• TFIDB EN
  • గేమ్ ఛేంజర్
    రేటింగ్ లేదు
    UATelugu
    'ఆర్‌ఆర్‌ఆర్‌' వంటి గ్లోబల్‌ స్థాయి సక్సెస్‌ తర్వాత రామ్‌చరణ్‌ చేస్తున్న చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌'. స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘ఒక నిజాయతీపరుడైన ఐఏఎస్ అధికారి రాజకీయ అవినీతిపై ఎలా పోరాడాడు’ అన్నది ఈ సినిమా కథ. గేమ్ ఛేంజర్ (RC15) చిత్రీకరణ కోసం రూ.450 కోట్ల బడ్జెట్ కేటాయించారు. గేమ్ ఛేంజర్ చిత్రం జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్ సూన్‌ ఆన్‌Prime| తేదీని ప్రకటించాలి
    2024 Mar 289 months ago
    గేమ్‌ ఛేంజర్ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలో దీనిపై అధికార ప్రకటన రానుంది.
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    రామ్ చరణ్
    రామ్ నందన్ IAS
    కియారా అద్వానీ
    అంజలి
    S. J. సూర్య
    జయరామ్
    సునీల్
    శ్రీకాంత్
    సముద్రకని
    నాసర్
    శుభలేఖ సుధాకర్
    నవీన్ చంద్రన్
    రాజీవ్ కనకాల
    వైభవ్ రెడ్డి
    సిబ్బంది
    ఎస్. శంకర్
    దర్శకుడు
    దిల్ రాజు
    నిర్మాత
    తమన్ ఎస్
    సంగీతకారుడు
    కార్తీక్ సుబ్బరాజ్
    కథ
    తిర్రు
    సినిమాటోగ్రాఫర్
    షమీర్ మహమ్మద్
    ఎడిటర్ర్
    కథనాలు
    Dhop Song Promo: ‘గేమ్ ఛేంజర్’ నుంచి ‘దోప్’ సాంగ్ ప్రోమో రిలీజ్, సూపర్బ్ రెస్పాన్స్
    Dhop Song Promo: ‘గేమ్ ఛేంజర్’ నుంచి ‘దోప్’ సాంగ్ ప్రోమో రిలీజ్, సూపర్బ్ రెస్పాన్స్
    రామ్ చరణ్(Ram Charan) ప్రధాన పాత్రలో, శంకర్(Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10, 2025న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘దోప్’ సాంగ్ ప్రోమో విడుదల చేయగా, ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ‘దోప్’ సాంగ్ విశేషాలు సినిమా టీమ్ ‘దోప్’ సాంగ్ ప్రోమోను విడుదల చేయడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. ఫుల్ సాంగ్‌ను డిసెంబర్ 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పాటలో రామ్ చరణ్, కియారా అద్వానీ డ్యాన్స్ ఆకట్టుకునేలా ఉంది. పాజిటివ్ ఎనర్జీతో కూడిన ఈ సాంగ్, ఆడియన్స్‌ను కట్టిపడేయనుంది. మైక్రో మంత్ర అంటూ సాంగ్ లిరిక్స్ వినసొంపుగా ఉన్నాయి.  కియరా, రామ్‌ చరణ్ కెమిస్ట్రీ కనుల విందుగా ఉంది. మెకోవర్ అట్రాక్టివ్‌గా పదే పదే చూడాలనిపించే విధంగా ఉంది. https://twitter.com/SivaHarsha_23/status/1869361110325018735 కాగా.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ‘జరగండి’, ‘నానా హైరానా’, ‘రా మచా మచా’ సూపర్ హిట్ కావడంతో, ఇప్పుడు కొత్తగా విడుదలైన ‘దోప్’ సాంగ్ ప్రోమోపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. https://twitter.com/BheeshmaTalks/status/1869298339730386976 రామ్ చరణ్ డ్యూయల్ రోల్ ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నట్లు టీజర్ ద్వారా తెలిసింది. ఒక పాత్ర పీరియాడిక్ టైమ్‌ లైన్‌కు చెందినదైతే, మరో పాత్ర (DHOP Song Promo)ప్రస్తుత కాలానికి సంబంధించినది. తండ్రి, కొడుకులుగా రామ్ చరణ్ కనిపించనున్నట్లు బిగ్‌బాస్ సీజన్ 8 ఫినాలేలో ఆయన స్వయంగా వెల్లడించారు. సంక్రాంతి బరిలో ‘గేమ్ ఛేంజర్’ ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి సందర్భంగా విడుదల అవుతున్న మొదటి సినిమా కావడంతో మరింత ఆసక్తి పెరిగింది. జనవరి 12న నందమూరి బాలకృష్ణ ‘డాకూ మహరాజ్’(Daku Maharaj), జనవరి 14న విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’, జనవరి 10న అజిత్ నటించిన డబ్బింగ్ చిత్రం ‘విడాముయర్చి’ విడుదల కానున్నాయి. టీజర్‌కు మంచి స్పందన ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. టీజర్ చూస్తుంటే ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయి అవుతుందనిపిస్తోంది. ఎస్ఎస్ థమన్ అందించిన సంగీతం, శంకర్ వినూత్న దర్శకత్వం, రామ్ చరణ్ నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. రామ్ చరణ్, కియారా అద్వానీ జోడీ, శంకర్ దర్శకత్వ ప్రతిభ, థమన్ సంగీతం ఈ చిత్రానికి పెద్ద ప్లస్ అవుతాయి. ‘దోప్’ సాంగ్ ప్రోమో ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉండగా, ఫుల్ సాంగ్ విడుదలకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
    డిసెంబర్ 18 , 2024
    <strong>Game Changer: గేమ్‌ ఛేంజర్‌లో పుల్ సాంగ్స్ లేవు … షాకింగ్ న్యూస్ చెప్పిన ఎడిటర్</strong>
    Game Changer: గేమ్‌ ఛేంజర్‌లో పుల్ సాంగ్స్ లేవు … షాకింగ్ న్యూస్ చెప్పిన ఎడిటర్
    గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ చిత్రంపై టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా అభిమానులు పెద్ద ఎత్తున అంచనాలు పెంచుకున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్లు, పోస్టర్లు, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌ ఈ సినిమాపై హైప్‌ను మరింతగా పెంచాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.అవేంటో ఇప్పుడు చూద్దాం. సెన్సార్ పూర్తి సినిమా విడుదలకు కేవలం పది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, చిత్ర యూనిట్ ప్రమోషన్లను మరింత వేగవంతం చేసింది. తాజా సమాచారం ప్రకారం, సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్‌ను జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిడివి 2 గంటల 45 నిమిషాలు ఉంటుందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రామ్ చరణ్ డ్యుయల్ రోల్ ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. ఒక వైపు ఐఏఎస్ అధికారి పాత్రలో గౌరవంగా కనిపిస్తాడు. మరోవైపు, ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే పాత్రలో పూర్తి మాస్ లుక్‌లో అభిమానులను ఆకట్టుకోనున్నాడు. రామ్ చరణ్ ఈ రెండు పాత్రలకు సంబంధించిన షేడ్స్‌ను ప్రేక్షకులు తెగ ఆరాధిస్తారని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది. అంజలి కీలకం ఈ సినిమాలో మరో ప్రధాన ఆకర్షణ నటి అంజలి పాత్ర. ఈ పాత్ర సినిమాకు అసలైన మలుపు తీసుకురాబోతుందని పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. దర్శకుడు శంకర్ అంజలి పాత్రను అద్భుతంగా డిజైన్ చేశారని, ఈ పాత్ర ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేస్తుందని చెబుతున్నారు. భారీ తారాగణం కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్.జె.సూర్య ప్రతినాయకుడి పాత్రలో, శ్రీకాంత్, అంజలి ఇతర కీలక పాత్రలతో భారీ తారాగణం కనిపించనుంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ట్రైలర్, పాటలుపై ఆసక్తికర సమాచారం ఈ చిత్రం ట్రైలర్‌ను న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే, సోషల్ మీడియాలో జరిగిన చిట్‌చాట్‌లో ఎడిటర్ రూబెన్స్ ఈ చిత్రంపై ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. సినిమా థియేట్రికల్ కట్‌లో పూర్తి పాటలు లేకపోవచ్చని, వాటిని సినిమా విడుదలైన తర్వాత యూట్యూబ్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో మెగా ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. https://www.youtube.com/watch?v=EqDlrimnMCE&amp;pp=ygURZ2FtZSBjaGFuZ2VyIHNvbmc%3D ప్రొడక్షన్ హైలైట్స్ ‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. శంకర్ తనదైన శైలీలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో మరొక మైలురాయిగా నిలుస్తుందని చిత్ర బృందం విశ్వాసంగా ఉంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో అభిమానుల్లో ఆత్రుత నెలకొంది. ‘గేమ్ ఛేంజర్’ కథను, కథనాన్ని, ముఖ్యంగా పాత్రల విశిష్టతను తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.
    డిసెంబర్ 31 , 2024
    Ram Charan: ‘గేమ్‌ ఛేంజర్‌’ సెట్‌ నుంచి రామ్‌చరణ్‌ ఫొటోస్‌ లీక్‌.. వైజాగ్‌లో చెర్రీ క్రేజ్‌ మామూల్గా లేదుగా !
    Ram Charan: ‘గేమ్‌ ఛేంజర్‌’ సెట్‌ నుంచి రామ్‌చరణ్‌ ఫొటోస్‌ లీక్‌.. వైజాగ్‌లో చెర్రీ క్రేజ్‌ మామూల్గా లేదుగా !
    మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ (Ram Charan).. టాప్‌ గేర్‌లో దూసుకెళ్లున్నాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత ఆయన క్రేజ్‌ గ్లోబల్‌ స్థాయికి చేరింది. ప్రస్తుతం చరణ్‌.. గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ’ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్‌చరణ్‌ చేస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ఇప్పటినుంచే అంచనాలు మెుదలయ్యాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. తాజాగా సెట్‌లో రామ్‌చరణ్‌ లుక్స్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వైజాగ్‌లో షూటింగ్‌ 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా చివరి దశ షూటింగ్‌ను మేకర్స్‌ వైజాగ్‌లో ప్లాన్ చేశారు. ఈ మూవీలోని పొలిటికల్ మీటింగ్‌కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను ఆర్‌కే బీచ్‌లో షూట్ చేస్తున్నారు. ఓపెన్ సెట్‌లో రామ్ చరణ్, ఎస్‌.జే సూర్య తదితరుల ముఖ్య తారాగణంతో శంకర్ ఈ షెడ్యూల్‌ని చిత్రీకరిస్తున్నారు. మార్చి 19 వరకు ఈ షెడ్యూల్ జరగనుంది. బహిరంగ షూటింగ్ కావడంతో సెట్స్‌లోని చరణ్ ఫోటోలు, వీడియోలు బయటకి వచ్చాయి. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో రామ్ చరణ్.. చాలా స్టైలిష్‌గా జెంటిల్‌మెన్ లుక్‌లో కనిపించాడు. ఈ లుక్ ఐఏఎస్ పాత్రకి సంబంధించినదని సమాచారం. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలపై మీరూ ఓ లుక్కేయండి.&nbsp; https://twitter.com/i/status/1768563620739453357 https://twitter.com/n_suren/status/1768531852414079277 https://twitter.com/i/status/1767734419715133518 https://twitter.com/venkysayzzz/status/1768539657896087692 చరణ్‌కు ఘన స్వాగతం వైజాగ్‌ షూటింగ్‌ నేపథ్యంలో.. నిన్ననే రామ్‌చరణ్‌, తమిళ నటుడు ఎస్‌.జే సూర్యతో పాటు ప్రధాన తారాగణం అంతా వైజాగ్‌ చేరుకుంది. వైజాగ్‌ ఎయిర్‌పోర్టుకు రామ్‌చరణ్‌ వస్తున్నట్లు ముందే తెలుసుకున్న ఆయన అభిమానులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి వెళ్లారు. చరణ్‌ ఎయిర్‌పోర్టులో దిగగానే కేరింతలు కొట్టారు. చరణ్‌ నినాదాలతో ఎయిర్‌పోర్టును మార్మోగించారు. తమ అభిమాన హీరోపై పూల వర్షం కురిపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.&nbsp; https://twitter.com/i/status/1768308149847753158 https://twitter.com/i/status/1768557163746656272 https://twitter.com/i/status/1768447264660296074 చరణ్‌ బర్త్‌డే రోజున స్పెషల్‌ సాంగ్‌ రామ్‍చరణ్ పుట్టిన రోజు సందర్భంగా.. మార్చి 27వ తేదీన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం నుంచి తొలి పాట రానుంది. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (SS Thaman) ఇటీవలే ఓ టీవీ కార్యక్రమంలో వెల్లడించారు. ‘జరగండి.. జరగండి’ పాటని ఆ రోజున విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. గతేడాది దీపావళికి ఈ పాటను తీసుకొస్తామని ప్రకటించి మూవీ టీమ్ వాయిదా వేసింది. ఇప్పుడు చెర్రీ పుట్టిన రోజున ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ నిర్ణయించినట్లు సమాచారం. ఈ పాటతోనే ‘గేమ్ ఛేంజర్’ సినిమా రిలీజ్ డేట్ కూడా వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.&nbsp; ‘RC 16’ చిత్రానికి ముహోర్తం ఫిక్స్‌! ‘గేమ్‌ ఛేంజర్’ సినిమా తర్వాత రామ్‌ చరణ్‌.. ఉప్పెన ఫేమ్‌ బుచ్చిబాబు (Buchi Babu) దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయనున్నారు. ‘RC16’ ప్రొడక్షన్‌ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. మార్చి 20వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగనున్నాయని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ఆ కార్యక్రమంతో ఈ సినిమా షురూ అవుతుందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది.&nbsp; మూవీ టైటిల్ అదేనా! రామ్‍చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కనున్న చిత్రానికి ‘పెద్ది’ (Peddi) అనే టైటిల్‍ను కూడా ఖరారు చేసినట్టు సినీ సర్కిల్‍లో టాక్ వినిపిస్తోంది. దీనిపై పూజా కార్యక్రమం రోజున అధికారిక ప్రకటన రావొచ్చని అంటున్నారు. ఉత్తరాంధ్ర సైడ్ ‘పెద్ది’ అంటే పెద్ద అని అర్ధం. ఇప్పటికీ చాలామంది ముసలివారిని, పెద్దవారిని ‘మా పెద్ది’ అని బంధువులు, కుటుంబ సభ్యులు పిలుస్తూ ఉంటారు. కథ కూడా టైటిల్‌కు మ్యాచ్‌ అయ్యేలా ఉండటంతో ఆ పేరునే సినిమాకు ఫిక్స్‌ చేసినట్లు టాక్ నడుస్తోంది. అయితే ఈ టైటిల్‌ను ఎన్టీఆర్‌ కోసం బుచ్చిబాబు అనుకున్నారని గతంలో రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు ఆ టైటిల్‌నే రామ్‌చరణ్‌కు తీసుకున్నట్లు వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది.&nbsp;
    మార్చి 16 , 2024
    Game Changer: ఎట్టకేలకు ‘గేమ్‌ ఛేంజర్‌’ టికెట్‌ ధరలు పెంచిన తెలంగాణ సర్కార్, ఎంతంటే?
