![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/Devara_acUqWUDE06_624_528.jpeg)
రేటింగ్ లేదు
No Dateమీకు ఈ సినిమా చూడాలనే ఆసక్తి ఉందా?
ఆసక్తి ఉంది
UATelugu
అనగనగా ఓ సముద్ర తీరం! అక్కడ ఓ రాజకుటుంబం ఉంటుంది. నరరూప రాక్షసుల వంటి మృగాల చేతిలో ఆ తీర ప్రాంత ప్రజలు బాధలు పడుతుంటారు. ఇకపై వాళ్ళ సంరక్షణ బాధ్యత తమది అని ఆ రాజకుటుంబం హామీ ఇస్తుంది. అప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న రాజ కుటుంబం వారసుడు దేవర(జూ.ఎన్టీఆర్) అడుగు పెట్టి... రాక్షస సంహారం చేస్తాడు. ఆ మృగాల మధ్య పెరిగిన మేలిమి ముత్యం లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు.. ఇదీ దేవర అసలు కథ. RRR తర్వాత జూ.ఎన్టీఆర్ నటిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. మరోవైపు ఆచార్య వంటి డిజాస్టర్ మూవీ తర్వాత కొరటాల శివ దేవర సినిమాను తెరకెక్కిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇంగ్లీష్లో చదవండి
తారాగణం
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/N_T_Rama_Rao_Jr_QHp3TWdA2pTRiAE1_250_250.jpeg)
ఎన్టీ రామారావు జూనియర్.
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Janhvi_Kapoor_250_250.jpeg)
జాన్వీ కపూర్
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Saif_Ali_Khan_250_250.jpeg)
సైఫ్ అలీ ఖాన్
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Srikanth_250_250.jpeg)
శ్రీకాంత్
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Prakash_Raj.jpeg)
ప్రకాష్ రాజ్
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Shine_Tom_Chacko.jpeg)
షైన్ టామ్ చాకో
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Narain_250_250.jpeg)
నారాయణ్
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Kalaiyarasan_250_250.jpeg)
కలైయరసన్
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Murali_Sharma.jpeg)
మురళీ శర్మ
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Abhimanyu_Singh.jpeg)
అభిమన్యు సింగ్
సిబ్బంది
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Koratala_Siva.jpeg)
కొరటాల శివ
దర్శకుడు![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Nandamuri_Kalyan_Ram.jpeg)
నందమూరి కళ్యాణ్ రామ్
నిర్మాతసుధాకర్ మిక్కిలినేనినిర్మాత
ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
![విజయ్ దేవరకొండ (Vijay Devarkonda) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/02/29175234/Untitled-design-2024-02-29T175221.305.jpg)
విజయ్ దేవరకొండ (Vijay Devarkonda) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
అర్జున్ రెడ్డి సినిమా విజయంతో రౌడీ బాయ్గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. తక్కువ కాలంలోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. గీతాగోవిందం, ఖుషి వంటి హిట్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గరయ్యాడు. ప్రస్తుతం స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న విజయ్ దేవరకొండ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికరమైన సంగతులు మీకోసం..
విజయ్ దేవరకొండ అసలు పేరు?
దేవరకొండ విజయ్ సాయి. అభిమానులు ముద్దుకు రౌడీ బాయ్, VDK అని పిలుచుకుంటారు.
విజయ్ దేవరకొండ ఎత్తు ఎంత?
5 అడుగుల 10 అంగుళాలు
విజయ్ దేవరకొండ తొలి సినిమా?
నువ్విలా చిత్రం ద్వారా తొలిసారి నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించాడు. 2016లో వచ్చిన పెళ్లి చూపులు చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు
విజయ్ దేవరకొండ తొలి బ్లాక్ బాస్టర్ హిట్స్?
అర్జున్ రెడ్డి చిత్రం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. గీతాగోవిందం, ట్యాక్సీవాలా, ఖుషి సినిమాలు హిట్స్గా నిలిచాయి.
విజయ్ దేవరకొండ క్రష్ ఎవరు?
ఖుషి సినిమాలో తనతోపాటు నటించిన సమంత తన క్రష్గా విజయ్ ఓ సందర్భంలో చెప్పాడు
VDKకు ఇష్టమైన కలర్?
తెలుపు, బ్లాక్, బ్రౌన్
విజయ్ దేవరకొండ పుట్టిన తేదీ?
మే 9, 1989
విజయ్ దేవరకొండకు నచ్చిన పుస్తకం?
విజయ్ దేవరకొండ పుస్తక ప్రియుడు. అతనికి 'ది పౌంటెన్ హెడ్' అనే పుస్తకం అంటే ఇష్టమని చెప్పాడు. ఈ పుస్తకంతో పాటు 'అట్లాస్ ష్రగ్ డ్', 'హూ మూవ్డ్ మై చీజ్' అనే పుస్తకాలు చదవదగినవని పేర్కొన్నాడు.
విజయ్ దేవరకొండకు లవర్ ఉందా?
విజయ్ దేవరకొండ, రష్మిక మంధాన ప్రేమలో ఉన్నారని చాలా వార్తల్లో వచ్చాయి. వీరిద్దరు కలిసి పలు సందర్భాల్లో కనిపించడం ఆ వార్తలకు బలానిచ్చాయి. గీతాగోవిందం, డియర్ కామ్రెడ్ వంటి హిట్ చిత్రాల్లో ఈ జోడి నటించింది.
విజయ్ దేవరకొండ వ్యాపారాలు?
రౌడీ బ్రాండ్ పేరుతో క్లాత్ బిజినెస్ ఉంది. ఈ బ్రాండ్ బట్టలు మింత్రా ఆన్లైన్ స్టోర్లో అందుబాటులో ఉన్నాయి. 'కింగ్ ఆఫ్ ది హిల్' అనే ప్రొడక్షన్ హౌస్ ఉంది. వోల్ట్స్ అనే ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు.
విజయ్ దేవరకొండకు ఎన్ని అవార్డులు వచ్చాయి?
అర్జున్ రెడ్డి చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు పొందాడు. 2018 ఫోర్బ్స్ ఇండింయా సెలబ్రెటీ 100 జాబితాలో 72వ స్థానం, టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్లో 4 వ స్థానంలో నిలిచాడు.
విజయ్ దేవరకొండ సామాజిక సేవ చేస్తాడా?
కొవిడ్ టైంలో మిడిల్ క్లాస్ ఫండ్ ద్వారా వంట సామాగ్రిని అందించాడు. ఇందుకోసం రూ.1.7కోట్లు ఖర్చు పెట్టాడు. ఖుషి సినిమా విడుదల సమయంలో తన రెమ్యునరేషన్ నుంచి రూ.కోటి ఖర్చు పెట్టి 100 మంది రైతులకు సాయం చేశాడు
విజయ్ దేవరకొండ ఎన్ని సినిమాల్లో నటించాడు?
విజయ్ దేవరకొండ 2024 వరకు 14 సినిమాల్లో నటించాడు.
విజయ్ దేవరకొండకు ఇష్టమే ఆహారం?
చికెన్ బిర్యాని, ఇటాలియన్ పస్తా అండ్ పీజా, కాఫీ.
https://www.youtube.com/watch?v=6Z_mp4t0QLU
మార్చి 19 , 2024
![విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషీ’ చిత్రం థియేటర్లలోకి రాకముందే మనం తప్పక చూడాల్సిన ప్రేమ కథా చిత్రాలు](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/02/11175615/cropped-ws_FS2ePFjakAA3z6j.jpg)
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషీ’ చిత్రం థియేటర్లలోకి రాకముందే మనం తప్పక చూడాల్సిన ప్రేమ కథా చిత్రాలు
]తమిళ మూవీ ‘96’కు రీమేక్గా ‘జాను’ చిత్రం వచ్చింది. శర్వానంద్, సమంతలు తమ నటనతో సినిమాలోని పాత్రలకు జీవం పోశారు. అపరిమితమైన ప్రేమ కాన్సెప్ట్తో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. నువ్వు ప్రేమించిన వారితో నువ్వు కలకాలం కలసి ఉండలేవు థీమ్తో సినిమా నిర్మించారు.జానుDownload Our App
ఫిబ్రవరి 11 , 2023
![<strong>VD12 Leaked Pic: ‘VD12’ సెట్ నుంచి విజయ్ దేవరకొండ ఫొటో లీక్.. నెట్టింట రచ్చ రచ్చ! </strong>](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/07/23154026/Untitled-design-2024-07-23T153952.224.jpg)
VD12 Leaked Pic: ‘VD12’ సెట్ నుంచి విజయ్ దేవరకొండ ఫొటో లీక్.. నెట్టింట రచ్చ రచ్చ!
యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కు యూత్లో ఏ స్థాయి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ రౌడీ బాయ్ ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘పెళ్లిచూపులు’, ‘టాక్సీవాలా’, ‘గీత గోవిందం’ సక్సెస్తో స్టార్ హీరోల స్థాయికి ఎదిగాడు. అయితే గత కాలంగా ఇండస్ట్రీలో విజయ్కు కలిసిరావడం లేదు. అతడు చేసిన గత మూడు చిత్రాలు ‘లైగర్’, ‘ఖుషీ’, ‘ఫ్యామిలీ స్టార్’ బాక్సాఫీస్ వద్దగా దారుణంగా విఫలమయ్యాయి. దీంతో ప్రస్తుతం అతడు చేస్తున్న ‘VD12’ చిత్రంపై విజయ్తో పాటు అతడి ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ సెట్ నుంచి ఓ ఫొటో లీకైంది. ఇందులో విజయ్ దేవరకొండ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
విజయ్ పిక్ వైరల్!
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'VD12' చిత్రం రూపొందుతోంది. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో షూటింగ్ సెట్ నుంచి విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇందులో బైక్పై వెనక కూర్చుని మాస్ లుక్లో కనిపించాడు. తలపై లైట్ హెయిర్, ముఖాన గడ్డంతో మెస్మరైజ్ చేసేలా అతడి లుక్ ఉంది. ఇది చూసిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్తో సంతోషంతో ఊగిపోతున్నారు. మరో బ్లాక్బాస్టర్ లోడింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోను విపరీతంగా షేర్ చేస్తూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు.
https://twitter.com/king_ntr9999/status/1815611065381896259
థియేటర్లు బద్దలే!
‘VD 12’ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ మాస్లుక్కు అనిరుధ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు తోడైతే ధియేటర్లు బద్దలు కావాల్సిందేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ‘VD 12’లో విజయ్ లుక్ చూస్తుంటే ‘యువ’ సినిమాలో మాధవన్ గుర్తుకు వస్తున్నాడంటూ పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో విజయ్కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నట్లు సమాచారం. తొలుత ఈ చిత్రానికి శ్రీలీలను హీరోయిన్గా ఎంపిక చేశారు. అనివార్య కారణాలతో ఆమె ప్లేస్లో భాగ్యశ్రీని తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె షూటింగ్లోనూ పాల్గొంటున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.
https://twitter.com/Rebelstarpr/status/1815667163178656207
డ్యుయల్ రోల్లో రౌడీ బాయ్!
‘VD 12’ చిత్రంలో విజయ్ దేవరకొండ పవర్ఫుల్ పోలీసు ఆఫీసర్గా కనిపించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి అస్పష్టంగా ఉన్న ఖాకీ డ్రెస్ పోస్టర్ను సైతం అధికారికంగా రిలీజ్ చేసింది. అయితే తాజాగా లీకైన ఫొటోను చూస్తే విజయ్ దేవరకొండ ఊర మాస్ లుక్లో కనిపించాడు. ఒక లోకల్ గ్యాంగ్స్టర్ను తలపించాడు. దీన్ని బట్టి చూస్తే విజయ్ ఈ చిత్రంలో ద్విపాత్రిభినయం చేస్తున్నాడా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. లేదా ఒకే పాత్రను రెండు డైమన్షన్స్లో దర్శకుడు చూపించబోతున్నారా? అన్న అనుమానం కలుగుతోంది. ఏది ఏమైనా లీకైనా విజయ్ లుక్ చూస్తే థియేటర్లో మాస్ జాతర కన్ఫార్మ్ అని స్పష్టమవుతోంది.
