రేటింగ్ లేదు
UATelugu
మంచు విష్ణు లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రం పురాతన పురుషుడు, గొప్ప శివ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది.
ఇంగ్లీష్లో చదవండి
రివ్యూస్
How was the movie?
తారాగణం
విష్ణు మంచు
కన్నప్ప, పరమ శివ భక్తుడుప్రీతి ముకుందన్
మోహన్ లాల్
శివుడుప్రభాస్
శివుడుమోహన్ బాబు
ఆర్. శరత్కుమార్
బ్రహ్మానందం
మధు షా (మధుబాల)
దేవరాజ్
ఐశ్వర్య భాస్కరన్
ముఖేష్ రిషి
కౌశల్ మంద
రఘు బాబు
అర్పిత్ రాంకా
సిబ్బంది
ముఖేష్ కుమార్ సింగ్దర్శకుడు
మోహన్ బాబు
నిర్మాతమణి శర్మ
సంగీతకారుడుపరుచూరి గోపాల కృష్ణ
కథజి.నాగేశ్వర రెడ్ది
కథషెల్డన్ చౌసినిమాటోగ్రాఫర్
ఆంథోనీ
ఎడిటర్ర్కథనాలు
Kannappa: 15 ఏళ్ల తర్వాత ప్రభాస్తో జత కట్టబోతున్న బాలీవుడ్ బ్యూటీ..!
నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) కలల ప్రాజెక్ట్గా సిద్ధమవుతోన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ‘మహాభారత’ సిరీస్ని రూపొందించిన ముఖేష్ కుమార్ సింగ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో చేయనుండగా.. శివరాజ్కుమార్, మోహన్లాల్, శరత్ కుమార్, మోహన్లాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు ఈ సినిమా కోసం పనిచేస్తున్నట్లు తెలిసింది. ఇదిలాంటే తాజాగా ‘కన్నప్ప’ సినిమాపై ఓ అప్డేట్ వచ్చింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు సంబంధించిన విషయం కావడంతో ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి!
‘కన్నప్ప’ చిత్రంలో ప్రభాస్ శివుడుగా నటించడం ఇప్పటికే ఖరారైంది. పార్వతి దేవి పాత్రలో తమిళ లేడి సూపర్ స్టార్ నయనతార (Nayanthara) చేయనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే తాజా అప్డేట్ ప్రకారం ఆ పాత్రను బాలీవుడ్ నటి పోషించబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ‘కంగనా రనౌత్’ (Kangana Ranaut) ప్రభాస్ పక్కన నటిస్తుందని అంటున్నారు. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. అలాగే మూవీకి సంబంధించిన మరిన్ని విషయాలు కూడా బయటకి రానున్నట్లు తెలుస్తోంది.
https://twitter.com/GetsCinema/status/1759893440500846829
15 ఏళ్ల తర్వాత..
ప్రభాస్-కంగనా కలిసి నటించడం ఇదే తొలిసారి కాదు. గతంలో వచ్చిన ‘ఏక్నిరంజన్’ (2009) చిత్రంలోనూ వీరిద్దరూ జోడీగా కనిపించారు. తెలుగులో కంగనాకు అదే తొలి చిత్రం. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే కలెక్షన్లు రాబట్టడంలో మాత్రం విఫలమైంది. ఈ సినిమాలో ప్రభాస్-కంగనా జోడీకి మంచి మార్కులే పడ్డాయి. వీరి కెమెస్ట్రీ చాలా బాగుందంటూ అప్పట్లో వార్తలు సైతం వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరు కలిసి నటించాలని భావించినప్పటికీ వీలు పడలేదు. ప్రస్తుత ప్రచారం నిజమైతే 15 ఏళ్ల తర్వాత ఈ జోడి మళ్లీ వెండితెరపై మెరవనుంది.
కన్నప్పపై విష్ణు ఫోకస్
తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్పను మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తూ.. ప్రతీ విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ న్యూజిలాండ్లో జరిగింది. టీమ్లో అందరికీ గాయాలు అవుతున్నా కూడా షూటింగ్కు మాత్రం బ్రేక్ ఇవ్వలేదు. విష్ణుకి కూడా షూటింగ్ టైమ్లో గాయాలైనట్లు వార్తలు వచ్చాయి. ఇలా ఎన్ని అడ్డంకులు వచ్చినా కన్నప్ప టీమ్ న్యూజిలాండ్ షెడ్యూల్ను పూర్తి చేసుకుని కొద్ది రోజుల క్రితం ఇండియాకు తిరిగొచ్చింది.