    Game Changer: ఎట్టకేలకు ‘గేమ్‌ ఛేంజర్‌’ టికెట్‌ ధరలు పెంచిన తెలంగాణ సర్కార్, ఎంతంటే?
    మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా, శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. ఈ చిత్రంపై అభిమానుల్లో విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్‌ ధరల పెంపుపై నీలి నీడలు కమ్మాయి. అయితే తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ దిల్‌ రాజు అభ్యర్థన మేరకు  టికెట్‌ ధరలను తెలంగాణ ప్రభుత్వం పెంచింది. కాగా ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సైతం గేమ్ ఛేంజర్ టికెట్‌ ధరల పెంపుతో పాటు ఈ సినిమా ప్రదర్శనకు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. తెలంగాణలో టికెట్‌ ధరల పెంపు తెలంగాణలో సినిమా టికెట్‌ ధరలను పెంచుకునే అవకాశాన్ని చిత్ర బృందం కోరగా, ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 11న ఉదయం 4 గంటల నుంచి ఆరు షోలకు ప్రదర్శనకు అనుమతి ఇచ్చారు. సింగిల్‌ స్క్రీన్‌లలో టికెట్‌ ధరను అదనంగా రూ.100 పెంచుకునే వీలును కల్పించారు.మల్టీ ప్లెక్స్‌ థియేటర్లలో రూ.150 అదనంగా వసూలు చేసేందుకు అనుమతించారు.జనవరి 11 నుంచి 19 వరకు, రోజుకు ఐదు షోలకు అనుమతి ఇచ్చింది.సింగిల్‌ స్క్రీన్‌లలో అదనంగా రూ.50,మల్టీ ప్లెక్స్‌లలో రూ.100 పెంచుకునే వెసులుబాటు కల్పించారు. అయితే, విడుదల రోజున జనవరి 10 అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్‌ షోకు అనుమతి ఇచ్చే సూచనను ప్రభుత్వం తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్‌ ధరలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రానికి టికెట్‌ ధరల పెంపునకు, బెనిఫిట్‌ షోలకు ముందుగానే అనుమతిని ఇచ్చింది. జనవరి 10న అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్‌ షో ప్రదర్శనకు అనుమతి ఇచ్చారు.ఈ బెనిఫిట్‌ షో టికెట్‌ ధరను రూ.600 (పన్నులతో కలిపి)గా నిర్ణయించారు.అదే విధంగా, ఆరు షోలకు జనవరి 10న ప్రత్యేక అనుమతి ఇచ్చారు.జనవరి 11 నుంచి 23 వరకు ఐదు షోలకు అనుమతి ఇచ్చి,సింగిల్‌ స్క్రీన్‌లలో అదనంగా రూ.135 (జీఎస్టీతో కలిపి),మల్టీ ప్లెక్స్‌లలో అదనంగా రూ.175 (జీఎస్టీతో కలిపి) వరకు టికెట్‌ ధర పెంచుకునే వెసులుబాటును కల్పించారు. ఫ్యాన్స్‌లో సంబరాలు తెలంగాణ &amp; ఏపీ ప్రభుత్వాల నిర్ణయాలతో రామ్‌ చరణ్‌ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. మెగా ఫ్యాన్స్ కోసం భారీ స్థాయిలో ప్రదర్శనలు ప్లాన్‌ చేస్తూ, ఈ సినిమా టికెట్‌ ధరలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. రెండు రాష్ట్రాల్లోనూ టికెట్‌ ధరల పెంపుకు అనుమతి ఇవ్వడం వల్ల మొదటి రోజున సినిమా భారీ కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. ‘గేమ్‌ ఛేంజర్‌’ విడుదల కోసం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, టికెట్‌ ధరల పెంపు, అనుమతులు ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.
    జనవరి 09 , 2025
    <strong>Game Changer: మూడు హిట్‌ సినిమాల బడ్జెట్‌తో ‘గేమ్‌ ఛేంజర్‌’ మెలోడీ సాంగ్‌.. ఇదెక్కడి అరాచకం!&nbsp;</strong>
    Game Changer: మూడు హిట్‌ సినిమాల బడ్జెట్‌తో ‘గేమ్‌ ఛేంజర్‌’ మెలోడీ సాంగ్‌.. ఇదెక్కడి అరాచకం!&nbsp;
    స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్‌ కానుంది. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) నటించింది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల రెండు పాటలను విడుదల చేయగా వాటికి విశేష స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే మూడో సాంగ్‌ను కూడా రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పాటకు సంబంధించి ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఈ మెలోడీ సాంగ్‌ కోసం చేసిన ఖర్చు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.  ఒక్క పాటకు రూ.20 కోట్లు! 'గేమ్‌ ఛేంజర్‌' నుంచి వచ్చిన మెుదటి రెండు పాటలు ‘జరగండి.. జరగండి..’, ‘రా మచ్చా మచ్చా’ పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ముఖ్యంగా ‘రా మచ్చా మచ్చా’ సాంగ్‌ యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్‌ రాబట్టి నేషనల్‌ వైడ్‌గా ట్రెండింగ్‌ అయ్యింది. అయితే త్వరలో థర్డ్‌ సింగిల్‌ను తీసుకొచ్చేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్‌ చివర్లో లేదా నవంబర్‌ ఫస్ట్‌ వీక్‌లో ఈ సాంగ్‌ రిలీజ్‌ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. తొలి రెండు పాటలు మంచి బీట్‌తో వచ్చి దుమ్మురేపగా థర్డ్‌ సింగిల్‌ మాత్రం మెలోడిగా రానుంది. ఇక లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ఈ మూడో పాటకు రూ.20 కోట్ల పైనే ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని మేకర్స్‌ ధ్రువీకరించాల్సి ఉంది. మూడు హిట్‌ చిత్రాల బడ్జెట్‌! ఇటీవల తెలుగులో రిలీజైన ‘ఆయ్‌’ (Aay), ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu), ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2) చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. ప్రేక్షకులను ఫుల్‌గా ఎంటర్‌టైన్‌ చేసి ప్రశంసలు పొందాయి. అయితే ఈ మూడు సినిమాలు తక్కువ బడ్జెట్‌తో వచ్చి మంచి వసూళ్లు సాధించాయి. ఈ మూడు చిత్రాలు బడ్జెట్‌ కలిపితే దాదాపు రూ.20 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. అయితే గేమ్‌ ఛేంజర్‌లో ఒక్క సాంగ్‌ కోసమే రూ.20 కోట్లు ఖర్చు చేశారని రూమర్లు రావడం చర్చకు తావిస్తోంది. ఇటీవల వచ్చిన సెకండ్ సింగిల్‌ ‘రా మచ్చా మచ్చా’ పాటకు కూడా దాదాపు రూ.6-10 కోట్లు ఖర్చు అయినట్లు కథనాలు వచ్చాయి. ఆ పాటలో వందల సంఖ్యలో డ్యాన్సర్లు పాల్గొని వివిధ కాస్ట్యూమ్స్‌లో స్టెప్పులు వేశారు. ఇలా సాంగ్‌లకే భారీ మెుత్తం ఖర్చు చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  శంకర్‌ మారాల్సిన అవసరం ఉందా? తమిళ స్టార్ డైరెక్టర్‌ శంకర్‌ సినిమా అంటే అందులోని పాటలు సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. ‘భారతీయుడు’, ‘జీన్స్‌’, ‘ఒకే ఒక్కడు’, ‘అపరిచితుడు’, ‘శివాజీ’, ‘రోబో’, ‘స్నేహితుడు’, ‘రోబో 2.0’ ఇలా ఏ సినిమా తీసుకున్న అందులోని పాటలు చాలా రిచ్‌గా ఉంటాయి. విదేశాల్లోని బ్యూటీఫుల్‌ లోకేషన్స్‌లో పాటలను చిత్రీకరించడం ద్వారా ఆడియన్స్‌లో కొత్త అనుభూతిని కలిగించేందుకు శంకర్ ప్రయత్నిస్తుంటారు. అయితే గతంలో వరుస హిట్స్‌తో శంకర్ ఫుల్‌ ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి ఈ పాటల గురించి పెద్దగా చర్చ జరగలేదు. అయితే గత కొంతకాలంగా డైరెక్టర్ శంకర్‌కు అసలు కలిసిరావడం లేదు. ఆయన తీసిన చివరి నాలుగు చిత్రాలు ఫ్లాప్‌ అయ్యాయి. నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి. ఇలాంటి సమయంలో పాటల కోసం రూ. కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుండటాన్ని సినీ ఆడియన్స్ తప్పుబడుతున్నారు. ప్రస్తుతం కాలంలో పాటలకు ఏ దర్శక నిర్మాతలు అంత మెుత్తంలో ఖర్చు చేయడం లేదని గుర్తు చేస్తున్నారు. శంకర్‌ తన తీరు మార్చుకోకుంటే అతనితో వర్క్‌ చేయడానికి నిర్మాతలు వెనకడుగు వేసే పరిస్థితులు తలెత్తవచ్చని అభిప్రాయపడుతున్నారు.  రికార్డు ధరకు ఓటీటీ హక్కులు! గేమ్‌ ఛేంజర్‌ ఓటీటీ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ రూ.110 కోట్లకు గేమ్‌ ఛేంజర్‌ స్ట్రీమింగ్‌ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. కేవ‌లం సౌత్ లాంగ్వేజెస్ డిజిట‌ల్ రైట్స్ కోస‌మే అమెజాన్‌ ఇంత మెుత్తాన్ని ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. హిందీ డిజిట‌ల్ రైట్స్‌ను మ‌రో ఓటీటీ సంస్థ‌కు అమ్మేందుకు మేక‌ర్స్ ప్ర‌య‌త్నాలు చేస్తోన్న‌ట్లు తెలిసింది. మొత్తంగా ఓటీటీ ద్వారానే మేక‌ర్స్‌ రూ.150 కోట్ల మేర సొమ్ము చేసుకునే పరిస్థితులు ఉన్నాయని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 'గేమ్‌ ఛేంజర్‌' రిలీజ్‌కు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ అంత పెద్ద మెుత్తంలో ఓటీటీ హక్కులు అమ్ముడుపోవడం మాములు విషయం కాదని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తండేల్‌ vs గేమ్‌ ఛేంజర్‌ గేమ్‌ ఛేంజర్‌ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరోవైపు నాగచైతన్య హీరోగా చేస్తున్న తండేల్‌ సైతం సంక్రాంతికి రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్‌ సంక్రాంతి హిస్టరీలో ఇప్పటికే పలుమార్లు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున తలపడ్డారు. అయితే ఈ సంక్రాంతికి వాళ్ల వారసులు తలపడనున్నట్లు బజ్‌ వినిపిస్తుండటం ఆసక్తి రేపుతోంది. RRR సక్సెస్‌తో రామ్‌చరణ్‌ గ్లోబల్‌ స్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్నాడు. దాన్ని గేమ్‌ ఛేంజర్‌ ద్వారా మరింత పదిలం చేసుకోవాలని చరణ్‌ చూస్తున్నాడు. మరోవైపు లవ్‌స్టోరీ తర్వా చైతూకి సరైన హిట్‌ లభించలేదు. దీంతో ఎలాగైనా తండేల్‌తో హిట్‌ కొట్టి హిట్‌ ట్రాక్‌లోకి రావాలని నాగచైతన్య పట్టుదలతో ఉన్నాడు. చరణ్‌ వర్సెస్‌ చైతూ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
    అక్టోబర్ 18 , 2024
    <strong>Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’కు బిగ్‌ షాక్‌.. రిలీజ్‌ కష్టమేనా!</strong>
    Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’కు బిగ్‌ షాక్‌.. రిలీజ్‌ కష్టమేనా!
