫస్ట్‌ ఫిల్మ్‌ 'రాజకుమారుడు'ను కల్కి నిర్మాత అశ్వనీదత్‌ నిర్మించారు. ఈ సినిమాకు ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నంది అవార్డు సైతం వచ్చింది. చాలా సెంటర్లలో ఈ సినిమా 100 రోజులకు పైగా ఆడింది. ప్లాట్ ఏంటంటే.. 'సెలవులను ఎంజాయ్‌ చేయడానికి వచ్చిన రాజ్‌.. రాణిని చూసి ప్రేమలో పడతాడు. అయితే కుటుంబం ఒత్తిడితో ఆమె ప్రేమను వదులుకుంటాడు. ఇంతకి రాణి ఎవరు? ఆమె ఫ్యామిలీతో రాజ్‌ కుటుంబానికి ఉన్న వైరం ఏంటి? చివరికి వారు ఎలా ఒక్కటయ్యారు?' అన్నది కథ.&nbsp; ఇంద్ర మెగాస్టార్‌ చిరంజీవి క్రేజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లిన చిత్రంగా 'ఇంద్ర'కు పేరుంది. ఈ సినిమాలో చిరు.. తొలిసారి ఫ్యాక్షనిస్టు పాత్ర పోషించారు. నిర్మాత అశ్వనీదత్‌కు ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. 2002లో ఉత్తమ నటుడిగా చిరంజీవికి నంది పురస్కారం వచ్చేలా చేసింది. 'రాయలసీమలో రెండు కుటుంబాల మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతుంటుంది. ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యర్థుల చెల్లెలితో ఇంద్ర పెళ్లికి అంగీకరిస్తాడు. కట్‌ చేస్తే సాధారణ జీవితం కోసం ఇంద్ర మారుపేరుతో కాశీకి వెళ్లిపోతాడు. ఇంద్ర కాశీకి ఎందుకు వెళ్లాడు? తిరిగి ప్రత్యర్థులపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు?' అన్నది కథ. స్టూడెంట్‌ నెంబర్‌ 1 దర్శకధీరుడు రాజమౌళిని నిర్మాత అశ్వని దత్‌ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తారక్‌ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన మెుట్ట మెుదటి చిత్రం 'స్టూడెంట్‌ నెం.1' అశ్వనీదత్‌ నిర్మాత. వైజయంతీ మూవీస్‌ సబ్‌ బ్యానర్‌ అయి స్వప్న సినిమాస్‌ ఈ మూవీని తెరకెక్కించింది. ఈ సినిమా 73 కేంద్రాల్లో 50 రోజులు, 42 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ప్రదర్శించబడింది. ఈ సినిమాని రూ.1.85 కోట్లతో నిర్మించగా రూ.12 కోట్లు వసూలు చేసింది. కథ ఏంటంటే.. ‘ఆదిత్యకు ఇంజినీర్ కావాలని కోరిక. కానీ అతని తండ్రి లాయర్ కావాలని ఆదేశిస్తాడు. అయితే లా చదవడం ఇష్టం లేని ఆదిత్య పరీక్ష రాసేందుకు వెళ్లే క్రమంలో ఓ అమ్మాయిని రక్షించబోయి సమస్యల్లో పడతాడు. ఆదిత్య తండ్రి అతన్ని ఇంటి నుంచి గెంటేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.&nbsp; మహర్షి మహేష్‌ బాబు హీరోగా పూజా హెగ్డే, అల్లరి నరేష్‌ ప్రధాన పాత్రల్లో చేసిన మహార్షి చిత్రానికి.. అశ్వనీ దత్‌ సహా నిర్మాతగా వ్యవహరించారు. 2019 సంవత్సరానికి గాను 10 విభాగాల్లో విభాగాల్లో సైమా అవార్డ్స్‌ నామినేట్‌ కాగా.. అందులో 5 పురస్కారాలను మహర్షి కైవసం చేసుకోవడం విశేషం. ‘రిషి (మహేష్‌) ఓ మల్టీ నేషనల్‌ కంపెనీకి సీఈవోగా ఉంటాడు. కాలేజీ రోజుల్లో తన కోసం ఫ్రెండ్‌ రవి&nbsp; చేసిన త్యాగం గురించి తెలుసుకుంటాడు. అతడ్ని వెతుక్కుంటూ ఊరికి వెళ్లిన రిషికి అతడు సమస్యల్లో ఉన్నట్లు తెలుస్తుంది. అప్పుడు రిషి తన ఫ్రెండ్‌ కోసం ఏం చేశాడు? ఎలా అండగా నిలబడ్డాడు?’ అన్నది కథ. ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ సీతారామం 2022లో తెరకెక్కిన సీతారామం చిత్రం.. ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నిర్మాతగా అశ్వని దత్‌ వ్యవహరించారు. ఈ సినిమాతో మృణాల్‌ ఠాకూర్‌ రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. రూ.30 కోట్లతో తెరకెక్కిన సీతారామం చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రూ.91-98 కోట్లు కొల్లగొట్టింది. ప్లాట్‌ ఏంటంటే.. ‘ఆర్మీ అధికారి రామ్ (దుల్కర్‌ స‌ల్మాన్‌) ఓ అనాథ. ఆ విషయాన్ని రేడియోలో చెప్పినప్పటి నుంచి అతడికి ఉత్తరాలు వెల్లువెత్తుతాయి. పెద్ద కుటుంబం ఏర్పడుతుంది. ఓ అమ్మాయి మాత్రం నీ భార్య సీతామ‌హాల‌క్ష్మి (మృణాల్ ఠాకూర్‌) అని సంబోధిస్తూ ఉత్తరాలు రాస్తుంటుంది. ఇంత‌కీ ఈ ఆమె ఎవ‌రు? అనాథ అయిన రామ్‌కు భార్య ఎక్కడి నుంచి వ‌చ్చింది? ఆమెని క‌లుసుకునేందుక‌ని వ‌చ్చిన రామ్‌కు ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి?’ అనేది కథ. ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ &amp; హాట్‌స్టార్‌ కల్కి 2898 ఏడీ నిర్మాత అశ్వని దత్‌.. ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని నిర్మించారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై వచ్చిన అతి భారీ బడ్జెట్‌ చిత్రం ‘కల్కి’ కావడం విశేషం. ఈ సినిమాను మైథాలిజీ &amp; ఫ్యూచరిక్‌ జానర్లలో నిర్మించారు. ఇందులో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ అశ్వత్థామ పాత్ర పోషించిగా.. విలన్‌గా కమల్‌ హాసన్‌ చేశారు. దిశాపటానీ, దీపిక పదుకొణె ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.&nbsp; వైజయంతీ మూవీస్‌ సబ్‌ బ్యానర్స్‌లో వచ్చిన హిట్‌ చిత్రాలు బాణం అశ్వని దత్‌ కుమార్తె ప్రియాంక దత్‌.. త్రీ ఎంజెల్స్ బ్యానర్‌పై తొలిసారి బాణం చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీ ద్వారా నారా రోహిత్‌ హీరోగా పరిచయం అయ్యారు. ప్లాట్‌ ఏంటంటే.. ‘మాజీ నక్సలైట్ కొడుకు అయిన భగత్ ఒక చిన్న పట్టణంలో నివసిస్తుంటాడు. స్థానిక గ్యాంగ్‌స్టర్ దౌర్జన్యాల నుంచి ప్రజలను కాపాడేందకు IPS అధికారి కావాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా? లేదా?’ అన్నది కథ. సారొచ్చారు ప్రియాంక దత్‌ నిర్మించిన ఈ సినిమా.. ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంది. ఇందులో రవితేజ, కాజల్‌&nbsp; రిచా గంగోపాథ్యాయ ప్రధాన పాత్రలు పోషించారు. ప్లాట్‌ ఏంటంటే.. 'సంధ్య కార్తిక్‌ను ప్రేమిస్తుంది. అయితే అతడికి ఇదివరకే పెళ్లైన విషయాన్ని తెలుసుకుంటుంది. ఇంతకీ కార్తిక్‌ గతం ఏంటి? కార్తిక్, సంధ్య కలిశారా? లేదా?’ అన్నది స్టోరీ. ఓటీటీ వేదిక : హాట్‌స్టార్‌ &amp; ఆహా Sir Ocharu Movie Posters TollywoodAndhra.in ఎవడే సుబ్రహ్మణ్యం కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ తెరకెక్కించిన మెుట్టమెుదటి ఫిల్మ్‌ 'ఎవడే సుబ్రహ్మణ్యం'. ఇందులో నాని, విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ టాలెంటెడ్‌ డైరెక్టర్‌గా నాగ్ అశ్విన్‌కు గుర్తింపు తీసుకొచ్చింది. ప్లాట్ ఏంటంటే.. ‘మెటీరియలిస్టిక్ స్వభావం కలిగిన సుబ్రమణ్యం జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు హిమాలయాలకు వెళ్తాడు. ఈ క్రమంలో అనుబంధాల పట్ల తన వైఖరిని మార్చుకుంటాడు’. ఓటీటీ వేదిక : సన్‌ నెక్స్ట్‌ మహానటి అశ్వని దత్‌ రెండో కుమార్తె స్వప్న దత్ ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి కూడా కల్కి ఫేమ్‌ నాగ అశ్విన్‌ దర్శకత్వం వహించారు. స్వప్న సినిమా బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం.. మహానటి సావిత్రి జీవత కథ ఆధారంగా తెరకెక్కింది. ‘సావిత్రి ఇండస్ట్రీలోకి ఎలా అడుగుపెట్టారు? నటుడు జెమినీ గణేషన్‌ ఆమె జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించారు? జీవత చరమాంకంలో ఆమె ఎలాంటి కష్టాలు అనుభవించారు?’ అన్నది స్టోరీ.&nbsp; ఓటీటీ వేదిక :&nbsp; అమెజాన్‌ ప్రైమ్‌ జాతి రత్నాలు వైజయంతి మూవీస్‌ సబ్‌ బ్యానర్‌ అయిన 'స్వప్న సినిమా'.. జాతిరత్నాలు మూవీని నిర్మించింది. ప్లాట్‌ ఏంటంటే.. ‘మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారు’ అనేది కథ. ఓటీటీ వేదిక :&nbsp; అమెజాన్‌ ప్రైమ్‌
    అక్టోబర్ 25 , 2024
    Ashu Reddy: హాట్‌ బాంబ్‌ ‘అషూ రెడ్డి’ గురించి ఈ విషయాలు తెలుసా?