https://twitter.com/i/status/1730567740325535838
ఆకట్టుకున్న ఫస్ట్లుక్
గతేడాది నవంబర్లో మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా 'కన్నప్ప' ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర బృందం విడుదల చేసింది. హీరో ముఖం కనిపించకుండా శివలింగం వైపు ఓ యోధుడు విల్లు ఎక్కుపెట్టినట్లు ఈ పోస్టర్లో చూపించారు. దీన్ని షేర్ చేసిన మంచు విష్ణు.. 'కన్నప్ప' ప్రపంచంలోకి అడుగుపెట్టండి అంటూ క్యాప్షన్ జోడించారు. నాస్తికుడైన యోధుడు శివుడికి పరమభక్తుడిగా ఎలా మారడన్నది ఈ చిత్రంలో చూపించనున్నట్లు ఆ సందర్భంలో విష్ణు తెలిపారు.
‘కన్నప్ప’ వచ్చేది అప్పుడేనా!
కన్నప్ప సినిమా రిలీజ్కు సంబంధించి ఇటీవల ఓ వార్త బయటకొచ్చింది. ఈ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ను న్యూజిలాండ్లో ఫినిష్ చేసిన మూవీ బృందం.. తదుపరి షూట్ను కూడా త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తోందట. ఈ దసరాకు ‘కన్నప్ప’ను రిలీజ్ చేయాలని మంచు విష్ణు టార్గెట్గా పెట్టుకున్నాడని అంటున్నారు. దసరాకు రిలీజ్ చేస్తే ప్రేక్షకులకు మరింత రీచ్ అవుతుందని టీమ్ భావిస్తోందట. పాన్ ఇండియా రేంజ్లో విడుదల అవుతున్న ‘కన్నప్ప’ కోసం అన్నీ భాషల్లోని స్టార్స్తో ప్రమోషన్స్ చేయాలనే ఆలోచనతో టీమ్ ఉందని టాక్.
ఫిబ్రవరి 21 , 2024
Kannappa: యూట్యూబ్ను షేక్ చేస్తున్న మంచు విష్ణు, రవితేజ.. ఎలాగంటే?
టాలీవుడ్లో కొత్త సినిమాలకు సంబంధించిన ట్రైలర్, టీజర్లు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటాయి. ముఖ్యంగా యూట్యూబ్లో లక్షల్లో వ్యూస్ సాధించి అదరగొడుతుంటాయి. ఈ క్రమంలో ఇటీవల వచ్చిన ‘కన్నప్ప’ (Kannappa), ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) టీజర్లు.. యూట్యూబ్ను షేక్ చేస్తున్నాయి. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ యూట్యూబ్లో ట్రెండింగ్లో నిలిచాయి. తద్వారా సినిమాపై ఇప్పటి నుంచే భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.
కన్నప్ప దూకుడు..!
మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా అతడి స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం 'కన్నప్ప' (Kannappa Movie). విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా పేరొందిన ఈ చిత్రాన్ని.. మహాభారతం సీరియల్కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్గా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. గ్రాండ్ విజువల్స్తో టీజర్ ఎంతో రిచ్గా సాగింది. దీంతో కన్నప్ప టీజర్కు యూట్యూబ్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ టీజర్.. ఇప్పటివరకూ 17 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించినట్లు చిత్ర యూనిట్ ఓ స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేసింది. ఇందులో ముంచు విష్ణు యాక్షన్ లుక్లో కనిపించాడు.
రిలీజ్ ఎప్పుడంటే
ప్రస్తుతం కన్నప్ప షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), అక్షయ్ కుమార్ (Akshay Kumar), మోహన్లాల్ (Mohan Lal), శివరాజ్ కుమార్ (Siva Raj Kumar), మోహన్ బాబు (Mohan Babu), శరత్ కుమార్ (Sarath Kumar) వంటి దిగ్గజ నటులు నటించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ (Mani Sharma), స్టీఫెన్ దేవసి సంగీతం అందిస్తున్నారు. కాగా, కన్నప్పను డిసెంబర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
https://www.youtube.com/watch?v=KCx1bBTM9XE
మిస్టర్ బచ్చన్ ‘షో రీల్’.. అదరహో!