    గ్లోబల్‌ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) లేటెస్ట్ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)పై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరెకెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్‌ కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రం బృందం వరుసగా ప్రమోషన్స్‌ నిర్వహిస్తూ సినిమాలపై అంచనాలు పెంచేస్తోంది. రిలీజ్‌కు సరిగ్గా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండగా.. ఈ క్రమంలో ఆ మూవీకి బిగ్‌ షాక్ తగలిదింది. ఈ సినిమాను తమిళంలో విడుదల చేయడానికి వీల్లేదంటూ అక్కడి నిర్మాతల మండలికి ఫిర్యాదు అందింది.  ఫిర్యాదు ఎందుకంటే.. కోలీవుడ్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) 'గేమ్ ఛేంజర్' సినిమా విడుదలను ఆపాలని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తమిళనాడు నిర్మాత మండలికి విజ్ఞప్తి చేసింది. దర్శకుడు శంకర్‌ చేతిలోని 'ఇండియన్‌ 3' సినిమాను లైకా ప్రొడక్షన్ నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ మూవీ షూటింగ్‌ పూర్తి చేసి రిలీజ్‌ చేసేవరకూ 'గేమ్‌ ఛేంజర్‌'ను తమిళనాడులో విడుదల చేయవద్దని నిర్మాత మండలిని కోరింది. దీంతో తమిళనాడులో ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుందా? లేదా?  అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.  https://twitter.com/Fukkard/status/1876183961447387501 రంగంలోకి శంకర్..! తాజా ఫిర్యాదు నేపథ్యంలో లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) నిర్మాతలతో డైరెక్టర్‌ శంకర్‌ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. 'ఇండియన్‌ 3' సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు, పాటల చిత్రీకరణ పెండింగ్‌లో ఉండగా.. వాటిని 'గేమ్‌ ఛేంజర్‌' రిలీజ్‌ తర్వాత పూర్తిచేస్తానని శంకర్‌ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రస్తుతం శంకర్, లైకా ప్రొడక్షన్స్ మధ్య చర్చలు జరుగుతున్నాయని కోలీవుడ్ వర్గాలు తెలియజేశాయి. లైకా ప్రొడక్షన్స్ నిర్ణయాన్ని బట్టి ‘గేమ్‌ ఛేంజర్‌’పై తమిళ నిర్మాతల మండలి చర్యలు తీసుకోనుంది.  ఎగ్జిబ్యూటర్ల ఆగ్రహం..! డైరెక్టర్ శంకర్‌ జరుపుతున్న చర్చలు విఫలమైనా ‘గేమ్‌ ఛేంజర్‌’కు తమిళనాట పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చను అంటున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ లేవనెత్తిన అంశం లీగల్‌గా నిలబడదని సినీ వర్గాలు చెబుతున్నాయి. పైగా తమిళనాడు ఎగ్జిబ్యూటర్లు లైకా ప్రొడక్షన్‌ ఫిర్యాదుపై గరం గరంగా ఉన్నారని తెలుస్తోంది. ఆ ప్రొడక్షన్స్‌ నుంచి వచ్చిన గత రెండు చిత్రాలు ఫ్లాప్‌ కావడం, సంక్రాంతికి రావాల్సిన 'విడాముయర్చి' చిత్రాన్ని చివరి క్షణంలో వాయిదా వేయడంతో లైకా ప్రొడక్షన్స్‌పై ఎగ్జిబ్యూటర్లు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఉన్న ఒకే ఒక్క పెద్ద సినిమా ‘గేమ్ ఛేంజర్‌’ను అడ్డుకుంటే లైకాకు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందని చెబుతున్నారు. ఇది గమనించి ఆ సంస్థ కూాడా ఫిర్యాదును వెనక్కి తీసుకోవచ్చని కోలీవుడ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి.  శంకర్‌ సక్సెస్‌ కొట్టేనా? ఇక ‘గేమ్ ఛేంజర్’ విషయానికొస్తే ఇందులో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్‌లో నటించారు. ఎస్‌జే సూర్య విలన్‌గా యాక్ట్ చేశారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించగా బ్రహ్మానందం, సముద్రఖని, శ్రీకాంత్, నవీన్ చంద్ర కీలకపాత్రలు పోషించారు. ఎస్.ఎస్ థమన్ సినిమాకి మ్యూజిక్ అందించారు. ఇప్పటికే రిలీజైన సినిమా ట్రైలర్, పాటలు ఫ్యాన్స్‌ని కిక్కిచ్చాయి. బ్యాక్‌ టూ బ్యాక్‌ ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న శంకర్‌.. ‘గేమ్‌ ఛేంజర్‌’ ద్వారా సక్సెస్‌ బాట పట్టాలని చూస్తున్నారు. నిర్మాత దిల్‌రాజు కూడా ‘గేమ్ ఛేంజర్‌’పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. 
    జనవరి 06 , 2025
    <strong>Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ నుంచి సెన్సార్ బోర్డు తొలగించినవి ఇవే!</strong>
    Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ నుంచి సెన్సార్ బోర్డు తొలగించినవి ఇవే!
    మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా తమిళ డైరెక్టర్‌ శంకర్‌ రూపొందించిన ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రం రిలీజ్‌కు సిద్ధమైంది. తెలుగు స్టార్‌ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రం మరో 8 రోజుల్లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్‌ వర్క్ పూర్తయింది. యూ/ఏ సర్టిఫికేట్‌తో పాటు 165 నిమిషాల నిడివిని సెన్సార్ సభ్యులు ఫిక్స్‌ చేశారు. అయితే ఓ విషయంలో మాత్రం ‘గేమ్ ఛేంజర్‌’ టీమ్‌కు సెన్సార్ బోర్టు (Central Board of Film Certification) చురకలు అంటించినట్లు తెలుస్తోంది.  ఇంగ్లీషు టైటిల్‌పై మండిపాటు! గతంతో పోలిస్తే ఇటీవల సినిమా టైటిల్స్‌ విషయంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. తెలుగుకు బదులు పరభాష పదాలను తెలుగు టైటిల్స్‌గా ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. తాజాగా ‘గేమ్‌ ఛేంజర్‌’ సైతం తెలుగుకి బదులు ఇంగ్లీషు టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీనికి సంబంధించి సెన్సార్‌ సభ్యులు (Central Board of Film Certification).. మూవీ టీమ్‌కు చురకలు అంటించినట్లు తెలుస్తోంది. సినిమా మెుదట్లో టైటిల్ కార్డ్‌ను సైతం తెలుగు పదాల్లో ఇంగ్లీషు భాషలో ‘Game Changer’ పెట్టడాన్ని సెన్సార్‌ సభ్యులు తప్పుబట్టినట్లు సమాచారం. తెలుగులో కూడా పెట్టాలని వారు సూచించినట్లు తెలుస్తోంది. తెలుగు వెర్షన్‌ రిలీజ్‌కు ఇలా ఇంగ్లీషు టైటిల్‌తో రావడంపై ఏంటని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో తెలుగులో ‘గేమ్‌ ఛేంజర్‌’ అంటూ పెట్టేందుకు చిత్ర బృందం అంగీకరించినట్లు టాక్ వినిపిస్తోంది. బ్రహ్మీకి షాక్‌..! చరణ్‌ - శంకర్ కాంబోలో రూపొందిన ‘గేమ్‌ ఛేంజర్‌’లో దిగ్గజ హాస్య నటుడు బ్రహ్మానందం (Brahmanandam) కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆయన్ను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించిన సంగతి తెలిసిందే. దీంతో మూవీ టైటిల్స్‌ సందర్భంగా ఆయన పేరును ‘పద్మశ్రీ బ్రహ్మానందం’ అని టీమ్‌ ప్రెజెంట్‌ చేసినట్లు సమాచారం. ఇది చూసిన సెన్సార్‌ సభ్యులు పద్మశ్రీ పదాన్ని పేరుకు ముందు తొలగించాలని సూచించింది. కేంద్రం ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారాలను మూవీ టైటిల్స్‌ సందర్భంగా ప్రదర్శించకూడదని గతంలో కోర్టు తీర్పులు ఉన్నాయి. ‘దేనికైనా రెడీ’ సమయంలో బ్రహ్మీ పేరు ముందు పద్మశ్రీ పెట్టడంపై విమర్శలు వచ్చాయి. దీంతో ‘గేమ్ ఛేంజర్‌’ మూవీలో ఆ తప్పు రిపీట్‌ కాకుండా సెన్సార్ బోర్డు కత్తెర పెట్టింది.&nbsp; మరిన్ని కత్తెరలు.. తెలుగు టైటిల్‌, పద్మశ్రీ పదం తొలగింపుతో పాటు మరికొన్ని కత్తెరలు సైతం ‘గేమ్‌ ఛేంజర్‌’కు సెన్సార్‌ బోర్డు (Censor Board) విధించింది. కొన్ని సీన్లలో లిక్కర్‌ బ్రాండ్లను నేరుగా చూపించడాన్ని తప్పుబట్టింది. ఆయా లేబుల్స్‌ను తొలగించాలని చెప్పింది. అలాగే సినిమాలో ఎక్కువ సార్లు ఉన్న ‘చట్ట ప్రకారం’ పదాన్ని ‘లెక్క ప్రకారం’గా ఛేంజ్‌ చేయాలని సూచించింది. దీంతో పాటు కేరళ అనే పదాన్ని కూడా తొలిగించాలని చెప్పింది. ఓ పేపర్‌ కట్టింగ్‌ ఉన్న ‘దుర్గ శక్తి నాగ్‌పాల్’ పేరును ‘సుచిత్ర పాండే’గా మార్చాలని మూవీ టీమ్‌కు స్పష్టం చేసింది. ఇవి మినహా సినిమా విషయంలో సెన్సార్ బోర్డు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.&nbsp; https://twitter.com/JohnWick_fb/status/1874672597172101375 మరికొద్ది సేపట్లో ట్రైలర్ రిలీజ్‌.. 'గేమ్‌ ఛేంజర్‌' ట్రైలర్‌ను మరికొద్ది సేపట్లో మూవీ టీమ్‌ రిలీజ్‌ చేయబోతోంది. ఇవాళ (జనవరి 2) సాయంత్రం 5:04 గం.లకు దిగ్గజ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్‌ కానుంది. కాగా ఇప్పటికే ఈ సినిమాలోని నాలుగు పాటలు విడుదలవ్వగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రామ్‌చరణ్‌ ద్విపాత్రాభినయం చేశారు. ఎస్‌.జే. సూర్యతో పాటు సముద్రఖని, అంజలి, సునీల్‌, శ్రీకాంత్, నాజర్‌ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
    జనవరి 02 , 2025
    <strong>Pushpa 2: గేమ్ చేంజర్‌కు పోటీగా పుష్ప2 సాంగ్? తగ్గేదేలే!</strong>
    Pushpa 2: గేమ్ చేంజర్‌కు పోటీగా పుష్ప2 సాంగ్? తగ్గేదేలే!
    ప్రస్తుతం యావత్‌ దేశం ‘పుష్ప 2’ (Pushpa 2) మేనియా నడుస్తోంది. అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కాంబోలో వచ్చిన బ్లాక్‌ బాస్టర్&nbsp; చిత్రం ‘పుష్ప’ (2021)కు సీక్వెల్‌గా ఇది వస్తుండటంతో సహజంగానే అందరి దృష్టి ఈ మూవీపై పడింది. రిలీజ్‌కు వారం రోజుల సమయం కూడా లేకపోవడంతో హీరో బన్నీతో పాటు మూవీ టీమ్ దేశవ్యాప్తంగా భారీగా ప్రమోషన్స్‌ చేస్తోంది. పాట్నా, చెన్నై, కొచ్చి నగరాల్లో భారీ ఈవెంట్లు నిర్వహించి సినిమా మరిన్ని అంచనాలు పెంచేసింది. ఇటీవల కొచ్చి ఈవెంట్‌లో ‘పీలింగ్స్‌’(peelings) అనే సాంగ్‌ను మలయాళ ప్రేక్షకుల కోసం బన్నీ స్పెషల్‌గా ప్లే చేశారు. ఇది ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ పాటకు సంబంధించిన ప్రోమోను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. రిలీజ్‌ డేట్‌ను సైతం ప్రకటించారు. అయితే ఈ పాటను ‘గేమ్ ఛేంజర్‌’ (Game Changer)కు పోటీగా తీసుకొస్తున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; సాంగ్‌ వచ్చేది ఎప్పుడంటే? అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా నటించిన 'పుష్ప 2' (Pushpa 2) చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా చేసింది. ఫహాద్‌ ఫాజిల్‌ విలన్‌ పాత్రలో కనిపించనున్నాడు. జగపతిబాబు, సునీల్‌, అనసూయ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. డిసెంబర్‌ 5న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే తాజాగా 'పుష్ప 2' టీమ్‌ నాలుగో పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్‌ చేసింది. కొచ్చి ఈవెంట్‌లో కొద్ది సెకన్ల పాటు ప్లే చేసిన 'పీలింగ్స్‌' పాటకు సంబంధించి ఈ ప్రోమోను విడుదల చేశారు. ఆ ఈవెంట్‌లో బన్నీ చెప్పినట్లుగానే మలయాళ లిరిక్స్‌తో పాట మెుదలైంది. 25 సెకన్ల పాటు ఉన్న ఈ ప్రోమో మంచి బీట్‌తో ఆకట్టుకుంటోంది. డిసెంబర్‌ 1 ఆదివారం రోజున ఈ పాటకు సంబంధించి లిరికల్ వీడియోను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. https://twitter.com/i/status/1862395532343484578 https://twitter.com/baraju_SuperHit/status/1862394696338973169 ‘నానా హైరానా’కు పోటీగా రిలీజ్‌? రామ్‌ చరణ్‌ నటిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ నుంచి గురువారం (నవంబర్‌ 28) మూడో సింగిల్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ‘నానా హైరానా’ (Naanaa Hyraanaa) అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్‌కు మ్యూజిక్‌ లవర్స్ నుంచి విశేష స్పందన వస్తోంది. ఇటీవల ‘పుష్ప 2’ నుంచి రిలీజైన ‘కిస్సిక్‌’ పాట కంటే ‘నానా హైరానా’ చాలా బాగుందంటూ నెట్టింట పెద్ద ఎత్తున కామెంట్స్ వినిపిస్తున్నాయి. పలు యూట్యూబ్‌ చానెళ్లు సైతం దీనిపై పోల్స్‌ నిర్వహించగా మెజారిటీ ప్రేక్షకులు ‘నానా హైరానా’కు అనుకూలంగా ఓట్లు వేశారు. ఈ నేపథ్యంలో ఆ మెలోడీ సాంగ్‌కు పోటీగా మంచి బీట్‌ ఉన్న ‘పీలింగ్స్‌’ పాటను ‘పుష్ప 2’ మేకర్స్‌ రిలీజ్‌ చేయబోతున్నట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతో ‘పుష్ప 2’ మేకర్స్‌కే తెలియాలి. హైదరాబాద్‌లో బిగ్ ఈవెంట్‌ తెలుగు రాష్ట్రాలు మినహా దేశంలోని పలు రాష్ట్రాల్లో ‘పుష్ప 2’ (Pushpa 2) వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఇవాళ ముంబయిలోనూ ఈవెంట్‌ను మేకర్స్ ప్లాన్‌ చేశారు. అయితే హోమ్‌ ల్యాండ్‌ అయిన తెలుగు స్టేట్స్ ఇప్పటివరకూ ఒక్క ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించలేదు. దీంతో హైదరాబాద్‌లో బిగ్ ఈవెంట్‌ను ‘పుష్ప 2’ మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. సినిమాకు ఎంతో కీలకమైన ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ను మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించాలని అనుకుంటున్నారట. ఈవెంట్‌ ఆర్గనైజర్‌ శ్రేయాస్‌ మీడియా ఇప్పటికే మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యంతో మాట్లాడినట్లు తెలుస్తోంది. పోలీసుల అనుమతి సైతం లభిస్తే డిసెంబర్‌ 1న సాయంత్రం ఈవెంట్‌ జరగనుంది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లోనే ఫోర్త్‌ సింగిల్‌ ‘పీలింగ్స్‌’ను కూడా రిలీజ్‌ చేసే అవకాశముంది. సీనియర్‌ ఎన్టీఆర్‌ తర్వాత బన్నీనే! ‘పుష్ప 2’ చిత్రానికి సంబంధించి గురువారం సెన్సార్‌ బోర్డ్‌ రివ్యూ పూర్తైంది. ఈ సినిమాకు సెన్సార్‌ సభ్యులు U/A సర్టిఫికేట్‌ జారీ చేశారు. అంతేకాదు 3 గంటల 20 నిమిషాల 38 సెకన్ల నిడివితో ఈ సినిమా రాబోతున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ‘పుష్ప 2’ ఓ అరుదైన ఘనతను సాధించింది. తెలుగులో ఇప్పటివరకూ వచ్చిన అత్యధిక నిడివి గల చిత్రాల జాబితాలో టాప్‌ - 3 నిలిచింది. గతంలో నందమూరి తారకరామారావు చేసిన దాన వీర శూర కర్ణ (3 గం.ల 43 నిమిషాలు), లవ కుశ&nbsp; (3 గం.ల 28 నిమిషాలు) చిత్రాలు నిడివి పరంగా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. కాబట్టి నిడివి పరంగా సీనియర్ ఎన్టీఆర్‌ తర్వాత బన్నీ టాప్‌లో ఉన్నాడని చెప్పవచ్చు.&nbsp; https://twitter.com/sairaaj44/status/1862102202971787356 నెట్టింట హీట్‌ పెంచేసిన రష్మిక! ఈ తరం స్టార్ హీరోయిన్లలో యంగ్‌ బ్యూటీ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఒకరు. ఆమెను అంతా నేషనల్‌ క్రష్ అని కూడా ముద్దుగా పిలుస్తుంటారు. తాజాగా ‘పుష్ప 2’ ఈవెంట్‌కు హాజరైన రష్మిక తన గ్లామర్‌తో అక్కడి వారి మతి పోగొట్టింది. గ్రీన్‌ కలర్‌ శారీలో ఎద అందాలు చూపిస్తూ సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. దీంతో ఈ ముద్దుగుమ్మ ఫొటోలు, వీడియోలు ఒక్కసారిగా నెట్టింట వైరల్‌గా మారాయి. నేషనల్ క్రష్‌ అంటే ఆమాత్రం అందం ఉండాలిలే అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. మరోవైపు ‘పుష్ప 2’ సినిమా లవర్స్‌ సైతం శ్రీవల్లి భలే గ్లామర్‌గా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. నెట్టింట వైరల్‌ అవుతున్న ఫొటోలు, వీడియోలను మీరూ ఓసారి చూడండి.&nbsp; https://twitter.com/Actresshddd/status/1862326105690317215 https://twitter.com/CeleBeautyHQ/status/1862195078669681134 https://twitter.com/itzFantasyWorld/status/1862382376334057619 https://twitter.com/natshathiram/status/1862209642795016288 https://twitter.com/RSprabha8/status/1862200290948391300