క్యూట్ లవ్స్టోరీ!
విజయ్ దేవరకొండ ‘VD 12’తో పాటు మరో ప్రాజెక్ట్కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దర్శకుడు రవికిరణ్ కోలా దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ మూవీకి దిల్రాజు (Dil Raju) నిర్మాతగా వ్యవహరించనున్నారు. అందమైన ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా రూపుదిద్దుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇందులో హీరోయిన్గా సాయిపల్లవి (Sai Pallavi) తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాయిపల్లవిని సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇటీవల టాలీవుడ్లో ప్రచారం జరిగింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.
జూలై 23 , 2024
![Vijay- Sukumar Movie: డైరెక్టర్ సుకుమార్తో విజయ్ దేవరకొండ కొత్త చిత్రం?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/05/21162420/123.-2024-05-21T162410.223-1.jpg)
Vijay- Sukumar Movie: డైరెక్టర్ సుకుమార్తో విజయ్ దేవరకొండ కొత్త చిత్రం?
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కు గత కొన్ని ఏళ్లుగా కలిసి రావడం లేదు. ఆయన గత మూడు చిత్రాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో విజయ్ ఫ్యాన్స్ ఆందోళనలో పడ్డారు. అయితే ఈ హీరో కొత్తగా ప్రకటిస్తున్న ప్రాజెక్ట్స్ మాత్రం అతడి ఫ్యూచర్ మూవీస్పై ఎంతో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇటీవల విజయ్ ఓ పిరియాడికల్ మూవీలో నటిస్తున్న ప్రకటించాడు. గౌతం తిన్ననూరి డైరెక్షన్లో రాబోతున్న చిత్రంలో పోలీసు ఆఫీసర్గా విజయ్ కనిపించనున్నాడు. ఇక లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం స్టార్ డైరెక్టర్ సుకుమార్తో రౌడీ బాయ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ను షేక్ చేస్తోంది.
‘విజయ్ - సుకుమార్ మూవీ పక్కా..’
విజయ్ దేవరకొండతో సుకుమార్ ఓ సినిమా చేయబోతున్నట్లు నిర్మాత కేదార్ సెలగంశెట్టి (Kedar Selagamsetty) చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) నటించిన 'గం గం గణేశా' చిత్రానికి కేదార్ నిర్మాతగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడిన ఆయన.. విజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబోలో ఓ సినిమా రానున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కచ్చితంగా ఉంటుందని నిర్మాత స్పష్టం చేశారు. ఇది విన్న విజయ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు.
Sukumar : Vijay Deverakonda's film will be there. I thought this year RamCharan and Sukumar film might be in progress but didn't happen, Pushpa2 is in progress. Currently, our project [ VD, Sukumar ] will take more time to go on floors, Sukumar Garu after completing his current… pic.twitter.com/2yNpn4tyhG— RatpacCheck (@RatpacCheck) May 20, 2024
గతంలోనే ప్రకటన
విజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబోలో కొద్ది సంవత్సరాల క్రితమే ఓ సినిమా రాబోతున్నట్లు ప్రకటన వెలువడింది. నిర్మాత కేదార్ సెలగంశెట్టి నేతృత్వంలోని ఫాల్కన్ నిర్మాణ సంస్థ వీరి కాంబోలో సినిమా తీసేందుకు అప్పట్లో ప్రయత్నించింది. అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అయితే ‘పుష్ప 2’ తర్వాత దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని భావించినా సుకుమార్.. రామ్చరణ్ కాంబినేషన్లో సినిమా ప్రకటించడంతో ఇక విజయ్తో సినిమా లేనట్లేనని సినీ వర్గాలు భావించాయి. అయితే లేటెస్ట్గా విజయ్-సుకుమార్ సినిమా ఉంటుందని నిర్మాత ప్రకటించడం ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించింది.
2026 తర్వాతే..!
ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్.. 'పుష్ప 2' సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ విడుదల తేదీ (ఆగస్టు 15) దగ్గర పడుతుండటంతో శరవేగంగా షూటింగ్ నిర్వహిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వెంటనే రామ్చరణ్తో సినిమా మెుదలవుతుంది. చరణ్తో మూవీ కంప్లీట్ అయిన తర్వాత విజయ్తో సుకుమార్ సినిమా చేయనున్నట్లు నిర్మాత కేదార్ సెలగంశెట్టి తెలిపారు. దీని ప్రకారం విజయ్ - సుకుమార్ మూవీ పట్టాలెక్కడానికి ఎట్టలేదన్న 2026 వరకూ ఆగాల్సిందేనని టాక్ వినిపిస్తోంది. పైగా పుష్ప 3 కూడా ఉండొచ్చని గతంలో బన్నీ ప్రకటించిన నేపథ్యంలో విజయ్ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
విజయ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
'ఫ్యామిలీ స్టార్' (Family Star) తర్వాత విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ ఫిల్మ్ను ‘జెర్సీ’ (Jersey) దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో కలిసి చేస్తున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో స్పై యాక్షన్ థ్రిల్లర్గా రూపొందనుంది. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలకు విజయ్ ఓకే చెప్పాడు. ‘టాక్సీవాలా’ (Taxiwaala) ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్తో కలిసి విజయ్ ఓ పిరియాడికల్ మూవీ చేయబోతున్నాడు. ఇటీవల ఈ సినిమా పోస్టర్ రిలీజ్ కాగా అది అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే దిల్రాజు నిర్మాతగా రవి కిరణ్ కోలాతో కలిసి ఓ యాక్షన్ డ్రామా సైతం విజయ్ చేయనున్నాడు. ఈ సినిమాల తర్వాత సుకుమార్తో విజయ్ మూవీ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.
మే 21 , 2024
![Devara Song: ఒక్క సాంగ్తో ‘దేవర’పై తలకిందులైన అంచనాలు.. నెట్టింట తీవ్ర సంతృప్తి! ](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/05/20165810/Untitled-design-2024-05-20T165303.185.jpg)
Devara Song: ఒక్క సాంగ్తో ‘దేవర’పై తలకిందులైన అంచనాలు.. నెట్టింట తీవ్ర సంతృప్తి!
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'దేవర' (Devara). కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తారక్కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. తీర ప్రాంతం నేపథ్యంలో రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా తారక్ బర్త్డే (మే 20)ను పురస్కరించుకొని నిన్ననే మూవీ టీమ్.. తొలి సాంగ్ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాటపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ సాంగ్ను ప్రశంసిస్తుంటే ఎక్కువ మంది సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
దూసుకెళ్తున్న సాంగ్
దేవర సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ను ఆదివారం (మే 19) సాయంత్రం చిత్ర యూనిట్ విడుదల చేసింది. 'ఫియర్ సాంగ్' (Fear Song) పేరుతో సాంగ్ లిరికల్ వీడియోను యూట్యూబ్లో రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలుగులో ఈ పాట లిరిక్స్ రామజోగయ్య శాస్త్రి రాయగా.. సంగీత దర్శకుడు అనిరుధ్ స్వయంగా పాడాడు. ప్రస్తుతం ఈ సాంగ్ తొలి 20 గంటల్లో 47 లక్షల వ్యూస్ (తెలుగులో) దూసుకెళ్తోంది. అటు ఇతర భాషల్లోనూ ఈ పాటకు మంచి ఆదరణ లభిస్తోంది.
https://www.youtube.com/watch?v=CKpbdCciELk&list=PLTtJUIuknk91d-Sq1qbTeI0WM0R6EbuZS&index=3
‘అనిరుధ్ ఎలివేషన్స్ ఏంటి’
దేవర ఫస్ట్ సాంగ్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్కు గూస్బంప్స్ వచ్చినా.. మిగతా మ్యూజిక్ లవర్స్, నెటిజన్లు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు. అసలు ఎన్టీఆర్ బర్త్డే సాంగ్లో అనిరుద్ ఎలివేషన్ ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. తారక్ కంటే ఎక్కువగా అనిరుధ్ కనిపించాడని మండిపడుతున్నారు. విక్రమ్ సినిమా టైటిల్ ట్రాక్ని తీసుకొచ్చి ‘దేవర’కు పెట్టారంటూ విమర్శలు చేస్తున్నారు. పాట మెుత్తాన్ని మ్యూజిక్ డామినేట్ చేసిందని పోస్టులు పెడుతున్నారు. ఆ మ్యూజిక్ మధ్యలో లిరిక్స్ ఏమి వినిపింలేదని మండిపతున్నారు. 'దేవర ముంగిట నువ్వెంత' అన్న పదం తప్ప ఇంకేమి స్పష్టంగా వినిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సాంగ్ విన్న తర్వాత ‘దేవర’ ఫిల్మ్పై ఉన్న అంచనాలు కూడా సన్నగిల్లుతున్ననయని మరికొందరు వ్యాఖ్యానించారు.
ఆ సాంగ్ను కాపీ కొట్టాడా?
‘దేవర’లోని ఫియర్ సాంగ్ను విన్న కొందరు నెటిజన్లు.. ఈ పాటను గతంలో వచ్చిన సాంగ్స్తో కంపేర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సాంగ్ 'లియో' చిత్రంలోని 'బ్యాడ్ యాస్' పాటలా ఉందంటూ తమిళ ఆడియన్స్ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. తమిళంలోనూ ఈ సాంగ్ రిలీజ్ అయిన నేపథ్యంలో ఈ మేరకు పోస్టులు పెడుతున్నారు. అనిరుధ్ మళ్లీ కాపీ కొట్టాడంటూ కామెంట్ బాక్స్లో పోస్టులు చేస్తున్నారు.
‘దేవర’లో ఎన్టీఆర్ పాత్ర ఇదే!
‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ‘దేవర’ వస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. సముద్ర తీర ప్రాంత ప్రజల సమస్యలను తీర్చే నాయకుడిగా తారక్.. దేవరలో కనిపించనున్నాడు. ఎన్టీఆర్లోని హీరోయిజాన్ని దర్శకుడు కొరటాలు ఈ మూవీతో పతాక స్థాయికి తీసుకెళ్లనున్నట్లు ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ఎన్టీఆర్కు ధీటుగా నిలబడే విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. అతడి పాత్ర కూడా చాలా పవర్ఫుల్గా ఉండబోతున్నట్లు సమాచారం.
మే 20 , 2024
![Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ సినిమా? క్లారిటీ!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/04/24160504/123.-92.jpg)
Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ సినిమా? క్లారిటీ!
యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల వచ్చిన 'ఫ్యామిలీ స్టార్' (Family Star) చిత్రం.. కలెక్షన్లు రాబట్టడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో విజయ్ కెరీర్ పరంగా బిగ్గెస్ట్ సక్సెస్ కోసం విజయ్ ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం అతడి దృష్టంతా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందనున్న లవ్ ఎంటర్టైనర్ మీదనే ఉంది. ఈ క్రమంలోనే ‘సలార్’, ‘కేజీఎఫ్’ వంటి బ్లాక్ బాస్టర్లు అందించిన ప్రశాంత్ నీల్తో విజయ్ భేటి కావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. వీరి కాంబోలో ఏమైనా సినిమా ఉంటుందా? అన్న ఆసక్తి టాలీవుడ్ వర్గాల్లో మెుదలైంది.
ఎందుకు కలిశారంటే!