    Ashu Reddy: హాట్‌ బాంబ్‌ ‘అషూ రెడ్డి’ గురించి ఈ విషయాలు తెలుసా?
    యూట్యూబ్‌ స్టార్, బిగ్‌ బాస్‌ బ్యూటీ అషూ రెడ్డి (Ashu Reddy) గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లెయన్సర్‌గా, యాంకర్‌గా ఆమెకు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉంది. ఈ అమ్మడు&nbsp; ఎప్పటికప్పుడు గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలోనూ తరచూ ట్రెండ్ అవుతూ ఉంటుంది. బుల్లితెర నుంచి వెండి తెరకు గుర్తింపు సంపాదించిన అషూ రెడ్డి ఎక్కడ పుట్టింది? ఆమె ఇష్టాఇష్టాలు ఏంటి? ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; అషూ రెడ్డి ఎక్కడ పుట్టింది? అమెరికాలోని టెక్సాస్‌లో ఆమ జన్మించింది. అషూ రెడ్డి పుట్టిన తేదీ? 15 సెప్టెంబర్‌, 1995 అషూ రెడ్డి స్కూలింగ్ ఎక్కడ జరిగింది? అషూ స్కూలింగ్ అంతా టెక్సాస్‌లో జరిగింది. అక్కడ ఉన్న గిల్మర్‌ హై స్కూల్‌లో ఆమె చదువుకుంది.&nbsp; అషూ రెడ్డి విద్యార్హత ఏంటి? డెల్లాస్‌ బాప్టిస్ట్‌ యూనివర్సిటీలో అషూ.. ఎంబీఏ చేసింది.&nbsp; అషూ రెడ్డి ఎత్తు ఎంత? 5 అడుగుల 4 అంగుళాలు (166 సెం.మీ) అషూ రెడ్డి బరువు ఎంత? 60 కిలోలు అషూ రెడ్డికి సోదరుడు / సోదరి ఉందా? అషూకి ఓ సోదరి ఉంది. ఆమె పేరు దివ్యా రెడ్డి అషూ రెడ్డి వయసు ఎంత? 29 సంవత్సరాలు (2024) అషూ రెడ్డి పూర్తి పేరు ఏంటి? అశ్విని రెడ్డి ప్రస్తుతం అషూ రెడ్డి ఎక్కడ ఉంటోంది? హైదరాబాద్‌ అషూ రెడ్డి ఎలా ఫేమస్ అయ్యింది? సోషల్‌ మీడియాలో రీల్స్‌ ద్వారా అషూ ఫేమస్‌ అయ్యింది. అమెను అంతా జూ.సమంత అని పిలిచేవారు.&nbsp; అషూ రెడ్డి తొలి చిత్రం? ‘ఛల్‌ మోహన్‌ రంగా’ (2018) అషూ రెడ్డి కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌ ఏది? ఈ భామ 2019లో వచ్చిన తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3లో పాల్గొంది. ఐదు వారాల పాటు బిగ్‌బాస్‌లో సర్వైవ్‌ అయ్యింది. ఈ బ్యూటీ.. అందం, అభినయం చూసి బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో అషూకి టెలివిజన్‌ షోలలో వరుసగా అవకాశాలు దక్కాయి.&nbsp; అషూ రెడ్డి ఇప్పటివరకూ చేసిన చిత్రాలు ఏవి? ‘ఛల్‌ మోహన్‌ రంగా’, ‘#పీకే’, ‘ఏ మాస్టర్‌ పీస్‌ (రైజ్‌ ఆఫ్‌ సూపర్‌ హీరో)’ అషూ రెడ్డి చేసిన బోల్డ్ ఇంటర్యూ ఏది? రామ్‌ గోపాల్‌ వర్మ (Ram Gopal Varma)ను అషూ రెడ్డి చేసిన ఇంటర్యూ అప్పట్లో సెన్సేషన్‌ సృష్టించింది. ఇందులో చాలా అడల్ట్ ప్రశ్నలు ఉన్నాయి. అషూ రెడ్డి హాబీలు ఏంటి? ఫ్రెండ్స్‌తో కలిసి లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లడం ఈ భామకు చాలా ఇష్టమట. అషూ రెడ్డి ఫేవరేట్‌ హీరో? ఈ భామ ఫేవరేట్‌ హీరో పవన్‌ కల్యాణ్‌. తన శరీరంపై పవన్‌ పేరును టాటూ సైతం వేయించుకుంది.&nbsp; అషూ రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ఏది? https://www.instagram.com/ashu_uuu/ https://www.youtube.com/watch?v=cmlVZwZOdeg
    ఏప్రిల్ 23 , 2024
    Shanvi Srivastava: బాంబ్ జాకెట్‌లో పరువాలు బయటపెడుతూ హద్దులు చెరిపిన  శాన్వి పాప
    Shanvi Srivastava: బాంబ్ జాకెట్‌లో పరువాలు బయటపెడుతూ హద్దులు చెరిపిన శాన్వి పాప
    ]మరిన్ని కథనాల కోసం&nbsp; మా వెబ్‌సైట్‌ చూడండి.&nbsp; YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
    ఏప్రిల్ 16 , 2024
    Yukti Thareja: టాలీవుడ్‌కు మరో అందాల తెగింపు.. సొగసులతో బాణాలు వదులుతున్న హర్యానా అందం
    Yukti Thareja: టాలీవుడ్‌కు మరో అందాల తెగింపు.. సొగసులతో బాణాలు వదులుతున్న హర్యానా అందం
    రంగబలి హీరోయిన్ యుక్తి తరేజా తాజా హాట్ లుక్స్‌లో అదరగొట్టింది. రంగబలి మూవీ ద్వారా ఈ ముద్దుగుమ్మ తెలుగుతెరకు పరిచయం కానుంది. రంగబలి ట్రైలర్ లాంచ్ తర్వాత ఇలా హాట్ హాట్ లుక్స్‌తో ఫొటోలకు పొజులిచ్చింది ట్రైలర్‌లో యుక్తి తరేజ అందం కుర్రకారును ఆకట్టుకుంది. ట్రైలర్‌ పట్ల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో హీరో నాగశౌర్యతో యక్తి తరేజ రొమాన్స్ చేయనుంది. రంగబలి మూవీ జులై 7న రిలీజ్ కానుంది సినిమాల్లోకి రాకముందు ఈ సొగసుల సంచలనం మోడలింగ్ చేసేది యుక్తి తరేజ స్వస్థలం హర్యానా, మాతృభాష హిందీ. ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన హర్యానా అందం... కాలేజీలో ఉన్నప్పుడే నటనపై ఆసక్తి పెంచుకుంది ఢిల్లీ ఫ్రెష్ ఫేస్ కాంపిటీషన్‌లో గెలుపొందిన తర్వాత మోడలింగ్‌ మొదలుపెట్టి.. అనంతరం యాక్టింగ్ ఆడిషన్స్ వచ్చింది తెలుగులో నటించేటప్పుడు భాషాపరమైన సవాళ్లు ఎదుర్కొదంట ఈ పుత్తడి బొమ్మ.. పెద్దపెద్ద పారాల డైలాగులు నేర్చుకుని చెప్పడం కొంచెం ఛాలెంజింగ్‌గా అనిపించిందట. యాక్టింగ్ సమయంలో డైరెక్షన్ టీమ్ చాలా సహాయం చేశారని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది తెలుగులో తన ఫేవరేట్ హీరో అల్లు అర్జున్ అని యుక్తి తరేజ చెప్పుకొచ్చింది. &nbsp;అల్లు అర్జున్ డాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని ఐకాన్ స్టార్ పక్కన నటించేందుకు ఉబలాట పడుతోంది. అల్లు అర్జున్ డాన్స్‌ను మ్యాచ్ చేయడం చాలా కష్టమని ప్రశంసలతో ముంచెత్తింది. హీరోయిన్స్‌లో అనుష్క శెట్టి అంటే తనకు ఇష్టమని చెప్పింది. &nbsp;ప్రస్తుతానికి తెలుగులో ఇంకో ప్రాజెక్ట్ ఏదీ సైన్ చేయలేదని చెప్పిన తరేజ.. ప్రస్తుతానికి కొన్ని కథలు వింటున్నానని, ఏదైనా నచ్చితే సైన్ చేస్తానని తెలిపారు.
