
UATelugu
సత్యభామ (ఆలియా భట్) ఓ డబ్బున్న ఇంట్లో హోటల్ మేనేజ్మెంట్ స్టాఫ్గా చేస్తుంటుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో తమ్ముడు అంకుర్ ఆనంద్ (వేదాంగ్ రైనా)ను తనే పెంచి పెద్దవాడ్ని చేస్తుంది. ఓ బిజినెస్ పనిమీద విదేశాలకు వెళ్లిన అంకుర్ అక్కడ డ్రగ్స్ తీసుకొని పట్టుబడతాడు. అక్కడి చట్టాల ప్రకారం అతడికి ఉరిశిక్ష విధిస్తారు. అప్పుడు సత్య ఏం చేసింది? తమ్ముడ్ని ఎలా రక్షించుకుంది? అన్నది స్టోరీ.
ఇంగ్లీష్లో చదవండి
రివ్యూస్
YouSay Review
Jigra Movie Review: తమ్ముడి కోసం అక్క చేసే విరోచిత పోరాటం.. ‘జిగ్రా’ ఎలా ఉందంటే?
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ‘RRR’ చిత్రంతో తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించింది. హిందీ ‘దేవర’ ప్రమోషన్స్లోనూ పాల్గొని తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచు...read more
How was the movie?
తారాగణం

అలియా భట్
ఆదిత్య నంద

శోభితా ధూళిపాళ

మనోజ్ పహ్వా

రవి కిషన్ శుక్లా
హర్ష్ ఏ సింగ్
వత్సన్ చక్రవర్తి

రాహుల్ రవీంద్రన్
సిబ్బంది
వాసన్ బాలదర్శకుడు

కరణ్ జోహార్
నిర్మాత
అలియా భట్
నిర్మాతఅపూర్వ మెహతానిర్మాత
షాహీన్ భట్నిర్మాత
సౌమెన్ మిశ్రానిర్మాత
స్వప్నిల్ S. సోనావానేసినిమాటోగ్రాఫర్
ప్రేరణ సైగల్ఎడిటర్ర్
కథనాలు

Jigra Movie Review: తమ్ముడి కోసం అక్క చేసే విరోచిత పోరాటం.. ‘జిగ్రా’ ఎలా ఉందంటే?
నటీనటులు : అలియా భట్, రాహుల్ రవీంద్రన్, వేదాంగ్ రైనా, అకాంక్ష రంజన్ కపూర్, మనోజ్ పహ్వా, యువరాజ్ విజయన్, జసన్ షా, ధీర్ హిరా, ఆదిత్య నంద తదితరులు
దర్శకత్వం : వాసన్ బాల
సంగీతం : అచింత్ థక్కర్
సినిమాటోగ్రఫీ : స్వప్నిల్ ఎస్. సోనావానే
ఎడిటింగ్ : ప్రేర్నా సైగల్
నిర్మాతలు : కరణ్ జోహార్, అలియా భట్, షాహీన్ భట్, అపూర్వ మెహతా
విడుదల తేదీ : 11-10-2024
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ‘RRR’ చిత్రంతో తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించింది. హిందీ ‘దేవర’ ప్రమోషన్స్లోనూ పాల్గొని తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. అటువంటి అలియా భట్ లీడ్రోల్ చేసిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘జిగ్రా’ (Jigra Movie Review). వాసన్ బాలా దర్శకుడు. తెలుగు నటుడు రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్ర పోషించాడు. అక్టోబరు 11న (Jigra Release Date) ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలోకి వచ్చింది. తెలుగులో ఏషియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) విడుదల చేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్ను మెప్పించిందా? ఇప్పుడు తెలుసుకుందాం.
కథేంటి
సత్యభామ (ఆలియా భట్) ఓ డబ్బున్న ఇంట్లో హోటల్ మేనేజ్మెంట్ స్టాఫ్గా చేస్తుంటుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో తమ్ముడు అంకుర్ ఆనంద్ (వేదాంగ్ రైనా)ను తనే పెంచి పెద్దవాడ్ని చేస్తుంది. మంచి బిజినెస్ ఐడియాతో ఉన్న అంకుర్ ఇన్వెస్టర్లను కలిసేందుకు మలేషియా దగ్గర్లో ఉన్న హన్షి దావో దేశానికి వెళ్తాడు. అక్కడ పార్టీలో డ్రగ్స్ తీసుకొని పోలీసులకు దొరికిపోతాడు. అక్కడి చట్టాల ప్రకారం అతడికి మరణశిక్ష విధిస్తారు. దీంతో తమ్ముడిని కాపాడటానికి సత్యభామ తనకు కుదిరిన ప్రయత్నాలన్నీ చేస్తుంది. కానీ ఫలితం ఉండదు. దీంతో జైలు నుంచి తప్పించడం తప్ప మరో మార్గం లేదని సత్య నిర్ణయిస్తుంది. మరి ఈ ప్రయత్నంలో సత్య విజయం సాధించిందా? ముత్తు (రాహుల్ రవీంద్రన్), భాటియా (మనోజ్ పహ్వా) ఎవరు? సత్యకు వారు ఏ విధంగా సాయపడ్డారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
సత్యభామగా ఆలియా భట్ అద్భుతంగా నటించింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. తమ్ముడిని కాపాడుకునే అక్క పాత్రలో అలియాను తప్ప మరొకరిని ఊహించలేనంత బాగా నటించింది. యాక్షన్ సీక్వెన్స్లోనూ దుమ్మురేపింది. తమ్ముడు అంకుర్ పాత్రలో వేదాంగ్ రైనా మంచి నటన కనబరిచాడు. అటు ముత్తు రూపంలో తెలుగు నటుడు రాహుల్ రవీంద్రన్కు మంచి పాత్ర దక్కింది. కథలో అతడి రోల్ ఎంతో కీలకం. మిగతా నటీనటులు తమ పాత్ర పరిధి మేరకు మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు వాసన్ బాలా జైల్ బ్రేక్ జానర్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా ప్రారంభమైన వెంటనే నేరుగా కథలోకి వెళ్లి అక్క, తమ్ముళ్ల బాండింగ్ను చక్కగా ఎస్టాబ్లిష్ చేశారు. వారి మధ్య ఉన్న స్ట్రాంగ్ రిలేషన్ను ఆడియన్స్ ఫీలయ్యేలా చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. అయితే అంకుర్ అరెస్టు వరకూ కథను అక్కడక్కడే తిప్పిన ఫీలింగ్ కలుగుతుంది. అరెస్టు తర్వాత నుంచి కథలో వేగం పెరుగుతుంది. జైలులో అతడు పడే తిప్పలు, తమ్ముడ్ని బయటకు తీసుకొచ్చేందుకు సత్య చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. తమ్ముడ్ని జైలు నుంచి తప్పించాలని సత్య నిర్ణయించుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. అందుకు ఆమె చేసే సాహాసోపేత ప్రయాణాన్ని చక్కగా తెరకెక్కించారు డైరెక్టర్. క్లైమాక్స్ వచ్చే యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్గా నిలుస్తుంది. అయితే సాగదీత సన్నివేశాలు, ఊహజనీతంగా కథనం, ట్విస్టులు లేకపోవడం మైనస్గా చెప్పవచ్చు.
టెక్నికల్గా
సాంకేతిక విభాగాలకు వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. జైలు వాతావరణాన్ని సినిమాటోగ్రాఫర్ చక్కగా ప్రజెంట్ చేశారు. ముఖ్యంగా క్లైమ్యాక్స్లో కొన్ని షాట్లు విజువల్ ఫీస్ట్లా అనిపిస్తాయి. సంగీతం కూడా పర్వాలేదు. నేపథ్య సంగీతం సినిమాకు తగ్గట్లు ఉంది. ఎడిటర్ మూవీని ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
అలియా భట్ నటనఅక్కా-తమ్ముడి సెంటిమెంట్యాక్షన్ సీక్వెన్స్సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
సాగదీత సీన్స్ఊహాజనీత కథనం
Telugu.yousay.tv Rating : 2.5/5
అక్టోబర్ 11 , 2024

Dussehra Movies Weekend Collections: దసరా చిత్రాల వీకెండ్ కలెక్షన్స్.. విజేత ఎవరంటే?
దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని గతవారం బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున చిత్రాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రాలు నాలుగు ఉన్నాయి. ‘వేట్టయన్’, ‘విశ్వం’, ‘మా నాన్న సూపర్ హీరో’, ‘జిగ్రా’ మూవీస్ దసరా కానుకగా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. మరి వీకెండ్ పూర్తయ్యే సరికి ఏ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఏ చిత్రం వసూళ్ల పరంగా టాప్లో నిలిచింది? ఇప్పుడు పరిశీలిద్దాం.
వేట్టయన్ (Vettaiyan)
రజనీకాంత్ హీరోగా టి. జే. జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ‘వేట్టయన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంపర కొనసాగిస్తోంది. గురువారం (అక్టోబర్ 10)న విడుదలైన ఈ చిత్రం తొలి నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్గా రూ. 201.21 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ఒక్క తమిళనాడులోనే రూ.81 కోట్లను తన ఖాతాలో వేసుకున్నట్లు తెలిపాయి. తెలుగుల రాష్ట్రాల్లో రూ.15.50 కోట్లు, కేరళలో రూ.13.20 కోట్లు, కర్ణాటకలో రూ. 19.25 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.5 కోట్లు రాబట్టినట్లు చెప్పాయి. అటు ఓవర్సీస్లో ఏకంగా రూ. 67.26 కోట్లు వసూలు చేసినట్లు వివరించాయి. కలెక్షన్ల పరంగా చూస్తే వేట్టయన్ రూ.200 కోట్ల క్లబ్లో చేరి దసరా విజేతగా నిలిచిందని చెప్పవచ్చు.
https://twitter.com/Filmy_Track/status/1845727131768082555
విశ్వం (Viswam)
మాస్ సినిమాల స్పెషలిస్ట్ గోపీచంద్, కామెడీ కింగ్ శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన విశ్వం చిత్రం దసరా సందర్భంగా రిలీజై పర్వాలేదనిపించింది. అక్టోబర్ 11 (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దారుణంగా ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. తొలి మూడు రోజుల్లో ఈ చిత్రం రూ. 7 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఏపీలో రూ.3.60 కోట్లు, నైజాంలో రూ. 2.20 కోట్లు, కర్ణాటకలో రూ.30 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.20 లక్షలు మాత్రమే రాబట్టినట్లు అభిప్రాయపడ్డాయి. అటు ఓవర్సీస్లో కేవలం రూ.20 లక్షలు మాత్రమే వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. అయితే రెండో రోజు నాటికే డిస్టిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి 100 శాతం రికవరీ అయినట్లు నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధికారిక పోస్టు పెట్టడం గమనార్హం.
https://twitter.com/AndhraBoxOffice/status/1845695019199463627
https://twitter.com/Colliderreview/status/1845720361499083121
మా నాన్న సూపర్ హీరో (Maa Nanna Super Hero)
సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా తెరకెక్కిన మరో వైవిధ్యమైన సినిమా ‘మా నాన్న సూపర్ హీరో’ (Maa Nanna Superhero). అక్టోబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి ఫీల్గుడ్ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా మాత్రం తీవ్రంగా నిరాశ పరుస్తోంది. ఈ చిత్రం వీకెండ్ పూర్తయ్యేసరికి రూ. 75 లక్షలు (GROSS) మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో రూ.68 కోట్లు నెట్ వసూళ్లుగా ఉన్నట్లు తెలిపాయి. తొలి రోజు రూ.19 లక్షలు, రెండో రోజు రూ.26 లక్షలు, మూడో రోజు రూ.23 లక్షలు మాత్రమే రాబట్టినట్లు వివరించాయి. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.5.2 కోట్లు రాబట్టాల్సి ఉంది. ప్రస్తుత వసూళ్లను బట్టి చూస్తే ఈ సినిమా లాభాల్లోకి రావడం కష్టంగానే కనిపిస్తోంది.
జిగ్రా (Jigra)
బాలీవుడ్ బ్యూటీ లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ చిత్రం 'జిగ్రా'. వాసన్ బాలా దర్శకత్వం వహించారు. తెలుగు నటుడు రాహుర్ రవీంద్రన్ ముఖ్య పాత్ర పోషించాడు. అక్టోబర్ 11న తెలుగు, హిందీతో పాటు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో వరల్డ్ వైడ్గా ఈ చిత్రం రూ.26 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఒక్క హిందీ బెల్ట్లోనే రూ.16.47 కోట్లు వసూలు చేసినట్లు వివరించాయి. హిందీలో రాజ్కుమార్ రావు, త్రిప్తి దిమ్రీ కాంబోలో రిలీజైన 'విక్కీ ఔర్ విద్యా కా వోహ్ వాలా' మూవీ నుంచి జిగ్రాకు గట్టి పోటీ ఎదురైనట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. దీంతో జిగ్రా కలెక్షన్స్లో కొంతమేర కోత పడినట్లు అభిప్రాయపడుతున్నారు.
అక్టోబర్ 14 , 2024