    నవంబర్ 29 , 2024
    <strong>Game Changer: దీపావళికి గేమ్‌ ఛేంజర్ నుంచి బిగ్ అప్‌డేట్!&nbsp;</strong>
    Game Changer: దీపావళికి గేమ్‌ ఛేంజర్ నుంచి బిగ్ అప్‌డేట్!&nbsp;
    గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) నటించిన పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌ 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్‌ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకొని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే గేమ్‌ ఛేంజర్ టీజర్‌ రిలీజ్‌కు సైతం ముహోర్తం ఫిక్సయినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; దీపావళి కానుకగా టీజర్‌? రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్‌’ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తోంది. మరో హీరోయిన్‌ అంజలి కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర, సునీల్, శ్రీకాంత్‌, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్‌, కోలీవుడ్ యాక్టర్లు ఎస్‌జే సూర్య, స‌ముద్రఖని, కన్నడ నటుడు జ‌య‌రామ్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్ అయినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీపావళి కానుకగా టీజర్‌ను విడుదల చేసే ప్లాన్‌లో మేకర్స్‌ ఉన్నట్లు సమాచారం. వీకెండ్‌లోనే దీనిపై అధికారిక ప్రకటన సైతం ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్‌ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.&nbsp; తెలుగు స్టేట్స్‌లో రికార్డు బిజినెస్? ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరగనున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో ఏకంగా రూ.150 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి. ఆంధ్రా నుంచి రూ. 70 కోట్లు, సీడెడ్ నుంచి రూ.25 కోట్లు, నైజాం ఏరియా నుంచి రూ. 55 కోట్ల మేర బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్లు ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాయి. ‘గేమ్‌ఛేంజర్‌’ను డిసెంబర్‌లో విడుదల చేయాలని భావించినప్పుడు ఇంత బిజినెస్ జరిగే అవకాశం కనిపించలేదట. అయితే ఈ మూవీ రిలీజ్ సంక్రాంతికి వాయిదా పడటంతో బిజినెస్ రేంజ్ అమాంతం పెరిగిపోయినట్లు ఫిల్మ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.&nbsp; చరణ్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే! సంక్రాంతి రిలీజ్‌ అంటే సినిమాల మధ్య గట్టి పోటీ ఉంటుంది. ఈ సంక్రాంతికి బాలయ్య, వెంకటేష్‌ పాటు, సందీప్ కిషన్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. నాగచైతన్య 'తండేల్‌' కూడా పొంగల్‌కు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్‌ వద్ద గట్టి పోటీ ఉంటుందని తెలిసినా డిస్ట్రిబ్యూటర్లు పెద్ద మెుత్తంలో చెల్లించేందుకు ముందుకు వస్తున్నారట. చరణ్‌ కాకుండా మరే హీరో సినిమా సంక్రాంతికి రిలీజైనా ఈ స్థాయి బిజినెస్‌ జరుగుతుందన్న అంచనాలు ఉండేవి కాదని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో చరణ్‌కు పూర్తిస్థాయిలో క్రెడిట్ ఇవ్వాల్సిందేనని చెబుతున్నారు.&nbsp; భారీ ధరకు ఓటీటీ హక్కులు! గేమ్‌ ఛేంజర్‌ ఓటీటీ హక్కులు సైతం రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ రూ.110 కోట్లకు గేమ్‌ ఛేంజర్‌ స్ట్రీమింగ్‌ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. కేవ‌లం సౌత్ లాంగ్వేజెస్ డిజిట‌ల్ రైట్స్ కోస‌మే అమెజాన్‌ ఇంత మెుత్తాన్ని ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. హిందీ డిజిట‌ల్ రైట్స్‌ను మ‌రో ఓటీటీ సంస్థ‌కు అమ్మేందుకు మేక‌ర్స్ ప్ర‌య‌త్నాలు చేస్తోన్న‌ట్లు తెలిసింది. మొత్తంగా ఓటీటీ ద్వారానే మేక‌ర్స్‌ రూ.150 కోట్ల మేర సొమ్ము చేసుకునే పరిస్థితులు ఉన్నాయని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 'గేమ్‌ ఛేంజర్‌' రిలీజ్‌కు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ అంత పెద్ద మెుత్తంలో ఓటీటీ హక్కులు అమ్ముడుపోవడం మాములు విషయం కాదని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒక్క పాటకు రూ.20 కోట్లు! 'గేమ్‌ ఛేంజర్‌' నుంచి వచ్చిన మెుదటి రెండు పాటలు ‘జరగండి.. జరగండి..’, ‘రా మచ్చా మచ్చా’ పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ముఖ్యంగా ‘రా మచ్చా మచ్చా’ సాంగ్‌ యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్‌ రాబట్టి నేషనల్‌ వైడ్‌గా ట్రెండింగ్‌ అయ్యింది. అయితే త్వరలో థర్డ్‌ సింగిల్‌ను తీసుకొచ్చేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్‌ చివర్లో లేదా నవంబర్‌ ఫస్ట్‌ వీక్‌లో ఈ సాంగ్‌ రిలీజ్‌ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. తొలి రెండు పాటలు మంచి బీట్‌తో వచ్చి దుమ్మురేపగా థర్డ్‌ సింగిల్‌ మాత్రం మెలోడిగా రానుంది. ఇక లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ఈ మూడో పాటకు రూ.20 కోట్ల పైనే ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని మేకర్స్‌ ధ్రువీకరించాల్సి ఉంది.
    అక్టోబర్ 24 , 2024
    Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’తో చిరంజీవికి ఊహించని తలనొప్పి.. మెగా ఫ్యాన్స్‌ మధ్య చీలికలు తప్పదా?
    Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’తో చిరంజీవికి ఊహించని తలనొప్పి.. మెగా ఫ్యాన్స్‌ మధ్య చీలికలు తప్పదా?
    రామ్‌చరణ్‌ - డైరెక్టర్ శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game changer). 'ఆర్ఆర్‌ఆర్‌' (RRR) తర్వాత రామ్‌ చరణ్‌ (Ram Charan) నటిస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీని టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాసేలా మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. క్రిస్మస్‌ కానుకగా ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ ఖాయమంటూ పలు వేదికలపై దిల్‌రాజు స్పష్టం చేశారు. అయితే అనూహ్యంగా ఈ సినిమా సంక్రాంతి రేసులో నిలవనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఇప్పటికే పొంగల్‌ బరిలో నిలిచిన చిరుకు చరణ్‌ నుంచి గట్టి పోటీ తప్పదా అన్న ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది.&nbsp; క్రిస్మస్‌ నుంచి సంక్రాంతికి లాక్‌! తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి చాలా పెద్ద ఫెస్టివల్. బడా బడా హీరోలందరూ తమ చిత్రాలను సంక్రాంతికి లాక్‌ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం తన అప్‌కమింగ్‌ చిత్రం 'విశ్వంభర'ను పొంగల్‌ రేసులో నిలిపారు. ఈ క్రమంలోనే రామ్‌చరణ్‌ లేటెస్ట్ చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌'ను సైతం సంక్రాంతికి రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ నిర్ణయించినట్లు ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ వినిపిస్తోంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి కావడానికి ఇంకాస్త సమయం పట్టే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో క్రిస్మస్‌ నాటికి రిలీజ్‌ సాధ్యం కాకపోవచ్చని సమాచారం. దీంతో సంక్రాంతికి రిలీజ్‌ చేస్తే బాగుంటుందని మేకర్స్‌ భావిస్తున్నారట. అదే జరిగితే బాక్సాఫీస్‌ వద్ద చిరు-రామ్‌చరణ్‌ మధ్య బిగ్‌ ఫైట్‌ తప్పదని అంటున్నారు.&nbsp; డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడే కారణమా? గేమ్‌ ఛేంజర్‌ చిత్రం డిసెంబర్‌ నుంచి సంక్రాంతికి మారడం వెనక డిస్ట్రిబ్యూటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని క్రిస్మస్‌ కంటే సంక్రాంతికి తీసుకువస్తేనే తమకు లాభదాయకంగా ఉంటుందని డిస్ట్రిబ్యూటర్ల అంటున్నారట. అలా కాదని క్రిస్మస్‌కు తీసుకొస్తే తమకు గిట్టుబాటు కాకపోవచ్చని తేల్చి చెబుతున్నారట. పైగా జనవరి 10 నుంచి సంక్రాంతి చిత్రాలు వస్తుండటంతో లాంగ్‌ పీరియడ్‌ కలెక్షన్స్‌ పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారట. 20 రోజుల కలెక్షన్స్‌తోనే 'గేమ్‌ ఛేంజర్‌' సరిపెట్టుకోవాల్సి వస్తుందని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందుతున్నారట. దీంతో ‘గేమ్‌ ఛేంజర్‌’ టీమ్‌ పూర్తిగా ఇరాకటంలో పడిపోయినట్లు తెలుస్తోంది.&nbsp; చిరు వెనక్కి తగ్గేనా! తండ్రి కొడుకులైనా చిరంజీవి, రామ్‌చరణ్‌ ఇప్పటివరకూ బాక్సాఫీస్‌ వద్ద తలపడలేదు. ‘విశ్వంభర’ వర్సెస్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’గా పోటీ మారితే ఫ్యాన్స్‌కు తప్పుడు సంకేతం ఇచ్చినవారవుతారు. రిలీజ్‌ సందర్భంగా ఏ సినిమా చూడాలన్న విషయంలో మెగా ఫ్యాన్స్‌ తర్జనభర్జన అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి కొడుకు కోసం ‘విశ్వంభర’ను పోస్ట్‌ పోన్‌ చేసుకునే అవకాశం లేకపోలేదని ఫిల్మ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా రిలీజ్‌పై ఎప్పటినుంచో సందిగ్దం నెలకొంది. నిర్మాత దిల్‌రాజు, సంగీత దర్శకుడు థమన్‌ క్రిస్మస్‌ కానుకగా సినిమా వస్తుందని చెప్పినా మెగా ఫ్యాన్స్‌ పూర్తిగా విశ్వసించలేదు. ఇప్పుడేమో సంక్రాంతికి సినిమా వస్తుందంటూ మరో ప్రచారం జోరందుకుంది. సంక్రాంతి కూడా మిస్‌ అయితే ‘గేమ్‌ ఛేంజర్‌’పై మెగా ఫ్యాన్స్ అసంతృప్తి తారాస్థాయికి చేరే ప్రమాదం ఉంది. కాబట్టి సంక్రాంతికే ‘గేమ్ ఛేంజర్‌’ను రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ పట్టుబడితే మెగాస్టార్‌ వెనక్కి తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.&nbsp; రీషూట్‌కు నో చెప్పిన చరణ్‌! ‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీ షూటింగ్‌ ఇటీవలే కంప్లీట్‌ చేసుకున్న రామ్‌చరణ్‌ తన ఫోకస్‌ను తర్వాతి చిత్రంపైకి మళ్లించారు. బుచ్చిబాబు డైరెక్షన్‌లో రానున్న ‘RC16’ కోసం లాంగ్‌ హెయిర్‌తో పాటు బాడీని సైతం పెంచాడు. అయితే దర్శకుడు శంకర్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’కి సంబంధించిన కొన్ని సీన్లపై అసంతృప్తిగా ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. చరణ్‌తో వాటిని రీషూట్‌ చేాయాలని భావించినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని నిర్మాత దిల్‌రాజు ద్వారా చరణ్‌ దృష్టికి తీసుకెళ్లగా ఇందుకు అతడు నో చెప్పినట్లు తెలిసింది. తిరిగి ‘గేమ్‌ ఛేంజర్‌’ లుక్‌లోకి మారితే ‘RC16’ షూటింగ్‌లో జాప్యం జరుగుతుందని ఆయన భావించారట. ఇప్పటికే ‘RC16’ కోసం డేట్స్‌ కూడా ఇవ్వడంతో వాటిని అడ్జస్ట్ చేసుకునేందుకు చరణ్‌ సంసిద్ధంగా లేరని ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ వినిపించింది. చరణ్‌- నీల్‌ కాంబో లోడింగ్‌! రామ్‌ చరణ్‌ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. కేజీఎఫ్‌, సలార్ వంటి బ్లాక్‌బాస్టర్స్‌ అందించిన ప్రశాంత్‌ నీల్‌తో చరణ్‌ ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై చర్చలు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను డీవీవీ దానయ్య నిర్మించనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కేందుకు చాలా సమయం పట్టే అవకాశముంది. ప్రస్తుతం ప్రశాంత్‌ చేతిలో 'NTR 31'తో పాటు సలార్‌ 2, కేజీఎఫ్‌ 3 ప్రాజెక్టులు ఉన్నాయి. అటు చరణ్‌ సైతం బుచ్చిబాబుతో పాటు సుకుమార్‌తో ప్రాజెక్ట్‌ చేయాల్సి ఉంది. అవన్నీ పూర్తయిన తర్వాత చరణ్‌-నీల్‌ మూవీ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.