రవితేజ (Ravi Teja) హీరోగా మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ (Harish Shankar) రూపొందిస్తున్న లేటెస్ట్ చిత్రం.. ‘మిస్టర్ బచ్చన్’. భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) ఇందులో కథానాయికగా చేస్తోంది. జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు. ప్రచారంలో భాగంగా చిత్రయూనిట్.. 'షో రీల్స్'ను సోమవారం (జూన్ 17) విడుదల చేసింది. ఒక్క డైలాగ్ లేకుండా యాక్షన్ సన్నివేశాలతో తీర్చిదిద్దిన ఈ గ్లింప్స్ వీడియో ఎంతో ఆసక్తిగా సాగింది. ప్రస్తుతం యూట్యూబ్లో మిలియన్ వ్యూస్ దిశగా దూసుకెళ్తోంది. విడుదలైన 22 గంటల్లో 7.4 లక్షల వ్యూస్ సాధించి అదరగొడుతోంది.
https://www.youtube.com/watch?v=FgVYeHnc0Ak
దేవిశ్రీ ప్రసాద్ ప్రశంసలు
మిస్టర్ బచ్చన్ నుంచి విడుదలైన మాస్ గ్లింప్స్.. ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులను సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్.. మిస్టర్ బచ్చన్ గ్లింప్స్పై ఎక్స్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వావ్ హరీష్ శంకర్ సార్.. పంచ్ డైలాగ్ లేకుండానే పంచ్ క్రియేట్ చేశారు. మాస్ మహారాజా అద్భుతంగా ఉన్నారు. బ్లాక్ బాస్టర్ లోడ్ అవుతోంది. థియేటర్లో చూడటానికి ఆగలేకపోతున్నా. మిస్టర్ బచ్చన్ చిత్ర యూనిట్కు నా శుభాకాంక్షలు' అంటూ స్పెషల్ పోస్టు పెట్టారు. కాగా, మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
https://twitter.com/ThisIsDSP/status/1802716299455570180
జూన్ 18 , 2024
Prabhas: పరుశురాముడిగా ప్రభాస్? అన్ని సినిమాలు ఒక్క లెక్క ఈ మూవీ మరో లెక్క!
ప్రభాస్ అనగానే ముందుగా అతడి ఫిజిక్ అందరికీ గుర్తుకువస్తోంది. పాన్ ఇండియా స్టార్గా ప్రభాస్ ఎదగడంలో అతడి కటౌట్ బాగా ఉపయోగపడింది. ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్ చేశాడంటే స్క్రీన్స్పై చూసేవాళ్లకు రియల్గా అనిపిస్తుంటుంది. యాక్షన్ ఒక్కటే కాదు పౌరాణిక పాత్రలకు సైతం అతడి కటౌట్ ఇట్టే సరిపోతుంది. ప్రభాస్ ఇప్పటికే ‘ఆదిపురుష్’లో రాముడిలా, ‘కల్కి 2898 ఏడీ’లో కర్ణుడిగా కనిపించాడు. త్వరలో రానున్న ‘కన్నప్ప’లో నందీశ్వరుడిగా పాత్రలోనూ కనిపిస్తాడని టాక్ ఉంది. ఈ క్రమంలోనే ప్రభాస్కు సంబంధించి ఓ క్రేజీ వార్త బయటకొచ్చింది. త్వరలో పరుశురాముడి పాత్రను సైతం అతడు పోషించనున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
పరుశురాముడిగా ప్రభాస్!
ప్రస్తుతం బాలీవుడ్లో రామాయణం అనే అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో సీతారాముల కల్యాణఘట్టాన్ని కన్నుల పండువగా తీయాలనే తలంపుతో దర్శకుడు నితీష్ తివారి ఉన్నారట. ఈ ఘట్టంలో పరశురాముడి పాత్ర చాలా కీలకం. విష్ణుమూర్తి దశావాతారాల్లో రామావతారానికి ముందు వచ్చే అవతారం పరశురామావతారం. కాబట్టి రాముడిగా రణబీర్కపూర్ చేస్తున్నప్పుడు, పరశురాముడిగా కూడా ఆ స్థాయి హీరో చేస్తే సబబుగా ఉంటుందని నితీశ్ భావించారట. ఈ నేపథ్యంలో ప్రభాస్ను ఆ పాత్ర కోసం తీసుకోవాలని నితీశ్ తివారి భావిస్తున్నారట. ఈ విషయమై ప్రభాస్ను కూడా కలిసినట్లు బీ టౌన్లో టాక్ వినిపిస్తోంది. పరుశురాముడి పాత్ర చేసేందుకు ప్రభాస్ అంగీకరించినట్లు కూడా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందట. అయితే సినిమాలో ప్రభాస్ పాత్ర కొద్దిసేపే ఉండనుంది. అయినప్పటికీ కథపై ఎంతో ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.