OTT Suggestions: ‘పుష్ప 2’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రముఖ ఓటీటీ సంస్థలు ప్రతీవారం కొత్త సినిమాలను తీసుకొస్తూ ఆడియన్స్ను పసందైన ఆనందాన్ని పంచుతున్నాయి. అయితే ఈ వారంతం కంటెంట్ పరంగా తెలుగు ప్రేక్షకులకు ది బెస్ట్ అని చెప్పవచ్చు. థియేటర్లో పలు ఆసక్తికర చిత్రాలు ఈ వారం ఓటీటీలోకి వచ్చేశాయి. మరికొన్ని రాబోతున్నాయి. వీటిలో మీ అభిరుచికి తగ్గ సినిమాను ఎంచుకుని ఓటీటీలో చూసేందుకు వీకెండ్లో ప్లాన్ చేసుకోండి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి ప్లాట్స్ ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం. (OTT Suggestions)
అమరన్ (Amaran)
పాన్ ఇండియా స్థాయిలో (OTT Releases) విడుదలై భారీ విజయం అందుకున్న రీసెంట్ తమిళ చిత్రం 'అమరన్' (Amaran OTT Platform). అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. శివ కార్తికేయన్, సాయి పల్లవి కీలక పాత్రలు పోషించారు. రాజ్ కుమార్ పెరియసామి డైరెక్ట్ చేశారు. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు వచ్చింది. తెలుగు, హిందీతో పాటు దక్షిణాది భాషల్లో వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే ‘ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) బాల్యం నుంచే సైనికుడు కావాలని కలగంటాడు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. ఆయన భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్గా ఎంపికవుతాడు. విధుల్లో చేరిన తర్వాత వారి ప్రేమను ఇందు కుటుంబం తిరస్కరిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి, వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఈ జంట తర్వాత ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించారనేది ఆసక్తికరంగా సాగుతుంది. మరి ముకుంద్ వరదరాజన్ దేశం కోసం ఎలాంటి త్యాగం చేశాడు? దేశం కోసం ఎలాంటి సాహసాలు చేశాడు?’ అనేది మిగతా కథ.
మట్కా (Matka)
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘మట్కా’ (Matka) కూడా ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చింది. డిసెంబర్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఇందులో వరుణ్కు జోడీగా మీనాక్షి చౌదరి నటించింది. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో 20 రోజులు తిరక్కముందే ఓటీటీలోకి వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘వాసు (వరుణ్ తేజ్) బతుకుదెరువు కోసం బర్మా నుంచి వైజాగ్ వస్తాడు. కూలీగా పనిచేస్తూ అనేక కష్టాలు పడతాడు. జీవితంలో ఏదైనా సాధించాన్న లక్ష్యం వాసుకి ఉంటుంది. ఈ క్రమంలో మట్కా గ్యాంబ్లింగ్లోకి అడుగుపెట్టడం అతడి కెరీర్ను ఊహించని మలుపు తిప్పుకుంది. మట్కాలో బాగా కలిసిరావడంతో అందులో ఎవరికి అందనంతగా ఎత్తుకు ఎదుగుతాడు. గ్యాంగ్స్టర్గా వ్యవస్థను శాసించే స్థాయికి వెళ్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? సుజాతతో వాసు లవ్ట్రాక్ ఏంటి?’ అన్నది స్టోరీ.
విక్కీ విద్యా కా వో వాలా వీడియో (Vicky Vidya Ka Woh Wala Video)
’యానిమల్’ బ్యూటీ త్రిప్తి దిమ్రి (OTT Suggestions) నటించిన లేటెస్ట్ చిత్రం ఈ వీకెండ్లోనే ఓటీటీలోకి రాబోతోంది . 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో' (Vicky Vidya Ka Woh Wala Video OTT Platform) సినిమా డిసెంబర్ 6 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబోతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఇందులో రాజ్కుమార్ రావ్, త్రిప్తి దిమ్రి జంటగా నటించారు. రాజ్ శాండిల్య డైరెక్ట్ చేశారు. అక్టోబర్ 11న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించింది. ప్లాట్ ఏంటంటే ‘1997 సంవత్సరంలో వికీ (రాజ్ కుమార్ రావు), విద్యా (త్రిప్తి డిమ్రీ) ఇద్దరు పెళ్లి చేసుకొంటారు. ఫస్ట్ నైట్ మధుర జ్ఞాపకాలను ఓ సిడీలో బంధిస్తారు. అయితే అనూహ్యంగా ఆ సీడీ దొంగతనానికి గురవుతుంది. ఆ తర్వాత ఆ ఇద్దరి దంపతుల పరిస్థితి ఏంటి? అన్నది స్టోరీ.
జిగ్రా (Jigra)
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ 'జిగ్రా' (Jigra OTT). ఈ చిత్రం కూడా ఈ వీకెండ్లో ఓటీటీలోకి రాబోతోంది. డిసెంబర్ 6 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్లోకి రానుంది. కరుణ్ జోహర్ నిర్మించిన ఈ చిత్రం దీపావళికి రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. వాసన్ బాల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో తెలుగు నటుడు రాహుల్ రవీంద్రన్ కీలక పాత్ర పోషించాడు. అలియా చేసిన సత్య పాత్రకు తమ్ముడిగా వేదాంగ్ రైనా నటించాడు. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ఈ చిత్రం ఓటీటీలో మంచి రెస్పాన్స్ అందుకుంటుందని చిత్ర బృందం ఆశిస్తోంది. ప్లాట్ ఏంటంటే ‘సత్యభామ (ఆలియా భట్) ఓ డబ్బున్న ఇంట్లో హోటల్ మేనేజ్మెంట్ స్టాఫ్గా చేస్తుంటుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో తమ్ముడు అంకుర్ ఆనంద్ (వేదాంగ్ రైనా)ను తనే పెంచి పెద్దవాడ్ని చేస్తుంది. ఓ బిజినెస్ పనిమీద విదేశాలకు వెళ్లిన అంకుర్ అక్కడ డ్రగ్స్ తీసుకొని పట్టుబడతాడు. అక్కడి చట్టాల ప్రకారం అతడికి ఉరిశిక్ష విధిస్తారు. అప్పుడు సత్య ఏం చేసింది? తమ్ముడ్ని ఎలా రక్షించుకుంది?’ అన్నది స్టోరీ.
మందిర (Mandira)
సన్నీ లియోనీ (Sunny Leone) ప్రధాన పాత్రలో దర్శకుడు ఆర్. యువన్ తెరకెక్కించిన సినిమా ‘మందిర’ (Mandira). ఈ మూవీ డిసెంబర్ 5 (OTT Suggestions) నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ వచ్చింది. నవంబర్ 22న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఇందులో సన్నీ ద్విపాత్రాభియనం చేసింది. ఈ హారర్ కామెడీ మూవీలో యోగిబాబు, సతీశ్ కీలక పాత్రలు పోషించారు. ప్లాట్ ఏంటంటే 'గత జన్మలో అనకొండపురం అనే రాజ్యానికి ఓ యువరాణి అయిన మందిర ఇప్పుడు దెయ్యంలా ఎలా మారింది? అసలు ఆమె కథేంటి? అన్నది స్టోరీ.
కంగువా (Kanguva)
తమిళ హీరో సూర్య (Suriya) నటించిన లేటెస్ట్ చిత్రం 'కంగువా' (Kanguva OTT Release) ఓటీటీ రిలీజ్ డేట్ను లాక్ చేసుకుంది. వచ్చే వారం డిసెంబర్ 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్లోకి రానుంది. నెల రోజుల వ్యవధిలోనే ఈ సినిమా ఓటీటీలోకి రానుండటం విశేషం. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. తమిళ డైరెక్టర్ శివ రూపొందించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్గా చేసింది. హిందీ నటి దిశా పటాని కథానాయికగా చేసింది. థియేటర్లలో మోస్తరు టాక్ తెచ్చుకోవడంతో కంగువాను త్వరగా ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. ప్లాట్ ఏంటంటే ‘ఫ్రాన్సిస్ (సూర్య) గోవాలో బౌంటీ హంటర్గా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు ఫ్రాన్సిస్ను ఒక పాప కలుస్తుంది. ఆ పాపకి తనకు ఎదో బంధం ఉందని అతడికి అనిపిస్తుంది. ఆ బంధం ఇప్పటిది కాదు గత జన్మదని అతడికి అర్థమవుతుంది. 1000 ఏళ్ల కిందట ఆ పాపతో ఫ్రాన్సిస్కు ఉన్న సంబంధం ఏంటి? అసలు కంగువా ఎవరు? తెగ నాయకుడిగా అతడు చేసిన పోరాటాలు ఏంటి? విలన్ (బాబీ డియోల్) నుంచి అతడి తెగకు ఎదురైన ముప్పు ఏంటి?’ అన్నది స్టోరీ.
క (Ka)
ఇదిలా ఉంటే గతవారం పలు ఆసక్తికర చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. అవి ఇప్పటివరకూ చూడకుండా ఉంటే ఈ వీకెండ్తో ఎంచక్కా చూసేయండి. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ చిత్రం 'క' (Ka OTT Release) గత వారమే ఓటీటీలోకి వచ్చింది. ఈటీవీ విన్ వేదికగా నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా చేశారు. ప్లాట్ ఏంటంటే ‘అభినయ్ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనే యువకుడు ఒక అనాథ. తన కుటుంబాన్ని కోల్పోయిన బాధలో గడిపే అభినయ్, చిన్నతనం నుంచే తల్లి దండ్రుల కోసం బాధపడుతూ ఉంటాడు. అనాధ ఆశ్రమం నుండి తప్పించుకుని, తన మాస్టర్ గురునాథం వద్ద డబ్బులు దొంగిలించి పారిపోతాడు. అతనికి పుస్తకాలు, ఉత్తరాలు చదవడం అంటే ఇష్టం. ఈ ఉత్సాహం అతనిని కొత్త మార్గంలో పయనించేలా చేస్తుంది. చివరకు కృష్ణగిరి అనే గ్రామానికి వచ్చి అక్కడ పోస్ట్ మాన్ ఉద్యోగంలో చేరతాడు. ఆ ఊరిలో సత్యభామ (నయన్ సారిక)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అభినయ్ను ప్రేమిస్తుంది.. ఇదే సమయంలో ఆ ఊరిలో అమ్మాయిలు ఆచూకీ లేకుండా పోతుంటారు. ఆ మిస్టరీ వెనక ఉన్నది ఎవరు? చివరికి అభినయ్ వాసుదేవ్ ఈ సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు?’ అనేది మిగతా కథ.
లక్కీ భాస్కర్ (Lucky Bhaskar)
దుల్కర్ సల్మాన్ (Dulquar Salman), మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary) నటించిన తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’ (Lucky Bhaskar OTT Release) సైతం గత వారమే ఓటీటీలోకి వచ్చింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 28 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రసారం అవుతోంది. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే ‘భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) ముంబైకి చెందిన సాధారణ బ్యాంకు ఉద్యోగి. అతని జీవితంలో ప్రధాన బాధ్యతలతో పాటు కుటుంబ అవసరాలు కూడా ఉంటాయి. భార్య సుమతి (మీనాక్షి చౌదరి), కొడుకు, తండ్రి, చెల్లి, తమ్ముడితో అతని జీవితం సాగుతుంది. అతను తన జీతంతో కుటుంబాన్ని పోషించే క్రమంలో అప్పుల ముప్పు తట్టుకుని కూడా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. కానీ, ఆ ప్రమోషన్ అతని కలగానే మిగిలిపోతుంది. తాను చేస్తున్న అన్ని ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. చివరికి తన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం భాస్కర్ ఓ పెద్ద రిస్క్ తీసుకుంటాడు. ఆ రిస్క్ అతను ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు?’ అనేది కథ.
వికటకవి (Vikkatakavi)
యువ నటుడు నరేష్ అగస్త్య (Naresh Agastya) 'మత్తు వదలరా', 'సేనాపతి', 'పంచతంత్రం' చిత్రాలతో తెలుగు ఆడియన్స్కు బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడు అతడు చేసిన లేటెస్ట్ సిరీస్ ‘వికటకవి’ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించిన ఈ సిరీస్లో మేఘా ఆకాష్ (Megha Akash) హీరోయిన్గా చేసింది. షిజు అబ్దుల్ రషీద్, రఘు కుంచె, అమిత్ తివారి, ముక్తార్ ఖాన్, అమిత్ తివారి, తారక్ పొన్నప్ప కీలక పాత్రలు చేశారు. జీ5 ఓటీటీలో గతవారం తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్కు వచ్చింది. ప్లాట్ ఏంటంటే 'అమరగిరి ఊరిలోని దేవతల గుట్ట (కొండ)కు వెళ్లిన ప్రజలు గతం మర్చిపోతుంటారు. అమ్మోరు శాపం వల్లే అలా జరుగుతున్నట్లు వారు నమ్ముతుంటారు. ఈ మిస్టరీని కనుగొనేందుకు డిటెక్టివ్ రామకృష్ణ రంగంలోకి దిగుతాడు. దేవతల గుట్టపైకి వెళ్తాడు. అక్కడ ఏం తెలుకున్నాడు? అమరగిరి సంస్థానానికి చెందిన లక్ష్మీ (మేఘా ఆకాష్)తో అతడికి పరిచయం ఎలా ఏర్పడింది? ఇంతకీ దేవతల గుట్టకు ఉన్న శాపం ఏంటి?' అన్నది స్టోరీ.
‘పుష్ప 2’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'పుష్ప 2' (Pushpa 2 OTT Release) థియేటర్లను షేక్ చేస్తోంది. దీంతో ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి రావొచ్చన్న చర్చ మెుదలైంది. వాస్తవానికి 'పుష్ప 2' స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. సాధారణగా ఏ సినిమా అయినా 6-8 వారాల గ్యాప్తో ఓటీటీలోకి వస్తుంటాయి. అయితే 'పుష్ప 2'ను మాత్రం నెల రోజుల్లో స్ట్రీమింగ్కు తీసుకొచ్చేలా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే జనవరి ఫస్ట్ వీక్లో ఓటీటీలోకి రావాల్సి ఉంటుంది. కానీ, ‘పుష్ప 2’ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడం, సంక్రాంతి వరకూ పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో థియేటర్లలో నెల రోజులకు పైగా పుష్పగాడికి తిరుగుండక పోవచ్చు. కాబట్టి సంక్రాంతికి ‘పుష్ప 2’ను ఓటీటీలోకి తీసుకొచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అది మిస్ అయినా పది రోజుల గ్యాప్తో వచ్చే రిపబ్లిక్ డే (జనవరి 26) రోజునైనా 'పుష్ప 2' కచ్చితంగా స్ట్రీమింగ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది.
డిసెంబర్ 05 , 2024

OTT Releases This Week Telugu: ఈ వారం పుష్ప గాడిదే హవా.. ఓటీటీలోకి ఎగ్జైటింగ్ ఫిల్మ్స్!
యావత్ దేశంలోని సినీ ప్రేమికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఓ మోస్ట్ వాంటెడ్ చిత్రం ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతోంది. దీంతో ఆ సినిమాను తట్టుకొని నిలబడేందుకు ఈ సినిమా సాహించలేదు. దీంతో ఈ వీక్ ఒకే ఒక్క సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది. మరోవైపు ఓటీటీ (OTT Releases This Week Telugu)లో మాత్రం పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్సిరీస్లు రాబోతున్నాయి. వాటికి సంబంధించిన విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రం
పుష్ప 2 (Pushpa 2)
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప' చిత్రం 2021లో విడుదలై ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. దీంతో దానికి సీక్వెల్గా రూపొందిన 'పుష్ప 2' దేశవ్యాప్తంగా అందరి దృష్టి పడింది. ఈ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. తెలుగు, హిందీతో పాటు పలు దక్షిణాది భాషల్లో ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ (Pushpa 2 Advance Booking) సైతం మెుదలయ్యాయి. ఈ మూవీలో బన్నీకి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్గా చేసింది. మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ (Fahad Fazil) ఇందులో విలన్గా చేశాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు, ప్రమోషన్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.
ఓటీటీలోకి వచ్చే చిత్రాలు / వెబ్ సిరీస్లు
అమరన్ (Amaran)
పాన్ ఇండియా స్థాయిలో (OTT Releases This Week Telugu) విడుదలై భారీ విజయం అందుకున్న రీసెంట్ తమిళ చిత్రం 'అమరన్' (Amaran OTT Platform). అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. శివ కార్తికేయన్, సాయి పల్లవి కీలక పాత్రలు పోషించారు. రాజ్ కుమార్ పెరియసామి డైరెక్ట్ చేశారు. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, హిందీతో పాటు దక్షిణాది భాషల్లో వీక్షించవచ్చు.
మట్కా (Matka)
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘మట్కా’ (Matka OTT Platform)కూడా ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. డిసెంబర్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఇందులో వరుణ్కు జోడీగా మీనాక్షి చౌదరి నటించింది. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో 20 రోజులు తిరక్కముందే ఓటీటీలోకి వస్తోంది. మరీ ఓటీటీ ఆడియన్స్ను మెప్పిస్తుందా లేదా చూడాలి.
విక్కీ విద్యా కా వో వాలా వీడియో (Vicky Vidya Ka Woh Wala Video)
యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి (OTT Releases This Week Telugu) నటించిన లేటెస్ట్ చిత్రం ఈ వారమే ఓటీటీలోకి రాబోతోంది. 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో' (Vicky Vidya Ka Woh Wala Video OTT Platform) సినిమా డిసెంబర్ 6 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబోతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఇందులో రాజ్కుమార్ రావ్, త్రిప్తి దిమ్రి జంటగా నటించారు. రాజ్ శాండిల్య డైరెక్ట్ చేశారు. అక్టోబర్ 11న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించింది. శోభనం రోజు వీడియో చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది.
జిగ్రా (Jigra)
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ 'జిగ్రా' (Jigra OTT Platform). ఈ చిత్రం కూడా ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. డిసెంబర్ 6 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్లోకి రానుంది. కరుణ్ జోహర్ నిర్మించిన ఈ చిత్రం దీపావళికి రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. వాసన్ బాల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో తెలుగు నటుడు రాహుల్ రవీంద్రన్ కీలక పాత్ర పోషించాడు. అలియా చేసిన సత్య పాత్రకు తమ్ముడిగా వేదాంగ్ రైనా నటించాడు. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ఈ చిత్రం ఓటీటీ (OTT Releases This Week Telugu)లో మంచి రెస్పాన్స్ అందుకుంటుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
కంగువా (Kanguva)
తమిళ హీరో సూర్య (Suriya) నటించిన లేటెస్ట్ చిత్రం 'కంగువా' (Kanguva OTT Release) ఓటీటీ రిలీజ్ డేట్ను లాక్ చేసుకుంది. డిసెంబర్ 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్లోకి రానుంది. నెల రోజుల వ్యవధిలోనే ఈ సినిమా ఓటీటీలోకి రానుండటం విశేషం. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. తమిళ డైరెక్టర్ శివ రూపొందించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్గా చేసింది. హిందీ నటి దిశా పటాని కథానాయికగా చేసింది. థియేటర్లలో మోస్తర్ టాక్ తెచ్చుకోవడంతో కంగువాను త్వరగా ఓటీటీలోకి తీసుకొస్తున్నారు.
TitleCategoryLanguagePlatformRelease DateChurchill At WarDocumentaryEnglishNetflixDec 04That CristamasAnimationEnglishNetflixDec 04The Only Girl In The OrchestraDocumentaryEnglishNetflixDec 04The AlitimatamSeriesEnglishNetflixDec 04Black DovesMovieEnglishNetflixDec 05A Nonsense Cristamas MovieEnglishNetflixDec 06Mary MovieEnglishNetflixDec 06Jack in Time For Cristamas MovieEnglishAmazon Dec 03Pop Culture ZeppadySeriesEnglishAmazon Dec 04AgneeMovieHindiAmazon Dec 06LongingMovieEnglishJio CinemaDec 07The OriginalSeriesEnglish/KoreanHot starDec 03Light ShopSeriesEnglish/KoreanHot starDec 04Mairy MovieHindiZee 5Dec 06Tanav 2MovieHindi/TeluguSonyLIVDec 06
డిసెంబర్ 02 , 2024