    జూలై 04 , 2023
    <strong>Avneet Kaur: కసి అందాలు చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతున్న అవ్నీత్ కౌర్</strong>
    Avneet Kaur: కసి అందాలు చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతున్న అవ్నీత్ కౌర్
    బాలీవుడ్‌ హాట్‌ బాంబ్‌ అవనీత్‌ కౌర్‌ తన లేలేత పరువాలతో సోషల్‌ మీడియాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మత్తెక్కించే అందాలతో రచ్చ రచ్చ చేస్తోంది.&nbsp; ప్రస్తుతం జర్మనీలో పర్యటనలో ఉన్న ఈ అమ్మడు అక్కడి సముద్రపు పడవలో అందాల ప్రదర్శన చేసింది.&nbsp; ఎద పొంగులు, నడుము అందాలను చూపిస్తూ నెటిజన్లకు అదిరిపోయే హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.&nbsp; అవనీత్ వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె పంబాబ్‌లోని జలంధర్‌లో జన్మించింది. 8 ఏళ్లకే 'డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌ లిటిల్‌ మాస్టర్స్‌' షోలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది.&nbsp; ఓ వైపు డ్యాన్స్‌ షోలలో పాల్గొంటూనే పంజాబీ, హిందీ టీవీ సీరియల్స్‌లో అవనీత్‌ నటించింది. 'మేరీ మా' 'సావిత్రి ఏక్‌ ప్రేమ్‌ కహానీ', 'హమారీ సిస్టర్‌ దీదీ' వంటి సీరియళ్లతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ముఖ్యంగా 'అల్లాఉద్దీన్‌' సీరియల్‌లో హీరోయిన్ యాస్మిన్‌ పాత్రతో అవనీత్‌ పాపులర్ అయ్యింది. దీంతో బాలీవుడ్‌ అవకాశాలు ఆమెను వరించాయి.&nbsp; 2014లో వచ్చిన 'మర్దానీ' (Mardaani) చిత్రంతో తొలిసారి అవనీత్‌ బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఇందులో మంచి నటన కనబరిచి అందర్నీ ఆకట్టుకుంది.&nbsp; ఆ తర్వాత వరుసగా దోస్త్‌, బ్రూనీ, ఏక్తా, మర్దానీ 2 చిత్రాల్లో ఈ బ్యూటీ నటించింది. అయితే అవేమి ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు.&nbsp; దీంతో ఓటీటీలోనూ అవనీత్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 'బాబర్‌ కా తాబర్‌', 'బందిశ్‌ బండిట్స్‌' వంటి వెబ్‌సిరీస్‌లలోనూ కనిపించింది.&nbsp; గతేడాది టీకూ వేడ్స్‌ శేరూ, ఈ ఏడాది 'లవ్‌ కి అరేంజ్‌ మ్యారేజ్‌' చిత్రాల్లో అవనీత్‌ నటించింది. ఈ రెండు కూడా అవనీత్‌కు కోరుకున్న పాపులారిటీని అందించలేకపోయాయి.&nbsp; ప్రస్తుతం 'లవ్‌ ఇన్‌ వియాత్నం' అనే ఫిల్మ్‌లో అవనీత్‌ నటిస్తోంది. ఈ సినిమా ద్వారానైనా బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదగాలని ఈ భామ ఆశిస్తోంది.&nbsp; సినిమాల్లో జయపజయాలు ఎలా ఉన్న అవనీత్‌కు సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు హాట్‌ ట్రీట్‌ ఇస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తుండటమే ఇందుకు కారణం. అవనీత్‌ కౌర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి పోస్టు వచ్చిందంటే అది నెట్టింట ట్రెండింగ్‌ కావాల్సిందే. తన జిగేలు మనే అందాలతో ఈ అమ్మడు కవ్విస్తుంటుంది. దీంతో నెట్టింట అవనీత్‌ కౌర్‌ ఫాలోవర్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 32.1 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
    జూలై 27 , 2024
    Nora Fatehi: నోరా ఫతేహీ అందాల తెగింపు.. క్యాట్ వాక్‌లో సొగసుల విందు
    Nora Fatehi: నోరా ఫతేహీ అందాల తెగింపు.. క్యాట్ వాక్‌లో సొగసుల విందు
    బాలీవుడ్ హాట్ బాంబ్ నోరా ఫతేహీ మరోసారి అందాలను అప్పనంగా ప్రదర్శించింది. తాజగా జరిగిన బాంబే ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్‌పై హోయలు ఒలికించింది. బోల్డ్ బ్లాక్ అవుట్‌ ఫిట్‌లో ఎద అందాలను ఎకరువు పెట్టింది. బ్యాక్, ఫ్రంట్ అందాల వడ్డింపుతో కుర్రకారును షేక్ చేసింది. ఈ హాట్ అవుట్‌ ఫిట్‌పై నెటిజన్లు తమ కామెంట్లకు పని చెప్పారు. హాట్ ఫైర్ ఎమోజీలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. సూపర్ ఎలిగంట్ బ్యూటీ అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. ఇందుకే నోరాను కుర్రాళ్ల హృదయ దేవత అంటారు అని మరొక నెటిజన్ రెచ్చిపోయాడు. ఇక నోరా ఫతేహీ విషయానికొస్తే… బాలీవుడ్‌లో రోర్ సినిమాతో తెరంగేట్రం చేసింది. అందమైన అందాలను తెరకెక్కించడంలో ముందుండే తెలుగు డైరెక్టర్లు ఈ అమ్మడి టాలెంట్‌ను ముందుగానే పసిగట్టారు. తెలుగులో టెంపర్, బాహుబలి బిగినింగ్, కిక్2 వంటి చిత్రాల్లో ఐటెం సాంగ్‌లు చేసి అలరించింది. అలాగే బాలీవుడ్‌లో dilbar, 'Kamariya', 'O Saki Saki', 'Garmi' వంటి బ్లాక్ బాస్టర్ పాటల్లో నర్తించి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్‌లో అందాల ఆరబోతలో మిగతా హీరోయిన్ల కంటే పదాకులు ఎక్కువే చదివిన నోరా ఫతేహీ గడుసందాలను ప్రదర్శించడంలో ఏమాత్రం వెనక్కి తగ్గదు. ఎప్పుడు సోషల్ మీడియా అకౌంట్లలో హాట్ ఫోటో షూట్‌ చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తూ వారి ఫాలోయింగ్‌ను పెంచుకుంటూనే ఉంటుంది. ప్రస్తుతం ఈ అందాల యవ్వనం… అక్షయ్ కుమార్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. తెలుగులో క్రిష్ డైరెక్ట్ చేస్తున్న హరిహరవీరమళ్లు సినిమాలో ఓ కీలక పాత్రలో యాక్ట్ చేస్తోంది.
    అక్టోబర్ 30 , 2023
    <strong>Disha Patani Bold Pics: నల్లటి గౌనులో తెల్లటి ఎద సొగసులతో కైపెక్కిస్తున్న దిశా పటాని!</strong>
    Disha Patani Bold Pics: నల్లటి గౌనులో తెల్లటి ఎద సొగసులతో కైపెక్కిస్తున్న దిశా పటాని!
    బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటాని (Disha Patani).. మరోమారు హాట్‌ బాంబ్‌లా సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేసింది. తన సొగసులతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.&nbsp; తాజాగా టైట్‌ ఫిట్‌ బ్లాక్‌ కలర్‌ పొట్టి గౌను ధరించిన ఈ అమ్మడు.. తన ఎద పొంగులు చూపిస్తూ కుర్రకారును రెచ్చగొట్టింది.&nbsp; దిశా పటానీ లేటెస్ట్ ఫొటోలు.. నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. #Dishapatani హ్యాష్‌ట్యాగ్‌తో ఈ ఫొటోలను నెటిజన్లు ట్రెండ్‌ చేస్తున్నారు.&nbsp; దిశా పెట్టే బోల్డ్‌ ఫొటోలు ట్రెండింగ్‌లో నిలవడం గత కొంతకాలంగా కామన్‌ అయిపోయింది. ఈ భామ నుంచి పోస్టు వచ్చిందంటే ఇక తమకు పండగేనని నెటిజన్లు కేరింతలు కొడుతున్నారు.&nbsp; ‘లోఫర్‌’ (Loafer) సినిమా ద్వారా దిశా పటానీ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో దిశా హోయలు చూసి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.&nbsp; లోఫర్‌ సినిమా తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసిన ఈ భామ.. అక్కడ పలు హిట్‌ చిత్రాలు తీసి హిందీ ప్రేక్షకులను అలరించింది.&nbsp; దిశా నటించిన ఎం.ఎస్‌ ధోని (M.S. Dhoni), భాగీ 2 (Baaghi 2),&nbsp; బాగీ 3 (Baaghi 3), రాధే (Radhe) వంటి చిత్రాలు మంచి హిట్‌ టాక్ తెచ్చుకున్నాయి.