    అక్టోబర్ 09 , 2024
    <strong>Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ డేట్‌ లాక్‌? వినాయక చవితికి బిగ్‌ సర్‌ప్రైజ్‌!&nbsp;&nbsp;</strong>
    Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ డేట్‌ లాక్‌? వినాయక చవితికి బిగ్‌ సర్‌ప్రైజ్‌!&nbsp;&nbsp;
    'ఆర్ఆర్‌ఆర్‌' (RRR) తర్వాత రామ్‌ చరణ్‌ (Ram Charan) నటిస్తున్న చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్‌ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ డేట్‌కు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ బయటకొచ్చింది. వినాయక చవితి రోజున చరణ్‌ సినిమాకు సంబంధించి బిగ్‌ సర్‌ప్రైజ్ ఉంటుందని అంటున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; రిలీజ్‌ డేట్‌ లాక్‌? ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా నుంచి భారీ అప్‍డేట్ సిద్ధమైందని తెలుస్తోంది. ఎంతగానో ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్‍తో ఓ పోస్టర్‌ను మూవీ టీమ్ తీసుకొస్తున్నట్టు సమాచారం. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 20న ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కానున్నట్లు తెలుస్తోంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్‌ 7న రిలీజ్‌ డేట్‌పై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఒక స్పెషల్‌ పోస్టర్‌ ద్వారా రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేసే అవకాశముందని ఫిల్మ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల ఓ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న నిర్మాత దిల్‌ రాజు డిసెంబర్‌లో గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతుందంటూ స్పష్టం చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.&nbsp; టీజర్‌కు రంగం సిద్ధం గేమ్‌ ఛేంజర్‌ సినిమా నుంచి ఇప్పటివరకూ ఆశించిన స్థాయిలో కంటెంట్‌ రిలీజ్‌ కాలేదు. ఈ నేపథ్యంలో ఓ టీజర్‌ రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెలలోనే టీజర్‌ను రిలీజ్‌ చేసి మెగా ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేయాలని గేమ్‌ ఛేంజర్‌ టీమ్‌ భావిస్తున్నట్లు తెలిసింది. తద్వారా ఒకే నెలలో రెండు అప్‌డేట్స్‌ ఇచ్చి ఫ్యాన్స్‌కు ఫుల్‌ ట్రీట్‌ ఇచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్‌ చివరి వారంలో ఈ టీజర్‌ విడుదల కావొచ్చని ఫిల్మ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.&nbsp; క్రిస్మస్‌కే ఎందుకు! పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ను మెగా హీరో రామ్‌చరణ్ అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ నటించిన ‘సలార్‌’ (Salaar: Part 1 – Ceasefire) చిత్రం గతేడాది క్రిస్మస్‌ కానుకగానే విడుదలై బ్లాక్‌ బాస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే సలార్‌ క్రిస్మస్‌కే రిలీజ్‌ కావడానికి ఓ కారణం ఉంది. 2024 సంక్రాతి బరిలో మహేష్‌ బాబు (గుంటూరు కారం), నాగార్జున (నాసామి రంగ), వెంకటేష్‌ (సైంధవ్‌), తేజ సజ్జా (హనుమాన్‌) వంటి స్టార్‌ హీరోలు నిలిచారు. వారితో పోటి పడి కలెక్షన్స్ పంచుకోవడం కన్నా సోలోగా వచ్చి మంచి వసూళ్లు సాధించాలని ప్రభాస్‌తో పాటు సలార్‌ యూనిట్‌ నిర్ణయించారు. ప్రస్తుతం అదే విధంగా రామ్‌చరణ్‌ &amp; కో కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 2025 సంక్రాంతి బరిలో మెగాస్టార్‌ చిరంజీవి ‘విశ్వంభర’ లాకై ఉంది. అలాగే వెంకటేష్‌- అనిల్‌ రావిపూడి చిత్రంతో పాటు అజిత్‌ నటిస్తున్న ‘గుడ్‌ బ్యాడ్ అగ్లీ’, ‘శతమానం భవతి 2’ కూడా సంక్రాంతి బరిలో నిలిచే ఛాన్స్‌ ఉంది. కాబట్టి క్రిస్మస్‌ కానుకగా రిలీజ్‌ చేస్తే ప్రభాస్‌ తరహాలోనే బాక్సాఫీస్‌ వద్ద ప్రభావం చూపించవచ్చని రామ్‌చణ్‌ భావిస్తున్నట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.&nbsp; డైరెక్టర్‌ శంకర్‌ భారీ ఆశలు! డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు 2’ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇది అసలు శంకర్‌ చిత్రంలానే లేదంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు పోస్టులు పెట్టారు. అంతకుముందు శంకర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘రోబో 2.0’, ‘ఐ’, ‘స్నేహితుడు’ వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద డీలా పడ్డాయి. దీంతో శంకర్‌ తిరిగి సక్సెస్‌ బాటలో పడేందుకు ‘గేమ్‌ ఛేంజర్‌’ కీలకంగా మారింది. అటు నిర్మాత దిల్‌రాజుకు కూడా గత చిత్రం పీడకలనే మిగిల్చింది. విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైంది. దిల్‌రాజుకు భారీగా నష్టాలను మిగిల్చిందంటూ టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో వాటిని ‘గేమ్‌ ఛేంజర్‌’ పూడుస్తుందని దిల్‌ రాజు భావిస్తున్నారట. ప్రస్తుతం దర్శకుడు, నిర్మాత ఆశలన్నీ చరణ్‌ మూవీ సక్సెస్‌పైనే ఆధారపడి ఉన్నాయి.&nbsp;
    సెప్టెంబర్ 04 , 2024
    <strong>Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ డేట్‌ లాక్‌? ప్రభాస్‌ బాటలో రామ్‌చరణ్‌!</strong>
    Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ డేట్‌ లాక్‌? ప్రభాస్‌ బాటలో రామ్‌చరణ్‌!
    ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) నటిస్తున్న చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer). తమిళ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్టు ఎప్పుడొస్తుందా అని మెగా ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్ర నిర్మాత దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘గేమ్‌ ఛేంజర్’ విడుదల తేదీపై హింట్‌ ఇచ్చాడు. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. రిలీజ్‌ డేట్ లాక్ అయ్యిందంటూ పోస్టులు పెడుతున్నారు.&nbsp; రిలీజ్‌ ఆ రోజేనా? పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న 'గేమ్‌ ఛేంజర్‌' చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Producer Dil Raju) నిర్మిస్తున్నారు. తాజాగా ‘రాయన్‌’ (Raayan) ప్రీ రిలీజ్ ఈవెండ్‌ పాల్గొన్న ఆయన ‘గేమ్ ఛేంజర్‌’ రిలీజ్‌పై స్పందించారు. క్రిస్మస్‌ కు కలుద్దామంటూ వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి 'గేమ్‌ ఛేంజర్‌'ను డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ కానుకగా రిలీజ్‌ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న 50వ చిత్రం. దీంతో దిల్‌రాజు ఎంతో ప్రతిష్టాత్మకగా ‘గేమ్‌ ఛేంజర్‌’ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఎడిటింగ్‌ వర్క్‌ జరుగుతున్నట్లు సమాచారం.&nbsp; https://twitter.com/i/status/1815052022200013098 ప్రభాస్‌ బాటలో రామ్‌చరణ్‌! పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ను మెగా హీరో రామ్‌చరణ్ అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ నటించిన ‘సలార్‌’ (Salaar: Part 1 – Ceasefire) చిత్రం గతేడాది క్రిస్మస్‌ కానుకగానే విడుదలై బ్లాక్‌ బాస్టర్ విజయాన్ని అందుకుంది. 2023 డిసెంబర్‌ 22న వచ్చిన సలార్‌ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.700 కోట్లు కొల్లగొట్టింది. అయితే సలార్‌ క్రిస్మస్‌కే రిలీజ్‌ కావడానికి ఓ కారణం ఉంది. 2024 సంక్రాతి బరిలో మహేష్‌ బాబు (గుంటూరు కారం), నాగార్జున (నా సామి రంగ), వెంకటేష్‌ (సైంధవ్‌), తేజ సజ్జా (హనుమాన్‌) వంటి స్టార్‌ హీరోలు నిలిచారు. వారితో పోటి పడి కలెక్షన్స్ పంచుకోవడం కన్నా సోలోగా వచ్చి మంచి వసూళ్లు సాధించాలని ప్రభాస్‌తో పాటు సలార్‌ యూనిట్‌ నిర్ణయించారు. ప్రస్తుతం అదే విధంగా రామ్‌చరణ్‌ &amp; కో కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 2025 సంక్రాంతి బరిలో మెగాస్టార్‌ చిరంజీవి ‘విశ్వంభర’ లాకై ఉంది. అలాగే వెంకటేష్‌- అనిల్‌ రావిపూడి చిత్రంతో పాటు అజిత్‌ నటిస్తున్న ‘గుడ్‌ బ్యాడ్ అగ్లీ’, ‘శతమానం భవతి 2’ కూడా సంక్రాంతి బరిలో నిలిచే ఛాన్స్‌ ఉంది. కాబట్టి క్రిస్మస్‌ కానుకగా రిలీజ్‌ చేస్తే ప్రభాస్‌ తరహాలోనే బాక్సాఫీస్‌ వద్ద ప్రభావం చూపించవచ్చని రామ్‌చరణ్‌ భావిస్తున్నట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.&nbsp; గేమ్‌ ఛేంజర్‌పై భారీ ఆశలు! డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు 2’ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇది అసలు శంకర్‌ చిత్రంలానే లేదంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు పోస్టులు పెట్టారు. అంతకుముందు శంకర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘రోబో 2.0’, ఐ, స్నేహితుడు వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద డీలా పడ్డాయి. దీంతో శంకర్‌ తిరిగి సక్సెస్‌ బాటలో పడేందుకు ‘గేమ్‌ ఛేంజర్‌’ కీలకంగా మారింది. అటు నిర్మాత దిల్‌రాజుకు కూడా గత చిత్రం పీడకలనే మిగిల్చింది. విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైంది. దిల్‌రాజుకు భారీగా నష్టాలను మిగిల్చిందంటూ టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో వాటిని ‘గేమ్‌ ఛేంజర్‌’ పూడుస్తుందని దిల్‌ రాజు భావిస్తున్నారట. ప్రస్తుతం దర్శకుడు, నిర్మాత ఆశలన్నీ చరణ్‌ మూవీ సక్సెస్‌పైనే ఆధారపడి ఉన్నాయి.&nbsp; కథ ఇదేనా? ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) ’గేమ్‌ ఛేంజర్‌’ స్టోరీలైన్‌ను గతంలోనే రివీల్‌ చేసింది. తమ ఓటీటీలో రాబోయే సినిమాలని ప్రకటిస్తూ ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్లాట్‌ను బహిర్గతం చేసింది. దీని ప్రకారం ‘పాలనలో మార్పులు తెచ్చేందుకు ఒక నిజాయతీపరుడైన ఐఏఎస్ అధికారి రాజకీయ అవినీతిపై ఎలా పోరాడాడు’ అన్నది ఈ మూవీ కథగా అమెజాన్‌ పేర్కొంది. కాగా ఇందులో చరణ్‌ తండ్రి కొడులుగా డ్యూయల్‌ రోల్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అటు ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. శ్రీకాంత్‌, సునీల్‌, నవీన్‌ చంద్ర, జయరామ్, సముద్రఖని, అంజలి ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఎస్‌.ఎస్‌. థమన్‌ ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నాడు. View this post on Instagram A post shared by prime video IN (@primevideoin)
    జూలై 22 , 2024
    <strong>Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ ఈవెంట్స్‌లో కియారా మిస్సింగ్‌.. గొడవలే కారణమా?</strong>
    Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ ఈవెంట్స్‌లో కియారా మిస్సింగ్‌.. గొడవలే కారణమా?