New Ott Releases This Week: దసరా స్పెషల్.. ఈ వారం రాబోతున్న కొత్త చిత్రాలు ఇవే!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దసరా సందడి నెలకొంది. ఈ పండగను పురస్కరించుకొని తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఈ వారం బాక్సాఫీస్ వద్ద అలరించనున్నాయి. అటు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్సిరీస్లు స్ట్రీమింగ్ రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు
వేట్టయాన్ (Vettaiyan)
తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన లేటెస్ట్ చిత్రం ‘వేట్టయాన్’. ‘జై భీమ్’ వంటి సోషల్ మెసేజ్ మూవీతో ప్రేక్షకులను అలరించిన టి.జె.జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించారు. దసరా కానుకగా అక్టోబరు 10న ఈ చిత్రం విడుదల (Vettaiyan Release Date) కానుంది. జైలర్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత రజనీ నటించిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో వేట్టయాన్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
విశ్వం (Viswam)
ప్రముఖ నటుడు గోపిచంద్ (Gopichand) హీరోగా శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ’విశ్వం’ (Viswam). ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి సంయుక్తంగా నిర్మించారు. కావ్య థాపర్ హీరోయిన్గా చేసింది. అక్టోబరు 11న (Viswam Movie Release Date) విడుదలవుతోంది. కామెడీ చిత్రాలకు కేరాఫ్గా మారిన శ్రీను వైట్లతో నటుడు గోపిచంద్ గతకొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాలని ధీమాతో ఉన్నారు. ఇప్పటికే విడుదలైన విశ్వం ట్రైలర్, టీజర్ ఆకట్టుకున్నాయి.
మా నాన్న సూపర్ హీరో (Maa Nanna Super Hero)
సుధీర్ బాబు (Sudheer Babu) కథానాయకుడిగా అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’ (Maa Nanna Super Hero). ఆర్ణ కథానాయికగా చేసింది. షాయాజీ షిండే కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడంతో అంచనాలను రేకెత్తించాయి.
జనక అయితే గనక (Janaka Ithe Ganaka)
యంగ్ హీరో సుహాస్ వరుసగా చిత్రాలు రిలీజ్ చేస్తూ దూసుకుపోతున్నాడు. వైవిధ్యమైన కథలతో మంచి విజయాలను సాధిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు నటించిన లేటెస్ట్ చిత్రం ‘జనక అయితే గనక’ ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. సంకీర్తన కథానాయక. ఈ చిత్రాన్ని దిల్రాజు ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. సందీప్ బండ్ల దర్శకత్వం వహించారు. అక్టోబరు 12న ఈ మూవీ విడుదల కానుంది.
జిగ్రా (Jigra)
అలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో వాసన్ బాలా రూపొందించిన బాలీవుడ్ చిత్రం ‘జిగ్రా’. అక్టోబరు 11న (Jigra Release Date) థియేటర్లలోకి రానుంది. తెలుగులో ఏషియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రానా దగ్గుబాటి విడుదల చేస్తున్నారు. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలయికతో వచ్చిన ఈ చిత్రం అన్నివర్గాలు ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇప్పటికే విడుదలై ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది.
మార్టిన్ (Martin)
కన్నడ నటుడు ధ్రువ సర్జా ఈ వారం మార్టిన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎ.పి. అర్జున్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వైభవి శాండిల్య కథానాయిక.ఈ పాన్ ఇండియా చిత్రాన్ని అక్టోబరు 11న (Martin Movie Release Date) విడుదల చేస్తున్నారు. యాక్షన్ చిత్రాల ప్రేమికులను ఈ మూవీ తప్పక మెప్పిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు
లెవెల్ క్రాస్
అమలాపాల్ హీరోయిన్గా నటించిన మలయాళం మూవీ ‘లెవెల్ క్రాస్’ థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి అర్ఫాజ్ అయూబ్ దర్శకత్వం వహించాడు. ఆసిఫ్ అలీ హీరోగా నటించాడు. అక్టోబర్ 11 నుంచి ఆహాలో ఈ చిత్రం ప్రసారం కానుంది. ప్లాట్ ఏంటంటే చైతాలి (అమలాపాల్) ట్రైన్ ప్రమాదంలో గాయపడుతుంది. ఆమెను రైల్వే గేట్మెన్ రఘు (ఆసిఫ్ అలీ) కాపాడుతాడు. రఘుని కలిసిన తర్వాత నుంచి చైతాలి జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. చైతాలి తనకు పెళ్లి అయినట్లుగా ఎందుకు భ్రమపడుతుంది? వారిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? అన్నది స్టోరీ.
TitleCategoryLanguagePlatformRelease DateYoung SheldonMovieEnglishNetflixOct 08Monster High 2MovieEnglishNetflixOct 10Khel Khel MeinMovieHindiNetflixOct 09Starting 5SeriesEnglishNetflixOct 10Tomb Raider: Lara CroftAnimationEnglishNetflixOct 10Lonely PlanetMovieEnglishNetflixOct 10Outer Banks 4SeriesEnglishNetflixOct 10Up RisingSeriesEnglish/KoreanNetflixOct 11ChuckyMovieEnglishNetflixOct 15SurfiraMovieHindiHotstarOct 11WarieMovieTamilHotstarOct 11Pailan PillagaMovieTeluguETV WinOct 10Thatva MovieTeluguETV WinOct 10Guter GuMovieHindiJio CinemaOct 11Tea cupMovieEnglishJio CinemaOct 11Jai MahendranMovieMalayalamSonyLIVOct 11Raat Jawan HieMovieHindiSonyLIVOct 11
అక్టోబర్ 07 , 2024

Zebra Movie Review: ఈసారైనా సత్యదేవ్ హిట్ కొట్టాడా? ‘జిబ్రా’ ఎలా ఉందంటే?
నటీనటులు : సత్యదేవ్, డాలీ ధనంజయ్, ప్రియా భవానీ శంకర్, అమృత అయ్యంగార్, జెన్నీఫర్, సునీల్, సత్య, సత్యరాజ్, సురేష్ చంద్ర మీనన్ తదితరులు
దర్శకత్వం : ఈశ్వర్ కార్తిక్
సంగీతం : రవి బస్రూర్
సినిమాటోగ్రఫీ: సత్య పొన్మార్
ఎడిటింగ్: అనిల్ క్రిష్
నిర్మాతలు: ఎస్.ఎన్. రెడ్డి, బాల సుందరం, దినేష్ సుందరం
విడుదల తేదీ: నవంబర్ 22, 2024
సత్యదేవ్ (Satya Dev), డాలి ధనంజయ్ (Daali Dhananjaya) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జీబ్రా’ (Zebra Movie Review). ‘పెంగ్విన్’ సినిమాను డైరెక్ట్ చేసిన ఈశ్వర్ కార్తీక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రియా భవానీ శంకర్, అమృత అయ్యంగార్ కథానాయికలుగా చేశారు. వైట్ కాలర్ క్రైమ్ డ్రామాలో దీనిని రూపొందించారు. మెగాస్టార్ చిరు (Chiranjeevi) ఈ మూవీ ప్రమోషన్స్లో స్వయంగా పాల్గొనడంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. నవంబర్ 22న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా? సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న సత్యదేవ్కు విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
మిడిల్ క్లాస్కు చెందిన సూర్య (సత్యదేవ్) బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్లో రిలేషన్ షిప్ మేనేజర్గా పని చేస్తుంటాడు. తోటి ఉద్యోగిని స్వాతి (ప్రియ భవానీ శంకర్)ని ఇష్టపడతాడు. ఓ రోజు స్వాతి తప్పుడు అకౌంట్కు రూ.4 లక్షల డబ్బును ట్రాన్ఫర్ చేస్తుంది. సదరు వ్యక్తిని సంప్రదించగా డబ్బు వాడేసుకున్నట్లు చెబుతాడు. దీంతో ఆ సమస్య నుంచి స్వాతిని కాపాడేందుకు సూర్య రంగంలోకి దిగుతాడు. సమస్యను పరిష్కరించే క్రమంలో అనుకోకుండా రూ.5 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్లో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలతో రాష్ట్రంలోనే ఎంతో ప్రమాదకారి అయిన ఆది (ధనంజయ్)ని సూర్య ఢీ కొట్టాల్సి వస్తుంది. సూర్య అతడ్ని ఎలా ఎదుర్కొన్నాడు? సూర్య లైఫ్లోకి ఆది ఎలా వచ్చాడు? రూ.5 కోట్ల ఫ్రాడ్ కేసు సూర్యను ఇంకెంత పెద్ద సమస్యలోకి నెట్టివేసింది? ఈ సమస్యల నుంచి చివరికీ బయటపడ్డాడా? లేదా? అన్నది స్టోరీ (Zebra Movie Review).
ఎవరెలా చేశారంటే
సూర్య పాత్రలో నటుడు సత్యదేవ్ (Satyadev) మరోమారు దుమ్ములేపాడని చెప్పవచ్చు. ఈ సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. కామెడీ, యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్ ఇలా అన్ని కలగలిసిన పాత్రలో సత్యదేవ్ అదరగొట్టాడు. సత్యదేవ్ తర్వాత ఆ స్థాయిలో మెప్పించాడు కన్నడ నటుడు డాలి ధనంజయ్. ఆది పాత్రలో అతడు జీవించేశాడు. సినిమాలో అత్యంత పవర్ఫుల్ పాత్ర అతడిదే. కొన్ని సన్నివేశాల్లో సత్యదేవ్ను డామినేట్ చేశాడన్న ఫీలింగ్ కలుగుతుంది. ప్రియా భవానీ శంకర్కు ప్రాధాన్యం ఉన్న పాత్రనే దక్కింది. జెన్నిఫర్ తన గ్లామర్తో ఆడియన్స్ను ఫిదా చేసింది. సత్య కామెడీ టైమింగ్ మరోమారు ఈ సినిమాలో ఆకట్టుకుంటుంది. సినిమా మెుత్తం సూర్య వర్సెస్ ఆది అన్నట్లు సాగిపోవడంతో మిగిలిన పాత్రలు పెద్దగా హైలెట్ కాలేదు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ బ్యాంకింగ్ రిలేటెడ్ కంటెంట్ (Zebra Movie Review)ను తీసుకొని ఎగ్జిక్యూట్ చేసిన విధానం చాలా బాగుంది. ముఖ్యంగా స్క్రీన్ప్లే విషయంలో అతడి నైపుణ్యం బాగా కనిపిస్తుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగే ఫ్రాడ్స్ను కళ్లకు కట్టే ప్రయత్నంలో కొంతమేర దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కెరీర్ ప్రారంభంలో బ్యాంక్ ఎంప్లాయిగా ఈశ్వర్ కార్తిక్ పని చేయడం సినిమాకు కలిసివచ్చింది. అయితే సాధారణ బ్యాంక్ ఎంప్లాయి అయిన హీరో నాలుగు రోజుల్లో రూ.5 కోట్లను సంపాదించడం కన్విన్సింగ్గా అనిపించదు. రూ.100 కోట్ల సమస్యను సైతం ఒక్క ఈమెయిల్తో తప్పించుకోవడం కూడా లాజిక్కు అందదు. లాజిక్కులను పట్టించుకోని ప్రేక్షకులకు మాత్రం జిబ్రా కచ్చితంగా నచ్చుతుందని చెప్పవచ్చు. సత్యదేవ్ - డాలీ మధ్య జరిగే ఇంట్రస్టింగ్ వార్, సత్య కామెడీ, సునీల్ నటన, డైలాగ్స్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి.
సాంకేతికంగా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే (Zebra Movie Review) రవి బస్రూర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ మరో లెవల్కు తీసుకెళ్లింది. పాటలు మాత్రం గుర్తుంచుకునేలా లేవు. సత్య పోన్మార్ కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. బ్యాంక్ను పర్ఫెక్ట్గా రీక్రియేట్ చేసి ఆర్ట్ డిపార్ట్మెంట్ మంచి మార్కులు కొట్టేసింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
కథ, స్క్రీన్ప్లేసత్యదేవ్, ధనంజయ్ నటననేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
లాజిక్కు అందని సన్నివేశాలుఇరికించినట్లు వచ్చే పాటలు
Telugu.yousay.tv Rating : 2.5/5
నవంబర్ 22 , 2024

Miss You Review: మిస్ ఫైర్ అయిన సిద్ధార్థ్ ఎమోషనల్ డ్రామా.. మరో ఫ్లాప్ ఖాతాలో పడినట్లే!
నటీనటులు : సిద్ధార్థ్, ఆషికా రంగనాథ్, కరుణాకరన్, బాల శరవణన్ తదితరలు
డైరెక్టర్ : ఎన్. రాజశేఖర్
సంగీతం: జిబ్రాన్
సినిమాటోగ్రఫీ: కె.జి. వెంకటేష్
ఎడిటర్: దినేష్ పోనరాజ్
నిర్మాత : శామ్యూల్ మాథ్యూ
విడుదల తేదీ: డిసెంబర్ 13, 2024
ప్రముఖ నటుడు సిద్ధార్థ్ (siddharth), కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ జంటగా నటించిన తాజా చిత్రం ‘మిస్ యు’ (Miss You Movie Review In Telugu). యు.ఎన్.రాజశేఖర్ దర్శకుడు. ఈ చిత్రాన్ని 7 మైల్స్ పర్ సెకండ్ సంస్థ నిర్మించింది. ఒక యునిక్ లవ్ కాన్సెప్ట్తో ఈ సినిమాను రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కు తమ చిత్రం తప్పక నచ్చుతుందని ప్రమోషన్స్ సందర్భంగా ఊదరగొట్టింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 13న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఫెయిల్యూర్స్తో ఇబ్బందిపడుతున్న సిద్ధార్థ్కు సక్సెస్ అందించిందా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.
కథేంటి
వాసు (సిద్ధార్థ్) డైరెక్టర్ కావాలని కలలు కంటాడు. ఈ ప్రయత్నాల్లో ఉండగా అనుకోకుండా అతడికి యాక్సిడెంట్ జరుగుతుంది. దీంతో రెండు సంవత్సరాల గతాన్ని మర్చిపోతాడు. ఈ క్రమంలో ఓ రోజు బాబీ (కరుణాకరన్)తో అయి పరిచయం అతడి జీవితంలో అనుకోని పరిణామాలను తీసుకొస్తుంది. అతడితో కలిసి బెంగళూరుకు వెళ్లిన వాసుకి అక్కడ సుబ్బలక్ష్మీ (ఆషికా రంగనాథ్) పరిచయమవుతుంది. తొలి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. వెంటనే ఈ విషయాన్ని ఆమెకు చెప్తాడు. అయితే సుబ్బలక్ష్మీ రిజెక్ట్ చేస్తుంది. అయితే సుబ్బలక్ష్మీ అలా ఎందుకు చేసింది? వాసుతో సుబ్బలక్ష్మీకి ముందే పరిచయం ఉందా? మంత్రితో ఆమెకున్న ఉన్న వైరం ఏంటి? వాసు మర్చిపోయిన రెండేళ్లలో ఏం జరిగింది? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
వాసు పాత్రలో నటుడు సిద్ధార్థ్ (Miss You Review) మరోమారు సెటిల్డ్ నటనతో ఆకట్టుకున్నాడు. బాగా కలిసొచ్చిన లవర్ బాయ్ పాత్రలో అలరించాడు. వాసు పాత్రకు అతడు పూర్తిగా న్యాయం చేశాడని చెపొచ్చు. ఇక హీరోయిన్ సుబ్బలక్ష్మీ పాత్రలో ఆషికా రంగనాథ్ (Miss You Movie Review In Telugu) అదరగొట్టింది. క్యారెక్టరైజేషన్ పరంగా చూస్తే సిద్ధార్థ్ కన్నా ఆమె రోల్ బాగా హైలెట్ అయ్యింది. కరుణాకర్ కామెడీ పంచ్లు బాగానే పేలాయి. మిగతా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఓ మోస్తరుగా అలరించారు. జయప్రకాశ్, శరత్ లోహితస్వ నటన బాగుంది. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు ఎన్.రాజశేఖర్ రాసుకున్న కథ బాగున్నా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో పూర్తిగా తడబడ్డాడు. వాసు పాత్రను డిజైన్ చేసిన తీరు సైతం ఏమాత్రం ఆకట్టుకోదు. సినిమాను ప్రారంభించిన విధానం బాగున్నప్పటికీ కథ సాగుతున్న కొద్ది క్యూరియాసిటీగా అనిపించదు. యాక్సిడెంట్ తర్వాత ఆడియన్స్లో ఆసక్తి పెంచినప్పటికీ ఆపై వచ్చే రెగ్యులర్ సీన్స్తో కథను సాదాసీదాగ మార్చేశారు. హీరో పరిచయం, యాక్సిడెంట్ తర్వాత వచ్చే సీన్స్, కరుణాకరణ్ కామెడీతో ఫస్టాఫ్ పర్వాలేదనిపిస్తుంది. సెకండాఫ్ మాత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారు డైరెక్టర్. సినిమాకు ఎంతో కీలకమైన ఎమోషనల్ డ్రామాను సరిగ్గా పండించలేకపోయారు. క్లైమాక్స్ మినహా మిగతా ఎమోషనల్ సీన్స్ అన్ని సాగదీసిన ఫీలింగ్ను కలిగిస్తాయి.
సాంకేతికంగా..
టెక్నికల్ అంశాలకు వస్తే (Miss You Movie Review In Telugu) జిబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. పాటలు మాత్రం పెద్దగా కనెక్ట్ కావు. వెంకటేష్ సినిమాటోగ్రఫీ వర్క్ డిసెంట్గా అనిపిస్తుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
ప్రధాన తారాగణం నటనకామెడీ సీన్స్నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
ఆసక్తిలేని కథనంకనెక్ట్ కానీ ఎమోషన్ డ్రామారొటీన్ సన్నివేశాలు
Telugu.yousay.tv Rating : 2/5
డిసెంబర్ 13 , 2024