&nbsp; భాగీ సినిమా షూటింగ్‌ సమయంలో హీరో టైగర్ ష్రాఫ్‌తో దిశా ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. వారి ఇరువురి డేటింగ్ అంశం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; అయితే టైగర్, దిశా రిలేషన్‌ ఎక్కువ కాలం నిలబడలేదు. కొన్ని కారణాల వల్ల వారు బ్రేక్‌ చెప్పుకున్నట్లు అప్పట్లో బాలీవుడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల బాలీవుడ్‌ నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్రా నటించిన ‘యోధ’ చిత్రంలో దిశా హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీ మార్చిలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది.&nbsp; ప్రస్తుతం దిశాపటాని చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనది ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం. ఇందులో రోక్సి అనే కీలక పాత్రలో దిశా కనిపించనుంది. తమిళ స్టార్‌ హీరో సూర్య చేస్తున్న ‘కంగువా’ (Kanguva) చిత్రంలోనూ దిశా ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకొని పోస్టు ప్రొడక్షన్‌ దశలో ఉంది.&nbsp; బాలీవుడ్‌లో 'వెల్‌కమ్‌ టూ ద జంగిల్‌' ఫిల్మ్‌లోనూ దిశా నటిస్తోంది. ఇందులో దిశా పాత్ర ఇప్పటివరకూ చేసిన వాటితో పోలిస్తే భిన్నంగా ఉంటుందని సమాచారం.&nbsp; ఓవైపు సినిమాలు, మరోవైపు సోషల్‌ మీడియా పోస్టులతో దిశా పటానీ.. బిజీ బిజీగా గడుపుతోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 61.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
    జూన్ 24 , 2024
    <strong>Ramcharan: ఎన్టీఆర్‌ను కొట్టి ఏడ్చేసిన రామ్‌చరణ్‌.. వీడియో వైరల్‌&nbsp;</strong>
    Ramcharan: ఎన్టీఆర్‌ను కొట్టి ఏడ్చేసిన రామ్‌చరణ్‌.. వీడియో వైరల్‌&nbsp;
    టాలీవుడ్‌ అగ్ర కథానాయకుల్లో రామ్‌చరణ్‌ (Ram charan), జూ.ఎన్టీఆర్ (Jr NTR) ఒకరు. వారిద్దరి మధ్య ఎంత మంచి బాండింగ్‌ ఉందో అందరికీ తెలిసిందే. వీరి కాంబోలో వచ్చిన ‘RRR’ బ్లాక్‌ బాస్టర్ విజయాన్ని సైతం అందుకుంది. మూవీ ప్రమోషన్స్‌ సందర్భంగా చరణ్‌, తారక్‌ చేసిన అల్లరి అంతా ఇంత కాదు. తమ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని వారు పలు వేదికలపై పంచుకున్నారు. ఇదిలా ఉంటే ‘RRR’ మూవీ షూటింగ్‌ సందర్భంగా తారక్‌ను చరణ్‌ కొరడాతో కొట్టిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వెంటనే చరణ్‌ ఇచ్చిన రియాక్షన్‌ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.  తారక్‌ను కొట్టి బాధపడ్డ చరణ్‌ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'RRR' చిత్రానికి సంబంధించిన డాక్యుమెంటరీ తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్ బియాండ్‌’ (RRR: Behind And Beyond) పేరుతో దీనిని తీసుకొచ్చారు. మూవీ షూటింగ్స్ సందర్భంగా జరిగిన విషయాలను ఈ డాక్యూమెంటరీలో పంచుకున్నారు. ఇదిలా ఉంటే ‘కొమురం భీముడో’ పాట సందర్భంగా తారక్‌ను రామ్‌చరణ్‌ కొరడాతో కొట్టే సీన్లు ఉంటాయి. తారక్‌ను కొట్టిన అనంతరం చరణ్‌ వెంటనే వెళ్లి హగ్‌ చేసుకునే దృశ్యాలను డాక్యుమెంటరీలో చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తారక్‌కు ఎక్కడ దెబ్బ తగిలిందోనని చరణ్‌ తెగ బాధ పడిపోవడం వీడియోలో గమనించవచ్చు.  https://twitter.com/Prabhas522452/status/1872484346667643139 అది చరణ్‌ అంటే..! తాజా వీడియో చూసి మెగా ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. రామ్‌ చరణ్‌ గొప్ప మనసు మరోమారు బయటపడిదంటూ కొనియాడుతున్నారు. రామ్ చరణ్ మనసు చాలా సున్నితమైనదని ప్రశంసిస్తున్నారు. ఎవరికీ ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేడని గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కొరడతో కొట్టే దానికి సంబంధించి గతంలోనే ఓ మహిళా ఆర్టిస్టు ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. 'ఒక రెండు దెబ్బలు ఎన్టీఆర్‌ గారిని కొరడాతో కొట్టారు. ఆయనకు దెబ్బ తగిలిందేమోనని ఈయన వెంటనే ఏడ్చేశారు. సార్‌ను హగ్‌ చేసుకొని సారీ సారీ చెబుతుంటే మా అందరికీ ఆశ్చర్యం వేసింది' అంటూ ఆమె సదరు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.  https://twitter.com/HumanTsunaME/status/1872507053534826583 ఆ సీన్‌ గ్రాఫిక్‌ కాదట..&nbsp; ‘RRR’ చిత్రంలో రామ్‌చరణ్ ఇంట్రడక్షన్‌ సీన్‌ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. పదుల సంఖ్యలో ఉన్న నిరసనకారులతో చరణ్‌ పోరాడే సీన్‌ ప్రతీఒక్కరికీ గూస్‌బంప్స్‌ తెప్పించింది. ఈ సందర్భంగా చరణ్‌ను చూసి భయపడి అక్కడి జనసందోహమంతా ఒక్కసారిగా వెనక్కి జరుగుతుంది. ఈ సీన్‌ను చరణ్‌ కంటిరెప్పల లోపల నుంచి జక్కన్న తెరపై చూపించారు. వాస్తవానికి ఈ సీన్‌ గ్రాఫిక్స్‌ అని అంతా భావించారు. కానీ ఆ సీన్‌ రియల్‌గానే తీసినట్లు జక్కన్న తాజా డాక్యూమెంటరీలో స్పష్టం చేశారు. చెర్రీ కన్నుకు దగ్గరగా కెమెరాను పెట్టి ఆ సీన్‌ను ఎలా తీశారో వివరించారు. https://twitter.com/bingewatcherhe/status/1872400033271947650 కొత్త దర్శకులకు ప్రేరణగా.. 'ఆర్ఆర్ఆర్‌: బిహైండ్ అండ్ బియాండ్' డాక్యుమెంటరీని ఒక గంట 37 నిమిషాల రన్ టైంతో రిలీజ్‌ చేశారు. షూటింగ్‌ సందర్భంగా రామ్‌చరణ్‌, తారక్‌, రాజమౌళి అండ్‌ టీమ్‌ ఎంత కష్టపడ్డారో ఇందులో చూపించారు. ఈ డాక్యుమెంటరీ కొత్త దర్శకులకు స్ఫూర్తిగా నిలవనుంది. ఇక ఈ మూవీలో తారక్‌, చరణ్‌తో పాటు బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, అజయ్ దేవగన్, శ్రేయా కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మించిన 'RRR' మూవీ 2021లో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసింది. అంతేకాదు ఆస్కార్ అవార్డును గెలుచుకుని చరిత్రను సృష్టించింది.  చరణ్‌, తారక్‌ బిజీ బిజీ.. రామ్‌చరణ్‌ సినిమాలకు వస్తే ఆయన నటించిన ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. జనవరి 10న సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్‌ కాబోతోంది. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్‌ నటిస్తున్నారు. ‘RC16’ వర్కింగ్ టైటిల్‌తో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ జరుపుకుంటోంది. దీని తర్వాత సుకుమార్‌తో ‘RC 17’ ప్రాజెక్ట్‌లో చరణ్‌ నటించనున్నారు. మరోవైపు ‘దేవర’ తర్వాత స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌తో తారక్‌ ఓ ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేశాడు. అలాగే తన ఫస్ట్ బాలీవుడ్‌ చిత్రం ‘వార్‌ 2’లోనూ తారక్‌ నటిస్తున్నాడు. ఇవి కాకుండా తమిళ స్టార్ డైరెక్టర్‌ వెట్రిమారన్‌తోనూ తారక్ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు ఉన్నాయి. 
    డిసెంబర్ 27 , 2024
    <strong>Allu Arjun vs Sukumar: సుకుమార్‌తో విభేదాలు.. చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిన బన్నీ?</strong>
    Allu Arjun vs Sukumar: సుకుమార్‌తో విభేదాలు.. చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిన బన్నీ?
    ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun), డైరెక్టర్‌ సుకుమార్‌ (Sukumar)కు ఇండస్ట్రీలో మంచి బాండింగ్‌ ఉంది. అది పలు సందర్భాల్లో నిరూపితమైంది కూడా. బన్నీ-సుకుమార్‌ కాంబోలో ఇప్పటికే మూడు చిత్రాలు (ఆర్య, ఆర్య 2, పుష్ప) రాగా అందులో రెండు బ్లాక్‌ బాస్టర్‌ విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం వీరిద్దరు కాంబోలో 'పుష్ప 2' తెరకెక్కుతోంది. కొన్ని రోజుల క్రితం వరకూ ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా సాగింది. అయితే అనూహ్యంగా ఈ మూవీ షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయి. దీనికి కారణం సుకుమార్‌, అల్లు అర్జున్‌ మధ్య తలెత్తిన వివాదాలేనని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. దీనికి తోడు బన్నీ షూటింగ్‌ను పక్కకు పెట్టి విహారయాత్రకు వెళ్లడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది.&nbsp; సుకుమార్‌ - బన్నీ మధ్య కోల్డ్‌వార్‌? 'పుష్ప: ది రూల్' షూటింగ్ విషయంలో అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావించారు. తీరా షూటింగ్‌కు మరింత సమయం పట్టే అవకాశముందని తెలిసి వాయిదా వేశారు. అయితే సినిమా వాయిదా వేసినప్పటికీ షూటింగ్‌ సక్రమంగా జరగడం లేదని బన్నీ గుర్రుగా ఉన్నారట. తను పూర్తిగా సహకరిస్తున్నా సుకుమార్‌ సరిగ్గా వినియోగించుకోవడం లేదని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే షూటింగ్‌ను నిలిపేసి సుకుమార్‌ అమెరికాకు వెళ్లడంపై బన్నీలో మరింత అసంతృప్తి కారణమైందని ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గడ్డం తీసేసిన బన్నీ సుకుమార్ శైలి నచ్చని అల్లు అర్జున్ ఫ్యామిలీతో హాలిడేకి వెళ్లారని తెలుస్తోంది. అతడు యూరప్ వెళ్లారని టాక్ వినిపిస్తోంది. ఫ్లైట్ జర్నీ సమయంలో ఆయన్ను కొందరు వీడియో తీశారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బన్నీ గడ్డం ట్రిమ్‌ చేసి కనిపించారు. వాస్తవానికి పుష్ప గాడు అంటే ఆ గడ్డం లుక్కే మెయిన్‌. గడ్డం మీద చేయి వేసి తగ్గేదేలే అని బన్నీ చెప్పిన డైలాగ్‌ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. దీనిపై భారీ ఎత్తున రీల్స్‌ సైతం అప్పట్లో వచ్చాయి. అటువంటిది గడ్డాన్ని బన్నీ ట్రిమ్‌ చేసి పర్యటనకు వెళ్లడం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. సుకుమార్‌తో ఉన్న విభేదాల వల్లే బన్నీ షూటింగ్‌కు దూరం అయ్యారా? అన్న ప్రశ్న నెట్టింట వినిపిస్తోంది.&nbsp; https://twitter.com/i/status/1813405877908726058 'పుష్ప 2' మళ్లీ వాయిదా? డైరెక్టర్‌ సుకుమార్‌, అల్లు అర్జున్‌ ఇద్దరు విదేశీ పర్యటనకు వెళ్లడంతో ప్రస్తుతం 'పుష్ప 2' అటకెక్కింది. ఇంకా చాలా సన్నివేశాలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరువురు లేకపోవడం 'పుష్ప 2' రిలీజ్‌పై ప్రభావం చూపుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్‌ను ఆగస్టు 15 నుంచి డిసెంబర్‌ 6కు మార్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో డిసెంబర్‌లోనైనా పుష్ప గాడిని చూస్తామా? అన్న ప్రశ్న ఆడియన్స్‌లో తలెత్తుతోంది. ప్రస్తుతం బన్నీ గడ్డాన్ని ట్రిమ్ చేసి యూరప్‌ వెళ్లారు. పుష్ప పాత్రకు తగ్గట్లు గడ్డం పెంచాలంటే కనీసం నెల రోజుల సమయం పడుతుంది. అంటే ఒక నెల రోజుల సమయం వృథా అయినట్లేనని ఫిల్మ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.&nbsp; ‘పుష్ప 2’కి విలన్ కష్టాలు! మలయాళ స్టార్‌ ఫహాద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil) 'పుష్ప 2'లో విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ ఆలస్యం కారణంగా ఫహద్ కూడా కొంత నిరాశలో ఉన్నట్లు పరిశ్రమ వర్గాల టాక్. పైగా ఫహద్ చేతిలో 6,7 పెద్ద సినిమాలే ఉన్నాయి. దాంతో అతడు అడిగినన్ని కాల్ షీట్లు ఇచ్చేలా కనిపించడం లేదు. దాంతో అతడు ఇచ్చిన డేట్స్‌లోనే షూట్ ఫినిష్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అదీకాక కాంబోలో ఉన్న ఆర్టిస్టులు అందరూ పెద్దవారే కావడం డైరెక్టర్‌ సుకుమార్‌కు పెద్ద సమస్యగా మారింది. ఇన్ని సమస్యలను సుకుమార్ ఎలా హ్యాండిల్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.&nbsp; నో చెప్పిన జాన్వీ కపూర్‌ పుష్ప 2లో ఐటెం సాంగ్ ఏ నటి చేస్తారన్న ప్రశ్న ఇప్పటికీ వెంటాడుతోంది. కొన్ని రోజుల క్రితం యానిమల్‌ బ్యూటీ తిప్తి దిమ్రీ పేరు వినిపించింది. ఆమెను చిత్ర యూనిట్‌ సంప్రదించగా ఐటెం సాంగ్ చేసేందుకు ఓకే చెప్పినట్లు రూమర్లు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఆమెను కాకుండా జాన్వీ కపూర్‌ను ఐటెం సాంగ్‌ కోసం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై ఆమెను సంప్రదించినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ వంటి స్టార్‌ హీరోలతో నటిస్తుండటంతో ఐటెం సాంగ్‌ చేసేందుకు జాన్వీ నో చెప్పినట్లు సమాచారం. ఇలాంటి సాంగ్స్‌ చేస్తే తన ఇమేజ్‌కు డ్యామేజ్‌ కలుగుతుందని ఆమె భావిస్తున్నట్లు తెలిసింది.&nbsp;
    జూలై 17 , 2024
    బ్యాంగ్‌టన్ బాయ్స్ ( BTS )కు ఎందుకింత క్రేజ్ !
    బ్యాంగ్‌టన్ బాయ్స్ ( BTS )కు ఎందుకింత క్రేజ్ !
    ]4. బట్టర్, ఆన్, లౌడర్ ధాన్ బాంబ్స్, బ్లడ్ స్వెట్ అండ్ టియర్స్ వంటివి గుర్తింపు పొందాయి. Listen Now
    ఫిబ్రవరి 14 , 2023
    Rangabali Movie Review: రంగబలితో నాగశౌర్య సక్సెస్ అందుకున్నట్లేనా.. మూవీ ఎలా ఉంది?
    Rangabali Movie Review: రంగబలితో నాగశౌర్య సక్సెస్ అందుకున్నట్లేనా.. మూవీ ఎలా ఉంది?
    నటీనటులు: నాగశౌర్య, యుక్తి తరేజా, షైన్ టామ్ చాకో, శరత్ కుమార్, మురళీ శర్మ, సత్య, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు.. దర్శకుడు: పవన్ బాసంశెట్టి నిర్మాత: సుధాకర్ చెరుకూరి సంగీతం: పవన్ సీహెచ్ సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి ‘ఛలో’ తర్వాత ఆ స్థాయి హిట్ కోసం నాగశౌర్య ఆత్రుతతో ఎదురు చూస్తున్నాడు. క్లాస్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచి లవర్‌ బాయ్‌గా గుర్తింపు పొందిన నాగశౌర్య ఇందులో మాస్ క్యారెక్టర్ పోషించాడు. ఈ సారి ‘రంగబలి’ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి వచ్చాడు. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? మాస్ ఆడియెన్స్‌ని నాగశౌర్య బుట్టలో వేసుకున్నాడా? వంటి అంశాలను రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటంటే? శౌర్య(నాగశౌర్య) పనీపాట లేకుండా తిరిగే అబ్బాయి. రాజవరంలో తండ్రి విశ్వం(రమణ) మెడికల్ షాపుని నిర్వహిస్తుంటాడు. కొడుకుకి మెడికల్ షాపును అప్పజెప్పి భవిష్యత్తును తీర్చిదిద్దాలని భావిస్తాడు విశ్వం. ఇందుకోసం ఫార్మసీ ట్రైనింగ్‌కి వైజాగ్ పంపిస్తాడు. అక్కడ శౌర్య సహజ(యుక్తి తరేజా)తో ప్రేమలో పడతాడు. కానీ, వీరి ప్రేమను అంగీకరించడానికి సహజ తండ్రి అడ్డు చెబుతాడు. రాజవరంలోని రంగబలి సెంటర్ ఇందుకు ప్రధాన కారణం. మరి వీరి ప్రేమకి, రంగబలికి సంబంధం ఏంటి? ప్రేమ కోసం హీరో ఏం చేశాడనేది తెరపై చూడాల్సిందే.&nbsp; ఎలా ఉంది? రంగబలి చూసిన ఆడియన్స్‌కు రెగ్యులర్ కమర్షియల్ సినిమా చూసిన భావనే కలుగుతుంది. ఫస్టాఫ్ సరదాగా సాగిపోతుంటుంది. సత్య చేసే కామెడీ ఫస్టాఫ్‌లో బోర్ కొట్టకుండా చేస్తుంది. ఇక ఒక ట్విస్టుతో ఇంటర్వెల్ అవుతుంది. సెకండాఫ్ పూర్తిగా యాక్షన్ సీన్లతో నడుస్తుంది. ఫస్టాఫ్‌లో కనిపించిన జోరు సెకండాఫ్‌లో ఉండదు. ఇక, క్లైమాక్స్ తీసికట్టుగా ఉన్నట్లు అనిపిస్తుంది. కథ అందరికీ తెలిసేలా ఉన్నా ప్రభావవంతమైన కథనంతో ప్రేక్షకుడిని రంగబలి మెప్పించలేకపోయింది.&nbsp; ఎవరెలా చేశారు? సొంతూరిలో రాజులా బతకాలనే భావనతో ఏమైనా చేసే యువకుడి పాత్రలో నాగశౌర్య మెప్పించాడు. లుక్స్‌తో క్లాస్, బాడీతో మాస్ ఆడియెన్స్‌ని మెప్పించాడు. హీరోయిన్ యుక్తి తరేజ ఫర్వాలేదనిపించింది. హీరోతో రొమాన్స్ పండించింది. ఇక కమెడియన్ సత్య కడుపుబ్బా నవ్వించాడు. ఇతరులు సంతోషపడితే చూడలేని అగాధం పాత్రలో ఇరగదీశాడు. ఫస్టాఫ్ మొత్తం తన కామెడీనే గుర్తుండిపోయేలా చేశాడు. ఇక, విలన్‌గా షైన్ టామ్ చాకోకు సరైన క్యారెక్టర్ పడలేదనిపించింది. డిజైన్ చేసిన మేరకు తన పాత్రలో మెప్పించాడీ మలయాళ నటుడు. గోపరాజు రమణ, మురళీ శర్మ, శరత్ కుమార్, తదితరులు ఓకే అనిపించారు. సాంకేతికంగా? ఒక చిన్న విషయాన్ని అనుకుని దానిని సినిమాగా డెవలప్ చేశాడు దర్శకుడు పవన్ బాసంశెట్టి. తొలి సినిమా అయినప్పటికీ కొన్ని సీన్లలో తన ప్రతిభను కనబర్చాడు. అయితే, ఓవరాల్‌గా ప్రేక్షకుడిని సాటిస్‌ఫై చేయలేకపోయాడు. క్లైమాక్స్‌ని మరింత పకడ్బందీగా ప్లాన్ చేసి ఉండాల్సింది. మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సీహెచ్ పాటలు పెద్దగా బయటికి రాలేవు. నేపథ్య సంగీతం కూడా అంతంతమాత్రమే. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు ఆకట్టుకుంటాయి.&nbsp; https://www.youtube.com/watch?v=e9d9qhvI3dk ప్లస్ పాయింట్స్ కామెడీ నటీనటులు మైనస్ పాయింట్స్ పేలవ కథ, కథనం క్లైమాక్స్ పాటలు రేటింగ్: 2.25/5 https://www.youtube.com/watch?v=B8ybLVdO2YQ