హైదరాబాద్ ఫిల్మ్నగర్లో ఉన్న విజయ్ దేవరకొండ ఇంటికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వెళ్లి కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతుందన్న పుకార్లు మొదలయ్యాయి. ముఖ్యంగా హ్యాట్రిక్ ఫ్లాపులతో సతమతమవుతున్న విజయ్.. ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్తో పని చేయబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ‘సలార్ 2’లో విజయ్ అతిథి పాత్ర పోషించబోతున్నట్లు టాలీవుడ్లో స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఈ పాత్ర గురించి చర్చించడానికే ప్రశాంత్ నీల్.. విజయ్ ఇంటికి వెళ్లారని సమాచారం. 'సలార్ 2' క్లైమాక్స్లో విజయ్ కనిపిస్తాడని అంటున్నారు. ఆయన రోల్ సినిమాకు చాలా కీలకంగా ఉండనుందని టాక్. అయితే దీనిపై మూవీ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
చిక్కుల్లో విజయ్ కెరీర్!
విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన గత మూడు చిత్రాలు ‘లైగర్’ (Liger), ‘ఖుషి’ (Kushi), ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star).. బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. ముఖ్యంగా రెండేళ్ల కిందట వచ్చిన లైగర్ భారీ నష్టాలను మిగిల్చింది. తాజాగా రిలీజైన ‘ఫ్యామిలీ స్టార్’ కూడా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. దీంతో నిర్మాత దిల్ రాజు కూడా భారీగా నష్టాలు చవిచూసినట్లు ఇండస్ట్రీలో టాక్ ఉంది. మరోవైపు తనకు ‘గీత గోవిందం’ లాంటి హిట్ ఇచ్చిన పరశురాం కూడా విజయ్ లక్కును మార్చలేకపోయాడు. దీంతో విజయ్కు బ్లాక్ బాస్టర్ తప్పనిసరిగా మారింది. మరో ప్లాపు విజయ్ ఖాతాలో పడితే అతడి కెరీర్ సమస్యల్లో పడవచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
విజయ్ ఫ్లాప్స్కు చెక్ పడేనా?
విజయ్(Vijay Deverakonda) తన తర్వాతి చిత్రం 'VD12'ను గౌతం తిన్ననూరి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్.. పాన్ ఇండియా స్థాయిలో రూపొందించనుంది. ఇందులో విజయ్కు జోడీగా 'ప్రేమలు' బ్యూటీ మమితా బైజు (Mamita Baiju)ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల వచ్చిన ‘ప్రేమలు’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అయ్యింది. ఓవర్సీస్లోనూ మంచి వసూళ్లను సాధించడంతో ఈ అమ్మడి మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో మమితా బైజును తీసుకుంటే సినిమాకు బాగా కలిసొస్తుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. పైగా కొత్త తరహా లవ్ స్టోరీ కావడం, విజయ్ మమితా తొలిసారి జోడీ కడుతుండటం సినిమాకు ప్లస్ అవుతుందని చిత్ర యూనిట్ అభిప్రాయపడుతోంది. మరి ఈ కేరళ బ్యూటీ విజయ్ ఫ్లాప్స్కు చెక్ పెడుతుందో లేదో చూడాలి.
https://telugu.yousay.tv/exclusive-premalu-heroine-romance-with-vijay-deverakonda.html
ఏప్రిల్ 24 , 2024
![EXCLUSIVE: విజయ్ దేవరకొండతో ‘ప్రేమలు’ హీరోయిన్ రొమాన్స్!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/04/20162155/123.-90.jpg)
EXCLUSIVE: విజయ్ దేవరకొండతో ‘ప్రేమలు’ హీరోయిన్ రొమాన్స్!
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. ఇటీవల 'ఫ్యామిలీ స్టార్' (Family Star) చిత్రంతో తెలుగు ఆడియన్స్ పలకరించాడు. ప్రస్తుతం అతడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాలో ఎవర్ని హీరోయిన్గా తీసుకుంటారన్న ఆసక్తి టాలీవుడ్లో మెుదలైంది. తొలుత శ్రీలీల (Sreeleela)ను విజయ్కు జోడీగా తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం యంగ్ సెన్సేషన్ మమితా బైజును హీరోయిన్గా లాక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
విజయ్కు జోడీగా కేరళ బ్యూటీ!
‘ప్రేమలు’ చిత్రంతో యువతరం హృదయాలను మలయాళీ సోయగం ‘మమితా బైజు’ (Mamita Baiju) దోచుకుంది. చూడముచ్చటైన రూపం, చక్కటి అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించింది. ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్ కూడా అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ భామకు తెలుగులో భారీ ఆఫర్లు మెుదలయ్యాయి. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతం తిన్ననూరి కాంబోలో రానున్న ‘VD12’ చిత్రంలో ఈ అమ్మడికి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. సరికొత్త ప్రేమ కథతో రానున్న ఈ సినిమాలో విజయ్కు జోడీగా మమితా బైజు సరిగ్గా ఉంటుందని యూనిట్ భావించిందట. ఈ ఆఫర్ పట్ల మమితా కూడా చాలా ఆసక్తి కనబరిచిందట. విజయ్తో నటించేందుకు చాలా ఇంట్రస్ట్ చూపించిందట. దీంతో ఈ మలయాళ బ్యూటీ నేరుగా చేయనున్న తెలుగు చిత్రం ఇదే అవుతుందని అంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని సమాచారం.
ఆ హీరోయిన్ల సరసన చోటు!
మలయాళం భామలు తెలుగు సినిమాల్లో నటించడం ఇదేమి తొలిసారి కాదు. మలయాళ ఇండస్ట్రీకి చెందిన అనుపమా పరమేశ్వరన్, కీర్తి సురేష్, నివేదా థామస్, మాళవిక మోహనన్ వంటి భామలు తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించారు. తమ నటన, గ్లామర్తో ఇక్కడి ప్రేక్షకులను అలరించారు. తాజాగా ఈ జాబితాలో చేరేందుకు యంగ్ సెన్సేషన్ మమితా బైజు రెడీ అవుతోంది. ‘ప్రేమలు’లో ఈ అమ్మడి నటనకు ఫిదా అయిన యూత్ ఆడియన్స్.. ‘VD12’పై ఇప్పటినుంచే అంచనాలు పెంచేసుకుంటున్నారు. తెలుగులోనూ ఈ అమ్మడి మ్యాజిక్ మెుదలవుతుందని బలంగా నమ్ముతున్నారు.
View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju)
మమితాపై ఆసక్తికి కారణమదేనా?
'VD 12' చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పాన్ ఇండియా స్థాయిలో రూపొందించనుంది. హీరో విజయ్కు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడులోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. అయితే మలయాళం సహా నార్త్ ప్రేక్షకులకు 'VD12' చిత్రాన్ని మరింత చేరువ చేసేందుకు మమితా బైజు ఉపయోగపడుతుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇటీవల వచ్చిన ‘ప్రేమలు’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ కావడం.. ఓవర్సీస్లోనూ మంచి వసూళ్లను సాధించడంతో ఈ అమ్మడి క్రేజ్ సినిమాకు బాగా కలిసొస్తుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీలీలను కాదని మమితా పట్ల ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 20 , 2024
![Devara: తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’కు ఊహించని షాక్.. ప్రభాస్, బన్నీతో పోలిస్తే వెనకబడ్డ తారక్!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/04/16192003/page-2.jpg)
Devara: తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’కు ఊహించని షాక్.. ప్రభాస్, బన్నీతో పోలిస్తే వెనకబడ్డ తారక్!
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జూ.ఎన్టీఆర్ (Jr. NTR) నటిస్తున్న చిత్రం 'దేవర' (Devara). కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా చేస్తోంది. సముద్ర బ్యాక్డ్రాప్లో రూపొందుతుండటం, తారక్ డ్యూయల్ రోల్లో చేస్తుండటంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని అభిప్రాయపడుతున్నారు. అయితే తాజాగా దేవర ప్రీరిలీజ్ బిజినెస్ అంటూ కొన్ని లెక్కలు వైరల్ అవుతున్నాయి. అవి చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆ సినిమాల కంటే వెనకే!
లేటెస్ట్ బజ్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’ థియేట్రికల్ హక్కులు రూ.130 కోట్లకు అమ్ముడుపోనున్నట్లు తెలుస్తోంది. తారక్ కెరీర్లో ఇదే అత్యధికం. అయితే అల్లుఅర్జున్ ‘పుష్ప 2’ (Pushpa 2), ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలు కేవలం ఒక్క రీజియన్లోనే రూ.100 కోట్ల మేర బిజినెస్ చేస్తోందని టాక్. వీటితో పోలిస్తే దేవర చాలా తక్కువ థియేట్రికల్ బిజినెస్ చేసే పరిస్థితులు కనిపిస్తాయి. వాస్తవానికి టాలీవుడ్లో బన్నీ, తారక్కు సమాన క్రేజ్ ఉంది. ‘పుష్ప 2’ లాగానే ‘దేవర’ కూడా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. అయినా కూడా ‘పుష్ప 2’ బిజినెస్ అంచనాలను తారక్ అందుకోకపోవడం ఫ్యాన్స్ను నిరాశకు గురిచేస్తోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో రూ.200 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని భావించిన వారంతా తాజా లెక్కలు చూసి పెదవి విరుస్తున్నారు.
ప్రీరిలీజ్ బిజినెస్ అంచనాలు ఇవే!
లేటెస్ట్ బజ్ ప్రకారం దేవర ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా రూ.400 కోట్లకు పైగా జరిగే అవకాశముందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ రూ.130 కోట్లు పలకనున్నట్లు సమాచారం. ఈ రైట్స్ కోసం నిర్మాత దిల్రాజు, మైత్రీమూవీ మేకర్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ వారు పోటీ పడుతున్నారట. మరోవైపు ఉత్తరాది, కర్ణాటక, తమిళనాడు, కేరళ కలుపుకొని సుమారు రూ.50-60 కోట్ల బిజినెస్ జరిగిందని అంటున్నారు. అటు ఓవర్సీస్ హక్కులను రూ.27 కోట్లకు హమ్సిని ఎంటర్టైన్మెంట్ లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆడియో రైట్స్ను రూ.33 కోట్లకు టి సిరీస్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక దేవర ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్.. రూ.155 కోట్లకు ఖాయం చేసుకోగా మిగిలిన శాటిలైట్ హక్కులను కూడా కలుపుకుంటే ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఈజీగానే రూ.400 కోట్లు దాటతాయని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
‘దేవర’ మూవీ టీజర్, ట్రైలర్, సాంగ్ రిలీజ్ కాకుండానే ఈ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు బయటకు రావడంపై సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. దేవర ఫస్ట్ పార్ట్కే ఈ స్థాయిలో బిజినెస్ జరిగితే.. రెండో భాగానికి ఇంకెంత బిజినెస్ జరుగుతుందోనని ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నాయి. కాగా, అక్టోబర్ 10న దసరా కానుకగా దేవర చిత్రం విడుదల కానుంది. ఇందులో సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఫిల్మ్స్ పతాకాలపై కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.
ఏప్రిల్ 16 , 2024
![Shruti Marathe: ‘దేవర’లో తారక్ భార్యగా గుజరాతి బ్యూటీ.. శ్రుతి మరాఠే ఎంత ఫేమస్సో తెలుసా? ](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/03/26175912/123.-52.jpg)
Shruti Marathe: ‘దేవర’లో తారక్ భార్యగా గుజరాతి బ్యూటీ.. శ్రుతి మరాఠే ఎంత ఫేమస్సో తెలుసా?
'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ (Jr NTR) నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'దేవర' (Devara). కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తారక్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అయితే రెండో పాత్రకు జోడీగా గుజరాతీ నటి శ్రుతి మరాఠే (Shruti Marathe) నటిస్తోంది.
దేవరలో నటించే విషయాన్ని శ్రుతినే స్వయంగా ప్రకటించడంతో ఆమె పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ భామ గురించి తెలుసుకునేందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్తో పాటు తెలుగు ఆడియన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.