Tollywood Box office: 75% పడిపోయిన విష్వక్ సేన్ మార్కెట్.. సత్యదేవ్, ఆశోక్ గల్లా పరిస్థితి మరీ దారుణం!
ఈ వారం టాలీవడ్ నుంచి మూడు కీలక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యాయి. మాస్ కా దాస్ విష్వక్ సేన్ (Vishwak Sen) నటించిన ‘మెకానిక్ రాకీ’ (Mechanik Rocky) శుక్రవారం (నవంబర్ 22)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాంతో పాటు విలక్షణ నటుడు సత్యదేవ్(Sathyadev) హీరోగా చేసిన ‘జిబ్రా’ (Zebra) కూడా ఆడియన్స్ను పలకరించింది. అలాగే ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కథ ఇచ్చిన కథతో ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva)బాక్సాఫీస్ బరిలో నిలిచింది. అయితే విష్వక్, సత్యదేవ్ చిత్రాలు యావరేజ్ టాక్ తెచ్చుకోగా అశోక్ గల్ల (Ashok Galla) నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. మరీ తొలి రోజు ఈ చిత్రాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి. తీవ్రంగా దెబ్బతిన్నాయా? లేదా మంచి వసూళ్లనే సాధించాయా? ఇప్పుడు పరిశీలిద్దాం.
‘మెకానిక్ రాకీ’ కలెక్షన్స్ ఎంతంటే
విష్వక్ సేన్ (Vishwaksen) హీరోగా మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలుగా చేసిన చిత్రం ‘మెకానిక్ రాకీ’ (Mechanik Rocky Day 1 Collections). రవితేజ ముళ్లపూడి (Raviteja Mullapudi) దర్శత్వం వహించారు. శుక్రవారం (నవంబర్ 22) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఏడాది ఇప్పటికే ‘గామి’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రాలతో విష్వక్ ప్రేక్షకులను పలకరించాడు. మంచి హిట్ టాక్ కూడా సొంతం చేసుకున్నాడు. ‘మెకానిక్ రాకీ’తో ఎలాగైన హ్యాట్రిక్ హిట్ కొట్టాలని భావించిన విష్వక్కు ఈ మూవీ ఝలక్ ఇచ్చారు. యావరేజ్ టాక్ మాత్రమే తెచ్చుకుంది. ఈ ప్రభావం తొలి రోజు కలెక్షన్స్పై స్పష్టంగా కనిపించింది. మెకానిక్ రాకీ తొలి రోజు వరల్డ్ వైడ్గా రూ. 2.3 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టగలిగింది. ఇది విష్వక్ స్థాయికి చాలా తక్కువనే చెప్పాలి. ఆయన గత చిత్రాలు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘గామి’ తొలి రోజున వరుసగా రూ.8 కోట్లు, రూ.8.6 కోట్ల గ్రాస్ సాధించింది. అంతకుముందు వచ్చిన ‘దాస్ కా ధమ్కీ’ కూడా రూ.8.88 కోట్లు వసూలు చేసింది. ఆ చిత్రాలతో పోలిస్తే మెకానిక్ రాకీ డే 1 కలెక్షన్స్ 75% మేర పడిపోయాయని చెప్పవచ్చు.
‘జిబ్రా’ కలెక్షన్స్ ఎంతంటే
సత్యదేవ్ (Satya Dev), డాలి ధనంజయ్ (daali dhananjaya) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జీబ్రా’ (Zebra Movie Review). ‘పెంగ్విన్’ సినిమాను డైరెక్ట్ చేసిన ఈశ్వర్ కార్తీక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రియా భవానీ శంకర్, అమృత అయ్యంగార్ కథానాయికలుగా చేశారు. వైట్ కాలర్ క్రైమ్ డ్రామాలో దీనిని రూపొందించారు. మెగాస్టార్ చిరు (Chiranjeevi) ఈ మూవీ ప్రమోషన్స్లో స్వయంగా పాల్గొనడంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. నవంబర్ 22న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో తడబడింది. యావరేజ్ టాక్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫలితంగా తొలి రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్గా రూ.65.8 లక్షలు మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.55.5 లక్షలు వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. శని, ఆది వారాల్లో సినిమా కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ లేకపోలేదని తెలిపాయి.
దేవకీ నందన వాసుదేవ కలెక్షన్స్ ఎంతంటే
ప్రముఖ వ్యాపారవేత్త గల్లా జయదేవ్ కుమారుడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ (Ashok Galla) హీరోగా రూపొందిన తాజా చిత్రం 'దేవకీ నందన వాసుదేవ' (Devaki Nandana Vasudeva Review). హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ మూవీకి కథ అందించగా అర్జున్ జంద్యాల దర్శకత్వం వహించారు. ఇందులో ఆధ్యాత్మిక, వాణిజ్య అంశాలతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని చిత్ర యూనిట్ మెుదటి నుంచి చెబుతూ వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం (నవంబర్ 22) రిలీజైన ఈ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకొని అందరినీ షాక్కు గురించేసింది. మూవీ టాక్కు తగ్గట్లే కలెక్షన్స్ కూడా దారుణంగా నమోదయ్యాయి. తొలి రోజు ఈ చిత్రం వరల్డ్వైడ్గా రూ.15.5 లక్షలు మాత్రమే దక్కించుకుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీకి వచ్చిన నెగిటివ్ టాక్ వల్ల రానున్న రోజుల్లో కలెక్షన్స్ ఇంకా తగ్గే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరీ ఏం జరుగుతుందో చూడాలి.
నవంబర్ 23 , 2024

Chiranjeevi: కుర్ర హీరోలకు గాడ్ ఫాదర్గా చిరంజీవి.. ఈ మెగా అండకు బిగ్ సెల్యూట్!
టాలీవుడ్కు చెందిన అగ్ర కథానాయకుల్లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఒకరు. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు ఇండస్ట్రీని శాసించారు. ఆరు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ జనరేషన్ యంగ్ హీరోలందరికీ చిరునే ఇన్స్పిరేషన్. కొత్తగా రాబోతున్న వారికి సైతం చిరునే ప్రేరణ. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో ఏ అండ లేని కుర్ర హీరోలకు మెగాస్టార్ చిరు భరోసాగా నిలుస్తున్నారు. యంగ్ హీరోల మూవీ ప్రమోషన్స్కు హాజరవుతూ సినిమా సక్సెస్కు తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు. తాజాగా సత్యదేవ్ నటించిన ‘జిబ్రా’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు సైతం ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. చిన్న సినిమా పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించి కుర్ర హీరోల్లో ఉత్సాహాన్ని నింపారు.
చిన్న చిత్రాలపై ప్రశంసలు..
చిరంజీవి వీరాభిమాని, యువ కథానాయకుడు సత్యదేవ్ (Sathya Dev) నటించిన 'జీబ్రా' సినిమా ఈనెల 22న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఏడాది చిన్న సినిమాలు సాధించిన విజయాల గురించి అక్కడ చిరు ప్రస్తావించారు. సంక్రాంతికి విడుదలైన ప్రశాంత్ వర్మ - తేజ సజ్జాల 'హనుమాన్' సినిమా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు', సిద్దు జొన్నలగడ్డ హీరోగా చేసిన 'టిల్లు స్క్వేర్' సైతం విజయాలు సాధించాయని గుర్తుచేశారు. దీపావళికి విడుదలైన 'లక్కీ భాస్కర్', 'క', 'అమరన్' సినిమాలు కూడా విజయాలు సాధించడం మంచి పరిణామమన్నారు. కీరవాణి తనయుడు శ్రీ సింహ, కమెడియన్ సత్య నటించిన 'మత్తు వదలరా 2' సినిమాను రెండుసార్లు చూశానని చెప్పారు. చిరు లాంటి బిగ్స్టార్ తమ సినిమాలను ప్రస్తావిస్తూ ప్రశంసించడంపై ఆయా చిత్ర బృందాలు సంతోషంలో మునిగాయి.
https://twitter.com/GulteOfficial/status/1856370891417932076
యంగ్ హీరోలకు భరోసా
తనను ప్రేరణగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ జనరేషన్ హీరోలకు మెగాస్టార్ చిరు అండగా నిలుస్తూ వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సత్యదేవ్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కు మెగాస్టార్ హాజరయ్యారు. అంతేకాదు తన ‘గాడ్ఫాదర్’ చిత్రానికి సత్యదేవ్ను విలన్గా సజెస్ట్ చేసి అతడి కెరీర్కు బూస్టప్ ఇచ్చారు. గతంలో ఓ సినిమా ఈవెంట్కు హాజరైన చిరు, యంగ్ హీరో సుహాస్పై ప్రశంసలు కురిపించారు. కలర్ ఫొటోలో సుహాస్ నటన బాగుందంటూ ప్రశంసించారు. చిరు మాటలకు సుహాస్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకొని చాలా ఎమోషనల్ అయ్యాడు. అలాగే ‘శ్రీకారం’ మూవీ ప్రీరిలీజ్కు హాజరై యువ హీరో శర్వానంద్ను ఆశీర్వదించాడు. రీసెంట్గా ‘కమిటీ కుర్రాళ్లు’ టీమ్ చిరు ఇంటికి వెళ్లగా అందులో లీడ్ రోల్ చేసిన యశ్వంత్ను అశీర్వచనాలు అందజేసాడు. ఫొటో దిగే క్రమంలో చిరుపై యశ్వంత్ చేయివేయగా ఆప్యాయంగా వేయించుకున్నారు. ఇలా అవకాశం దొరికనప్పుడల్లా కుర్ర హీరోలను ప్రోత్సహిస్తూ చిరు అండగా నిలుస్తున్నారు.
జపాన్ వెళ్లనున్న మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం 'విశ్వంభర' (Viswambhara) చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ మూవీ కోసం చిరు జాపన్ వెళ్లనున్నారు. అక్కడ పది రోజుల పాటు షూటింగ్లో పాల్గొంటారు. ఈ షెడ్యూల్లో పాటలతో పాటు కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. కాగా, 'విశ్వంభర' సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘అంజి’ సినిమాల తరహాలో సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. 2025 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా రామ్చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కోసం చిరు వెనక్కి తగ్గారు.
ఈ ఏడాది మూడు విశిష్ట గౌరవాలు
అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi)కి ఈ ఏడాది మరుపురాని జ్ఞాపకాలను అందించింది. మూడు విశిష్టమైన పురస్కారాను మెగాస్టార్ అందుకున్నారు. గత నెల ప్రతిష్టాత్మక ఏఎన్నార్ జాతీయ అవార్డు చిరంజీవిని వరించింది. అక్కినేని నాగార్జున కుటుంబికుల సమక్షంలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఈ అవార్డు ప్రధానం చేశారు. ఈ ఏడాది జూన్లో దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ను రాష్ట్రపతి చేతుల మీదగా చిరు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి చిరు భార్య సురేఖ, కుమారుడు రామ్చరణ్, కోడలు ఉపాసన, కూతురు సుస్మితా హాజరై మురిసిపోయారు. ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోను చిరు స్థానం సంపాదించారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది.
నవంబర్ 13 , 2024