    జూలై 07 , 2023
    This Week Releases: ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న చిత్రాలు ఇవే
    This Week Releases: ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న చిత్రాలు ఇవే
    ఈ వారం(July 7) బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేయబోతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని థియేటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే రిలీజైన ఆయా చిత్రాల ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. మరి, ఆ సినిమాలతో పాటు ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో చూసేద్దాం.&nbsp; థియేటర్లలో విడుదలవుతున్న చిత్రాలు రంగబలి(Rangabali) నాగశౌర్య, యుక్తి తరేజా జంటగా నటించిన చిత్రం ‘రంగబలి’. ఈ మూవీని పవన్ బాసంశెట్టి తెరకెక్కించాడు. ‘లవ్ స్టోరీ’ మూవీకి మ్యూజిక్ అందించిన పవన్ సీహెచ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశాడు. సత్య, సప్తగిరి, బ్రహ్మాజీ, తదితరులు నటించగా సుధాకర్ చెరుకూరి నిర్మించాడు. జులై 7న సినిమా విడుదల కానుంది.&nbsp; రుద్రంగి(Rudrangi) బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన చిత్రం ‘రుద్రంగి’. జగపతి బాబు, మమత మోహన్‌దాస్, తదితరులు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. అజయ్ సామ్రాట్ డైరెక్షన్ చేయగా నోఫెల్ రాజా మ్యూజిక్ అందించాడు. జులై 7న మూవీ రిలీజ్ కానుంది.&nbsp; భాగ్ సాలే(Bhaag Saale) శ్రీసింహ కోడూరి హీరోగా వస్తున్న చిత్రం ‘భాగ్ సాలే’. నేహా సోలంకి శ్రీసింహ సరసన నటించింది. వైవా హర్ష, రాజీవ్ కనకాల, జాన్ విజయ్ తదితరులు కీలక పాత్ర పోషించారు. డైరెక్టర్ ప్రణీత్ బ్రహ్మాండపల్లి ఈ మూవీని క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాడు. కాలభైరవ మ్యూజిక్ అందించాడు. జులై 7న రిలీజ్ అవుతోంది. ఇద్దరు(Iddaru)&nbsp; యాక్షన్ కింగ్ అర్జున్, జేడీ చక్రవర్తి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇద్దరు’. ఎస్ఎస్ సమీర్ దర్శకత్వంలో ఫర్హీన్ ఫాతిమా నిర్మాణంలో వస్తోందీ సినిమా. జులై 7న రిలీజ్ కానుంది.&nbsp; సర్కిల్(Circle) ‘ఎవరు ఎప్పుడు ఎందుకు శత్రువులవుతారో’ అంటూ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న చిత్రం ‘సర్కిల్’.&nbsp; నీలకంఠ దర్శకత్వం వహించాడు. సాయి రోనక్, అర్షిణ్ మెహతా, బాబా భాస్కర్, నైనా తదితరులు ఇందులో నటించారు. జులై 7న మూవీ రిలీజ్.&nbsp; ఓ సాథియా (Oo Sathiya) దివ్య భావన దర్శకత్వంలో ‘ఓ సాథియా’ తెరకెక్కింది. ఆర్యన్ గౌరా, మిస్తీ చక్రవర్తి, తదితరులు నటించారు. చందన కట్టా నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా సైతం జులై 7న విడుదల కానుంది. 7.11 PM ఆసక్తికరమైన కథాంశంతో 7.11 PM మూవీ థియేటర్లలోకి వస్తోంది. చైతు మాదాల ఈ మూవీని తెరకెక్కించాడు. సాహస్, దీపిక ప్రధాన పాత్రల్లో నటించారు. నరేశ్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి సినిమాను నిర్మించారు. జులై 7న విడుదల కాబోతోంది. మోహనకృష్ణ గ్యాంగ్‌లీడర్ (Mohanakrishna’s Gang Leader) మోహనకృష్ణ, సౌజన్య, హరిణి, సుమన్, తదితరులు నటించిన చిత్రమే ఇది. మోహనరావు డైరెక్షన్ చేసి నిర్మాతగా వ్యవహరించారు. జులై 7న మూవీ రిలీజ్ కానుంది.&nbsp; నాతో నేను(Natho Nenu) సాయికుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజ్‌పుత్, ఐశ్వర్య, రాజీవ్ కనకాల తదితరులు నటించిన చిత్రం ‘నాతో నేను’. జులై 7న విడుదల కానుంది. తుర్లపాటి శాంతికుమార్ దర్శకత్వం వహించగా ప్రశాంత్ టంగుటూరి నిర్మాతగా వ్యవహరించారు.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు TitleCategoryLanguagePlatformRelease DateIshq Next DoorMovieHindiJio CinemaJuly 3GoodNightMovieTamilDisney + HotstarJuly 3BabylonMovieEnglishAmazon PrimeJuly 5Sweet Kaaram CoffeeWeb SeriesTeluguAmazon PrimeJuly 6The Pope's ExorcistMovieEnglishNetflixJuly 7DeepFakeLoveWeb SeriesEnglishNetflixJuly 7AdhuraWeb SeriesHindiAmazon PrimeJuly 7TarlaMovieHindiZee5July 7IB 71MovieHindiDisney + HotstarJuly 7FarhanaMovieTamil/TeluguSony LivJuly 7BlindMovieHindiJio CinemaJuly 7 APP ఈ వారం(July 7) బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేయబోతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని థియేటర్ల ముందు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే పలు చిత్రాల ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. మరి, ఆ సినిమాలతో పాటు ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో ‘YouSay Web’బటన్‌పై క్లిక్ చేసి తెలుసుకోండి.&nbsp;&nbsp;&nbsp;
    జూలై 03 , 2023
    Top 10 Melody Hits Of Veturi : ఈ సాంగ్స్ వింటే ఎవరైన ప్లాట్ కావాల్సిందే భయ్యా..!
    Top 10 Melody Hits Of Veturi : ఈ సాంగ్స్ వింటే ఎవరైన ప్లాట్ కావాల్సిందే భయ్యా..!
    వేటూరి సుందరరామమూర్తి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ పేరు తెలియని వారుండరు. గేయ రచయితగా తెలుగు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. తన కెరీర్‌లో 5 వేలకు పైగా పాటలకు సాహిత్య దానం చేశారు వేటూరి. వేటూరి పాటను కీర్తిస్తూ ఎన్నో పాటలు పుట్టుకు రావడం సుందర రామమూర్తి సాహిత్యానికి నిదర్శనం. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా తన పాటలతో అందరినీ మరిపించగలరు. మంచి మెలోడీ పాటలనూ రాయగలరు. మరి, వేటూరి కలం నుంచి జాలువారిన కొన్ని మెలోడీ గీతాలేంటో తెలుసుకుందామా.&nbsp; పూసింది పూసింది పున్నాగ సీతారామయ్యగారి మనవరాలు సినిమాలోని ‘పూసింది పూసింది పున్నాగ’ గేయం ఇప్పటికీ తెలుగు లోగిళ్లలో వినిపిస్తుంది. పదాలను ప్రాసలో వాడటంలో వేటూరి ప్రావీణ్యమేంటో ఈ పాటలో తెలిసిపోతుంది. ఈ పాటలోని లిరిక్స్ ఆహ్లాదంగా ఉంటాయి. వేటూరి మాటకు కీరవాణి బాణీ కడితే ఈ పాటలా ఉంటుంది. మీరూ వినేయండి మరి. https://www.youtube.com/watch?v=sBG_Z3zv96s యమహా నగరి కలకత్తా పురి చూడాలని వుంది సినిమాలోని పాట ఇది. కలకత్తా నగర విశిష్ఠతను తెలియజేస్తూ సాగిపోతుంటుందీ గీతం. బెంగాళీ చరిత్రను ఒక పాటలో అవపోసన పడితే వచ్చేదే ఈ గేయం. ‘కలలకు నెలవట.. కళలకు కొలువుట.. విధులకు సెలవట.. అతిథుల గొడవట.. కలకట నగరపు కిటకిటలో’ అంటూ ప్రాసలో చేర్చేశారు. వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్(నేతాజీ)లకు జన్మనిచ్చిన చోటు అంటూ గేయంలో చరిత్రను ఇనుమడించారు. https://www.youtube.com/watch?v=q2mt5XNgFVE యమునాతీరం ఆనంద్ సినిమాలోని ‘యమునాతీరం’ పాట చాలా మందికి ఎంతో ఇష్టం. ఉదయం లేవగానే ఈ పాటను ఎంతో మంది వింటుంటారు. ఉల్లాసంగా ఉంటూ.. కొత్త ఉత్సాహాన్ని నింపుతుందీ పాట. ‘శిశిరంలో చలి మంటై రగిలేది ప్రేమ.. చిగురించే రుతువల్లే విరబూసే ప్రేమ’ అంటూ సాగే గీతం నూతనోత్తేజాన్ని నింపుతుంది. హరిహరన్, చిత్ర వేటూరి సాహిత్యానికి ప్రాణం పోశారు. https://www.youtube.com/watch?v=375j2vlMbxM ఉప్పొంగెలే గోదావరి గోదావరి సినిమాలోని ‘ఉప్పొంగెలే గోదావరి’ పాట ఎంతో అద్భుతం. గోదావరి గొప్పదనాన్ని వేటూరి పాటకన్నా గొప్పగా ఏదీ వర్ణించదేమో అన్నట్లుగా ఉంటుందీ గీతం. ‘వెతలు తీర్చే మా దేవేరి.. వేదమంటి మా గోదారి.. శబరి కలిసిన గోదారి..రామ చరితకే పూదారి’ అంటూ గోదారి విశిష్ఠతను వర్ణించారు. బాల సుబ్రహ్మణ్యం పాటను మరోస్థాయికి తీసుకెళ్లారు.&nbsp; https://www.youtube.com/watch?v=yWnhTwJeKbQ తొలిసారి మిమ్మల్ని శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలోని పాట ఇది. ఓ అబ్బాయిని చూసి మనసు పారేసుకున్న యువతి పాట పాడితే ఎలా ఉంటుందో ఈ గేయం చెబుతుంది. ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు.. కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు’ అంటూ నివేదిస్తుంది.&nbsp; https://www.youtube.com/watch?v=VZEIVEjC5TE చుక్కల్లారా చూపుల్లారా ఆపద్భాందవుడు సినిమాలోని మధురమైన పాట ఇది. ‘చుక్కల్లారా చూపుల్లారా.. ఎక్కడమ్మా జాబిలీ.. మబ్బుల్లారా, మంచుల్లారా తప్పుకోండీ దారికీ’ అంటూ గేయం మొదలవుతుంది. ఇందులోని లిరిక్స్ శ్రోతలను కట్టిపడేస్తాయి. మీరూ ఈ మధుర గీతాన్ని ఆస్వాదించండి.&nbsp; https://www.youtube.com/watch?v=5QYZGxyg1ZE పచ్చందనమే సఖి సినిమాలోని తెలుగు వెర్షన్ పాటలను రాసింది వేటూరీనే. ఇందులో పచ్చందనమే పాట మ్యూజిక్ లవర్స్‌కి ఫేవరేట్ సాంగ్. ‘ఎర్రని రూపం ఉడికే కోపం.. మసకే పడితే మరకత వర్ణం.. అందం చందం అలిగిన వర్ణం’ అని సాగే లిరిక్స్ మెస్మరైజ్ చేసేస్తాయి.&nbsp; https://www.youtube.com/watch?v=XruNLPI0yQc జిలిబిలి పలుకుల సితార సినిమాలోని ‘జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా’ అంటూ ఈ పాట సాగుతుంది. ‘కలలను తెంచకు.. కలతను దాచకు’, ‘అడగను లే చిరునామా ఓ మైనా ఓ మైనా.. చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా’ వంటి వాక్యాలు ఇంప్రెస్ చేస్తాయి. ఇలాంటివి ఎన్నో ఉంటాయీ పాటలో. https://www.youtube.com/watch?v=yJNSkGafGJw మౌనమేళనోయి సాగర సంగమం సినిమాలోని పాటలన్నీ ప్రత్యేకం. అందులోనూ ‘మౌనమేళనోయి’ మెలోడీ మరెంతో స్పెషల్. ‘ఎదలో వెన్నెల.. వెలిగే కన్నుల.. తారాడే హాయిల’ అంటూ శ్రోతలను హాయిని చేకూర్చారు వేటూరి. అందుకే ఇప్పటికీ ఈ పాట వెంటాడుతూనే ఉంటుంది.&nbsp; https://www.youtube.com/watch?v=N-J2YjDtBGs రెక్కలొచ్చిన ప్రేమ బస్ స్టాప్ సినిమాలోని ‘రెక్కలొచ్చిన ప్రేమా నింగికి ఎగిరిందా’ పాట మ్యూజిక్ లవర్స్‌కి ఎంతో ఇష్టం. ‘ఆకాశం ఇల్లవుతుందా రెక్కలొచ్చాక.. అనురాగం బదులిస్తుందా ప్రశ్నై మిగిలాక’ అంటూ ప్రశ్నిస్తూనే తత్వాన్ని చెప్పారు వేటూరి. ఈ పాటను ఓసారి వినేయండి మరి. https://www.youtube.com/watch?v=hQ7EaelCpP8