    సాధారణంగా ఏ సినిమాకైనా ప్రమోషన్స్‌ చాలా ముఖ్యం. హీరో, హీరోయిన్‌, డైరెక్టర్‌ సహా మూవీ బృందమంతా ప్రచారాల్లో పాల్గొంటూ సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేస్తుంటాయి. ఈ ప్రమోషన్స్‌కు గ్లామర్‌ తీసుకురావడంలో హీరోయిన్స్ ముఖ్య పాత్ర పోషిస్తుంటారు. అయితే ప్రస్తుతం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) ప్రమోషన్స్‌లో ఆ గ్లామరే మిస్‌ అయ్యింది. రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా, స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ రూపొందించిన ‘గేమ్‌ ఛేంజర్‌’ మరో ఏడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. దీంతో మూవీ టీమ్‌ చురుగ్గా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. అయితే ఈ వేడుకలకు హీరోయిన్‌ కియారా అద్వానీ (Kiara Advani) డుమ్మా కొడుతుండటం చర్చకు తావిస్తోంది. ఆమె మిస్సింగ్‌కు కారణం ఏమై ఉంటుందా? అని సినీ వర్గాల్లో తెగ చర్చ జరుగుతోంది.  కీలక ఈవెంట్స్‌కు దూరం.. 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer) చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) కథానాయికగా చేసింది. హీరోయిన్లను అందంగా చూపించడంలో డైరెక్టర్‌ శంకర్‌కు మంచి పేరుంది. ఈ క్రమంలోనే 'గేమ్‌ ఛేంజర్‌'లోనూ కియారాను ఆయన చాలా అందంగా చూపించారు. పాటలు, టీజర్‌, ట్రైలర్‌ చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. ఇదిలా ఉంటే 'గేమ్ ఛేంజర్‌' ప్రమోషన్స్‌లో కియారా పాల్గొనకపోవడం టాలీవుడ్‌లో చర్చనీయాంశమవుతోంది. గురువారం (జనవరి 2) జరిగిన ట్రైలర్‌ లాంట్ ఈవెంట్‌లో ఆమె పాల్గొనలేదు. అంతకుముందు డల్లాస్‌లో జరిగిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు సైతం ఆమె అందుబాటులో లేదు. లక్నోలో జరిగిన ఒక్క టీజర్‌ లాంచ్ ఈవెంట్‌లో మాత్రమే కియారా పాల్గొంది. ఎంతో కీలకమైన ప్రమోషన్స్‌కు హీరోయిన్‌ దూరంగా ఉండటం ఏంటని సినీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.  టీమ్‌తో విభేదాలు వచ్చాయా? ‘గేమ్‌ ఛేంజర్‌’కు కియారా దూరంగా ఉండటంతో నెటిజన్లు ఎవరికి నచ్చినట్లు వారు ఊహించుకుంటున్నారు. చిత్ర బృందంతో తలెత్తిన వివాదం కారణంగానే ఆమె ప్రమోషన్స్‌కు రావడం లేదని కామెంట్స్ చేస్తున్నారు. మూవీ టీమ్‌ వ్యవహారశైలిపై కియారా చాలా అసంతృప్తితో ఉందని పోస్టులు పెడుతున్నారు. అయితే కియారా వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ‘టాక్సిక్‌’, ‘వార్‌ 2’ చిత్రాల్లో కథానాయికగా చేస్తోంది. ప్రస్తుతం ఆ రెండు చిత్రాల షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ముందే డేట్స్‌ కమిట్ కావడంతో కియారా ఆయా చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొనాల్సి వస్తున్నట్లు సమాచారం. అందువల్లే ‘గేమ్ ఛేంజర్‌’ ప్రమోషన్స్‌కు హాజరుకాలేకపోతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. మెగా పవర్‌ ఈవెంట్‌కైనా వస్తుందా? 'గేమ్‌ ఛేంజర్‌' టీమ్.. ఆంధ్రప్రదేశ్‌లో బిగ్ ఈవెంట్‌ను ప్లాన్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చీఫ్‌ గెస్ట్‌గా హాజరుకానున్నారు. జనవరి 4న రాజమండ్రిలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు స్పెషల్‌ పోస్టర్‌ ద్వారా మేకర్స్‌ ఈ విషయాన్ని తెలియజేశారు. మెగా పవర్ ఈవెంట్‌ అంటూ ఈ వేడుకపై చిత్రం బృందం భారీగా అంచనాలు పెంచేసింది. అటు బాబాయి, అబ్బాయి ఒకే వేదికపై కనిపించనుండటంతో మెగా ఫ్యాన్స్ కూడా ఈ ఈవెంట్‌ కోసం తెగ ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ బిగ్‌ ఈవెంట్‌కైనా కియారా హాజరుకావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. ఆమె వస్తే ఈ వేడుక మరింత అందంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి కియారా వస్తుందో లేదో చూడాలి. 
    జనవరి 03 , 2025
    <strong>Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌ నుంచి మరో అప్‌డేట్.. తెలిస్తే షాకే!</strong>
    Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌ నుంచి మరో అప్‌డేట్.. తెలిస్తే షాకే!
    గ్లోబల్‌ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) లేటెస్ట్ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)పై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. 'పుష్ప 2' (Pushpa 2) తర్వాత టాలీవుడ్‌ నుంచి వస్తోన్న మరో బిగ్‌ ప్రాజెక్ట్‌ కావడంతో ప్రస్తుతం అందరూ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరెకెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్‌ కాబోతోంది. రిలీజ్‌కు మరో 25 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఈ సినిమా ప్రమోషన్స్‌పై మేకర్స్‌ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి నాల్గో సింగిల్‌ రిలీజ్‌ చేసేందుకు చిత్ర బృందం రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సంగీత దర్శకుడు థమన్‌ ఈ పాటపై అమాంతం హైప్ పెంచేశాడు. దాంతోపాటు ‘గేమ్‌ ఛేంజర్‌’కు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.  సాంగ్‌పై హైప్‌ పెంచేసిన థమన్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan), కియారా అద్వానీ (Kiara Advani) జంటగా చేసిన ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) నుంచి సాలిడ్‌ అప్‌డేట్‌ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ (S.S. Thaman) సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు. నాల్గో సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ‘డోప్’ (DHOP Song) అనే పాట రాబోతోందని, ఇది సౌండ్ ఛేంజర్ అవుతుందని, ఈ పాట గురించి ప్రపంచం మాట్లాడుకుంటుందని వరుస ట్వీట్స్‌తో థమన్‌ హోరెత్తించారు. దీంతో ‘డోప్’ సాంగ్‌పై ఒక్కసారిగా నెట్టింట చర్చ మెుదలైంది. ఈ పాట గురించి ప్రముఖ సింగర్‌ గీతా మాధురి మాట్లాడిన వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ సాంగ్‌ తాను విన్నానని, ఒకసారి పాట రిలీజైతే ప్రపంచం మెుత్తం మీ వైపు చూస్తుందని థమన్‌తో చెప్పినట్లు ఆమె గుర్తుచేశారు. అయితే ‘డోప్‌’ పాటను యూఎస్ ఈవెంట్‌లో రిలీజ్ చేస్తారని సమాచారం. అక్కడే ట్రైలర్‌ను కూడా లాంచ్‌ చేస్తారని టాక్ ఉంది. https://twitter.com/MusicThaman/status/1868538197304918040 https://twitter.com/MusicThaman/status/1868538521746915761 https://twitter.com/AlwaysAkashRC/status/1868541776933355580 ‘బ్రహ్మాండంగా ఎంజాయ్‌ చేస్తారు’ గేమ్ ఛేంజర్‌ సినిమాలో నటుడు రాజీవ్‌ కనకాల (Rajiv Kanakala) సైతం ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సినిమాతో పాటు రామ్‌చరణ్‌ గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 'ఈయన (రామ్‌చరణ్‌) గ్లోబల్‌ స్టార్‌. రైజ్‌లో ఉన్న గ్లోబల్‌ స్టార్‌. ట్రెజర్‌ (సంపద) లాంటి వ్యక్తి. పద్మనాభ స్వామి టెంపుల్‌లో తీసిన నేల మాళిగ లాంటి వ్యక్తి చరణ్‌. ఈ సినిమాకు కలెక్షన్స్ వస్తాయని మేము చాలా నమ్మకంతో ఉన్నాం. సాంగ్స్‌ కూడా అద్భుతంగా తీశారు. నేను విన్నదైతే ఒక్కొక్క సాంగ్‌ రూ.10-12 కోట్లు ఖర్చు అయ్యింది. బ్రహ్మాండంగా సినిమాను ఎంజాయ్‌ చేస్తారు. కథలోని డ్రామా కూడా అదే స్థాయిలో ఉంటుంది' అని రాజీవ్ అన్నారు. https://twitter.com/Deepu0124/status/1868549330094957034 చరణ్‌ యాక్టింగ్‌కు షాకవుతారు: శ్రీకాంత్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రంలో ఒకప్పటి టాలీవుడ్ స్టార్‌ హీరో శ్రీకాంత్‌ (Srikanth) కూడా ముఖ్యమైన రోల్‌ పోషిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాపై శ్రీకాంత్‌ చేసిన కామెంట్స్‌ ఫ్యాన్స్‌లో మరింత హైప్‌ను పెంచుతున్నాయి. ఇందులో చరణ్‌ పోషించిన అప్పన్న పాత్ర చూసి ఫ్యాన్స్ షాకవుతారని ఆయన అన్నారు. ఇందులో విలన్‌గా చేస్తోన్న తమిళ నటుడు ఎస్‌.జే. సూర్యకు 'సరిపోదా శనివారం'కు మించిన ప్రశంసలు వస్తాయని పేర్కొన్నారు. డైరెక్టర్ శంకర్ రీసెంట్‌ చిత్రాలు మిస్‌ఫైర్‌ అయ్యాయని, గేమ్‌ ఛేంజర్ విషయంలో మాత్రం అలా జరగదని భరోసా ఇచ్చారు. కచ్చితంగా ఈ చిత్రం బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంటుందని చెప్పుకొట్టారు. ట్విస్టుల మీద ట్విస్టులతో ఆద్యాంతం ఆడియన్స్‌ను అలరిస్తుందని శ్రీకాంత్ అన్నారు. దీంతో మెగా ఫ్యాన్స్‌ తెగ సంతోషిస్తున్నారు. https://twitter.com/TheAakashavaani/status/1867904962572812564 ఓవర్సీస్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్‌ చేయబోతున్నారు. ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాపై బజ్ ఉంది. దీంతో నేటి నుంచి కూడా అడ్వాన్స్‌ బుకింగ్స్‌ను మేకర్స్‌ ఓపెన్‌ చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ మేకర్స్ ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పోస్టర్‌లో చరణ్‌ కుర్చీలో కూర్చొని ఎంతో దర్జాగా కనిపించాడు. ఇదిలా ఉంటే ఓవర్సీస్‌లోనే గేమ్‌ ఛేంజర్‌ ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించనన్నారు. డిసెంబర్‌ 21న గార్లాండ్‌లోని కర్టిస్‌ కల్వెల్‌ సెంటర్‌లో ఈ వేడుక జరగనుంది. ఈ ఈవెంట్‌ కోసం ఓవర్సీస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. https://twitter.com/AlwaysRamCharan/status/1868331670245622241
    డిసెంబర్ 16 , 2024
    <strong>Game Changer Teaser: లక్నోలో ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫస్ట్‌ ప్రమోషన్‌ ఈవెంట్‌.. ఎందుకంటే?&nbsp;</strong>
    Game Changer Teaser: లక్నోలో ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫస్ట్‌ ప్రమోషన్‌ ఈవెంట్‌.. ఎందుకంటే?&nbsp;
    ‘RRR’ తర్వాత రామ్‌ చరణ్‌ (Ram Charan) నుంచి వస్తోన్న సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). అగ్ర దర్శకుడు శంకర్‌ (Shankar) దర్శకత్వంలో తెలుగు నిర్మాత దిల్‌రాజు నిర్మించిన చిత్రమిది. పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్‌ తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ ప్రమోషన్స్‌పై చిత్ర బృందం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా టీజర్‌ రిలీజ్‌ తేదీని చిత్ర బృందం లాక్‌ చేసింది. యూపీలో టీజర్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాలు ఉండగా నార్త్‌లోనే టీజర్‌ లాంచ్ ఈవెంట్ ఎందుకు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే దీని వెనక ఓ మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది.&nbsp; టీజర్‌ ఎప్పుడంటే? రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్‌’ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తోంది. మరో హీరోయిన్‌ అంజలి కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర, సునీల్, శ్రీకాంత్‌, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్‌, కోలీవుడ్ యాక్టర్లు ఎస్‌జే సూర్య, స‌ముద్రఖని, కన్నడ నటుడు జ‌య‌రామ్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్ అయ్యింది. నవంబర్‌ 9న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్‌ అధికారికంగా ప్రకటించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో ఈ టీజర్‌ లాంచ్ ఈవెంట్‌ జరగనున్నట్లు వెల్లడించారు. లక్నోలోనే ఎందుకు? గేమ్‌ ఛేంజర్‌ టీజర్‌ లాంచ్ ఈవెంట్‌ను తొలుత హైదరాబాద్‌లోనే నిర్వహించాలని మూవీ టీమ్ భావించింది. కానీ ఇక్కడ పరిస్థితులు, అనుమతులు అనుకూలించకపోవడంతో వేదికను లక్నోకి మార్చినట్లు సమాచారం. గేమ్‌ ఛేంజర్‌ పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. కాబట్టి దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ ఎంతో అవసరం. ఇందులో భాగంగా తొలి అధికారిక ఈవెంట్‌నే నార్త్‌లో నిర్వహిస్తే అక్కడి ప్రజలకు మరింత చేరువ కావొచ్చని మూవీ టీమ్ భావిస్తోంది. అంతేకాదు టీజర్‌ రిలీజైనప్పటి నుంచి రెండు వారాలకు ఒకసారి ఏదోక అప్‌డేట్‌ ఇస్తూ గేమ్‌ ఛేంజర్‌ గురించి చర్చ జరిగేలా ప్లాన్‌ చేస్తోంది. మరోవైపు ఇందులో చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. మరి టీజర్‌లో అతడి రెండు పాత్రల లుక్స్‌ను రివీల్‌ చేస్తారో లేదో చూడాలి.&nbsp; ఇదే తొలి చిత్రం! తమిళ అగ్ర దర్శకుడు శంకర్‌ ఇప్పటివరకూ ఎన్నో సూపర్‌ హిట్ చిత్రాలు తీశారు. ‘జెంటిల్‌మెన్‌’, ‘ప్రేమికుడు’, ‘భారతీయుడు’, ‘జీన్స్‌’, ‘ఒకే ఒక్కడు’, ‘బాయ్స్‌’, ‘అపరిచితుడు’, ‘శివాజీ’, ‘రోబో’ వంటి బ్లాక్‌ బాస్టర్స్‌తో తమిళంతో పాటు తెలుగులోనూ ఎంతో పాపులర్ అయ్యారు. అయితే అవన్నీ తెలుగులో డబ్‌ అయిన చిత్రాలు. ‘గేమ్‌ ఛేంజర్‌’ మాత్రమే శంకర్‌కు తొలి డైరెక్ట్‌ తెలుగు ఫిల్మ్‌. అంతేకాదు రామ్‌చరణ్‌తో కూడా తొలిసారి ఆయన వర్క్‌ చేశారు. కెరీర్‌లో ఇప్పటివరకూ సందేశాత్మక చిత్రాలనే రూపొందించిన శంకర్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ను కూడా అదే ప్యాట్రన్‌లో రూపొందించారు. ఆ కాన్సెప్ట్ ఏంటో తెలిసేలా ఓ థీమ్‌తో టీజర్‌ను కట్‌ చేసినట్లు తెలుస్తోంది. మరి టీజర్ ప్రేక్షకులను ఏమాత్రం అలరిస్తుందో చూడాలి. ఆ ఫైట్‌ సినిమాకే హైలెట్‌! ఇటీవల టీజర్‌ సూన్ అంటూ గేమ్‌ ఛేంజర్‌ టీమ్‌ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. అందులో చరణ్‌ ఓ టేబుల్‌ ముందు కుర్చీ వేసుకొని కూర్చోవడం, అతన్ని చంపడానికి పెద్ద సంఖ్యలో రౌడీలు అతడి వైపు దూసుకురావడం ఆసక్తిరేపింది. అయితే ఇది ‘గేమ్‌ ఛేంజర్’ ఇంట్రడక్షన్‌ సీన్‌ అని ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ‘RRR’ తరహాలో గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఈ మాబ్‌ ఫైట్ ఉంటుందని సమాచారం. ఇది సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని మూవీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫైట్ అయిపోయాక చరణ్‌ హెలికాఫ్టర్‌ ఎక్కి వెళ్తాడట. ఆ వెంటనే 'రా మచ్చ మచ్చ' సాంగ్‌ వస్తుందని చెబుతున్నారు. రికార్డు బిజినెస్? ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరగనున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో ఏకంగా రూ.150 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి. ఆంధ్రా నుంచి రూ. 70 కోట్లు, సీడెడ్ నుంచి రూ.25 కోట్లు, నైజాం ఏరియా నుంచి రూ. 55 కోట్ల మేర బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్లు ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాయి. ‘గేమ్‌ఛేంజర్‌’ను డిసెంబర్‌లో విడుదల చేయాలని భావించినప్పుడు ఇంత బిజినెస్ జరిగే అవకాశం కనిపించలేదట. అయితే ఈ మూవీ రిలీజ్ సంక్రాంతికి వాయిదా పడటంతో బిజినెస్ రేంజ్ అమాంతం పెరిగిపోయినట్లు ఫిల్మ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.&nbsp;