Vikrant Massey Net worth: సినిమా కెరీర్లో విక్రాంత్ మెస్సే ఎంత సంపాదించాడో తెలుసా?
బాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ మాస్సే (Vikrant Massey) సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 37 ఏళ్ల ఈ టాలెంటెడ్ నటుడు తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఇటీవలే ‘12th ఫెయిల్’ చిత్రంతో విక్రాంత్ మాస్సే పేరు మార్మోగింది. ఈ చిత్రం పలు అవార్డులను సైతం కొల్లగొట్టింది. దీంతో బాలీవుడ్లో విక్రాంత్కు ఒక్కసారిగా ఆఫర్లు పెరిగాయి. చేతినిండా ప్రాజెక్ట్స్తో అతడు బిజీగా మారిపోయారు. అలాంటి సమయంలో సినిమాలకు బిగ్ బ్రేక్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కారణం ఏంటంటే?
సినిమాలకు కొంత కాలం బ్రేక్ ఇస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా విక్రామ్ మాస్సే (Vikrant Massey Net worth) ప్రకటించాడు. ఇందుకు గల కారణాలను వివరిస్తూ సుదీర్ఘ పోస్టు పెట్టాడు. కొన్నేళ్ల నుంచి ప్రేక్షకులు చూపిస్తున్న అసాధారణ ప్రేమ, అభిమానానికి విక్రాంత్ థ్యాంక్స్ చెప్పారు. ఇకపై కుటుంబ సభ్యులకు టైమ్ ఇవ్వాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. అందుకే ఇకపై కొత్త ప్రాజెక్ట్స్ అంగీకరించనని స్పష్టం చేశారు. 2025లో విడుదలయ్యే చిత్రమే తన చివరిదని స్పష్టం చేశాడు. ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలంటూ తన నోట్ను ముగించాడు. అయితే విక్రాంత్ నిర్ణయాన్ని ఆయన అభిమానులు తీసుకోలేకపోతున్నారు. మరోసారి ఆలోచించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఫ్యామిలీ, ప్రొఫెషనల్ లైఫ్ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగమని సూచిస్తున్నారు.
విక్రాంత్ సినీ నేపథ్యం
సినిమాలకు బ్రేక్ ఇవ్వడంతో విక్రాంత్ మాస్సే (Vikrant Massey Net worth) పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. అతడి గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. విక్రాంత్ (Vikrant Massey) 1987 ఏప్రిల్ 3న ముంబయిలో జన్మించాడు. అక్కడి ఆర్.డి. నేషనల్ కాలేజీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు. 2007లో వచ్చిన 'ధూమ్ మచావో ధూమ్' సీరియల్తో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ధరమ్ వీర్ (2008), ‘బాలిక వధు’, ‘కుతుబ్ హై’ సీరియల్స్లో చేశాడు. 2013లో వచ్చిన ‘లూతేరా’ ఫిల్మ్తో బాలీవుడ్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత పదుల సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ పెద్దగా బ్రేక్ రాలేదు. 2018లో వచ్చిన 'మీర్జాపుర్' సిరీస్ నటుడిగా అతడికి గుర్తింపు తెచ్చిపెట్టింది. గతేడాది చేసిన '12th ఫెయిల్' మూవీ విక్రాంత్ కెరీర్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ ఏడాది వచ్చిన 'సెక్టార్ 36' ఫిల్మ్ సైతం నటుడిగా విక్రాంత్ను మరో మెట్టు ఎక్కించింది. ఈ ఏడాదే వచ్చిన 'ది సబర్మతి రిపోర్ట్' సైతం విక్రాంత్కు మంచి మార్కులు పడేలా చేసింది. ప్రస్తుతం విక్రాంత్ చేతిలో 'యార్ జిగ్రి', 'టీఎంఈ', 'అన్కౌన్ కి గుస్తాఖియాన్' ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
కొడుకు కోసం స్పెషల్ టాటూ!
విక్రాంత్ మాస్సే (Vikrant Massey Net worth) కుటుంబానికి చాలా విలువ ఇస్తాడు. బాలీవుడ్ నటి షీతల్ థాకూర్ (Sheetal Thakur) ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2022 ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజున తొలుత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. నాలుగు రోజుల తర్వాత ఫిబ్రవరి 18న కుటుంబ సభ్యుల సమక్షంలో హిందూ సంప్రదాయల ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. విక్రాంత్కు ఈ ఏడాది ఫిబ్రవరిలో బాబు పుట్టాడు. అతడికి వర్ధన్ పేరు పెట్టాడు. కొడుకుపై ప్రేమకు గుర్తుగా చేతిపై పుట్టిన తేదీతో సహా వర్ధన్ అనే పేరును టాటూ వేసుకున్నాడు. దీన్ని బట్టి కుటుంబానికి, కుమారుడికి విక్రాంత్ ఎంత ప్రాధాన్యత ఇస్తాడో అర్థమవుతుంది. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్ట్స్ ఉండటంతో వారితో సమయం గడపడం కుదరట్లేదని సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించాడు.
ఆ హీరోయిన్కు బిగ్ ఫ్యాన్
విక్రాంత్ మాస్సే (Vikrant Massey) ఇష్టా ఇష్టాలకు వస్తే బాలీవుడ్లో అతడికి చాలా మంది ఫేవరేట్ హీరోలు ఉన్నారు. అజయ్ దేవగన్, కె.కె. మీనన్, ఇర్ఫాన్ ఖాన్, పంకజ్ కపూర్ తన అభిమాన నటులని విక్రాంత్ చెబుతుంటాడు. అయితే హీరోయిన్ విషయంలో మాత్రం విక్రాంత్కు చాలా స్పష్టత ఉంది. ప్రముఖ నటి టబు విక్రాంత్కు ఫేవరేట్ యాక్ట్రెస్. అటు ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ (1999), ‘వాస్తవ్’ (1999), ‘యువ’ (2004) చిత్రాలు విక్రాంత్కు ఆల్టైమ్ ఫేవరేట్ అని చెప్పవచ్చు. స్పోర్ట్స్ విషయానికి వస్తే క్రికెట్ను విక్రాంత్ బాగా ఇష్టపడతాడు. ఫుడ్ విషయానికి వస్తే రాజ్మా చావల్, పాలక్ పన్నీర్ను ఎంతో ఇష్టంగా విక్రాంత్ తింటాడు. డ్యాన్సింగ్, ట్రావెలింగ్, క్రికెట్ ఆడటం, పర్ఫ్యూమ్స్ను కలెక్ట్ చేయడం వంటివి విక్రాంత్ హాబీలుగా చెప్పవచ్చు. ఫుడ్ విషయానికి వస్తే రాజ్మా చావల్, పాలక్ పన్నీర్ను ఎంతో ఇష్టంగా విక్రాంత్ తింటాడు. డ్యాన్సింగ్, ట్రావెలింగ్, క్రికెట్ ఆడటం, పర్ఫ్యూమ్స్ను కలెక్ట్ చేయడం విక్రాంత్ హాబీలుగా చెప్పవచ్చు.
విక్రాంత్ ఆస్తుల విలువ ఎంతంటే?
విక్రాంత్ మాస్సే (Vikrant Massey Net worth) 2007 నుంచే నటన జీవితాన్ని ప్రారంభించినప్పటికీ చెప్పుకోతగ్గ స్థాయిలో మాత్రం ఆస్తులు కూడబెట్టలేకపోయాడు. వాస్తవానికి ‘12th ఫెయిల్’ (2023) చిత్రం తర్వాతే రెమ్యూనరేషన్ భారీగా పెరిగిందని చెప్పవచ్చు. ఆ సినిమాకు ముందు వరకూ రూ.30-40 లక్షలు మాత్రమే తీసుకున్న విక్రాంత్, ప్రస్తుతం రూ.2 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం అతడి నెట్ వర్త్ రూ.20-26 కోట్ల వరకూ ఉండొచ్చని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అతడికి రూ.60 లక్షలు విలువైన Volvo S90 కారు, డుకాటి మాన్స్టర్ (రూ.12 లక్షలు), మారుతీ సుజుకీ డిజైర్ (రూ.8.4లక్షలు) ఉన్నాయి. అలాగే ముంబయిలో సొంతిల్లు కూడా ఉన్నట్లు సమాచారం.
డిసెంబర్ 02 , 2024

Brahmaji vs Sathyadev: సత్యదేవ్పై బ్రహ్మాజీ అనుచిత వ్యాఖ్యలు.. బెడిసికొట్టిన ప్రమోషన్స్!
సత్యదేవ్ (Satyadev) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'జీబ్రా' (Zebra Movie). ‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్’ అన్నది ఉపశీర్షిక. ఈశ్వర్ కార్తీక్ (Eshwar Karthik) దర్శత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 22న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar), జెన్నిఫర్ (Jenniffer) హీరోయిన్లుగా నటిస్తున్నారు. డాలీ ధనంజయ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హాజరై సినిమాపై అంచనాలు పెంచేశారు. తాజాగా హీరో సత్యదేవ్తో ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ఇంటర్వ్యూ చేశారు. ఇందుకు సంబధించిన ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే ఇందులో సత్యదేవ్పై బ్రహ్మాజీ నోరుపారేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ప్రోమోలో ఏముందంటే?
బ్రహ్మాజీతో జరిగిన ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోను నటుడు సత్యదేవ్ తన ఎక్స్ ఖాతాలో పంచున్నారు. ఇందులో బ్రహ్మాజీ వస్తూనే 'ఈ న్యూసెన్స్ ఏంటి, గోల ఏంటి, అమ్మాయిలు ఏంటీ అని చిరగ్గా ముఖంగా పెట్టి సత్యదేవ్ను అడిగారు. నువ్వు డ్యాన్స్ చేశావా అని ప్రశ్నించగా.. ఏదో హుక్ స్టెప్ వేశాను అని సత్యదేవ్ అంటాడు. 'హుక్కా.. బొక్కా' అల్లు అర్జున్ అయితే డ్యాన్స్ కోసం వెయిట్ చేస్తారు, నీకోసం ఎవరు చూస్తారు అని బ్రహ్మాజీ విసుక్కుంటాడు. జిబ్రా అనగానే థియేటర్లు బద్దలు కొట్టుకొని ప్రేక్షకులు వచ్చేస్తారా అంటు మండిపడ్డాడు. సలార్, కేజీఎఫ్ చిత్రాలకు సంగీతం అందించిన రవి బస్రూర్ జిబ్రాకు వర్క్ చేశారని సత్యదేవ్ చెప్పగానే బ్రహ్మాజీ బిగ్గరగా నవ్వుతాడు. అలా అని పేర్లు వేసేసుకుంటున్నారా? అని ప్రశ్నించాడు. అప్పుడు సత్యదేవ్ నీలాగా పోస్టులు పెట్టి డిలీట్ చేయను అంటూ కౌంటర్ ఇచ్చారు. ప్రోమోను మీరు ఓసారి చూసేయండి.
https://twitter.com/i/status/1857340000733720861
మరీ ఓవర్ చేశారా?
ప్రస్తుతం తమ సినిమాలను వినూత్నంగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో 'జిబ్రా' టీమ్ ఇలా బ్రహ్మాజీ, సత్యదేవ్ మధ్య వాగ్వాదం జరుగుతున్నట్లు ఇంటర్వ్యూను ప్లాన్ చేసింది. అయితే ఈ ప్లాన్ బెడిసికొట్టినట్లు కనిపిస్తోంది. ఎవరైన సినిమాను ప్రమోట్ చేయడానికి ఇలాంటి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంటారు. కానీ ప్రోమోను పరిశీలిస్తే ప్రతీ దశలోనూ బ్రహ్మాజీ 'జిబ్రా' మూవీని ఏకిపారేయడం చూడవచ్చు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అయినప్పటికీ చూడటానికి కాస్త ఎబ్బెట్టుగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సత్యదేవ్ను చాలా పర్సనల్గా అటాక్ చేసినట్లు అనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్తో పోలుస్తూ నీ స్థాయి ఇంతే అన్నట్లు ఇండైరెక్ట్గా పంచ్లు వేసినట్లు ఉందన్నారు. అలాగే ‘జిబ్రా’ అనేది బ్రహ్మాండమైన సినిమా అనుకోవాలా? జనాలు ఎగబడిపోవాలా? అంటూ చేసిన కామెంట్స్ సినిమాపై నెగిటివిటీని పెంచేలా ఉందని చెబుతున్నారు.
https://twitter.com/powerstarp1/status/1857413471135998113
https://twitter.com/ganeshmunju11/status/1857355491401154992
https://twitter.com/Rohit_RC_/status/1857383353298600053
బ్రహ్మాజీ అలా.. చిరు ఇలా
'జిబ్రా' సినిమా రిలీజ్ నేపథ్యంలో మంగళవారం (నవంబర్ 12)న చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించింది. దీనికి హాజరైన మెగాస్టార్ చిరంజీవి ఇందులో హీరోగా చేసిన సత్యదేవ్పై ప్రశంసలు కురిపించాడు. తనకు మూడో తమ్ముడు అంటూ ఆకాశానికి ఎత్తాడు. కల్మషం లేని స్వచ్ఛమైన ప్రేమ, నిజాయితీ, నిజమైన ఎమోషన్ అతడిలో ఉన్నాయని చెప్పారు. మంచి నటుడు అయినప్పటికీ సరైన సినిమాలు పడదలేన్నారు. అందుకే తన 'గాడ్ ఫాదర్' సినిమాకు రిఫర్ చేసినట్లు చెప్పారు. అతడి చేసిన 'జిబ్రా' సూపర్ హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పాడు.
https://twitter.com/i/status/1856606401709162891
నవంబర్ 16 , 2024

Satyadev: ‘జీబ్రాను అలా కానివ్వకండి’.. తెలుగు ఆడియన్స్ను వేడుకున్న సత్యదేవ్
సత్యదేవ్ (Satyadev) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'జీబ్రా' (Zibra). 'పుష్ప'లో జాలిరెడ్డి పాత్రలో ఆకట్టుకున్న కన్నడ ధనంజయ ఇందులో కీలక పాత్ర పోషించాడు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో హీరోయిన్లుగా చేశారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తొలిరోజు మోస్తరు రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ మౌత్ టాక్తో రెండో రోజు నుంచి మంచి ఆదరణ సంపాదించింది. రీసెంట్గా సక్సెస్ మీట్ను సైతం చిత్ర బృందం నిర్వహించింది. ఇదిలాఉంటే నటుడు సత్యదేవ్ ప్రేక్షకులను ఉద్దేశించి తాజాగా బహిరంగ లేఖ రాశారు. గతంలో చేసిన ‘బ్లఫ్ మాస్టర్’ గురించి ప్రస్తావిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
సత్యదేవ్ ఏం రాశారంటే?
‘జీజ్రా’ (Zibra) చిత్రానికి వస్తోన్న విశేష ఆదరణ చూసి సత్యదేవ్ (Satyadev) సంతోషం వ్యక్తం చేశాడు. అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో ఓ నోట్ రిలీజ్ చేశాడు. 'ఇది మీరిచ్చిన విజయం. మీరు ఈ సినిమా బాగుందన్నారు. ఇంతకన్నా నాకేం కావాలి. ఇలాంటి హిట్ కోసం 5 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నా. మీకు నచ్చే సినిమా చేయడానికి, మీతో హిట్ కొట్టావ్ అని అనిపించుకోవడానికి ఎంతో ఎదురుచూశాను. నేను హిట్ కొడితే, మీరు ఆనందిస్తున్నారు. నాకెంతో సంతోషంగా ఉంది. బ్లఫ్ మాస్టర్ సినిమాని మీరు థియేటర్లో చూడలేకపోయారు. తర్వాత ఓటీటీ, యూట్యూబ్లో చూసి ఎంతో ఆదరించారు. జీబ్రా విషయంలో అలా జరగకూడదని కోరుకుంటున్నా. దయచేసి ఈ చిత్రాన్ని థియేటర్లో చూడండి. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అని రాసుకొచ్చారు.
https://twitter.com/ActorSatyaDev/status/1861276550337073501
ప్రతీ సినిమాకు ఎదురీతే
టాలెంట్ ఉన్న సరైన గుర్తింపునకు నోచుకోని హీరోలలో సత్యదేవ్ (Satyadev) ఒకరు. ప్రతీ పాత్రకు 100 శాతం న్యాయం చేసే సత్యదేవ్ జీబ్రాతో తన రాత మారుతుందని భావించారు. పాజిటివ్ టాక్ రావడంతో సంబరపడిపోయాడు. అయితే ఆ ప్రభావం కలెక్షన్స్లో కనిపించకపోవడంతో సత్యదేవ్ కొంత ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి సత్యదేవ్కు కొత్తేమి కాదు. అతడి తొలి ఫిల్మ్ నుంచి ఇదే పరిస్థితిని ఫేస్ చేస్తూ వస్తున్నాడు. హీరోగా తన ఫస్ట్ ఫిల్మ్ 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' కొవిడ్ కారణంగా ఓటీటీలోకి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత చేసిన 'తిమ్మరుసు'పై కూడా కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం పడింది. 50 శాతం మందినే థియేటర్లలోకి అనుమతించడంతో అనుకున్న సక్సెస్ రాలేదు. అనంతరం చేసిన ‘బ్లఫ్ మాస్టర్’ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత చేసిన 'కృష్ణమ్మ' రెండేళ్ల పాటు ఆగిపోయింది. ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చినా వారం వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చేసింది. ‘గాడ్ఫాదర్’లో చిరంజీవికి ప్రతినాయకుడిగా చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో సత్యదేవ్కు అవకాశాలు దక్కలేదు. ఇలా ఎదురుదెబ్బలు తింటూ వస్తోన్న సత్యదేవ్ ‘జీబ్రా’ విషయంలో మళ్లీ రిపీట్ కాకూడదని భావించారు. ఈ నేపథ్యంలో అభిమానులకు థ్యాంక్స్ చెబుతూనే తన సినిమాను ఆదరించాలని రిక్వెస్ట్ చేసుకున్నారు.
'జీబ్రా' నిజంగానే బాగుందా?
దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ బ్యాంకింగ్ వ్యవస్థలోని ఆర్థిక నేరాల్ని ఆధారంగా చేసుకొని జీబ్రాను రూపొందించారు. గ్యాంగస్టర్ ప్రపంచంతో స్టోరీని ముడిపెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. బ్యాంక్ ఉద్యోగి సూర్య పాత్రలో సత్యదేవ్ (Satyadev) ఆకట్టుకున్నాడు. తన సెటిల్డ్ నటనతో మెప్పించాడు. రూ.5 కోట్ల ఫ్రాడ్ విషయంలో గ్యాంగ్స్టర్ అయిన విలన్ చేతికి హీరో చిక్కడం, ఆ డబ్బు సంపాదించేందుకు హీరో పడే కష్టాలు ఆకట్టుకుంటాయి. అయితే దేశ రాజకీయాలనే శాసించే అపరకుభేరుడైన విలన్ కేవలం రూ.5 కోట్ల కోసం హీరో వెంటపడటమే కాస్త సిల్లీగా అనిపిస్తుంది. కిక్కిచ్చే మూమెంట్స్ పెద్దగా లేకపోవడం కూడా మైనస్గా మారింది. కథలో కొత్తదనం కోరుకునేవారికి, థ్లిల్లింగ్ సినిమాలను ఇష్టపడేవారికి జీబ్రా తప్పక నచ్చుతుందని చెప్పవచ్చు.
స్టోరీ ఏంటంటే?
మిడిల్ క్లాస్కు చెందిన సూర్య (సత్యదేవ్) బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్లో రిలేషన్ షిప్ మేనేజర్గా పని చేస్తుంటాడు. తోటి ఉద్యోగిని స్వాతి (ప్రియ భవానీ శంకర్)ని ఇష్టపడతాడు. ఓ రోజు స్వాతి తప్పుడు అకౌంట్కు రూ.4 లక్షల డబ్బును ట్రాన్ఫర్ చేస్తుంది. సదరు వ్యక్తిని సంప్రదించగా డబ్బు వాడేసుకున్నట్లు చెబుతాడు. దీంతో ఆ సమస్య నుంచి స్వాతిని కాపాడేందుకు సూర్య రంగంలోకి దిగుతాడు. సమస్యను పరిష్కరించే క్రమంలో అనుకోకుండా రూ.5 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్లో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలతో రాష్ట్రంలోనే ఎంతో ప్రమాదకారి అయిన ఆది (ధనంజయ్)ని సూర్య ఢీ కొట్టాల్సి వస్తుంది. సూర్య అతడ్ని ఎలా ఎదుర్కొన్నాడు? సూర్య లైఫ్లోకి ఆది ఎలా వచ్చాడు? రూ.5 కోట్ల ఫ్రాడ్ కేసు సూర్యను ఇంకెంత పెద్ద సమస్యలోకి నెట్టివేసింది? ఈ సమస్యల నుంచి చివరికీ బయటపడ్డాడా? లేదా? అన్నది స్టోరీ.
నవంబర్ 26 , 2024