    జూన్ 21 , 2023
    ఎద పొంగులతో ఈషా.. శ్రద్దా సొగసుల సంపద.. సాగర తీరాన&nbsp; మాళవిక అందాల ఆరబోత
    ఎద పొంగులతో ఈషా.. శ్రద్దా సొగసుల సంపద.. సాగర తీరాన&nbsp; మాళవిక అందాల ఆరబోత
    సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ తారలు తమ అందాలతో అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా పలువురు హీరోయిన్లు హాట్‌ ఫోటోలతో హీట్‌ పెంచారు. ఆ ఫోటోలేంటో మీరూ&nbsp; ఓ లుక్కేయండి. టాలీవుడ్ అగ్రకథానాయికగా ఎదిగిన కాజల్‌ లేటెస్ట్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. తన నడుము అందాలను చూపిస్తూ కాజల్ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) సీతారామం బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ తాజాగా షేర్‌ చేసిన ఫొటోలను చూసి నెటిజన్లు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు.&nbsp; View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) నటి మాళవిక మోహనన్‌ చేస్తున్న ఫోటోషూట్స్‌కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం పోర్చుగల్‌లో పర్యటిస్తున్న ఈ భామ సముద్రం పక్కన పొట్టి గౌనుతో ఫొటోలు దిగింది. View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) హాట్ బాంబ్ శ్రద్దా దాస్ అందాల ఆరబోత రోజురోజుకీ పీక్స్ లోకి వెళుతోంది. తాజాగా మరోమారు శ్రద్ధా తన సొగసులను కెమెరా ముందు పెట్టి రచ్చ రచ్చ చేసింది. View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) చిరుత బ్యూటీ నేహా శర్మ ఓ రెస్టారెంట్‌లో సందడి చేశారు. ఫుడ్‌ మెనూను చూస్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు.&nbsp; View this post on Instagram A post shared by Neha Sharma ? (@nehasharmaofficial) కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించున్న ప్రియా వారియర్‌.. సోషల్‌మీడియాలో అందాల ఆరబోతగా వెనకాడటం లేదు. View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) కలర్‌ఫొటో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి చాందిని చౌదరి.. హాట్‌ లుక్‌తో నెటిజిన్లకు ట్రీట్‌ ఇచ్చారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో చాందిని పరువాలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) నటి ఈషా రెబ్బ పెట్టే పోస్టులకు సోషల్‌ మీడియాలో మంచి క్రేజ్‌ ఉంటుంది. ఎద పొంగులతో తాజాగా ఆమె పెట్టిన పోస్టులు నెటిజన్లను షేక్‌ చేస్తోంది.&nbsp; View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha)
    మార్చి 30 , 2023
    <strong>Sandeep Reddy Vanga: తల్లి సెంటిమెంట్‌పై సందీప్‌ రెడ్డి వంగా కొత్త సినిమా?</strong>
    Sandeep Reddy Vanga: తల్లి సెంటిమెంట్‌పై సందీప్‌ రెడ్డి వంగా కొత్త సినిమా?
    భారతీయ చిత్ర పరిశ్రమలో దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కొత్త ఒరవడిని సృష్టించాడు. మూస ధోరణి సీన్లు, రెగ్యులర్‌ స్క్రీన్‌ప్లేకు స్వస్థి చెప్పి తనదైన కొత్త తరహా మేకింగ్‌ స్టైల్‌ను అందరికీ పరిచయం చేశాడు. తన సినిమాల్లో ఎక్కువగా వైలెన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే సందీప్‌ రెడ్డి ‘యానిమల్‌’ (Animal)లో వైలెన్స్‌తో పాటు తండ్రి సెంటిమెంట్‌ను సైతం బాగా చూపించాడు. తన చిత్రాల్లో తండ్రి పాత్రలను ప్రాధాన్యత ఇచ్చే సందీప్‌ తల్లి రోల్స్‌ను అంతగా పట్టించుకోడన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్‌ రెడ్డి తన సినిమాల్లో తల్లి పాత్రలకు ప్రాధాన్యం ఇవ్వడానికి గల కారణాన్ని వివరించారు. ప్రస్తుతం ఆ కామెంట్స్‌ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. ‘అమ్మను ఎదిరించాను’ సెన్సేషన్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి&nbsp; (Sandeep Reddy Vanga) రంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన సినిమాల్లో తల్లి రోల్స్‌కు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడో వివరించాడు. తన అమ్మతో తాను చాలా చనువుగా ఉంటానని సందీప్‌ తెలిపారు. ఆమె తనను బాగా&nbsp; సపోర్ట్ చేస్తుందని చెప్పారు. కెరీర్‌లో ముందుకెళ్లడానికి తన మదర్‌ చాలా సహకరించిందని, యాక్టింగ్‌ స్కూల్‌ ఫీజుల దగ్గర నుంచి అర్జున్‌ రెడ్డి ప్రొడక్షన్‌ వరకు ఎన్నో విషయాల్లో ఆమె సపోర్ట్ ఉందని చెప్పారు. అమ్మతో ఎక్కువ ఎటాచ్‌మెంట్ ఉండడం వల్ల ఒక్కోసారి ఆమెను ఎదిరించిన సందర్భాలు సైతం ఉన్నాయని చెప్పించారు. తమ బంధంలో ఎలాంటి సమస్యలు లేకపోవడం వల్లే సినిమాల్లో ఆ డ్రామాను తీసుకురాలేకపోతున్నట్లు స్పష్టం చేశారు. ఒకవేళ తల్లి- కుమారుడు సెంటిమెంట్‌తో సినిమా తీస్తే అది పాజిటివ్‌గా ఉంటుందని, అందులో హింసకు చోటుండదని చెప్పుకొచ్చాడు.&nbsp; తండ్రి-కొడుకుల బాండింగ్‌ సూపర్బ్‌ సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కించిన ‘యానిమల్‌’(Animal) చిత్రం గతేడాది డిసెంబర్‌లో విడుదలై బ్లాక్‌బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఇందులో వైలెన్స్‌తో పాటు తండ్రీ, తనయుల మధ్య అనుబంధాన్ని సందీప్‌ చక్కగా చూపించాడు. యాక్షన్‌ &amp; ఎమోషన్‌ డ్రామా ఫిల్మ్‌గా కళ్లకు కట్టాడు. ఇందులో బాలీవుడ్ దిగ్గజ నటుడు అనిల్‌కపూర్‌ తండ్రి పాత్రలో యాక్ట్‌ చేయగా రణ్‌బీర్‌ కపూర్‌ తనయుడిగా చేశాడు. బాబీదేవోల్‌ ప్రతి నాయకుడిగా కనిపించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీనికి కొనసాగింపుగా ‘యానిమల్‌ పార్క్‌’ రానున్న విషయం తెలిసిందే.&nbsp; మూడు విభిన్న లుక్స్‌తో.. యానిమల్‌ తర్వాత రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తో సందీప్‌ (Sandeep Reddy Vanga) ‘స్పిరిట్‌’ అనే ప్రాజెక్ట్‌ రూపొందించనున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్‌ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. పోలీసు లుక్‌తో పాటు మరో రెండు లుక్స్‌లో ప్రభాస్ కనిపించే ఛాన్స్ ఉందని చర్చ జరుగుతోంది. ‘యానిమల్‌’లో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) కనిపించిన తరహాలోనే మరో రెండు కొత్త లుక్స్‌లో ప్రభాస్‌ అలరించే అవకాశముందని స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. డిసెంబర్‌ ఎండింగ్‌లోపు సినిమాను లాంఛనంగా ప్రారంభించి 2025 జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్‌ మెుదలు పెట్టాలని సందీప్ రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం. అక్కడి నుంచి 6 నెలల్లోనే సినిమాను కంప్లీట్‌ చేయాలని భావిస్తున్నట్లు ఇటీవల చిత్ర నిర్మాత ప్రకటించారు. దీంతో మూవీ లాంచింగ్‌ కార్యక్రమం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.&nbsp; భారీ బడ్జెట్‌తో.. ప్రభాస్‌ (Prabhas) హీరోగా సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్‌లో రాబోతున్న ‘స్పిరిట్‌’ (Spirit)పై దేశవ్యాప్తంగా భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించి నెట్టింట ఓ వార్త హల్‌ చల్‌ చేస్తోంది.&nbsp; ఈ సినిమాకు ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు టాక్ వినిపిస్తోంది. తొలుత ఈ మూవీ బడ్జెట్ రూ.500 కోట్లు అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత రూ. 750 కోట్లకు పెరిగిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా రూ.1000 కోట్లతో ఈ సినిమా రూపొందనున్నట్లు బజ్‌ వినిపిస్తోంది. అదే నిజమైతే బడ్జెట్‌ పరంగా ప్రభాస్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ మూవీగా 'స్పిరిట్‌' నిలవనుంది.