గుజరాత్లోని వడోదరా ప్రాంతంలో 9 అక్టోబర్, 1986 శ్రుతీ జన్మించింది. అక్కడి సెయింట్ మీరాస్ కాలేజీ (St. Mira's College)లో ఆమె చదువుకుంది.
కెరీర్ ప్రారంభంలో శ్రుతి మరాఠే మోడల్గా చేసింది. పలు వాణిజ్య ప్రకటనల్లో నటించి గుర్తింపు పొందింది.
అలా మరాఠీ సీరియల్స్లోకి అడుగుపెట్టిన శ్రుతి.. రాధ హయ్ బవారి (Radha Hi Bawari), జాగో మోహన్ ప్యారే (Jaago Mohan Pyare), మఝ్యా నవర్యాచి బేకూ (Majhya Navaryachi Bayko) వంటి సీరియళ్లతో చాలా పాపులర్ అయ్యింది.
2008లో వచ్చిన 'సనాయ్ చౌగదే' (Sanai Choughade) అనే మరాఠీ సినిమాతో ఆమె వెండితెరపై అడుగుపెట్టింది. అందులో అశ్విని పాత్రలో కనిపించి అలరించింది.
ఆ తర్వాత 'ఇందిరా విఝా' (Indira Vizha) సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టి అక్కడ కూడా గుర్తింపు సంపాదించింది. మరాఠి, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేసి ఆకట్టుకుంది.
2016లో వచ్చిన బుధియా సింగ్ - బొర్న్ టూ రన్' (Budhia Singh – Born to Run) సినిమాతో శ్రుతి.. బాలీవుడ్కు పరిచయమైంది. అదే ఏడాది 'వెడ్డింగ్ యానివర్సరీ'తో హిందీ ప్రేక్షకులకు దగ్గరైంది.
'బార్డ్ ఆఫ్ బ్లడ్' (Bard Of Blood) వెబ్సిరీస్లోనూ శ్రుతి నటించింది. బాలీవుడ్లో తనేంటో నిరూపించుకున్న శ్రుతికి టాలీవుడ్లో 'దేవర'నే మెుదటి సినిమా.
శ్రుతి మరాఠే వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆమెకు 2016లోనే వివాహమైంది. ప్రముఖ మరాఠీ నటుడు గౌరవ్ ఘట్నేకర్ (Gaurav Ghatnekar) ఆమె వివాహం చేసుకుంది.
విహార యాత్రలను ఎక్కువగా ఇష్టపడే ఈ భామకు బోటింగ్ అంటే ఇంకా ఇష్టమట. షూటింగ్ నుంచి ఏ కాస్త విరామం దొరికినా కుటుంబంతో ట్రిప్ ప్లాన్ చేస్తుందట.
ఈ సోషల్ మీడియాలోనూ శ్రుతి మరాఠీ చాలా చురుగ్గా ఉంటోంది. ఇంట్లో వాళ్లతో కలిసి చేసిన రీల్స్ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
శ్రుతి.. అప్పుడప్పుడు గ్లామర్ ఫొటోలను కూడా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తుంటుంది.
మార్చి 27 , 2024
![Devara Movie: ‘దేవర’ నుంచి తారక్ వీడియో క్లిప్ లీక్.. సర్ప్రైజ్ చేసిన మేకర్స్!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/03/22155304/Untitled-design-2024-03-22T154812.219.jpg)
Devara Movie: ‘దేవర’ నుంచి తారక్ వీడియో క్లిప్ లీక్.. సర్ప్రైజ్ చేసిన మేకర్స్!
‘ఆర్ఆర్ఆర్’ (RRR) తర్వాత తారక్ (Jr NTR) నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దేవర’ (Devara). జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివ (Koratala Siva)తో జూ.ఎన్టీఆర్ ఈ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీకపూర్ (Janhvi Kapoor), తారక్పై చిత్ర యూనిట్ ఓ సాంగ్ను అక్కడ చిత్రీకరిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్కు సంబంధించిన ఓ వీడియో లీక్ అయ్యింది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ‘దేవర’లో ఎన్టీఆర్కు సంబంధించిన లుక్ను మేకర్స్ అధికారికంగా రివీల్ చేశారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
రుద్రాక్షతో ఠీవీగా నిలబడ్డ తారక్!
‘దేవర’లో జూ.ఎన్టీఆర్కు సంబంధించిన లేటెస్ట్ లుక్ను చిత్ర యూనిట్ సోషల్మీడియాలో పంచుకుంది. ఈ ఫొటోలో నడుముపై చేతులు వేసుకొని చాలా దర్జాగా ఎన్టీఆర్ కనిపించాడు. మెడలో రుద్రాక్షతో ఉన్న ఎన్టీఆర్ మాస్ లుక్ చూసి.. ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ ఫొటోలో ఎన్టీఆర్తో పాటు డైరెక్టర్ కొరటాల శివ, కొరియోగ్రాఫర్ రాజు సుందరం కనిపించారు. గోవాలో చిత్రీకరిస్తున్న పాటకు రాజు సుందరం కొరియోగ్రఫీ అందింస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఎన్టీఆర్ వీడియో లీక్..
అంతకుముందు గోవాలో ‘దేవర’ షూటింగ్కు సంబంధించిన వీడియో నెట్టింట లీక్ అయ్యింది. సముద్రం ఒడ్డున లుంగీ ధరించి ఉన్న ఎన్టీఆర్.. ఆ వీడియోలో కనిపించాడు. సముద్రం నుంచి తీరం వైపునకు తారక్ నడుచుకుంటూ రావడం ఇందులో కనిపించింది. చిత్ర యూనిట్ పోస్టు చేసిన ఫొటోలో, ఈ వీడియోలో ఉన్న తారక్ లుక్ ఒకటే కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సైతం నెట్టింట వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. కాగా ఈ మూవీలో రెండు పాత్రల్లో తారక్ కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. తండ్రికొడులుగా అతడు నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం లీకైన వీడియో ఫాదర్ క్యారెక్టర్కు సంబంధించిందని టాక్.
https://twitter.com/Chaitanya9045/status/1770879170299781378
‘దేవర’లో ఎన్టీఆర్ పాత్ర ఇదే!
జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ‘దేవర’ వస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. సముద్ర తీర ప్రాంత ప్రజల సమస్యలను తీర్చే నాయకుడిగా తారక్.. దేవరలో కనిపించబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్లోని హీరోయిజాన్ని దర్శకుడు కొరటాల శివ.. ఈ మూవీతో పతాక స్థాయికి తీసుకెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎన్టీఆర్కు ధీటుగా నిలబడే విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. అతడి పాత్ర కూడా చాలా పవర్ఫుల్గా ఉండబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ రెండు పార్టులుగా రానుండగా.. తొలి భాగాన్ని అక్టోబర్ 10 (Devara Release Date)న రిలీజ్ చేయనున్నారు.
మార్చి 22 , 2024
![Telugu Sea/Ocean Movies: దేవర సినిమా మాదిరి సముద్రం బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమాలు తెలుసా?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/01/10161824/Untitled-design-2024-01-10T161813.282.jpg)
Telugu Sea/Ocean Movies: దేవర సినిమా మాదిరి సముద్రం బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమాలు తెలుసా?
టాలీవుడ్లో కొత్త ట్రెండ్ మెుదలైంది. సముద్రం నేపథ్యం ఉన్న సినిమాలు గత కొంత కాలం నుంచి విరివిగా తెరకెక్కుతున్నాయి. తీర ప్రాంత కథలతో వచ్చే సినిమాలకు సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉండటంతో సీనియర్లతో పాటు యంగ్ హీరోలు తీర ప్రాంత కథల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కథలో వైవిధ్యం ఉంటే కొత్త డైరెక్టర్లతో కూడా పని చేసేందుకు సై అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో వచ్చిన, రాబోతున్న చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
దేవర
'ఆర్ఆర్ఆర్' తర్వాత తారక్ నటిస్తున్న చిత్రం ‘దేవర(Devara like movies)’. కొరటాల శివ దర్శకత్వంలో సముద్రపు బ్యాక్ డ్రాప్తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందుకు అనుగుణంగానే ఇటీవల విడుదలైన మూవీ గ్లింప్స్లో తారక్ సముద్రపు దొంగల్ని ఊచకోత కోస్తాడు. కాగా ఈ సినిమాలో తారక్కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. సైఫ్ అలీఖాన్, టామ్ చాకో, శ్రీకాంత్, మురళి శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదల కానుంది.
తండేల్
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘తండేల్’(Thandel). ఇందులో చైతూ మత్స్యకారుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల రిలీజైన మూవీ గ్లింప్స్ అదిరిపోయింది. సముద్రంలోకి వేటకు వెళ్లిన జాలర్లు పొరపాటున పాక్ జలాల్లోకి ప్రవేశించి వారి చేతికి చిక్కుతారు. వారి బారి నుంచి ఏ విధంగా బయటపడ్డారు? అన్నది మూవీ స్టోరీ. దర్శకుడు చందూ మెుండేటి ప్రేమ కథ, దేశ భక్తి అంశాలను జోడించి ఈ సినిమాను కమర్షియల్గా తీస్తున్నారు.
ఓజీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజీ(OG MOVIE)’. ఈ సినిమా కూడా ముంబయి సముద్ర తీరం చుట్టూ తిరగనుంది. సముద్రంలో జరిగే అక్రమ రవాణాకు సంబంధించి కథ సాగనున్నట్లు తెలిసింది. ఇందులో పవన్కు జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తోంది. శ్రియా రెడ్డి, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, షాన్ కక్కర్ ప్రధాన పాత్రుల పోషించనున్నారు.
మట్కా
వరుణ్ తేజ్ హీరోగా, కరుణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మట్కా’. ఈ మూవీ కూడా తీర ప్రాంత నేపథ్యంతో సాగనుందని సమాచారం. యావత్ దేశాన్ని కదిలించిన యదార్థ ఘటన ఆధారంగా మట్కా రూపొందుతోంది. ఈ మూవీలో వరుణ్ విభిన్న గెటప్లలో కనిపిస్తాడని టాక్. నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటిస్తున్నారు.
KGF 3
ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో కన్నడ స్టార్ యష్ హీరోగా రూపొందిన చిత్రం ‘కేజీఎఫ్’. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని అందుకుంది. అయితే కేజీఎఫ్ 3 సముద్ర నేపథ్యంలో ఉంటుందని చెబుతున్నారు.
RC16
మెగా పవర్స్టార్ రామ్చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో రానున్న చిత్రం 'RC 16'. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్లో బిజీగా ఉన్న చరణ్.. ఆ తర్వాత RC16ను పట్టాలెక్కించనున్నాడు. ఈ చిత్రం కూడా తీర ప్రాంత నేపథ్యంలోనే తెరకెక్కనుందని టాక్. ఇందులో తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపిస్తాడని సమాచారం.
వాల్తేరు వీరయ్య
గతేడాది సంక్రాంతి సందర్భంగా వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. సముద్రంలో చేపలు పట్టుకునే గంగపుత్రుడి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించాడు. ఇందులో రవితేజ పోలీసు ఆఫీసర్గా నటించి సినిమా విజయంతో ముఖ్య పాత్ర పోషించాడు. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా చేసింది.
ఉప్పెన
సముద్రపు బ్యాక్డ్రాప్తో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న చిత్రం ‘ఉప్పెన(Uppena)’. పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మత్సకార కుటుంబానికి చెందిన పేదింటి యువకుడు పాత్రలో వైష్ణవ్ నటించాడు. వ్యాపార వేత్త శేషారాయణం (విజయ్ సేతుపతి) కూతురు బేబమ్మగా కృతి శెట్టి కనిపించింది. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.