Young Telugu Heroes: వైవిధ్యతకు ప్రాధాన్యమిస్తున్న కుర్ర హీరోలు.. సీనియర్లు చూసి నేర్చుకోవాల్సిందే!
టాలీవుడ్ యంగ్ హీరోలు కథల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కథలో కొత్త దనం ఉంటేనే సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. లేకుంటే నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. తద్వారా రొటిన్ స్టోరీలతో వస్తోన్న నాగార్జున, వెంకటేష్, రవితేజ, రామ్ పోతినేని, నితిన్, గోపిచంద్ వంటి సీనియర్ హీరోలకు పాఠాలు నేర్పుతున్నారు. యువ హీరో సుహాస్ రీసెంట్గా 'గొర్రెపురాణం' అనే మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో కుర్ర హీరోలు ఎంచుకుంటున్న కొత్త తరహా సబ్జెక్ట్స్పై మరోమారు చర్చ మెుదలైంది. ఇంతకీ కొత్త కథలతో వస్తోన్న యంగ్ హీరోలు ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
సుహాస్ (Suhas)
ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ నటుడిగా కొనసాగుతూ వచ్చిన సుహాస్ ‘కలర్ ఫోటో’ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చిన క్రేజ్తో సినిమా అవకాశాలను పట్టేశాడు. ‘రైటర్ పద్మభూషణ్’, ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’, ‘శ్రీరంగనీతులు’, ‘ప్రసన్నవదనం’ వంటి వైవిధ్యవంతమైన చిత్రాల్లో నటించి ఆడియన్స్లో మంచి మార్కులు కొట్టేశాడు. అంతేకాదు ‘హిట్ 2’ మూవీలో విలన్గానూ నటించి ఆకట్టుకున్నాడు. తాజాగా ‘గొర్రెపురాణం’ అనే సరికొత్త సబ్జెక్ట్తో శుక్రవారం (సెప్టెంబర్ 20) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
తేజ సజ్జ (Teja Sajja)
బాలనటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తేజ సజ్జ ‘జాంబి రెడ్డి’ సినిమాతో హీరోగా మారాడు. తొలి చిత్రంతోనే హీరో మెటీరియల్గా అనిపించాడు. ఆ తర్వాత ‘ఇష్క్’, ‘అద్భుతం’ వంటి వైవిధ్యమైన చిత్రాలు చేసినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. తిరిగి ప్రశాంత్ వర్మ డైరెక్షన్లోనే 'హనుమాన్' చిత్రం చేసి జాతీయ స్థాయిలో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ సక్సెస్తో తేజ సజ్జ పేరు మార్మోగింది. ప్రస్తుతం 'మిరాయ్' అనే మరో పాన్ ఇండియా చిత్రంలో తేజ నటిస్తున్నాడు. ఇందులో మంచు మనోజ్ విలన్గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘మిరాయ్’ టీజర్ గూస్బంప్స్ తెప్పించింది.
నిఖిల్ సిద్దార్ధ్ (Nikhil Siddhartha)
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హ్యాపీ డేస్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సినిమాలో వరుణ్ సందేశ్ పక్కన ఫ్రెండ్గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత సోలో హీరోగా పలు సినిమాలు చేసి యూత్కు దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే స్వామి రారా, కార్తికేయా, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ, కార్తికేయ 2, స్పై వంటి డిఫరెంట్ జానర్ ఫిల్మ్స్ చేసి మినమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రామ్చరణ్ నిర్మాణంలో స్వయంభు అనే హిస్టారికల్ చిత్రంలో నిఖిల్ నటిస్తున్నాడు. అలాగే ‘కార్తికేయ 3’ చిత్రం కూడా అతడి లైనప్లో ఉంది.
విశ్వక్ సేన్ (Visvak Sen)
యువ నటుడు విశ్వక్ సేన్ యూత్లో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా విశ్వక్ జాగ్రత్త పడుతున్నాడు. తొలి చిత్రం ‘వెళ్లిపోమాకే’ పెద్దగా సక్సెస్ కాకపోయిన ‘ఈ నగరానికి ఏమైంది’ ఫిల్మ్తో యూత్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘ఫలక్నామా దాస్’ పేరుతో మాస్ యాక్షన్ డ్రామా తీసి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ‘హిట్’, ‘పాగల్’, ‘అశోక వనంలో అర్జున కల్యాణం’, ‘ఓరి దేవుడా’, ‘దాస్ కా ధమ్కీ’, ‘గామి’, ‘గ్యాంగ్స్ గోదావరి’ సక్సెస్లతో తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’, ‘లైలా’ అనే డిఫరెంట్ జానర్ ఫిల్మ్లో విశ్వక్ నటిస్తున్నాడు. ‘లైలా’లో లేడీ గెటప్లో అతడు కనిపించనుండటం గమనార్హం.
అడివి శేష్ (Adivi Sesh)
ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన సొంతం సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసిన అడివి శేష్ ‘కర్మ’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పవన్ కల్యాణ్ నటించిన ‘పంజా’ సినిమాలో విలన్గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రన్ రాజా రన్’, ‘బాహుబలి’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన అతడు ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘మేజర్’, ‘హిట్ 2’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో నమ్మదగిన హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా ‘మేజర్’ సినిమాతో అడివి శేష్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అతడు గూఢచారి సీక్వెల్లో నటిస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. ఈ మూవీ కూడా సక్సెస్ అయితే అడివి శేష్కు తిరుగుండదని చెప్పవచ్చు.
సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda)
నాగచైతన్య హీరోగా నటించిన మొదటి సినిమా జోష్తోనే సిద్దు జొన్నలగడ్డ కూడా ఇండస్ట్రీలోకి వచ్చాడు. ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘ఆరెంజ్’, ‘గుంటూర్ టాకీస్’ వంటి సినిమాలలో నటించినప్పటికీ సిద్ధు కెరీర్ గ్రోత్ అంతగా లేదనే చెప్పాలి. అయితే ఆయా చిత్రాల్లో సిద్ధు రోల్స్ మాత్రం చాలా వైవిధ్యంగా ఉంటాయి. నటనతోపాటు రైటర్గా, ఎడిటర్గా కూడా వర్క్ చేస్తూ వచ్చిన సిద్ధు ‘డిజే టిల్లు’తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్తో సీక్వెల్ కూడా తెరకెక్కించి మరో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ‘టిల్లు స్క్వేర్’ చిత్రం ఏకంగా రూ.135 కోట్లు వసూలు చేయడం విశేషం. ప్రస్తుతం ‘జాక్’, ‘తెలుసు కదా’ వంటి చిత్రాల్లో అతడు నటిస్తున్నాడు. వాటి తర్వాత ‘టిల్లు క్యూబ్’ కూడా పట్టాలెక్కనుంది.
నార్నే నితిన్ (Narne Nithin)
జూనియర్ ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘మ్యాడ్’తో తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. కాలేజ్ బ్యాక్డ్రాప్లో రావడంతో యూత్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ఇక నితిన్ తన తర్వాతి చిత్రం ‘ఆయ్’ను పక్కా విలేజ్ నేపథ్యంలో తీసుకొచ్చి వైవిధ్యం చూపించాడు. అంతేకాదు మంచి విజయాన్ని కూడా అందుకున్నాడు. మ్యాడ్లో కాస్త సెటిల్గా కనిపించిన నితీన్ ‘ఆయ్’ సినిమాలో మంచి ప్రదర్శన చేశాడు. నటన, డ్యాన్స్, కామెడీ ఇలా అన్ని రంగాల్లో మ్యాడ్తో పోలిస్తే బెటర్ పర్ఫార్మెన్స్ చేశాడు. భావోద్వేగాలను కూడా చక్కగా పండించి ఆకట్టుకున్నాడు.
సెప్టెంబర్ 17 , 2024

Adipurush Trailer Review: ఆ తప్పు మళ్లీ చేయలేదు.. నేటి జనరేషన్కు తగ్గట్టుగా ఆదిపురుష్
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రూతగా ఎదురుచూస్తున్న ఆదిపురుష్ ట్రైలర్ విడుదలైంది. గతంలో విడుదల చేసిన టీజర్పై ఎన్నో వివాదాలు చెలరేగగా వాటిని సరిచేస్తూ డైరెక్టర్ ఓం రౌత్ తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. ట్రైలర్ ఎలా ఉందో ఓసారి సమీక్షిద్దాం.
ట్రైలర్ యాంగిల్
ఆదిపురుష్ ట్రైలర్ను రామ భక్తుడు అంజనేయుడి యాంగిల్లో చూపించారు. “రఘు రాముడు మనషిగా పుట్టిన భగవంతుడు. ఆయన జీవితం ధర్మానికి.. సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రాఘవ. ఆయన ధర్మం .. అధర్మానికి ఉన్న అహంకారాన్ని అంతం చేసింది. ఇది ఆ రఘునందుని గాథ. యుగయగాలకు సజీవం.. నా రాఘవుని కథే రామాయణం అంటూ వాయిస్ ఓవర్ ద్వారా సినిమా కథా సారాంశాన్ని చెప్పారు.
https://www.youtube.com/watch?v=e3ew7YUeeQc
ట్రైలర్లో ఏముంది?
ట్రైలర్లో రావణుడు సీతమ్మతల్లిని అపహహించడానికి వెళ్లడం, జటాయువు రక్షించేందుకు రావడం. వానర సైన్యాన్ని ఏకం చేసి లంకపై యుద్ధం ప్రకటించడం వంటివి చూపారు. లంకపై యుద్ధం ప్రకటించి రావణాసురిడిని వధించి సీతమ్మ తల్లిని కాపాడటం వంటి కీలక ఘట్టాలను ట్రైలర్లో చూపించారు.
శ్రీరాముడిగా (ప్రభాస్) సంభాషణలు ఆకట్టుకున్నాయి. లంకలో ఉన్న సీత మాతను తీసుకు రావడానికి లక్ష్మణుడు అయోధ్య సైన్యాన్ని తీసుకువద్దాం అని చెబుతాడు. అది మర్యాద కాదంటూ రాముడు వద్దంటాడు. సీత తనకు ప్రాణమే అయినా.. ప్రాణం కంటే మర్యాదే ముఖ్యం అని చెప్పడం రాముడి పాత్ర ఔచిత్యాన్ని చాటింది. ట్రైలర్ను చూస్తుంటే ఆదిపురుష్ రామాయణ ఇతిహాసం మొత్తం కాకుండా సీతాపహరణం వర్గం వరకే పరిమితం చేశారని తెలుస్తోంది.
నేటి జనరేషన్కు తగ్గట్టుగా
ట్రైలర్ సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. అందరికీ తెలిసిన కథే అయినప్పటికీ నేటి జనరేషన్కు అర్థమయ్యే రీతిలో సరికొత్తగా తెరకెక్కించారు. ఆధుకతలో రామాయణ కథను భాగం చేస్తూ విజువల్స్ గ్రాఫిక్స్తో సినిమాను తెరకెక్కించారు.
హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా విజువల్స్ రిచ్గా ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్లో యాక్షన్ సీన్స్ను కలబోసి నేటి తరం దృష్టి కోణంలో కథ నడిచినట్లు తెలుస్తోంది.
బలహీనతలు:
ట్రైలర్లో వచ్చిన కొన్ని సీన్లు బాహుబలి సినిమాను గుర్తు చేశాయి. వానరసేనకు శ్రీరాముడు(ప్రభాస్) ధైర్యం చెప్పే సీన్ బాహుబలి సీన్ను గుర్తు చేస్తుంది.
తెలుగు ట్రైలర్లో వచ్చే డైలాగ్స్ కొంచెం అర్థం కావు. బహుశా హిందీ మాతృకలో సినిమా తీయడం వల్ల కావచ్చు అనిపిస్తుంది.
డైలాగ్స్ తెలుగు నెటివిటికి తగ్గట్టుగా వస్తే బాగుండేది. సినిమాలో ఆ ప్రయత్నం జరిగి ఉండొచ్చు.
ఫైనల్గా
భరత జాతి ఎంతగానో ఆరాధించే రామాయాణం ఆదిపురుష్ సినిమాను ఓం రౌత్ చాలా ప్రతిష్టాత్మకంగా తెరికెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీ జూన్ 16న ప్యాన్ వరల్డ్ స్థాయిలో భారీగా విడుదల కానుంది. మొత్తంగా గతంలో టీజర్ కంటే ట్రైలర్ బాగుంది. మొత్తంగా కొత్త ట్రైలర్తో ఈ సినిమాపై అంచనాలు పెంచేసారు చిత్ర యూనిట్.
మే 09 , 2023

డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. కారణాలు ఇవే!
నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj). ఈ చిత్రం జనవరి 12, 2025న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. చిత్ర యూనిట్ ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే అనంతపురం జిల్లాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి అభిమానుల్లో ఉత్సాహం నింపాలని చిత్రబృందం భావించింది. తాజాగా మూమీ మేకర్స్ తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.
మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను అనంతపురం జిల్లాలో నిర్వహించాలని ప్రణాళిక రచించారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఈ వేడుక జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు భారీ స్థాయిలో పూర్తి కాగా, బాలకృష్ణకు సంబంధించిన భారీ కటౌట్ను కూడా ఏర్పాటు చేశారు. అభిమానులు తమ హీరోను చూడాలని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న వేళ, ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుకు కారణం
బాలకృష్ణ ఈ ఈవెంట్ రద్దు చేయడానికి గల కారణాలను ఒక ప్రకటనలో వివరించారు.“తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో కొందరు భక్తులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. మృతులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి కుటుంబాల దుఃఖాన్ని నేను వ్యక్తిగతంగా పంచుకుంటున్నాను. ఈ దుర్ఘటన జరిగిన నేపథ్యంలో విహార వాతావరణంలో ఈవెంట్ను నిర్వహించడం సరైంది కాదని భావించి, అనంతపురంలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను రద్దు చేయాలని నిర్ణయించాం,” అని బాలకృష్ణ వెల్లడించారు.
తిరుపతిలో జరిగిన ఘటన
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని, జనవరి 10న భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీ కారణంగా టికెట్ జారీ ప్రాంతంలో తొక్కిసలాట జరగడం వల్ల ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషాదకర ఘటనతో, డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను రద్దు చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది.
నారా లోకేష్ హాజరు కావాల్సి ఉంది..
ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్ హాజరుకావాల్సి ఉన్నప్పటికీ, తిరుపతి ఘటన నేపధ్యంలో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేశారు.
సినిమా విడుదల
ఇక ‘డాకు మహారాజ్’ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది.
సింగిల్ స్క్రీన్లలో అదనంగా రూ.135మల్టీప్లెక్స్లలో అదనంగా రూ.175 (జీఎస్టీతో కలిపి) వరకు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటును కల్పించింది.
అభిమానుల భావోద్వేగం
ఈవెంట్ రద్దు నిర్ణయం అభిమానులకు కొంత నిరాశ కలిగించినప్పటికీ, బాలకృష్ణ తీసుకున్న నిర్ణయాన్ని వారు గౌరవిస్తున్నారు. ‘డాకు మహారాజ్’ ట్రైలర్కు వచ్చిన భారీ స్పందన, టికెట్ ధరల పెంపు మరియు ప్రమోషన్లతో ఈ సినిమా మొదటి రోజే రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించడానికి సన్నద్ధంగా ఉంది.
‘డాకు మహారాజ్’ సినిమా విడుదలను ప్రతి ఒక్కరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు!
జనవరి 09 , 2025

Vijay Devarakonda: ‘నేను మూర్ఖుడ్ని కాదని చెప్పండి’.. రౌడీ బాయ్ స్పెషల్ వీడియో
డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న కొద్ది సైబర్ నేరాలు సైతం గణనీయంగా పెరుగుతున్నాయి. బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు చోరి చేసేందుకు సైబర్ నేరస్తులు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ ఏజెంట్లు, ప్రభుత్వ అధికారులమని చెప్పి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని యంగ్ హీరో విజయ్ దేవరకొండ సూచించాడు. ఫేక్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
రౌడీ బాయ్ ఏం చెప్పాడంటే?
సైబర్ నేరాలు, మోసాల పట్ల ప్రతీ ఒక్కరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సూచించాడు. తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో తన ఫ్రెండ్కు జరిగిన ఘటనను పంచుకున్నాడు. ‘ఫ్రెండ్, శ్రేయోభిలాషి అంటూ మాట కలుపుతూ డబ్బులు అడిగే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకు ఖాతాలో మనీ క్రెడిట్ అయినట్లు సైతం మెసేజ్లు సృష్టిస్తారు. ఒకవేళ అలాంటివి ఏమైనా వస్తే ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసుకునేందుకు తప్పనిసరిగా బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేసుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తే నేను మూర్ఖుడిని కాదు అని చెప్పండి’ అంటూ వీడియోను విజయ్ ముగించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సమాజానికి ఉపయోగపడే వీడియో చేసినందుకు విజయ్ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
https://twitter.com/pakkatelugunewz/status/1876979601215299644
'VD 14' క్రేజీ అప్డేట్..
టాక్సీవాలాతో బ్లాక్ బాస్టర్ ఇచ్చిన దర్శకుడు రాహుల్ సంకృత్యన్తో విజయ్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. VD14 వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. 1854 - 78 మధ్య కాలంలో ఈ సినిమా సాగనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ మూవీకి బాలీవుడ్ సంగీత ద్వయం ఎంపికైనట్లు సమాచారం. ఆదిపురుష్కు పనిచేసిన అజయ్-అతుల్ ఈ సినిమాకు మ్యూజిక్ సమకూర్చనున్నట్లు ఒక్కసారిగా వార్తలు మెుదలయ్యాయి. ఇక ఇందులో హీరోయిన్గా రష్మిక మందన్న చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
https://twitter.com/tupaki_official/status/1876903598078009523
‘VD 12’తో విజయ్ బిజీ..
ప్రస్తుతం విజయ్.. ‘VD12’ షూటింగ్తో పాల్గొంటూ చాలా బిజీగా ఉన్నాడు. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వేసవిలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయాలని భావించినా అదే సమయంలో పవన్ కల్యాణ్ (హరి హర వీరమల్లు) మూవీ రాబోతున్న నేపథ్యంలో విడుదల వాయిదా వేయబోతున్నట్లు తెలిసింది. విడుదలకు ఎలాగూ సమయం ఉండటంతో షూటింగ్ మెల్లగా చేస్తున్నారని టాక్. ఫిబ్రవరిలో మొత్తం షూటింగ్ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. శ్రీలంక నేపథ్యంలో మెుత్తం రెండు భాగాలుగా ఈ సినిమా రానున్నట్లు చిత్ర నిర్మాత కన్ఫార్మ్ చేశారు.
జనవరి 08 , 2025

OTT Suggestions: ఈ వీకెండ్.. పక్కా వినోదాన్ని పంచే చిత్రాలు ఇవే
ప్రముఖ ఓటీటీ సంస్థలు ప్రతీవారం కొత్త సినిమాలను తీసుకొస్తూ ఆడియన్స్ను పసందైన ఆనందాన్ని పంచుతున్నాయి. ఈ వారంతం పలు ఆసక్తికర చిత్రాలు, సిరీస్లు ఓటీటీలోకి రానున్నాయి. మరికొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్లోకి వచ్చేశాయి. వీటిలో మీ అభిరుచికి తగ్గ సినిమాను ఎంచుకుని ఓటీటీలో చూసేందుకు వీకెండ్ (OTT Suggestions)లో ప్లాన్ చేసుకోండి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి ప్లాట్స్ ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం.
జీబ్రా (Zebra)
సత్యదేవ్, ధనుంజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జీబ్రా’ (Zebra). ప్రియాభవానీ శంకర్ కథానాయిక. ఈశ్వర్ కార్తీక్ దర్శకుడు. యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్గా ఇది తెరకెక్కింది. నవంబర్ 22న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ప్రసారం చేయనున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ అధికారికంగా ప్రకటించింది. డేట్ అనౌన్స్ చేయనప్పటికీ డిసెంబర్ 14న ఈ మూవీ స్ట్రీమింగ్కు వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్లాట్ ఏంటంటే ‘మిడిల్ క్లాస్కు చెందిన సూర్య (సత్యదేవ్) బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్లో రిలేషన్ షిప్ మేనేజర్గా పని చేస్తుంటాడు. తోటి ఉద్యోగిని స్వాతి (ప్రియ భవానీ శంకర్)ని తప్పుడు అకౌంట్కు రూ.4 లక్షల డబ్బును ట్రాన్ఫర్ చేస్తుంది. ఆ సమస్య నుంచి స్వాతిని కాపాడే క్రమంలో సూర్య రూ.5 కోట్ల ఫ్రాడ్లో ఇరుక్కుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాలతో ఎంతో ప్రమాదకారి అయిన ఆది (ధనంజయ్)ని సూర్య ఢీ కొట్టాల్సి వస్తుంది. సూర్య అతడ్ని ఎలా ఎదుర్కొన్నాడు? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి?’ అన్నది స్టోరీ.
తంగలాన్ (Thangalan)
తమిళ స్టార్ హీరో విక్రమ్ హీరోగా నటించిన 'తంగలాన్' చిత్రం ఈ వారమే సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. డిసెంబర్ 10 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి పా. రంజిత్ దర్శకత్వం వహించగా మాళవిక మోహనన్, పార్వతి తిరువొత్తులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్లాట్ ఏంటంటే ‘తంగలాన్ తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బ్రిటిషర్లతో కలిసి బంగారం వెతికేందుకు వెళ్తాడు. అయితే బంగారాన్ని నాగజాతికి చెందిన మంత్రగత్తె ఆరతి (మాళవిక) రక్షిస్తుంటుంది. ఆమె నుంచి తంగలాన్ బృందానికి ఎదురైన సవాళ్లు ఏంటి? ఆమె నుంచి తప్పించుకొని తంగలాన్ బంగారాన్ని ఎలా సాధించాడు?’ అన్నది స్టోరీ.
7/G
సోనియా అగర్వాల్ (OTT Suggestions), స్మృతి వెంకట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘7/G’. హరూన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం టెరిఫిక్ హారర్ థ్రిల్లర్గా థియేటర్లలో ఆకట్టుకుంది. కాగా ఈ చిత్రం తాజాగా ఆహా వేదికగా స్ట్రీమింగ్లోకి వచ్చింది. తెలుగులో వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే ‘రాజీవ్, వర్ష దంపతులు ఐదేళ్ల కుమారుడితో కలిసి కొత్త ఫ్లాట్లోకి షిఫ్ట్ అవుతారు. అక్కడ వర్షకు అనూహ్య పరిస్థితులు ఎదురవుతాయి. అతీతశక్తులతో ఆమె పోరాటం చేయాల్సి వస్తుంది. చివరికీ ఏమైంది? అన్నది స్టోరీ.
బౌగెన్విల్లా (Bougainvillea)
మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, కుంచకో బోబన్, జ్యోతిర్మయి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం 'బౌగెన్విల్లా'. థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 13 నుంచి సోని లివ్ వేదికగా స్ట్రీమింగ్లోకి రాబోతోంది. తెలుగులోనూ వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే 'థామస్, రీతు భార్య భర్తలు. యాక్సిడెంట్లో గీతు గతం మర్చిపోతుంది. మరోవైపు మినిస్టర్ కుమార్తె మిస్సింగ్ కేసు రాష్ట్రంలో సంచలనం సృషిస్తుంటుంది. యాక్సిడెంట్కు ముందు మినిస్టర్ కుమార్తెను రీతు ఫాలో కావడం చూసి దర్యాప్తు చేసేందుకు ఏసీపీ కోషి వాళ్ల ఇంటికి వస్తాడు. అక్కడ ఏసీపీకి తెలిసిన షాకింగ్ నిజాలేంటి? అసలు మినిస్టర్ కూతుర్ని కిడ్నాప్ చేసింది ఎవరు? అన్నది స్టోరీ.
హరికథ (Harikatha)
పలు సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ పీపీల్ మీడియా ఫ్యాక్టరీ తొలిసారి ఓ ఆసక్తికర వెబ్సిరీస్ను నిర్మించింది. 'హరికథ: సంభవామి యుగే యుగే' (OTT Suggestions) పేరుతో రూపొందిన ఈ సిరీస్ ఈ వారమే హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్లోకి రాబోతోంది. డిసెంబర్ 13 నుంచి ఈ సిరీస్ను వీక్షించవచ్చు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్, దివి, అంబటి అర్జున్ కీలక పాత్రలు పోషించారు. మగ్గీ దర్శకత్వం వహించారు.
రోటి కపడా రొమాన్స్ (Roti Kapada Romance)
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్ పొనుగంటి, సుప్రజ్ రంగా హీరోలుగా నటించిన సినిమా 'రోటి కపడా రొమాన్స్'. ఇందులో సోనూ ఠాకూర్, నువేక్ష, మేఘ లేఖ, ఖుష్బూ చౌదరి హీరోయిన్లు. విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే థియేటర్లలో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఈ వారం స్ట్రీమింగ్కు వచ్చింది. డిసెంబర్ 12 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో ఈ సినిమా ప్రసారం అవుతోంది. ప్లాట్ ఏంటంటే ‘ఈవెంట్ ఆర్గనైజర్ హర్ష (హర్ష నర్రా), సాఫ్ట్వేర్ రాహుల్ (సందీప్ సరోజ్), ఆర్జే సూర్య (తరుణ్), విక్కీ(సుప్రజ్ రంగ) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఒకే రూమ్లో ఉంటూ హ్యాపీగా జీవిస్తుంటారు. సాఫీగా సాగుతున్న వీరి లైఫ్లోకి నలుగురు అమ్మాయిలు ఎంట్రీ ఇస్తారు. వారి రాకతో ఆ నలుగురు ఫ్రెండ్స్ లైఫ్ ఎలా మారింది? ప్రేమ వల్ల వారు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? వారిలో వచ్చిన రియలైజేషన్ ఏంటి?’ అన్నది స్టోరీ
కంగువా (Kanguva)
ఇదిలా ఉంటే గతవారం పలు ఆసక్తికర చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. అవి ఇప్పటివరకూ చూడకుండా ఉంటే ఈ వీకెండ్తో ఎంచక్కా చూసేయండి. తమిళ హీరో సూర్య (Suriya) నటించిన లేటెస్ట్ చిత్రం 'కంగువా' (Kanguva OTT Release) డిసెంబర్ 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్లోకి వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘ఫ్రాన్సిస్ (సూర్య) గోవాలో బౌంటీ హంటర్గా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు ఫ్రాన్సిస్ను ఒక పాప కలుస్తుంది. ఆ పాపకి తనకు ఎదో బంధం ఉందని అతడికి అనిపిస్తుంది. ఆ బంధం ఇప్పటిది కాదు గత జన్మదని అతడికి అర్థమవుతుంది. 1000 ఏళ్ల కిందట ఆ పాపతో ఫ్రాన్సిస్కు ఉన్న సంబంధం ఏంటి? అసలు కంగువా ఎవరు? తెగ నాయకుడిగా అతడు చేసిన పోరాటాలు ఏంటి? విలన్ (బాబీ డియోల్) నుంచి అతడి తెగకు ఎదురైన ముప్పు ఏంటి?’ అన్నది స్టోరీ.
అమరన్ (Amaran)
పాన్ ఇండియా స్థాయిలో (OTT Releases) విడుదలై భారీ విజయం అందుకున్న రీసెంట్ తమిళ చిత్రం 'అమరన్' . అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. శివ కార్తికేయన్, సాయి పల్లవి కీలక పాత్రలు పోషించారు. రాజ్ కుమార్ పెరియసామి డైరెక్ట్ చేశారు. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) బాల్యం నుంచే సైనికుడు కావాలని కలగంటాడు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. ఆయన భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్గా ఎంపికవుతాడు. విధుల్లో చేరిన తర్వాత వారి ప్రేమను ఇందు కుటుంబం తిరస్కరిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి, వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఈ జంట తర్వాత ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించారనేది ఆసక్తికరంగా సాగుతుంది. మరి ముకుంద్ వరదరాజన్ దేశం కోసం ఎలాంటి త్యాగం చేశాడు? దేశం కోసం ఎలాంటి సాహసాలు చేశాడు?’ అనేది మిగతా కథ.
విక్కీ విద్యా కా వో వాలా వీడియో (Vicky Vidya Ka Woh Wala Video)
’యానిమల్’ బ్యూటీ త్రిప్తి దిమ్రి (OTT Suggestions) నటించిన లేటెస్ట్ చిత్రం గత వారం ఓటీటీలోకి వచ్చింది. 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో' (Vicky Vidya Ka Woh Wala Video OTT Platform) సినిమా డిసెంబర్ 6 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఇందులో రాజ్కుమార్ రావ్, త్రిప్తి దిమ్రి జంటగా నటించారు. రాజ్ శాండిల్య డైరెక్ట్ చేశారు. ప్లాట్ ఏంటంటే ‘1997 సంవత్సరంలో వికీ (రాజ్ కుమార్ రావు), విద్యా (త్రిప్తి డిమ్రీ) ఇద్దరు పెళ్లి చేసుకొంటారు. ఫస్ట్ నైట్ మధుర జ్ఞాపకాలను ఓ సిడీలో బంధిస్తారు. అయితే అనూహ్యంగా ఆ సీడీ దొంగతనానికి గురవుతుంది. ఆ తర్వాత ఆ ఇద్దరి దంపతుల పరిస్థితి ఏంటి? అన్నది స్టోరీ.
డిసెంబర్ 12 , 2024