    నవంబర్ 05 , 2024
    <strong>Game Changer Day 1 Collections: సెన్సేషనల్ రికార్డు దిశగా గేమ్‌ ఛేంజర్ వసూళ్లు</strong>
    Game Changer Day 1 Collections: సెన్సేషనల్ రికార్డు దిశగా గేమ్‌ ఛేంజర్ వసూళ్లు
    గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ హీరోగా, మావెరిక్‌ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం “గేమ్‌ ఛేంజర్” గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో 15వ చిత్రంగా, శంకర్ కెరీర్‌ను నిర్ణయించే సినిమాగా గుర్తింపు పొందింది. అలాగే దిల్ రాజు బ్యానర్‌ 50వ ప్రాజెక్ట్‌గా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. శుక్రవారం(జనవరి 10) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ చిత్రం డే 1 కలెక్షన్లపై అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంపై మొదటి నుంచి విశేషంగా హైప్‌ క్రియేట్‌ చేసినప్పటికీ, ప్రమోషన్లు సరైన వేగంతో సాగలేకపోయాయి. దీని కారణంగా తెలుగు రాష్ట్రాల్లో చిత్ర బుకింగ్స్‌ కూడా కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ, సినిమా రిలీజ్‌ రోజుకి ట్రెండ్‌ మాత్రం అద్భుతంగా కొనసాగుతోంది. ఈ చిత్రం రామ్ చరణ్, శంకర్‌కి మరొక మైలురాయిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. డే 1 ఓపెనింగ్స్‌ రికార్డులు “గేమ్ ఛేంజర్” ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలై పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమా బుకింగ్స్‌ సాలిడ్‌గా కొనసాగుతున్నాయి. యూఎస్ మార్కెట్‌లో ప్రీమియర్స్‌ ద్వారా మొదటి రోజే 1 మిలియన్ డాలర్లను దాటినట్లు సమాచారం. ఈ హవా మొదటి రోజుకు వరల్డ్ వైడ్‌ సుమారు 100 కోట్ల గ్రాస్‌ను క్రాస్‌ చేసి, 120 నుండి 150 కోట్ల గ్రాస్ వరకు చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రముఖ ట్రేడ్ ప్రిడిక్షన్స్ ఈ చిత్రానికి సంబంధించి ట్రేడ్ వర్గాలు చెప్పిన ప్రిడిక్షన్స్‌ అనుసరించి, “గేమ్ ఛేంజర్” పాన్ ఇండియా స్థాయిలో భారీ కలెక్షన్లను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా విజువల్స్‌, గ్రాండ్ మేకింగ్, రామ్ చరణ్‌ పవర్ఫుల్‌ పెర్ఫార్మెన్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా శంకర్‌ దర్శకత్వ శైలి మరొకసారి ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందిస్తోంది. మేకర్స్‌ నుంచి అఫీషియల్‌ అప్‌డేట్ ప్రస్తుతం సినిమా ఫైనల్‌ కలెక్షన్లపై అధికారిక వివరాలు రావాల్సి ఉంది. యూఎస్‌ మార్కెట్‌ నుంచి వస్తున్న రిపోర్ట్స్‌ ప్రకారం, మొదటి రోజే ఈ చిత్రం భారీ కలెక్షన్లను అందుకుంటుందని స్పష్టమవుతోంది. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రానికి ఉన్న క్రేజ్‌ను బట్టి, ఇది రామ్ చరణ్ కెరీర్‌లో మరో హిట్‌గా నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సినిమా కథ ఇదే! ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఆధారంగా చేసుకుని కథ నడుస్తుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి (శ్రీకాంత్) “అభ్యుదయం” పార్టీ పేరుతో పరిపాలిస్తుంటాడు. అయితే, ఆయన తనయుడు మంత్రి అయిన బొబ్బిలి మోపిదేవి (ఎస్ జే సూర్య) ముఖ్యమంత్రి పదవిపై కన్నేసి ఉంటాడు. ఈ పరిస్థితుల్లో కలెక్టర్‌గా రామ్ నందన్ (రామ్ చరణ్) నియమించబడతాడు. మోపిదేవి, రామ్ నందన్ మధ్య పొలిటికల్ యుద్ధం ఎలా ప్రారంభమవుతుంది? ఈ క్రమంలో సత్యమూర్తి తన అనుచరుల ఎదుట రామ్ నందన్‌ను కొత్త ముఖ్యమంత్రిగా ఎందుకు ప్రకటిస్తాడు? అసలు అభ్యుదయం పార్టీ స్థాపకుడైన అప్పన్న (రామ్ చరణ్ ద్విపాత్రాభినయం) కథతో సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికి జవాబులు వెండితెర మీద గేమ్ ఛేంజర్‌లో చూడాల్సిందే. “గేమ్ ఛేంజర్” దిల్ రాజు బ్యానర్‌కు 50వ చిత్రంగా, శంకర్‌ దశాబ్దాల కెరీర్‌లో మరొక గేమ్‌ ఛేంజింగ్‌ ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. సినిమా బుకింగ్స్‌ మొదలయిన తర్వాత నుండి ట్రెండ్‌ అంచనాలకు మించి సాగుతోంది. ఈ చిత్రం భవిష్యత్తులో మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశం ఉంది.
    జనవరి 10 , 2025
    <strong>Game Changer: ఒక్క స్పీచ్‌తో ‘గేమ్‌ ఛేంజర్‌’పై అంచనాలు పెంచేసిన చరణ్‌.. వీడియో వైరల్‌</strong>
    Game Changer: ఒక్క స్పీచ్‌తో ‘గేమ్‌ ఛేంజర్‌’పై అంచనాలు పెంచేసిన చరణ్‌.. వీడియో వైరల్‌
    గ్లోబల్‌ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) లేటెస్ట్ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)పై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. 'పుష్ప 2' (Pushpa 2) తర్వాత టాలీవుడ్‌ నుంచి వస్తోన్న మరో బిగ్‌ ప్రాజెక్ట్‌ కావడంతో ప్రస్తుతం అందరూ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరెకెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్‌ కాబోతోంది. రిలీజ్‌కు మరో 19 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఈ సినిమా ప్రమోషన్స్‌పై మేకర్స్‌ దృష్టి సారించారు. అమెరికాలోని డల్లాస్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ప్లాన్‌ చేశారు. ఇందుకోసం రామ్‌చరణ్‌తో పాటు చిత్ర బృందం ప్రస్తుతం యూఎస్‌లో ల్యాండ్‌ అయ్యింది.  ఫ్యాన్స్‌ మీట్‌లో చరణ్ భరోసా ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ అమెరికాలోని డల్లాస్‌లో జరగనుంది. అక్కడ డిసెంబర్‌ 21 రాత్రి 9 గంటలకు ఈవెంట్‌ మెుదలుకానుంది. అంటే భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉ.8 గంటలకు ఈవెంట్‌ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రీ రిలీజ్‌కు ముందు ఏర్పాటు చేసిన ఫ్యాన్స్‌ మీట్‌లో చరణ్‌ మాట్లాడారు. తన సోలో మూవీ వచ్చి నాలుగేళ్లకు పైగా అయ్యిందని గుర్తు చేశారు. ‘నా బ్రదర్ తారక్‍తో RRR చేశాను. కానీ సోలో ఫిల్మ్ వచ్చి నాలుగేళ్లకు పైగానే అయింది. మూడున్నరేళ్ల పాటు గేమ్ ఛేంజర్ కోసం చాలా కష్టపడ్డాం. గేమ్ ఛేంజర్ సినిమా డైరెక్టర్ శంకర్ స్టైల్‍లో ఉంటుంది. సంక్రాంతికి ఈ మూవీ అద్భుతంగా ఉంటుంది. అసలు నిరుత్సాహపరచదు’ అని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  https://twitter.com/GulteOfficial/status/1870358771224244610 డల్లాస్‌లో దిగిన ఎస్‌.జే.సూర్య ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొనేందుకు తమిళ నటుడు ఎస్‌.జే. సూర్య అమెరికాలో ల్యాండ్‌ అయ్యారు. డల్లాస్ ఎయిర్‌పోర్టులో ఆయన దిగిన దృశ్యాలు నెట్టంట చక్కర్లు కొడుతున్నాయి. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన వెంటనే సూర్యతో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఆసక్తి కనబరిచారు. ఫ్యాన్స్‌తో కొద్దిసేపు ముచ్చటించిన అనంతరం సూర్య అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు. కాగా, గేమ్‌ ఛేంజర్‌ చిత్రంలో అతడు విలన్‌ పాత్ర పోషించారు. 'సరిపోదా శనివారం'కు మించి అతడి నటన ఉంటుందని మూవీలో చేసిన నటుడు శ్రీకాంత్‌ అన్నారు. దీంతో అతడి రోల్‌పై అందరిలో ఆసక్తి ఏర్పడింది.  https://twitter.com/GulteOfficial/status/1870388689530142754 దోప్‌ సాంగ్‌ రిలీజ్‌ షురూ.. ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) చిత్రం నుంచి ఫోర్త్‌ సింగిల్‌ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. దోప్‌ పేరుతో సాగే నాల్గో పాటను డల్లాస్‌లో జరిగే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లోనే విడుదల చేయనున్నారు. ఇటీవల ఈ సాంగ్‌ ప్రోమోను మేకర్స్‌ రిలీజ్ చేయగా విశేష స్పందన వచ్చింది. సాధారణ పాటలకు భిన్నంగా ఎంతో ఇన్నోవేటివ్‌గా ఈ పాటను తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. దీంతో మ్యూజిక్‌ లవర్స్‌లో ఈ పాటపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు థమన్‌ సంగీతం అందించగా అతడి కెరీర్‌లోనే ఈ పాట ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్న కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.  గేమ్‌ ఛేంజర్‌ రన్‌టైమ్‌ లాక్‌! రామ్‌చరణ్‌ హీరోగా చేసిన ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రంలో బాలీవుడ్‌ నటి కియారా అద్వానీ హీరోయిన్‌గా చేసింది. శ్రీకాంత్‌, సునీల్‌, అంజలి కీలక పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త హల్‌ చల్‌ చేస్తోంది. మూవీ రన్‌టైమ్‌ లాక్‌ అయినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. గేమ్‌ ఛేంజర్‌ ఫైనల్‌ ఔట్‌ పుట్‌ 2 గంటల 45 నిమిషాలకు లాక్‌ అయినట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. సినిమా చూసి డైరెక్టర్ శంకర్‌ చాలా సంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా కథనాలు వచ్చాయి. సెన్సార్‌ బోర్డ్‌ పర్యవేక్షణ తర్వాత రన్‌టైమ్ ఫైనల్‌ కానుంది. అదే డీసెంట్ మూవీ కావడంతో ఎలాంటి కత్తెరలు లేకుండా 165 నిమిషాలతోనే సినిమా వచ్చే ఛాన్స్ ఉంది.  https://twitter.com/GulteOfficial/status/1870337765688459552
    డిసెంబర్ 21 , 2024
    <strong>Game Changer: టెన్షన్‌లో మెగా ఫ్యాన్స్‌.. ‘గేమ్‌ ఛేంజర్‌’ ఈ ఏడాది రానట్లేనా?&nbsp;</strong>
    Game Changer: టెన్షన్‌లో మెగా ఫ్యాన్స్‌.. ‘గేమ్‌ ఛేంజర్‌’ ఈ ఏడాది రానట్లేనా?&nbsp;
    'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) వంటి బ్లాక్‌ బాస్టర్ తర్వాత రామ్‌చరణ్‌ (Ram Charan) నటిస్తున్న చిత్రం 'గేమ్ ఛేంజర్‌' (Game Changer). పొలిటికల్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని తమిళ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. క్రిస్మస్‌ కానుకగా ఈ సినిమా రాబోతున్నట్లు ఇటీవల దిల్‌ రాజు ప్రకటించడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కానీ, ఇప్పుడు ‘గేమ్‌ ఛేంజర్‌’కు కొత్త సమస్య మెుదలైనట్లు తెలుస్తోంది. దీని వల్ల ఈ ఏడాది సినిమా రిలీజ్‌ కాకపోవచ్చని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.  కారణం ఏంటంటే? మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer) చిత్రం ఈ ఏడాది విడుదల కాకపోవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. నిర్మాత దిల్‌ రాజు చెప్పినట్లు క్రిస్మస్‌కు విడుదల కాకపోవచ్చని స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. షూటింగ్‌ ఇంకా పూర్తి కాకపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. ఈ సినిమాకు ఇంకా 15 రోజులకు పైగా షూటింగ్‌ పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. పైగా కొత్త లొకేషన్స్‌ కోసం దర్శకుడు శంకర్‌ వెతుకుతున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు చెబుతున్నాయి. కావాల్సిన లొకేషన్స్‌ దొరికి మిగిలిన షూటింగ్‌ను ఫినిష్‌ చేసే సరికి మరింత సమయం పట్టే అవకాశముంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌, డబ్బింగ్‌ కంప్లీట్‌ చేసేసరికి డిసెంబర్‌ దాటి పోవచ్చని అంచనా వేస్తున్నారు. డిసెంబర్‌ 25న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలంటే మూవీ యూనిట్‌ మరింత వేగంగా పని చేయాల్సి ఉంటుంది. అయితే డైరెక్టర్‌ శంకర్‌ ప్రస్తుత స్పీడ్‌ చూస్తుంటే ఈ ఏడాది చరణ్‌ మూవీ రావడం కష్టమేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.&nbsp; 2024 సమ్మర్‌ కానుకగా! రామ్ చరణ్ - శంకర్‌ కాంబోలోని 'గేమ్ ఛేంజర్' చిత్రం డిసెంబర్‌ నుంచి 2025 సమ్మర్‌కి వెళ్లే ఛాన్స్‌ ఉందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. డిసెంబర్‌ మిస్‌ అయితే సంక్రాంతికి రిలీజ్‌ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటికే పలు చిత్రాలు పొంగల్‌ బరిలో నిలిచాయి. మెగాస్టార్‌ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. అలాగే వెంకటేష్‌- అనిల్‌ రావిపూడి చిత్రంతో పాటు అజిత్‌ నటిస్తున్న ‘గుడ్‌ బ్యాడ్ అగ్లీ’, ‘శతమానం భవతి 2’ కూడా సంక్రాంతి రేసులో నిలిచాయి. ఈ నేపథ్యంలో వాటికి పోటీగా ‘గేమ్‌ ఛేంజర్‌’ను బరిలోకి దింపడం కరెక్ట్‌ కాదని చిత్ర యూనిట్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అటు ఫిబ్రవరి, మార్చి పరీక్షల కాలం కావడంతో వేసవి సెలవుల్లో ‘గేమ్ ఛేంజర్‌’ రిలీజ్‌ కావొచ్చని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు.  గేమ్‌ ఛేంజర్‌పై భారీ ఆశలు! డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు 2’ (Indian 2) చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇది అసలు శంకర్‌ చిత్రంలానే లేదంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు పోస్టులు పెట్టారు. అంతకుముందు శంకర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘రోబో 2.0’, ‘ఐ’, ‘స్నేహితుడు’ వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద డీలా పడ్డాయి. దీంతో శంకర్‌ తిరిగి సక్సెస్‌ బాటలో పడేందుకు ‘గేమ్‌ ఛేంజర్‌’ కీలకంగా మారింది. అటు నిర్మాత దిల్‌రాజుకు కూడా గత చిత్రం పీడకలనే మిగిల్చింది. విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా తెరకెక్కిన ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైంది. దిల్‌రాజుకు భారీగా నష్టాలను మిగిల్చిందంటూ టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో వాటిని ‘గేమ్‌ ఛేంజర్‌’ పూడుస్తుందని దిల్‌ రాజు భావిస్తున్నారట. ప్రస్తుతం దర్శకుడు, నిర్మాత ఆశలన్నీ చరణ్‌ మూవీ సక్సెస్‌పైనే ఆధారపడి ఉన్నాయి.  కియారా పోస్టర్ అదుర్స్‌! గేమ్ ఛేంజర్ మూవీలో బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వాని (Kiara Advani) ఫీమేల్‌ లీడ్‌గా నటిస్తోంది. ఇటీవల ఈ భామ బర్త్‌డే సందర్భంగా చిత్ర బృందం ఓ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. ఈ పోస్టర్‌లో కియారా ఓ మల్టీ కలర్ లెహంగాలో ఎంతో అందంగా కనిపించింది. మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘జరగండి జరగండి’ పాటలోని లుక్ ఇది. ఇక ఈ చిత్రంలో చరణ్‌, కియారాలతో పాటు ఎస్‌.జే. సూర్య, అంజలి, శ్రీకాంత్‌, నాజర్‌, నవీన్‌ చంద్ర, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 
    ఆగస్టు 06 , 2024
    Game Changer Story: షాకింగ్‌.. ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా కథ లీక్‌.. ఆందోళనలో రామ్‌ చరణ్ ఫ్యాన్స్‌!