ఘాజీ
1971లో భారత్ పాకిస్థాన్ల మధ్య జరిగిన యుద్థానికి ముందు సముద్ర గర్భంలో జరిగిన ఓ అప్రకటిత యుద్ధ కథే ఘాజీ(Ghazi). రానా, కేకే మీనన్, అతుల్ కులకర్ణి, తాప్సీ లీడ్ రోల్స్లో నటించారు. సంకల్ప్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రానికి కె. కృష్ణ కుమార్ సంగీతం అందించారు. ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.
మహా సముద్రం
అజయ్ భూపతి డైరెక్షన్లో వచ్చిన యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'మహాసముద్రం'. ఇందులో శర్వానంద్, సిద్దార్థ్, అదితిరావు హైదరీ, అను అమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో చేశారు. తీర ప్రాంత నగరం వైజాగ్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ.. ప్రేక్షకులను మెప్పించడంలో మాత్రం వెనుకబడింది.
జనవరి 10 , 2024
![Kushi Movie Review: విజయ్ దేవరకొండ, సమంత కెమిస్ట్రీ సూపర్బ్.. మరి ‘ఖుషి’ హిట్ అయినట్లేనా?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/09/01120344/Untitled-design-22.jpg)
Kushi Movie Review: విజయ్ దేవరకొండ, సమంత కెమిస్ట్రీ సూపర్బ్.. మరి ‘ఖుషి’ హిట్ అయినట్లేనా?
నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, లక్ష్మీ, మురళీ శర్మ, జయరామ్, రోహిణి, సచిన్ ఖేడేకర్, శరణ్య, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు
దర్శకత్వం: శివ నిర్వాణ
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
సినిమాటోగ్రఫీ: మురళి. G
నిర్మాత : చిరంజీవి పెదమల్లు, Y. రవిశంకర్, నవీన్ యెర్నేని
సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’ (Kushi). శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ నుంచి వస్తున్న చిత్రమిది. విజయ్కి జోడిగా సమంత అని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. దానికి తోడు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ సూపర్ హిట్ సాధించడంతో ‘ఖుషి’పై హైప్ మరింత పెరిగింది. భారీ అంచనాల మధ్య ఇవాళ (సెప్టెంబర్ 1) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? విజయ్, సమంత జోడీకి ఎన్ని మార్కులు పడ్డాయి? ఈ పూర్తి రివ్యూలో చూద్దాం.
కథ:
ఈ సినిమా కథ కశ్మీర్లో ప్రారంభమవుతుంది. బుర్ఖాలో ఉన్న బేగం (సమంత)ను చూసి విప్లవ్ (విజయ్ దేవరకొండ) తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆ పిల్ల తనదని ఫిక్స్ అవుతాడు. అయితే అనూహ్య పరిస్థితుల్లో బేగం బ్రాహ్మిణ్ అని విప్లవ్కు తెలుస్తుంది. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆరాధ్య (సమంత)ను క్రిస్టియన్ అబ్బాయి విప్లవ్కు ఇచ్చి వివాహం చేసేందుకు ఆమె తండ్రి చంద్రరంగం (మురళీశర్మ) ఒప్పుకోడు. ఈ పెళ్లికి విప్లవ్ కుటుంబ సభ్యులు కూడా అంగీకరించరు. దీంతో పెద్దలను ఎదిరించి మరీ విప్లవ్, ఆరాధ్య ఒక్కటవుతారు. అంతా ‘ఖుషి’గా సాగిపోతుందని అనుకున్న సమయంలో విప్లవ్, ఆరాధ్యల కాపురం కొత్త మలుపు తిరుగుతుంది. అసలు విప్లవ్, ఆరాధ్యలకు వచ్చిన సమస్యేంటి? దాని నుంచి వారు ఎలా బయటపడ్డారు? అన్నది మిగిలిన కథ. ఇది తెలియాలంటే సినిమాకు వెళ్లాల్సిందే.
ఎవరెలా చేశారంటే?
విజయ్ దేవరకొండ ఎప్పటిలాగే తన అద్భుతమైన నటనతో మెప్పించాడు. విప్లవ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి అలరించాడు. అటు సమంత కూడా ఆరాధ్య పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో ఎంతగానో ఆకట్టుకుంది. తెరపై విప్లవ్, ఆరాధ్య పాత్రలు మాత్రమే కనిపించేంతలా విజయ్, సామ్ పోటీపడి నటించారు. వీరి మధ్య కెమెస్ట్రీ సైతం అద్భుతంగా కుదిరింది. అటు మురళీశర్మ, సచిన్ ఖేడేకర్, రోహిణి, లక్ష్మీ నటన సినిమాకు ప్లస్ అయ్యింది. వెన్నెల కిషోర్, అలీ, రాహుల్ రామకృష్ణ కామెడీ నవ్వులు పూయించింది.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
ఫ్యామిలీ ఆడియన్స్ను దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీసే దర్శకుడు శివ నిర్వాణ. తన గత చిత్రాలైన ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఖుషి కోసం రొటిన్ కథనే ఆయన ఎంచుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా దాన్ని తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. పెళ్లి తర్వాత ఇది చేద్దాం.. అది చేద్దాం అని ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న జంటలకు ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అయితే సినిమాలో అక్కడక్కడ కొన్ని సీన్లు బోరింగ్ అనిపిస్తాయి. మరికొన్ని సీన్లు ఎక్కడో చూసిన భావన కలిగిస్తాయి. ఎడిటర్ తన కత్తెరకు మరింత పని చెప్పి ఉంటే బాగుండేది. ఓవరాల్గా శివ నిర్వాణ డైరెక్షన్ బాగుంది.
టెక్నికల్గా
ఖుషి సినిమాకు టెక్నికల్ అంశాలు చాలా బాగా ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా పాటలు ఈ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి. సందర్భానుసారంగా వచ్చే సాంగ్స్ ఎంతో వినసొంపుగా అనిపిస్తాయి. సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. అటు G. మురళి అందించిన సినిమాటోగ్రఫీ కూడా ఈ చిత్రానికి మంచి ఎసెట్ అయ్యింది. ముఖ్యంగా కశ్మీర్ అందాలను ఆయన తన కెమెరా పనితనంతో ఎంతో అద్భుతంగా చూపించాడు. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. నాణ్యత విషయంలో ప్రొడ్యుసర్లు ఎక్కడా రాజీపడినట్లు అనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
విజయ్, సమంత నటనసంగీతంసినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
కథనంబోరింగ్ సీన్స్
రేటింగ్: 3/5
సెప్టెంబర్ 01 , 2023
![త్వరలో ఒక్కటి కానున్న సమంత - విజయ్ దేవరకొండ! ఇద్దరి టార్గెట్ ఒక్కటే.. ఇదిగో సాక్ష్యాలు](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/08/31144351/Untitled-design-15.jpg)
త్వరలో ఒక్కటి కానున్న సమంత - విజయ్ దేవరకొండ! ఇద్దరి టార్గెట్ ఒక్కటే.. ఇదిగో సాక్ష్యాలు
సమంత - విజయ్ దేవరకొండ వీరిద్దరు తెలుగు తెరపై అనతి కాలంలోనే స్టార్స్గా ఎదిగారు. పెద్దఎత్తున ఫ్యాన్ బేస్ను సంపాదించారు. విజయ్ -సామ్ సినీ కెరీర్ పక్కన పెడితే ఇద్దరూ తమ పర్సనల్ లైఫ్లో ఒకేరకంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. వీరి ఆలోచనల్లో కొన్ని ఒకేరకంగా ఉండటం యాధృచ్చికమే అయినా.. కెరీర్ పరంగా ఒకే దారిలో అడుగులు వేస్తూ ఒకే టార్గెట్ వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో వస్తున్న ఖుషీ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
టాలీవుడ్లో తొలి సినిమాతో యూత్లో విపరీతమైన క్రేజ్ సంపాందించి రౌడీ బాయ్గా ఫ్యాన్స్కు దగ్గరయ్యాడు విజయ్ దేవరకొండ. తన యాటిట్యూడ్, టాకింగ్ నెస్తో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం మూవీలతోనే కాకుండా సొంతంగా బిజినెస్లు ప్రారంభిస్తూ అందులోనూ రాణిస్తున్నాడు. ఇదే దారిలో సమంత కూడా పయనిస్తోంది.
సినిమాల్లోకి వచ్చిన తొలిరోజుల్లోనే సమంత తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుసగా అవకశాలు కొల్లగొడుతూ అగ్రహీరోయిన్ స్థాయికి ఎదిగింది. తెలుగు, తమళంలో దాదాపు అందరు అగ్రహీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.
విజయ్ దేవరకొండ ఓవైపు సినిమాలు చేస్తూనే వ్యాపారాలపై దృష్టి పెట్టాడు. యూత్లో క్రేజ్ సంపాదించిన విజయ్.. ఆ క్రేజ్ను తన వ్యాపారానికి పెట్టుబడిగా మార్చుకున్నాడు. రౌడీ బ్రాండ్ పేరుతో టెక్స్ టైల్ బిజినెస్ ప్రారంభించి ఈ రంగంలోనూ సక్సెస్ సాధించాడు.
సొంత బ్రాండ్ కావడంతో తానే ప్రకటనల్లో నటిస్తూ ప్రమోట్ చేస్తున్నాడు. ఈ రౌడీ బ్రాండ్ మెన్స్వేర్కి యూత్లో మంచి డిమాండ్ ఉంది.
ఇక సామ్ గురించి చెప్పాలంటే.. ఫ్యాషన్ రంగంపై తనకున్న ఇంట్రెస్ట్తో 'సాకీ' అనే పేరుతో ఓ ఆన్లైన్ వస్త్ర వ్యాపారాన్ని స్టార్ట్ చేసింది సమంత. ఈ ఆన్ లైన్ స్టోర్ కోసం సొంతంగా ప్రమోషన్స్ చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతోంది.
తన బ్రాండ్ ప్రమోషన్స్ కోసం వ్యాపార ప్రకటనల్లో పాల్గొనడం సామ్, విజయ్లో ఉన్న కామన్ పాయింట్. వీటితో పాటు బడా వ్యాపార సంస్థల ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు.
కేవలం వ్యాపారం, డబ్బు సంపాదించడమే కాకుండా సామాజిక స్పృహతో సమాజ సేవలో కూడా పాల్గొంటున్నారు ఇద్దరు స్టార్స్. ఈ క్రమంలో దేవరకొండ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను రౌడి స్టార్ ప్రారంభించాడు. దీని ద్వారా నిరుద్యోగులకు జాబ్ స్కిల్స్, ఇంగ్లిష్ వంటి వాటిలో ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు.
అలాగే కోవిడ్ టైంలో విజయ్ ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేదవాళ్లకు నిత్యవసర సరకులను ఉచితంగా అందించి పెద్ద మనసు చాటుకున్నాడు.
ఇక లెడీ బాస్ సమంత ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సేవలందిస్తోంది. ఈ ఫౌండేషన్ తరఫున ప్రాణాపాయంలో ఉన్న మహిళలు, చిన్నారులను సామ్ ఆదుకుంటోంది.
అయితే వీరిద్దరు కలిసి ఓ కామన్ బ్రాండ్ ద్వారా తమ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్. ఇప్పటికే రౌడీ బ్రాండ్తో విజయ్, సాకీ బ్రాండ్తో సమంత సొంత వ్యాపారాలు చేస్తుండగా ఈ రెండింటిని కలపడం లేదా , మరొ కొత్త బ్రాండ్తో వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారట.
ఇక సినిమాల విషయానికొస్తే.. వీరిద్దరు జంటగా నటించిన ఖుషి మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఖుషి మూవీ పాటలు, ప్రచార కార్యక్రమాలు ప్రేక్షకుల్లో మంచి హైప్ను క్రియేట్ చేశాయి. వీరిద్దరి ఆన్స్క్రీన్ రోమాన్స్ అదిరిపోయింది. ఈ సినిమా విజయం ఇద్దరి స్టార్స్ కెరీర్కు కీలకం కానున్నాయి. వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న విజయ్- సమంతలు ఈ చిత్రం సక్సెస్పై గంపెడు ఆశలు పెట్టుకున్నారు.