SSMB 29: సోషల్ మీడియాలో మహేష్ బాబు లెటెస్ట్ ఫొటోలు లీక్… సింహంతో మాములుగా లేడు!
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో రాబోయే ప్రతిష్టాత్మక చిత్రం SSMB 29 రెండు భాగాలుగా రూపొందనుందని సమాచారం. ఈ సినిమా కోసం 2025 జనవరి నుంచి షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిసింది. దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రానికి రాజమౌళి పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో పాత్రల ఎంపికకు కూడా రాజమౌళి ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
Image Credit: X
ప్రపంచస్థాయి సాంకేతిక నిపుణులతో సినిమా నిర్మాణం సినిమా గొప్పతనాన్ని మరింత పెంచేందుకు రాజమౌళి వరల్డ్ క్లాస్ టెక్నీషియన్స్తో చేతులు కలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే వేగంగా సాగుతున్నాయి. ఆఫ్రికా అడవుల్లో కొన్ని వినూత్నమైన లొకేషన్లను పరిశీలించి, (Mahesh Babu Ai Images)అత్యంత యథార్థంగా ఉండేలా ఎంపిక చేశారని టాక్. అంతేకాకుండా, గ్రాఫిక్స్ విషయంలో హాలీవుడ్ స్టూడియోలతో చర్చలు జరిపి, ఇంటర్నేషనల్ స్థాయికి తగినంత ఉన్నతమైన విజువల్ ఎఫెక్ట్స్పై దృష్టి సారించారు.
Image Credit: X
రెండేళ్ల పాటు షూటింగ్
ఈ భారీ ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు దాదాపు రెండు సంవత్సరాల పాటు షూటింగ్ సెట్స్లోనే(Mahesh Babu Ai Images) గడపవలసి ఉంటుంది. ఈ సినిమా హై-వోల్టేజ్ యాక్షన్, అడ్వెంచర్తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేలా రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు.
https://twitter.com/AbhiM2608/status/1866455157590184410
ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ జోడీగా
ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడీగా ఇండోనేషియాకు చెందిన నటి చెల్సియా ఎలిజబెత్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి కథను విజయేంద్ర ప్రసాద్ అందించగా, సంగీతాన్ని ఎం.ఎం. కీరవాణి సమకూరుస్తున్నారు.
Image Credit: X
ఎక్స్లో మహేష్ బాబు ఏఐ పిక్స్ వైరల్
SSMB29 సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో మహేష్ బాబు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వీటిని ఫ్యాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(AI) ద్వారా క్రియేట్ చేశారు. SSMB29 కథా నేపథ్యంతో ఏఐ క్రియేట్ చేసిన ఫొటోలు ఆశ్యర్యపరుస్తున్నాయి. సింహంతో ఉన్న మహేష్ బాబు పిక్స్ ఔరా! అని అబ్బురపడేలా ఉన్నాయి. అడవిలో మహేష్ బాబు ఫైట్స్ చేస్తున్నట్లుగా ఏఐ క్రియేట్ చేసింది. మరో ఫొటోలో రాజమౌళి మహేష్ బాబుకు సీన్ వివరిస్తున్నట్లుగా ఉంది. ప్రస్తుతం(Mahesh Babu Ai Images) ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సినిమాలో ఇలాగే మహేష్ మెకోవర్ ఉంటే ఫ్యాన్స్కు పండగేనంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Image Credit: X
ముఫాసా పాత్రపై మహేష్ ఉత్సాహం ఇటీవల మహేష్ బాబు, డిసెంబర్ 20న విడుదల కానున్న ‘ముఫాసా: ది లయన్ కింగ్’ తెలుగు వెర్షన్లో లీడ్ క్యారెక్టర్ ముఫాసా పాత్రకు వాయిస్ అందించారు. ఈ అవకాశంపై మహేష్ సంతోషం వ్యక్తం చేస్తూ, "ముఫాసా పాత్ర నాకు ఎంతో ఇష్టమైనది. కుటుంబంపై ప్రేమ, సంరక్షణ అనే అంశాలను ఈ పాత్ర అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. ఈ పాత్రకు డబ్బింగ్ ఇవ్వడం నా కల సాకారమైనంతటిది" అని అన్నారు.
తెలుగు వెర్షన్లో ముఫాసా పాత్రకు మహేష్ బాబు వాయిస్ అందించగా, ఇతర పాత్రలకు (Mahesh Babu Ai Images)సత్యదేవ్, అలీ, బ్రహ్మానందం, అయ్యప్ప పి. శర్మ వాయిస్ అందించారు. ఈ చిత్రాన్ని బారీ జెంకిన్స్ దర్శకత్వం వహించగా, డిసెంబర్ 20న ఇంగ్లీష్తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల కానుంది.
Image Credit: X
అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలు
SSMB 29 చిత్రంపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి సినిమా కావడం, అంతర్జాతీయ స్థాయి సాంకేతికత, భారీ బడ్జెట్, మహేష్ బాబు వంటి స్టార్ హీరో అందులో నటించడమే ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఈ చిత్రం నుంచి మరిన్ని అప్డేట్ల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంచనాలను అందుకునే విధంగా రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
డిసెంబర్ 10 , 2024

Pragya nagra Viral Video: ప్రైవేట్ వీడియోపై స్పందించిన హీరోయిన్ ప్రగ్యా నగ్రా
తెలుగు ప్రేక్షకులను లగ్గం సినిమాతో ఆకట్టుకున్న ప్రగ్యా నగ్రా తన జీవితంలో ఎదురైన ఒక అసహజ అనుభవంపై స్పందించారు. ఇటీవల సామాజిక మాధ్యమాలలో ఆమెపై ఎవరో సృష్టించిన ఒక ఫేక్ వీడియో (pragya nagra viral video) వైరల్ కావడం, ఆమె పేరును ఎక్స్ వేదికలో ట్రెండింగ్ చేయడం జరిగిన ఘటన ఆమెను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ క్రమంలో ఆ వీడియోపై ఆమె స్పందించారు.
ప్రగ్యా నగ్రా స్పందన
సోషల్ మీడియాలో తనదిగా వైరల్ అవుతున్న ప్రైవేట్ వీడియోపై ప్రగ్యా ఎక్స్ వేదిక ద్వారా తన ఆవేదనను పంచుకున్నారు.
‘‘ఆ వీడియో నిజం కాదని మీరు అందరూ తెలుసుకోండి. ఈ వ్యవహారం ఒక భయంకరమైన కల అనిపిస్తోంది. టెక్నాలజీ మన జీవితాలను మెరుగుపరచాలి, కానీ అతి దుర్మార్గమైన వ్యక్తులు దాన్ని నాశనం చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చెత్త వీడియో తయారు చేసి, సోషల్ మీడియాలో ప్రాచుర్యం చేయడం నన్ను తీవ్రంగా బాధ పెట్టింది.’’ అని పేర్కొన్నారు.
తనను అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ‘‘ఇలాంటి సంఘటన (pragya nagra viral video)మరొక అమ్మాయికి జరగకూడదని ఆకాంక్షిస్తున్నాను. సోషల్ మీడియాలో ఇలాంటి విషయాలపై అందరూ జాగ్రత్తగా ఉండాలి’’ అని సూచించారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సైబరాబాద్ పోలీస్, సైబర్ దోస్త్, మహారాష్ట్ర సైబర్ పోలీసులను ట్యాగ్ చేయడం జరిగింది.
ప్రగ్యా నగ్రా కెరీర్ ప్రారంభం
హరియాణాలోని అంబాలాకు చెందిన ప్రగ్యా నగ్రా మోడల్గా తన ప్రస్థానం ప్రారంభించారు. వివిధ ఉత్పత్తులకు సంబంధించి 100కు పైగా ప్రకటనల్లో మోడల్గా నటించి గుర్తింపు పొందారు.
ప్రగ్యా నగ్రా విద్యాభ్యాసం మెుత్తం ఢిల్లీలోనే జరిగింది. స్కూలింగ్, కాలేజ్ స్టడీస్తో పాటు మోడలింగ్ కెరీర్ కూడా దేశ రాజధాని ఢిల్లీలోనే మెుదలైంది. ఆమె తండ్రి భారత మిలటరీలో పని చేశారు. దీంతో కాలేజీ డేస్లో ఆర్మీలో చేరాలని భావించింది. ఇందుకోసం ఎన్సీసీ స్టూడెంట్గా చేసింది.
మోడలింగ్లోకి వచ్చాక ఆమె ఆలోచనల్లో మార్పు వచ్చింది. దీంతో నటిగా కెరీర్లో (pragya nagra viral video)స్థిరపడాలని నిర్ణయించుకొని సినిమాల వైపు అడుగులు వేసింది.
సినీ ప్రయాణం
ప్రగ్యా 2022లో తమిళ చిత్రం వరలారు ముక్కియం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రంలో జీవా కథానాయకుడు. ఆ తర్వాత మలయాళంలో నథికళిల్ సుందరి యుమనా, N4 చిత్రాల్లో నటించారు. తెలుగులో ఆమె తొలి చిత్రం లగ్గం. ఈ చిత్రంలో సాయి రోనక్ హీరోగా రూపొందింది. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రమేశ్ చెప్పాల దర్శకత్వం వహించారు.
లగ్గం మూవీ డిజిటల్ విడుదల
ప్రస్తుతం లగ్గం చిత్రం ఆహా మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్ఫారాలపై స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది.
మహిళల భద్రతపై ప్రగ్యా నగ్రా ఆందోళన
ఈ సంఘటన ప్రగ్యాను కుదిపేసింది. ఆమె ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని, ఫేక్ కంటెంట్ను పంచుకోవడాన్ని నివారించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘టెక్నాలజీని ఉపయోగించే విధానం బాధ్యతతో ఉండాలి’’ అనే సందేశాన్ని అందించారు.
ప్రగ్యా నగ్రా తన ఆవేదనను వ్యక్తం చేస్తూనే, ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. టెక్నాలజీ సద్వినియోగం మాత్రమే మన జీవితాలను మెరుగుపరుస్తుందనే విషయాన్ని గుర్తు చేశారు.
డిసెంబర్ 07 , 2024

RC16: ఇస్రో శాస్త్రవేత్తల బాటలో డైరెక్టర్ బుచ్చిబాబు.. వర్కౌట్ అయితే చరణ్ను ఎవరూ ఆపలేరు!
‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సంక్రాంతికి రాబోతున్న రామ్చరణ్ (Ramcharan) ఈ సినిమా రిలీజ్కు ముందే డైరెక్టర్ బుచ్చిబాబు సనా (Buchi Babu Sana)తో ‘RC 16’ ప్రాజెక్టు చేయబోతున్నాడు. ఈ సినిమా త్వరలోనే సెట్స్పైకి వెళ్లనుంది. మల్లయుద్దం నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం రామ్చరణ్ మేకోవర్ అవుతున్నాడు. పాత్రకు తగ్గట్లు శరీరాన్ని మలుచుకుంటున్నాడు. మరోవైపు డైరెక్టర్ బుచ్చిబాబు సినిమాను సెట్స్పైకి తీసుకెళ్లే ముందు దైవానుగ్రహం కోసం దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మూవీ స్క్రిప్ట్కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తాజాగా కర్ణాటక మైసూరులోని ఓ ఆలయంలో బుచ్చిబాబు ప్రత్యక్షమయ్యారు. ఇదంతా చూస్తుంటే బుచ్చిబాబు వైఖరి ఇస్రో సైంటిస్టులను తలపిస్తోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
సేమ్ టూ సేమ్..
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో ఇప్పటివరకూ ఎన్నో విజయవంతమైన ప్రయోగాలు నిర్వహించింది. అయితే ప్రతీ ప్రయోగానికి ముందు ఇస్రో ఛైర్మన్, శాస్త్రవేత్తలు దైవ దర్శనానికి వెళ్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రయోగం సక్సెస్ అయ్యేలా చూడమని వేడుకుంటారు. అలాగే నెల్లూరు జిల్లా సూళ్లురుపేటలోని చెంగాలమ్మ సన్నిధిలోనూ ఇస్రో ఛైర్మన్ ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు బుచ్చిబాబు చేస్తోంది చూస్తే ఇస్రో శాస్త్రవేత్తలే గుర్తుకు వస్తున్నారు. బచ్చిబాబు కూడా షూటింగ్ ప్రారంభానికి ముందు వరుస పెట్టి దేవలయాలు చుట్టేస్తున్నారు. ఇటీవల రామ్చరణ్తో కలిసి కడప వెళ్లిన బుచ్చిబాబు అక్కడ దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఎదుట ‘RC16’ స్క్రిప్ట్ పెట్టి ఆశీర్వచనం కోరారు. తాజాగా మైసూర్లోని ఛాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న డైరెక్టర్ ఎలాంటి అవరోధాలు లేకుండా సినిమా సక్సెస్ కావాలని ప్రార్థించారు. దీంతో ఇస్రో సైంటిస్టులతో బుచ్చిబాబును పోలుస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/SriLakshmi_10/status/1679348363546730496
https://twitter.com/i/status/1858591431201317066
‘RC 16’ షూటింగ్ షురూ..
శుక్రవారం (నవంబర్ 22) ఉదయం మైసూర్లోని చాముండేశ్వరి అమ్మవారిని దర్శించి బుచ్చిబాబు ఆలయ ప్రాంగణంలో మూవీ స్క్రిప్ట్ పట్టుకొని దిగిన ఫొటోను పంచుకున్నారు. ఈ పోస్టుకు ఆసక్తిక వ్యాఖ్యలను సైతం జోడించారు. ఇది తమకు చాలా ముఖ్యమైన రోజని, ఎంతోకాలం ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసిందని పేర్కొన్నారు. చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ఇది మెుదలైందంటూ రాసుకొచ్చారు. ఈ పోస్టు బట్టి శుక్రవారం (నవంబర్ 22) నుంచే RC 16 రెగ్యులర్ షూట్ మెుదలైనట్లు తెలుస్తోంది. మైసూరులోనే ఏర్పాటు చేసిన సెట్లో మూడు రోజుల పాటు షూట్ జరగనున్నట్లు సమాచారం. ఇందులో హీరో లేని సీన్లను మాత్రమే షూట్ చేస్తారని తెలిసింది. వచ్చే వారం నుంచి రామ్చరణ్ షూటింగ్లో భాగమవుతారని సమాచారం.
https://twitter.com/BuchiBabuSana/status/1859777297768681631
టీమ్లోకి జగ్గుభాయ్..
'RC 16' ప్రాజెక్ట్ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అయితే ప్రాజెక్ట్లో దిగ్గజ నటుడు జగపతి బాబు (Jagapathi Babu) జాయిన్ అయ్యారు. ఈ మేరకు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. షూట్లో జాయిన్ అయినట్లు తెలుపుతూ ఓ ఫొటోను షేర్ చేశారు. దీంతో జగ్గుభాయ్ ఈ మూవీలో ఏ పాత్రలో కనిపించబోతున్నాడనే ఆసక్తి నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్ చేసిన ఈ పోస్టుకు థ్యాంక్యూ కామండో అంటూ జగపతిబాబు రిప్లై ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నెగిటివ్ షేడ్లోనే జగపతిబాబు కనిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. కాగా, రామ్చరణ్ - జగ్గుభాయ్ ప్రత్యర్థులుగా చేసిన 'రంగస్థలం' (Rangasthalam) చిత్రం బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
https://twitter.com/IamJagguBhai/status/1859820964600742352?
‘RC16’ స్టోరీ ఇదే!
‘RC16’ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. విలేజ్ బ్యాక్డ్రాప్లో మలయుద్ధం నేపథ్యంలో ఈ సినిమా రానున్నట్లు సమాచారం. ఏపీకి చెందిన మల్ల యుద్ద వీరుడు కోడిరామ్మూర్తి నాయుడు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఆ పాత్రకు తగ్గట్లు బలిష్టంగా కనిపించేలా చరణ్ మేకోవర్ అవుతున్నాడు. ఇందుకు తగ్గట్లుగా బాడీని బిల్డ్ చేసుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే గతంలో 'బీస్ట్ మోడ్ ఆన్' అంటూ ఓ ఫొటోను సైతం అభిమానులతో చరణ్ పంచుకున్నాడు. ‘గేమ్ ఛేంజర్’ లుక్తో పోలిస్తే చరణ్ బాడీతో పాటు, లాంగ్ హెయిర్, గడ్డం పెంచాడు. ఇందులో చరణ్కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఏ.ఆర్. రెహమాన్ స్వరాలు అందించనున్నారు. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ సైతం ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
నవంబర్ 22 , 2024