    Game Changer Story: షాకింగ్‌.. ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా కథ లీక్‌.. ఆందోళనలో రామ్‌ చరణ్ ఫ్యాన్స్‌!
    'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) వంటి గ్లోబల్‌ స్థాయి సక్సెస్‌ తర్వాత మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) చేస్తున్న చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer). దిల్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో చరణ్‌ జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ నటిస్తోంది. స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల నెట్టింట ప్రత్యక్షమైన లీకుల మినహా ఈ సినిమాపై యూనిట్‌ నుంచి చెప్పుకోతగ్గ అప్‌డేట్‌ రాలేదు. సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాకుండా చిత్ర యూనిట్‌ జాగ్రత్త పడుతూ వస్తోంది. కానీ ఇప్పుడు గేమ్ ఛేంజర్ కథ ఇదేనంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌.. ఈ కథను లీక్‌ చేయడం గమనార్హం.&nbsp; కథ ఏంటంటే? మంగళవారం అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) ఆధ్వర్యంలో భారీ ఈవెంట్‌ జరిగింది. త్వరలో తమ ఓటీటీలో రాబోయే సినిమాలని ప్రకటిస్తూ నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ హక్కులు సైతం తామే దక్కించుకున్నట్లు ప్రైమ్‌ వర్గాలు ప్రకటించాయి. అంతటితో ఆగకుండా త్వరలో స్ట్రీమింగ్‌కు రాబోయే సినిమాలు/ సిరీస్‌లకు సంబంధించిన స్టోరీ లైన్స్‌తో పాటు గేమ్‌ ఛేంజర్‌ ప్లాట్‌ను అమెజాన్‌ బహిర్గతం చేసింది. దీని ప్రకారం.. ‘పాలనలో మార్పులు తెచ్చేందుకు ఒక నిజాయతీపరుడైన ఐఏఎస్ అధికారి రాజకీయ అవినీతిపై ఎలా పోరాడారన్నదే కథ’. ప్రస్తుతం ఈ ప్లాట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో స్టోరీ ఎందుకు చెప్పారంటూ చరణ్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇందులో చరణ్‌ తండ్రి కొడులుగా డ్యూయల్‌ రోల్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.&nbsp; View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) వామ్మో ఏకంగా అన్ని కోట్లా! ‘గేమ్ ఛేంజర్’ సినిమా అన్ని భాషల్లో కలిపి డిజిటల్ రైట్స్‌ని అమెజాన్ ఏకంగా రూ.110 కోట్లకు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. థియేటర్లలోకి రాకముందే ఇంత భారీ ధర పెట్టి కొన్నారా? అని సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఏది ఏమైనా రూ.110 కోట్లకు డిజిటల్ రైట్స్ కొనుగోలు అంటే అది చాలా ఎక్కువనే చెప్పాలి. బడ్జెట్‌లో సగం రిలీజ్ అవ్వకుండా నిర్మాతలకు వచ్చేస్తుంది. ఈ వార్త నిజమైతే ఈ స్థాయిలో ఓటీటీ హక్కులకు అమ్ముడుపోయిన తొలి తెలుగు చిత్రంగా ‘గేమ్‌ ఛేంజర్‌’ నిలవనుంది.&nbsp; గ్రాండ్‌గా ఆరంభమైన 'RC16’ గేమ్‌ ఛేంజర్‌ తర్వాత రామ్‌చరణ్‌ తన తర్వాతి చిత్రాన్ని ‘ఉప్పెన’ డైరెక్టర్‌ బుచ్చిబాబుతో తీయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రామ్‌చరణ్, బుచ్చిబాబుతో పాటు మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్‌ శంకర్‌, హీరోయిన్ జాన్వీ కపూర్‌, ఆమె తండ్రి బోని కపూర్‌, నిర్మాత అల్లు అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.&nbsp; https://twitter.com/1012_raj/status/1770365882738573469 ఆ రోజున డబుల్‌ ధమాకా! మార్చి 27న రామ్‌చరణ్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు గ్రాండ్‌ ట్రీట్‌ ఇచ్చేందుకు ‘గేమ్ ఛేంజర్‌’, ‘RC16’ మేకర్స్ సిద్ధమవుతున్నారు. చరణ్‌ బర్త్‌డే రోజున ఓ అప్‌డేట్‌ ఉందని ఇప్పటికే గేమ్ ఛేంజర్‌ యూనిట్‌ ప్రకటించింది. అదే రోజున ‘RC16’ డైరెక్టర్‌ బుచ్చిబాబు కూడా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నట్లు సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. అదే నిజమైతే ఆ రోజున ఫ్యాన్స్‌ డబుల్ ట్రీట్ లభించనుంది.&nbsp;&nbsp;
    మార్చి 20 , 2024
    <strong>Game Changer: </strong><strong>RRR తరహాలో ‘గేమ్‌ ఛేంజర్‌’.. గుంపుతో మళ్లీ ఫైట్‌ చేయనున్న చరణ్‌?&nbsp;</strong>
    Game Changer: RRR తరహాలో ‘గేమ్‌ ఛేంజర్‌’.. గుంపుతో మళ్లీ ఫైట్‌ చేయనున్న చరణ్‌?&nbsp;
    గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) నటించిన పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌ 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్‌ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకొని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే గేమ్‌ ఛేంజర్ టీజర్‌ త్వరలో రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ ఓ స్పెషల్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. దీని ద్వారా మేకర్స్ ఓ విషయాన్ని చెప్పకనే చెప్పారని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు.&nbsp; గుంపుతో చరణ్‌ ఫైట్‌ RRR చిత్రంలోని రామ్‌చరణ్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌ ఎప్పటికీ ఫ్యాన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వందలాది మంది నిరసన కారులతో చరణ్‌ చేసే ఫైట్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. అయితే ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాలోనూ ఈ తరహా మాబ్‌ ఫైట్‌ను (Mob Fight) ఎక్స్‌పెక్ట్‌ చేయవచ్చని నెటిజన్లు చెబుతున్నారు. తాజాగా గేమ్‌ ఛేంజర్‌ టీమ్‌ రిలీజ్‌ చేసిన పోస్టర్‌ ఇదే విషయాన్ని తెలియజేస్తోందని అంటున్నారు. సినిమా రిలీజ్‌కు 75 రోజులు ఉన్న నేపథ్యంలో మేకర్స్ ఈ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. టీజర్‌ త్వరలో రానున్నట్లు ఇందులో హింట్ ఇచ్చారు. అయితే ఈ పోస్టర్‌ను గమనిస్తే చరణ్‌ ముందు టేబుల్ వేసుకొని కుర్చీలో కూర్చునట్లుగా వెనకనుంచి చూపించారు. అదే సమయంలో పదుల సంఖ్యల గుండాలు కత్తులు, కర్రలతో చరణ్‌ వైపు దూసుకురావడం చూపించారు. దీన్ని బట్టి RRR తరహాలో మాబ్‌ ఫైట్‌ను ఎక్స్‌పెక్ట్‌ చేయోచ్చని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మూవీ టీమ్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.&nbsp; కలిసొచ్చిన మాబ్‌ ఫైట్‌ మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌కు వందలాది మంది రౌడీలతో చేసే మాబ్‌ ఫైట్‌ బాగా కలిసొచ్చిందని చెప్పవచ్చు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమాలో చరణ్‌ తొలిసారి మాబ్ ఫైట్‌ చేశారు. ‘ఒక్కొక్కడిని కాదు షేర్‌ ఖాన్‌ 100 మందిని ఒకేసారి పంపించు’ శత్రు సైన్యంతో విరోచితంగా పోరాడాడు. ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపించిన ధ్రువ సినిమాలోనూ ఈ తరహా సీన్‌ను చూడవచ్చు. తనపైకి దూసుకొచ్చిన అల్లరిమూకకు బుద్ధి చెప్పే సీన్ ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత ‘RRR’లో చేసిన మాబ్‌ ఫైట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చరణ్‌ గుంపుతో ఫైట్‌ చేసిన ప్రతీ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ‘గేమ్‌ ఛేంజర్‌’లోనూ ఇలాంటి ఫైట్‌ ఉంటే ఆ మూవీ కూడా పక్కాగా విజయం సాధిస్తుందని ఫ్యాన్స్‌ నమ్మకంతో ఉన్నారు.&nbsp; దీపావళికి టీజర్‌ రిలీజ్‌! రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్‌’ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తోంది. మరో హీరోయిన్‌ అంజలి కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర, సునీల్, శ్రీకాంత్‌, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్‌, కోలీవుడ్ యాక్టర్లు ఎస్‌జే సూర్య, స‌ముద్రఖని, కన్నడ నటుడు జ‌య‌రామ్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్ అయినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీపావళి కానుకగా టీజర్‌ను విడుదల చేసే ప్లాన్‌లో మేకర్స్‌ ఉన్నట్లు సమాచారం. దీంతో మెగా ఫ్యాన్స్‌ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.&nbsp; రూ.150 కోట్లకు తెలుగు రైట్స్‌? ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరగనున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో ఏకంగా రూ.150 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి. ఆంధ్రా నుంచి రూ. 70 కోట్లు, సీడెడ్ నుంచి రూ.25 కోట్లు, నైజాం ఏరియా నుంచి రూ. 55 కోట్ల మేర బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్లు ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాయి. ‘గేమ్‌ఛేంజర్‌’ను డిసెంబర్‌లో విడుదల చేయాలని భావించినప్పుడు ఇంత బిజినెస్ జరిగే అవకాశం కనిపించలేదట. అయితే ఈ మూవీ రిలీజ్ సంక్రాంతికి వాయిదా పడటంతో బిజినెస్ రేంజ్ అమాంతం పెరిగిపోయినట్లు ఫిల్మ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.&nbsp; రికార్డు ధరకు ఓటీటీ హక్కులు! గేమ్‌ ఛేంజర్‌ ఓటీటీ హక్కులు సైతం రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ రూ.110 కోట్లకు గేమ్‌ ఛేంజర్‌ స్ట్రీమింగ్‌ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. కేవ‌లం సౌత్ లాంగ్వేజెస్ డిజిట‌ల్ రైట్స్ కోస‌మే అమెజాన్‌ ఇంత మెుత్తాన్ని ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. హిందీ డిజిట‌ల్ రైట్స్‌ను మ‌రో ఓటీటీ సంస్థ‌కు అమ్మేందుకు మేక‌ర్స్ ప్ర‌య‌త్నాలు చేస్తోన్న‌ట్లు తెలిసింది. మొత్తంగా ఓటీటీ ద్వారానే మేక‌ర్స్‌ రూ.150 కోట్ల మేర సొమ్ము చేసుకునే పరిస్థితులు ఉన్నాయని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 'గేమ్‌ ఛేంజర్‌' రిలీజ్‌కు ఇంకా రెండు నెలలకు పైగా సమయం ఉన్నప్పటికీ అంత పెద్ద మెుత్తంలో ఓటీటీ హక్కులు అమ్ముడుపోవడం మాములు విషయం కాదని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
    అక్టోబర్ 28 , 2024

    @2021 KTree