ఆగస్టు 31 , 2023
![<strong>Kalki 2898 AD: విజయ్ దేవరకొండ, దుల్కర్ క్యామియో కన్ఫార్మ్ చేసిన నాగ్ అశ్విన్.. రోల్స్ ఏమిటంటే?</strong>](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/06/26201655/kjfsdljfsdkljf.jpg)
Kalki 2898 AD: విజయ్ దేవరకొండ, దుల్కర్ క్యామియో కన్ఫార్మ్ చేసిన నాగ్ అశ్విన్.. రోల్స్ ఏమిటంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఈ చిత్రం గురువారం (జూన్ 27) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, టీజర్ ఇప్పటికే విడుదలవ్వగా.. వాటికి విశేష ఆదరణ లభిస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్లతో పాటు కుర్ర హీరోలు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ సైతం నటిస్తున్నారని గత కొంత కాలంగా టాక్ వినిపిస్తోంది. అయితే ఇది నూటికి నూరు శాతం నిజమని తెలుస్తోంది. ఈ విషయాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ స్వయంగా వెల్లడించారు.
వీడియో వైరల్..!
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి చిత్రం.. రేపు (జూన్ 27) థియేటర్లలో గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్.. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ పేర్లను ప్రస్తావిస్తూ.. కల్కిలో భాగమైనందుకు ధన్యవాదాలు చెప్పారు. అటు ప్రభాస్ సైతం వారు సినిమాలో అతిథి పాత్రలు పోషించినందుకు థ్యాంక్స్ తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు. విజయ్ క్యామియోతో కల్కి థియేటర్లు బద్దలవుతాయని రౌడీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/AyyoEdits/status/1805955173459656978
విజయ్ పాత్ర అదేనా?
తాజాగా కల్కి రెండో ట్రైలర్ రిలీజ్ కాగా.. అందులో విజయ్ దేవరకొండను చూపకనే చూపించారంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ ట్రైలర్లో మహాభారత సంగ్రామం సీక్వెన్స్ను కొద్దిసేపు చూపించారు. ఇందులో అశ్వత్థామ పాత్ర పోషించిన అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అర్జునుడితో తలపడ్డారు. అయితే అర్జునుడి పాత్ర ముఖాన్ని స్పష్టంగా చూపించలేదు. దీంతో అది విజయ్ కావొచ్చని నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు దర్శకుడు నాగ్ అశ్విన్ స్వయంగా విజయ్ ఉన్నట్లు స్పష్టం చేయడంతో తమ హీరో అర్జునుడిగా కనిపించడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ ప్రశ్నకు జూన్ 27న క్లారిటీ వచ్చే అవకాశముంది.
https://twitter.com/TheDEVERA_fan/status/1804410479642841242
సీనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నారా?
కల్కి సినిమాకు సంబంధించి లేటెస్ట్ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా కనిపించనున్నారని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి వీఎఫ్ఎక్స్లో ఎన్టీఆర్ పాత్రను ఈ చిత్రంలో మేకర్స్ చూపించనున్నారని తెలుస్తోంది. శ్రీకృష్ణుడి పాత్రను ఎన్టీఆర్ చాలా సినిమాల్లో చేశారు. కృష్ణుడు అంటేనే తెలుగు వారికి ఆయనే గుర్తు వస్తారు. శ్రీకృష్ణుడి అవతారంలో ఎన్టీఆర్ ఉన్న విగ్రహాలు కూడా చాలా చోట్ల ఉన్నాయి. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కల్కి 2898 ఏడీ సినిమాలో ఎన్టీఆర్ ఉండాలని మేకర్స్ భావించినట్టు తెలుస్తోంది.
విశ్వామిత్రునిగా రాజమౌళి?
కల్కి చిత్రంలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (S.S. Rajamouli) కూడా ఓ కీలక పాత్ర పోషించినట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. అయితే ఆయన విశ్వామిత్రుని పాత్రలో కనిపిస్తారని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. సినిమాలోని కీలక సన్నివేశంలో రాజమౌళి పాత్ర తెరపైకి వస్తుందని అంటున్నారు. రెండు నుంచి మూడు నిమిషాల నిడివి లోపే రాజమౌళి పాత్ర ముగుస్తుందని సమాచారం. మరోవైపు డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ నుంచి కూడా ఓ క్యామియో ఉంటుందని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఆర్జీవీ పాత్ర చాలా సర్ప్రైజింగ్గా ఉంటుందని చెబుతున్నారు. కల్కి కోసం ఆర్జీవీ ఫస్ట్ టైమ్ యాక్టర్గా మారడం గమనార్హం.
జూన్ 26 , 2024
![<strong>Vijay Deverakonda: </strong><strong>విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్టు.. తండ్రిని గట్టిగా హగ్ చేసుకొని..! </strong>](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/06/19154719/page.jpg)
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్టు.. తండ్రిని గట్టిగా హగ్ చేసుకొని..!
టాలీవుడ్లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు 'విజయ్ దేవరకొండ' (Vijay Devarakonda). ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ రౌడీ బాయ్.. తనకంటూ ప్రత్యేకమైన స్టార్డమ్ను సృష్టించుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి’, ‘పెళ్లి చూపులు’, ‘గీతా గోవిందం’, ‘ట్యాక్సీవాలా’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలతో స్టార్ హీరోల సరసన నిలిచాడు. కాగా, ఇటీవల విజయ్.. తన ఫ్యామిలీతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లాడు. అక్కడ కుటుంబ సభ్యులతో దిగిన ఎమోషనల్ ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఎమోషనల్ పోస్టు
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.. తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవిలతో పాటు సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లాడు. విజయ్ తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి. గత కొంత కాలంగా వరుస షూటింగ్ షెడ్యూల్స్తో బిజీ బిజీగా గడుపుతోన్న విజయ్.. విరామం కోసం అమెరికాకు వెళ్లి కొద్ది రోజులు ఫ్యామిలీతో సరదాగా గడిపారు. తాజాగా ఇండియాకు వచ్చిన విజయ్.. అక్కడ తన ఫ్యామిలీతో దిగిన ఫొటోలను పంచుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన అమ్మనాన్న, సోదరుడితో కలిసి అమెరికా వెకేషన్ను.. విజయ్ ఎంత బాగా ఆస్వాదించారో ఈ ఫొటోల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా తండ్రి గోవర్ధన్రావును విజయ్ గట్టిగా హగ్ చేసుకున్న ఫొటో ఫ్యాన్స్ను విపరీతంగా ఆకర్షిస్తోంది.
https://www.instagram.com/p/C8W7M9Jys78/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
అసిస్టెంట్ డైరెక్టర్గా త్రివిక్రమ్ కుమారుడు!
విజయ్ దేవరకొండ తీసిన గత మూడు చిత్రాలు (లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్) బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచాయి. దీంతో విజయ్ తన తర్వాతి చిత్రంపై ఫోకస్ పెట్టాడు. ‘VD12’ ప్రొడక్షన్ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పెద్ద కుమారుడు రిషి.. ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతనిది హీరో ఫేస్ అని అభిమానులు అంటున్నా.. రిషి మాత్రం కెమెరా వెనుక నుంచి తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారట. ఇందుకు త్రివిక్రమ్ కూడా ఓకే చెప్పడంతో విజయ్ దేవరకొండ సినిమా ద్వారానే రిషి తన సినీ కెరీర్ను మెుదలుపెట్టినట్లు సమాచారం.
పోలీసు ఆఫీసర్గా విజయ్
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న VD12 చిత్రంలో విజయ్.. ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా కనిపిస్తారని సమాచారం. ఇందులో సీరియస్ పోలీసు ఆఫీసర్గా విజయ్ కనిపించనున్నాడట. హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree)ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా, ఈ సినిమాలో ప్రముఖ నటుడు సత్యదేవ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాలీవడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇటీవల అతడు నటించిన 'కృష్ణమ్మ' ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో సత్యదేవ్ కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారట.
సాయిపల్లవితో రొమాన్స్
రౌడీ భాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda).. దర్శకుడు రవికిరణ్ కోలా (Ravi Kiran Kola)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీకి దిల్ రాజు (Dil Raju) నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇది అందమైన, సరికొత్త ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా నటించనున్నట్లు కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. చిత్ర యూనిట్ సాయిపల్లవిని కలిశారని, ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు ఫిల్మ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది నిజమైతే విజయ్ - సాయి పల్లవి జోడీ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్గా నిలుస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.
జూన్ 19 , 2024
![Vijay Deverakonda - Sai Pallavi: విజయ్ దేవరకొండతో సాయిపల్లవి రొమాన్స్!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/06/06155129/123.-2024-06-06T154804.523.jpg)
Vijay Deverakonda - Sai Pallavi: విజయ్ దేవరకొండతో సాయిపల్లవి రొమాన్స్!
నేచురల్ బ్యూటీ సాయి పల్లవికి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఈ భామ సినిమాకు ఓకే చెప్పిందంటే అది కచ్చితంగా కంటెంట్ ఉన్న మూవీనే అయి ఉంటుందని అభిమానులు భావిస్తుంటారు. గ్లామర్ షోకు ఆమడ దూరం ఉండే సాయి పల్లవి.. తన నటన, మెస్మరైజింగ్ డ్యాన్స్తోనే కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగులో ఆమె నటించిన చిత్రాలు తక్కువే అయినా అవి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశాయి. అటువంటి సాయి పల్లవి.. రొమాంటిక్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ కాంబో త్వరలోనే సెట్స్పైకి వెళ్లనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.
క్రేజీ లవ్స్టోరీ..
రౌడీ భాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. దర్శకుడు రవికిరణ్ కోలా (Ravi Kiran Kola)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీకి దిల్ రాజు (Dil Raju) నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇది అందమైన, సరికొత్త ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హీరోయిన్గా సాయిపల్లవిని తీసుకుంటే బాగుంటుందని మేకర్స్ భావించారట. ఇప్పటికే చిత్ర యూనిట్ సాయిపల్లవిని కలిశారని, ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు ఫిల్మ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని అంటున్నారు. ఇది నిజమైతే విజయ్ - సాయి పల్లవి జోడీ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్గా నిలుస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.
లవ్ స్టోరీలకు కేరాఫ్
తమిళంలో వచ్చిన ‘ప్రేమమ్’ (Premam) చిత్రంతో కుర్రకారును ఎంతగానో ఆకట్టుకున్న సాయిపల్లవి (Sai Pallavi).. ఆ తర్వాత నుంచి ఆచితూచి సినిమాలు చేసింది. స్కిన్ షోకు పూర్తి వ్యతిరేకమైన ఈ భామ.. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. కంటెంట్ ఉన్న చిత్రాలనే ఎంపిక చేసుకుంది. ఈ క్రమంలో హృదయాలకు హత్తుకునే ప్రేమకథా చిత్రాల్లో ఆమె నటించింది. ‘ప్రేమమ్’ సహా ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’ వంటి చిత్రాలు ఈ అమ్మడికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆమెకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేశాయి. ఆ తర్వాత రానాతో చేసిన ‘విరాట పర్వం’ సినిమాలో చక్కటి నటన కనబరిచి సాయిపల్లవి నటిగా మరో మెట్టు పైకెక్కింది.
ఫుల్ స్వింగ్లో సాయిపల్లవి
ప్రస్తుతం సాయి పల్లవి.. సినిమాల పరంగా ఫుల్ స్వింగ్లో ఉంది. ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్య (Naga Chaitanya)తో కలిసి ‘తండేల్’ (Thandel) చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అటు తమిళంలో శివకార్తికేయన్ (Sivakarthikeyan)తో కలిసి ‘అమరన్’ (Amaran) అనే సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. వీటితో పాటు బాలీవుడ్లోనూ రెండు భారీ ప్రాజెక్టులకు సాయిపల్లవి ఓకే చెప్పింది. ఇందులో ప్రతిష్టాత్మంగా రూపొందుతున్న 'రామయణం' కూడా ఉంది. ఈ మూవీలో రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా మెుదలైంది.