    డిసెంబర్ 07 , 2024
    <strong>Pushpa 3: బన్నీ ఫ్యాన్స్‌ను దారుణంగా మోసం చేసిన సుకుమార్‌.. ఎలాగంటే?&nbsp;</strong>
    Pushpa 3: బన్నీ ఫ్యాన్స్‌ను దారుణంగా మోసం చేసిన సుకుమార్‌.. ఎలాగంటే?&nbsp;
    అల్లు అర్జున్‌ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబోలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం యావత్‌ దేశాన్ని షేక్‌ చేస్తోంది. థియేటర్లలో మాస్ జాతరను సృష్టించింది. దేశవ్యాప్తంగా ఉన్న చాలా వరకూ థియేటర్లలో పుష్పగాడి రూలే నడుస్తోంది. హీరో అల్లు అర్జున్‌ మరోమారు అవార్డు విన్నింగ్‌ నటనతో ఆకట్టుకున్నాడని ఆడియన్స్‌ అంటున్నారు. అటు సుకుమార్‌ సైతం తన మార్క్‌ మేకింగ్‌తో మెస్మరైజ్‌ చేశాడని పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఓ విషయంలో మాత్రం సుకుమార్‌ తమను మోసం చేశాడని ఆడియన్స్‌ ఫీలవుతున్నారు. అందుకు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఆ గ్లింప్స్‌ సీన్స్‌ మిస్సింగ్‌.. ‘పుష్ప 2’ ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్‌ సుకుమార్‌ మెుట్ట మెుదటగా ‘వేర్‌ ఈజ్‌ పుష్ప’ అంటూ ఒక గ్లింప్స్‌ను రిలీజ్‌ చేశారు. అందులో పుష్ప మిస్సింగ్‌ అంటూ ప్రజలు అల్లర్లకు దిగుతారు. స్మగ్లింగ్‌ చేసిన డబ్బుతో పుష్ప చేసిన మేలును చెప్పే ప్రయత్నం చేస్తారు. అటు మీడియా ఛానల్స్ సైతం పుష్ప ఎక్కడ? అంటూ వార్తలు ప్రసారం చేస్తాయి. ఈ క్రమంలో అడవిలో జంతువుల కోసం పెట్టిన కెమెరాలో పుష్ప కనిపిస్తాడు. ఈ గ్లింప్స్‌ అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ‘పుష్ప 2’పై భారీగా అంచనా పెరగడానికి కారణమైంది. అయితే తాజాగా విడుదలైన ‘పుష్ప 2’ చిత్రంలో గ్లింప్స్‌లోని ఒక్క సీన్‌ కూడా కనిపించలేదు. దీంతో సుకుమార్‌ తమను దారుణంగా మోసం చేశారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 2023 ఏడాదికి గాను బిగ్గెస్ట్‌ ప్రాంక్‌ వీడియో అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.&nbsp; https://twitter.com/letscinema/status/1643488166421356547 https://twitter.com/SodiReddyUnOffl/status/1864529905733530018 నెక్ట్స్‌ పార్ట్‌లో ఎక్స్‌పెక్ట్‌ చేయవచ్చా? ‘వేర్‌ ఈజ్‌ పుష్ప’ అంటూ వచ్చిన గ్లింప్స్‌లోని సన్నివేశాలు ‘పుష్ప 3’లో కనిపించే ఛాన్స్‌ పుష్కలంగా ఉన్నాయి. ‘పుష్ప 2’ క్లైమాక్స్‌ పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఎందుకంటే క్లైమాక్స్‌లో ఓ భారీ బాంబ్‌ బ్లాస్ట్‌ను చూపించారు. అది కూడా పుష్ప అటెండ్‌ అయిన పెళ్లిలో జరుగుతుంది. పుష్పను టార్గెట్‌ చేసి శత్రువులు ఈ బ్లాస్ట్‌ చేయిస్తారు. ఈ ఘటన తర్వాత పుష్ప కనిపించకుండా పోయే ఛాన్స్ ఉందని నెటిజన్లు అంచనా వేస్తారు. అతడు బతికున్నాడో లేదో తెలియక ప్రజలు అయోమయానికి గురై ఇలా అల్లర్లకు పాల్పడి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. పార్ట్‌ 2 క్లైమాక్స్‌లో పుష్పకి కొత్త శత్రువులు యాడ్‌ అవ్వడం, ఇంటర్నేషనల్‌ స్థాయిలో స్మగ్లింగ్‌కు తెరలేపడంతో ‘పుష్ప 3’ (Pushpa 3) మరింత ఆసక్తికరంగా ఉండొచ్చని తెలుస్తోంది.&nbsp; పుష్ప 3 ఎప్పుడంటే? ‘పుష్ప 2’ భారీ విజయం సాధించడంతో ప్రస్తుతం అందరి దృష్టి మూడో భాగంపై పడింది. ఈ మూవీ (Pushpa 3 Release Date) ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పట్లో ఈ సినిమా మెుదలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకుంటే పుష్ప 2 తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్‌ ఓ ప్రాజెక్ట్‌ చేయబోతున్నాడు. అటు సుకుమార్‌ సైతం రామ్‌ చరణ్‌తో ‘RC 17’ ప్రాజెక్ట్‌ తెరకెక్కించనున్నాడు. ఐదేళ్ల కాలాన్ని పుష్పకు అంకితం చేయడంతో సుకుమార్‌ కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత ‘RC 17’పై ఫోకస్‌ పెట్టే ఛాన్స్ ఉంది. అటు బన్నీ, ఇటు సుకుమార్‌ తమ ప్రాజెక్ట్‌లను ఫినిష్‌ చేసుకున్న తర్వాతే ‘పుష్ప 3’ని పట్టాలెక్కించనున్నారు. దీనికి కనీసం నాలుగేళ్ల సమయం పట్టవచ్చని ఫిల్మ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 2028లో ఈ సినిమా (Pushpa 3) పట్టాలెక్కవచ్చని అంచనా వేస్తున్నాయి.&nbsp; బన్నీపై NHRCకి ఫిర్యాదు! మరోవైపు ‘పుష్ప 2’ ప్రీమియర్స్‌ సందర్భంగా హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన మానవ హక్కుల కమిషన్‌ (NHRC) వద్దకు చేరింది. ఈ విషయంపై ఓ న్యాయవాది NHRCకి ఫిర్యాదు చేశారు. పోలీసు యాక్ట్‌ కింద ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ప్రీమియర్‌ షో ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ్‌ ప్రాణపాయ స్థితిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలియజేశారు. మృతురాలి కుటుంబ సభ్యులకు రూ.5 కోట్ల పరిహారం ఇప్పించాలని కోరారు. ఘటనకు కారకులైన నటుడు అల్లు అర్జున్‌తో పాటు సంబంధిత ప్రభుత్వ అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో రాసుకొచ్చారు. కాగా, ఈ ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమీషన్‌ స్వీకరించింది. త్వరలోనే నోటీసులు పంపే ఛాన్స్ ఉంది. https://twitter.com/tupaki_official/status/1864948492453523637
    డిసెంబర్ 06 , 2024

    @2021 KTree