పోలీసు ఆఫీసర్గా విజయ్
'ఫ్యామిలీ స్టార్' చిత్రం తర్వాత ప్రస్తుతం విజయ్.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. విజయ్ కెరీర్లో 12వ మూవీగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో ఇంతకు ముందు ఎన్నడూ చూడని సీరియస్ పోలీసు ఆఫీసర్గా విజయ్ కనిపించనున్నాడు. హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri)ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా, తాజాగా ఈ సినిమాలో ప్రముఖ నటుడు సత్యదేవ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇటీవల అతడు నటించిన 'కృష్ణమ్మ' ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో సత్యదేవ్ కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారట.
జూన్ 06 , 2024
![VD12 : హ్యాట్రిక్ ఫ్లాప్స్ నేపథ్యంలో విజయ్ దేవరకొండ డేరింగ్ డెసీషన్..? కెరీర్లోనే తొలిసారి!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/04/26121745/GL2vwv5aIAEoKC6-1.jpg)
VD12 : హ్యాట్రిక్ ఫ్లాప్స్ నేపథ్యంలో విజయ్ దేవరకొండ డేరింగ్ డెసీషన్..? కెరీర్లోనే తొలిసారి!
టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోల్లో ‘విజయ్ దేవరకొండ’ (Vijay Devarakonda) ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా అతడ్ని ఫ్యాన్స్ అభిమానిస్తుంటారు. అయితే గత కొంతకాలంగా సరైన హిట్ లేక విజయ్ ఇబ్బంది పడుతున్నాడు. విజయ్ గత మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. దీంతో రాబోయే చిత్రం విజయ్కు చాలా కీలకంగా మారింది. విజయ్ తన తర్వాతి చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయనున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి సెన్సేషనల్ అప్డేట్ బయటకొచ్చింది. అది విన్న విజయ్ ఫ్యాన్స్ తమ హీరో డేరింగ్ డెసిషన్కు ఆశ్చర్యపోతున్నారు.
డేరింగ్ డేసిషన్ ఏంటంటే?
విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri) కాంబోలో రానున్న 'VD12' చిత్రం.. యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. విజయ్ రీసెంట్ చిత్రాలు ‘లైగర్’, ‘ఖుషీ’, ‘ఫ్యామిలీ స్టార్’ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటంతో.. ప్రస్తుతం అతడి ఫోకస్ మెుత్తం ఈ సినిమా పైనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవాలని విజయ్ దృఢసంకల్పంతో ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ‘VD12’ సక్సెస్ కోసం ఎంతైన కష్టపడాలని అతడు నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం విజయ్.. ఈ సినిమా కోసం ఓ డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఈ సినిమాలో ఒక్క పాట లేకుండా నటించేందుకు అతడు సిద్ధపడ్డాడట.
సాంగ్స్ ఎందుకు వద్దంటే?
విజయ్ దేవరకొండ సినిమాలకు హిట్ ఆల్బమ్స్గా పేరుంది. అతడి ప్రతీ సినిమాలో కనీసం రెండు, మూడు సాంగ్స్ అయినా సూపర్ హిట్గా నిలుస్తుంటాయి. అటువంటిది ‘VD12’లో సాంగ్స్ వద్దని చిత్ర యూనిట్ భావిస్తుండటం అందరికీ షాకింగ్గా అనిపిస్తోంది. అయితే ఇందుకు ఓ బలమైన కారణం ఉన్నట్లు టాలీవుడ్లో వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో విజయ్ తొలిసారి పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ ప్రాజెక్టులో పాటలు పెడితే కథనం, మూవీ ఫ్లేవర్ దెబ్బతింటాయని డైరెక్టర్ గౌతమ్ భావిస్తున్నారట. దీంతో పాటలు లేకుండానే ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దామని విజయ్తో ఆయన అన్నాడట. ఇందుకు విజయ్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. కార్తీ నటించిన 'ఖైదీ' చిత్రం కూడా గతంలో ఒక్క పాట లేకుండానే వచ్చి.. సూపర్ హిట్గా నిలిచింది. ఇప్పుడు ఆ చిత్రాన్నే 'VD12' అనుసరించనుండటం గమనార్హం.
అనిరుధ్ పైనే భారం!
‘VD12’ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందించనున్నాడు. అనిరుధ్ పాటలు, నేపథ్య సంగీతానికి ఆడియన్స్లో మంచి క్రేజ్ ఉంది. ‘VD12’ను చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లడానికి అనిరుధ్ మ్యూజిక్ ఒక్కటి చాలని డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి భావిస్తున్నారట. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకే హైలైట్ అవుతుందని మూవీ టీమ్ నమ్ముతోంది. మరి ఈ ప్రయోగం విజయ్కి కలిసొస్తుందో లేదో చూడాలి. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.
హీరోయిన్గా కేరళ బ్యూటీ!
ప్రేమలు చిత్రంతో యువతరం హృదయాలను దోచుకున్న మలయాళీ బ్యూటీ 'మమితా బైజు' (Mamita Baiju).. 'VD12'లో హీరోయిన్గా నటించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ పాత్రకు శ్రీలీల (Sreeleela)ను ఎంపిక చేశారు. కొన్ని కారణాల రిత్యా ఆమె స్థానంలో మమితాను తీసుకోవాలని మేకర్స్ నిర్ణయించారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది. కాగా, ‘VD12’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుంది. విజయ్కు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళ్, కన్నడ భాషల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే మలయాళం సహా నార్త్ ప్రేక్షకులకు 'VD12' చిత్రాన్ని చేరువ చేసేందుకు మమితా బైజు క్రేజ్ ఉపయోగపడుతుందని మేకర్స్ భావిస్తున్నారు. అటు ఓవర్సీస్లోనూ ఈ అమ్మడికి ఫాలోయింగ్ ఉండటంతో సినిమాకు అదనపు ప్రయోజనం చేకూరనుంది.
ఏప్రిల్ 26 , 2024
![VD13: వరుసగా సమంత, శ్రీలీల, మృణాల్తో విజయ్ దేవరకొండ రొమాన్స్.. పెట్టి పుట్టాడు పో!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/06/14172223/FykP7G6WIAIaqH4.jpeg)
VD13: వరుసగా సమంత, శ్రీలీల, మృణాల్తో విజయ్ దేవరకొండ రొమాన్స్.. పెట్టి పుట్టాడు పో!
‘పెళ్లిచూపులు’ అంటూ పక్కింటి అబ్బాయిలా ప్రేక్షకులను పలకరించాడు విజయ్ దేవరకొండ. వెంటనే అర్జున్ రెడ్డితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాడు. రౌడీబాయ్ యాటిట్యూడ్కి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడిందంటేనే విజయ్ స్టార్డమ్ ఏ రేంజ్లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ అభిమాన గణాన్ని కాపాడుకుంటేనే పక్కాగా సినిమాలు చేస్తున్నాడు దేవరకొండ. లైగర్ బెడిసి కొట్టినా వరుస సినిమాలకు సైన్ చేసి కెరీర్ని పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడు.
సినిమాలో హీరోయిన్ ఎంపిక విషయంలో డైరెక్టర్, ప్రొడ్యూసర్లతో పాటు హీరోది కీలక పాత్ర. ఫలానా వారినే పెట్టుకుందామని హీరోలు సిఫార్సు చేస్తే డైరెక్టర్, ప్రొడ్యూసర్లు ఒకే చెప్పేస్తారు. అయితే, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మాత్రం ప్రత్యేక రూటు ఫాలో అవుతున్నాడు. తెలుగులో టాప్ హీరోయిన్లతోనే రొమాన్స్ చేస్తానని అంటున్నాడు. అందుకు తగ్గట్టుగానే అప్ కమింగ్ సినిమాల్లో హీరోయిన్లను ఎంపిక చేసుకుంటున్నాడీ హ్యాండ్సమ్ హీరో.
సమంత
మహానటి సినిమాలో పార్ట్ టైం హీరోగా నటించాడు విజయ్ దేవరకొండ. ఇందులో విజయ్కి తోడుగా సమంత నటించింది. కానీ, ఈ సినిమాలో వీరిద్దరి మధ్య రోమాన్స్కు స్కోప్ లేకుండా పోయింది.
ఖుషీ సినిమాతో మరోసారి సామ్, విజయ్ ఒక్కటయ్యారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. కశ్మీర్ నేపథ్యంలో సాగే లవ్స్టోరీగా డైరెక్టర్ శివ నిర్వాణ దీన్ని తీర్చిదిద్దాడు.
సినిమాలో నుంచి ‘నా రోజా నువ్వే’ సాంగ్ విడుదలై మంచి రెస్పాన్స్ని రాబడుతోంది. మరి, ఇందులో సమంతతో విజయ్ ఏ మేరకు రొమాన్స్ చేశాడో వేచి చూడాలి.
శ్రీలీల
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా శ్రీలీల బిజీబిజీగా ఉంది. జెర్సీ ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి సినిమాలో శ్రీలీలనే హీరోయిన్. ఈ ప్రాజెక్టు చిత్రీకరణ దశలో ఉంది.
ఇప్పటివరకు శ్రీలీల లిప్లాక్ సీన్లలో నటించలేదు. గౌతమ్ తిన్ననూరి తొలి సినిమాలో రొమాన్స్ని బాగా చూపించాడు. కథ వేరే అయినప్పటికీ ఈ సీన్స్ పెట్టి ఆడియెన్స్ని సాటిస్ఫై చేశాడు.
ముఖ్యంగా, విజయ్లోని రొమాంటిక్ యాంగిల్ని చాలా మంది ఇష్టపడతారు. దీంతో ఈ సినిమాలోనూ శ్రీలీల, విజయ్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది.
మృణాల్ ఠాకూర్
సీతారామం సినిమాలో అందాల భామ మృణాల్ ఠాకూర్ని డైరెక్టర్ హను చాలా పద్ధతిగా చూపించాడు. కానీ, మృణాల్ ఠాకూర్ తరచూ హాట్ ఫొటోలతో రెచ్చిపోతుంటుంది.
బికినీలు ధరించి సోషల్ మీడియాను హీటెక్కిస్తుంది. ఏ మాత్రం సంకోచించకుండా అందాల నిధిని బయటకు తెరుస్తుంది. ఇప్పుడు ఈ బ్యూటీ విజయ్ దేవరకొండతో జతకట్టింది.
గీతగోవిందం సినిమా ఫేమ్ డైరెక్టర్ పరషురామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గీతగోవిందం సినిమాకు సీక్వెల్గా ఇది రానుంది. మరి, అటు రౌడీబాయ్, ఇటు గ్లామర్ బ్యూటీ ఏ మేరకు రెచ్చిపోతారో? అని నెటిజన్లు గుసగుసలాడుతున్నారు.
వీరిద్దరి మధ్య రోమాన్స్ పండితే ఇక సినిమా బ్లాక్ బాస్టర్ అని కామెంట్ చేస్తున్నారు.
లవ్ స్టోరీగానే ఈ సీక్వెల్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రొమాంటిక్ సన్నివేశాలకు కొదవ ఉండకపోవచ్చని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. అలనాటి అర్జున్ రెడ్డి సినిమాను గుర్తు తెచ్చుకుంటున్నారు.
జూన్ 14 , 2023
![Heroes in Ads: మహేష్ బాబుతో విజయ్ దేవరకొండ పోటీ.. ఇక..Jr NTR, అల్లు అర్జున్ పరిస్థితి?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/06/13172524/Untitled-design-79.png)
Heroes in Ads: మహేష్ బాబుతో విజయ్ దేవరకొండ పోటీ.. ఇక..Jr NTR, అల్లు అర్జున్ పరిస్థితి?
ఒకప్పుడు యాడ్స్ అంటే బాలీవుడ్ నటులే గుర్తొచ్చేవారు. కానీ, ఇప్పుడలా లేదు. ఏ యాడ్ చూసినా టాలీవుడ్ హీరోలే. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ నుంచి లోకల్ ప్రొడక్టు వరకు ప్రతీ ప్రచారానికి తెలుగు హీరోలే కేరాఫ్గా నిలుస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలా చేస్తున్న ప్రకటనల సంఖ్య పెరిగిపోయింది. ఒక్కో హీరో ఏకంగా నాలుగైదు యాడ్స్ చేస్తుండటం డామినేషన్ని తెలియజేస్తోంది. సినిమాలతో పాటు యాడ్స్లలో బిజీబిజీగా గడుపుతున్న ఆ స్టార్స్ ఎవరో చూసేద్దామా.
అల్లు అర్జున్
పుష్ప సినిమా బన్నీని ఐకాన్ స్టార్గా మార్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పలు యాడ్లలో చేస్తున్నాడు. ఇటీవలే రెడ్ బస్ బ్రాండ్ అంబాసిడర్గా మారాడు. కేఎఫ్సి చికెన్ తరఫున ప్రచారం చేస్తున్నాడు. ఆస్ట్రాల్ స్ట్రాంగ్ పీవీసీ పైప్లకూ ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నాడు. కోకాకోలా కూల్డ్రింక్ యాడ్లోనూ నటించాడు. జొమాటో ఫుడ్ డెలివరీ యాప్కీ అల్లు అర్జునే బ్రాండ్ అంబాసిడర్. శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున కూడా బన్నీ ప్రచారం చేస్తున్నాడు. ఇలా సినిమాలతో పాటు ప్రకటనలతోనూ బన్నీ బాగానే కమాయిస్తున్నాడు. ఒక్కో ప్రకటనకి అల్లు అర్జున్ రూ.7 నుంచి రూ.10 కోట్లు తీసుకుంటాడని టాక్.
View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline)
విజయ్ దేవరకొండ
శ్యామ్ స్టీల్ ఇండియాతో విజయ్ చేతులు కలిపాడు. ఈ స్టీల్ గుణగణాలను తెలియజేస్తూ డిజైన్ చేసిన యాడ్లో విజయ్ నటించాడు. దీంతో పాటు జైవర్స్ ఫుట్వేర్ కంపెనీని కూడా ప్రమోట్ చేస్తున్నాడు. లక్స్ కాజి మెన్స్ ఇన్నర్వేర్ తరఫున ప్రచార కర్తగా ఉన్నాడు. థమ్స్ అప్(Thumbs Up) యాడ్లోనూ విజయ్ దేవరకొండ నటించాడు. సౌత్ ఇండియా, నార్త్ ఇండియాకు తంబ్స్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నందుకు విజయ్ ఏకంగా రూ.10 కోట్లు తీసుకున్నట్లు టాక్.
View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda)
మహేశ్ బాబు
తెలుగు రాష్ట్రాల్లో సూపర్ స్టార్గా గుర్తింపు పొందిన మహేశ్ బాబు.. యాడ్స్ ఎక్కువ చేస్తుంటాడు. ఇటీవల మౌంటెన్ డ్యూ అనే సాఫ్ట్డ్రింక్ కోసం బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశాడు. దీంతో పాటు మహేశ్ బాబు ఎవరెస్ట్ గ్రాండ్ మసాలా యాడ్లో నటించాడు. ఆంధ్రా హాస్పిటల్స్తోనూ మహేశ్ బాబు అసోసియేట్ అయ్యాడు. మౌంటెన్ డ్యూ యాడ్కి మహేశ్ బాబు ఏకంగా రూ.12 కోట్లు ఛార్జ్ చేసినట్లు టాక్.
View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh)
జూనియర్ ఎన్టీఆర్
ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో పలు కంపెనీలు ఎన్టీఆర్ కోసం క్యూ కట్టాయి. రీసెంట్గా జూనియర్ మెక్ డొనాల్డ్స్ కి ప్రచారకర్తగా వ్యవహరించాడు. 24 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో కోసం ఎన్టీఆర్ ఏకంగా రూ.8 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు చర్చ నడుస్తోంది. దీంతో పాటు ఎన్టీఆర్ లిషియస్ అనే ఫుడ్ డెలివరీ యాప్కి, ఆప్పీ ఫిజ్ కూల్డ్రింక్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు.
View this post on Instagram A post shared by Jr NTR (@jrntr)
రామ్చరణ్
రామ్చరణ్ పలు ప్రకటనల్లో నటించాడు. గతంలో సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ తరఫున ప్రచారం చేశాడు. ఇటీవల ఫ్రూటీ యాడ్లోనూ అలియా భట్తో కలిసి చెర్రీ నటించాడు. గతేడాది మీషో బ్రాండ్ తరఫున యాడ్లో తళుక్కున మెరిశాడు.
https://www.youtube.com/watch?v=PtNSXvlZVIM
జూన్ 13 , 2023
![Sai Pallavi: చిరంజీవి నుంచి విజయ్ దేవరకొండ వరకు సాయి పల్లవి వదులుకున్న సినిమాలు.. కారణం చెప్పిన హైబ్రిడ్ పిల్ల!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/05/09122316/9th-May-Sai-Pallavi-birthday-vertica-e1683615214893.jpg)
Sai Pallavi: చిరంజీవి నుంచి విజయ్ దేవరకొండ వరకు సాయి పల్లవి వదులుకున్న సినిమాలు.. కారణం చెప్పిన హైబ్రిడ్ పిల్ల!
టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరిగా సాయి పల్లవి గుర్తింపు సంపాదించింది. మలయాళం సినిమా ‘ప్రేమమ్’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన సాయిపల్లవి ఆ సినిమాతో ఎనలేని పేరును సంపాదించింది. ఫిదా చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన సాయి పల్లవి.. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ హృదయాలను గెలుచుకుంది. అద్భుతమైన నటన, మిస్మరైజింగ్ డ్యాన్స్తో అందరిని ఆకట్టుకుంది. అయితే హీరోయిన్కు ఒక హిట్టు వస్తే అవకాశాలు క్యూ కట్టడం కామన్గా మారిపోయాయి. అందుకు తగ్గట్లే ఈ తరం హీరోయిన్లు ఎడపెడా సినిమాలు చేస్తూ ఫ్లాపులు మూటగట్టుకుంటున్నారు. అయితే ఈ ధోరణికి సాయి పల్లవి దూరంగా ఉంది. ఎంత పెద్ద సినిమా ఆఫర్ వచ్చిన కథ నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. పాత్రలో గ్లామర్ డోస్ ఎక్కువైనా, నటనకు ప్రాధాన్యం తగ్గినా సాయి పల్లవి సున్నితంగా రిజెక్ట్ చేస్తుందని ఇండస్ట్రీలో టాక్. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ ఈ మలయాళీ భామ వదులుకున్న సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
1. భోళా శంకర్ (Bhola Shankar)
చిరంజీవి హీరోగా, మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భోళాశంకర్. ఇందులో చిరంజీవి సరసన తమన్న నటిస్తుండగా చెల్లెలిగా కీర్తి సురేష్ చేస్తోంది. అయితే కీర్తి సురేష్ పాత్రకు తొలుత సాయిపల్లవిని చిత్రం బృందం సంప్రదించింది. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఈవెంట్లో సాయిపల్లవే చెప్పింది. తానే ఆ రోల్ను రిజెక్ట్ చేశానని స్పష్టం చేసింది. రీమేక్ సినిమాలపై ఉన్న భయంతోనే ఆ పాత్రను వదులుకున్నట్లు తెలిపింది. కాగా, తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన వేదాలం సినిమాకు రీమేక్గా ‘భోళా శంకర్’ వస్తోంది.
2. లియో (Leo)
తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడు అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. కానీ సాయి పల్లవి మాత్రం విజయ్ సినిమాను సున్నితంగా తిరస్కరించింది. విజయ్ లేటెస్ట్ మూవీ ‘లియో’లో హీరోయిన్గా తొలుత సాయి పల్లవినే అనుకున్నారట. ఇందుకోసం చిత్ర యూనిట్ సాయి పల్లవిని కూడా సంప్రదించింది. అయితే ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత త్రిషను సంప్రదించగా అందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
3. ఛత్రపతి (Chatrapathi)
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి సినిమాతో హిందీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తెలుగులో సూపర్ హిట్గా నిలిచిన రాజమౌళి ‘ఛత్రపతి’కి రీమేక్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ పాత్ర కోసం కూడా సాయిపల్లవినే సంప్రదించారని అప్పట్లో టాక్ వినిపించింది. గ్లామర్ షో ఎక్కువగా చేయాల్సి ఉండటంతో సాయి పల్లని ఈ ఆఫర్ రిజెక్ట్ చేశారని సమాచారం. దీంతో ఆ పాత్రకు బాలీవుడ్ నటి నుస్రత్ భరుచ్చాను ఎంపికచేశారు. కాగా, ఈ సినిమా మే 12 రిలీజ్ కానుంది.
4. వారసుడు (Varasudu)
విజయ్ రీసెంట్ మూవీ వారసుడు / వారిసు సినిమాను కూడా సాయి పల్లవి రిజెక్ట్ చేసిందట. ఇందులో కూడా హీరోయిన్ పాత్రకు ప్రియారిటీ లేకపోవడంతో సున్నితంగా నో చెప్పిందని సమాచారం. దీంతో సాయిపల్లవి చేయాల్సిన పాత్రకు రష్మిక మందన్నను ఎంపిక చేశారు.
5. సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru)
మహేష్ బాబు, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో హీరోయిన్ పాత్రను సైతం సాయిపల్లవినే చేయాల్సి ఉండగా ఆమె రిజెక్ట్ చేసింది. దీంతో ఆ అవకాశం మళ్లీ రష్మికకే దక్కింది. హీరోయిన్ పాత్రకు యాక్టింగ్ స్కోప్ ఎక్కువగా లేకపోవడంతోనే ఈ భామ తిరస్కరించినట్లు తెలుస్తోంది.
6. డియర్ కామ్రేడ్ (Dear Comrade)
విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘డియర్ కామ్రేడ్’. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం దారుణంగా ఫెయిల్ అయింది. అయితే ఈ సినిమా హీరోయిన్ ఆఫర్ కూడా ముందుగా సాయిపల్లవికే వెళ్లింది. అయితే ముద్దు సన్నివేశాలు, గ్లామర్ షో ఉన్న పాత్ర కావడంతో ఈ భామ తిరస్కరించినట్లు అప్పట్లో వార్తల్లో వచ్చాయి. తొలి నుంచి కిస్సింగ్ సీన్లకు దూరంగా ఉండే సాయిపల్లవి.. ఇందులో హీరోయిన్, హీరోయిన్ల ఘాటు రొమాన్స్ ఉండటంతో నో చెప్పింది.
7. చెలియా (Cheliya)
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంతో కనీసం ఒక సినిమాలోనైనా వర్క్ చేయాలని హీరో, హీరోయిన్లు కలకలలు కంటారు. ఒక చిన్న పాత్ర దొరికినా చాలు అని సంబరపడుతుంటారు. కానీ సాయిపల్లవి మాత్రం ఏకంగా హీరోయిన్ ఆఫర్నే తిరస్కరించింది. కార్తిక్ హీరోగా తెరకెక్కిన చెలియా సినిమా కోసం తొలుత సాయిపల్లవినే మూవీ యూనిట్ సంప్రదించింది. అయితే సినిమా కథతో సంతృప్తి చెందని ఈ భామ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించింది. దీంతో సాయిపల్లవి ప్లేసులో అదితిరావు హైదరినీ తీసుకున్నారు.
మే 09 , 2023