విలన్స్గా స్టార్ కపుల్స్
‘యానిమల్’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ప్రభాస్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ‘స్పిరిట్’ పేరుతో ఈ మూవీ రూపొందనుంది. ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్ట్ దశలో ఉంది. అయితే ఇందులో బాలీవుడ్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) నటించనున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషిస్తాడని ప్రచారం జరగింది. కాగా, లేటెస్ట్ బజ్ ప్రకారం ‘స్పిరిట్’లో కరీనా కపూర్ సైతం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. రియల్ లైఫ్లో కపుల్స్ అయిన కరీనా, సైఫ్ ‘స్పిరిట్’ సినిమాలో విలన్స్గా కనిపిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
పోలీసు vs మాఫియా డాన్!
‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ ద్విపాతాభినయం చేయనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని డైలాగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక ప్రభాస్ డ్యూయల్ రోల్స్ విషయానికి వస్తే ఒక పాత్రలో పోలీసుగా మరో పాత్రలో మాఫియా డాన్గా ప్రభాస్ కనిపిస్తారని బజ్ ఉంది. డాన్ పాత్ర నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే బాక్సాఫీస్ వద్ద ఊచకోత ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. ఇకపోతే అక్టోబర్ 10న ప్రభాస్ బర్త్డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజవుతుందని, వచ్చే ఏడాది జనవరి 25 నుంచి ‘స్పిరిట్’ సెట్స్పైకి వెళ్తుందని టాక్. మరోవైపు ప్రభాస్ ఇప్పటివరకూ మూడు సినిమాల్లో ద్విపాత్రిభినయం చేశారు. తొలి చిత్రం ‘బిల్లా’ కాగా ఆపై ‘బాహుబలి’, ‘బాహుబలి 2’లోనూ డ్యూయల్ రోల్స్లో కనిపించారు. రీసెంట్గా తెరకెక్కుతున్న రాజాసాబ్లోనూ ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తారని ప్రచారం ఉంది.
పీరియాడికల్ లవ్ స్టోరీ!
ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమాకు సంబంధించిన పూజాకార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఇక ఈ చిత్రం పీరియాడికల్ యాక్షన్ లవ్ డ్రామాగా రూపొందనున్నట్లు తెలుస్తోంది. రజాకార్స్ బ్యాక్డ్రాప్లో బ్యూటీఫుల్ లవ్ డ్రామాగా దర్శకుడు హను రాఘవపూడి ఈ కథను రాసినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యే టైమ్ పీరియడ్లో ఈ మూవీ సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ను పరిశీలిస్తోన్నట్లు సమాచారం. ‘ఫౌజీ’ అంటే సైనికుడు అని అర్థం. ఇందులో ఇండియన్ పారా మిలిటరీకి చెందిన సైనికుడిగా ప్రభాస్ కనిపించనున్నట్లు చెబుతున్నారు. అయితే ఇందులో ఇమాన్ ఇస్మాయిల్ అనే యువతి హీరోయిన్గా నటించనుంది. ఇటీవల జరిగిన పూజా కార్యక్రమాల్లో ఇమాన్ పాల్గొని తన లుక్స్తో సోషల్ మీడియాను అట్రాక్ట్ చేసింది.
సెప్టెంబర్ 28 , 2024
Preity Mukhundhan: ‘ఓం భీమ్ బుష్’ బ్యూటీ ప్రీతి ముకుందన్ గురించి ఈ విషయాలు తెలుసా?
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan).. ‘ఓం భీమ్ బుష్’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో హీరో శ్రీవిష్ణు (Sri Vishnu)కు జోడీగా కనిపించి అందర్ని మెప్పించింది. మంచు విష్ణు (Manchu Vishnu) ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa)లోనూ ఈ బ్యూటీ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. దీంతో ప్రీతి ముకుందన్ గురించి తెలుసుకునేందుకు తెలుగు ఆడియన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన పూర్తి సమాచారం YouSay మీ ముందుకు తెచ్చింది.
ప్రీతి ముకుందన్ ఎవరు?
టాలీవుడ్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యంగ్ హీరోయిన్
ప్రీతి ముకుందన్ ఎక్కడ పుట్టింది?
తమిళనాడులోని తిరుచ్చి ప్రాంతం ఆమె జన్మ స్థలం
ప్రీతి ముకుందన్ పుట్టిన తేదీ?
జులై 30, 2001లో ప్రీతి ముకుందన్ జన్మించింది.
ప్రీతి ముకుందన్ తల్లిదండ్రులు ఎవరు?
తన పేరెంట్స్ సంబంధించిన సమాచారాన్ని ప్రీతి ఎక్కడా బహిరంగ పరచలేదు. దీనిపై ఆమె గోప్యత పాటిస్తోంది.
ప్రీతి ముకుందన్ తల్లిదండ్రులు ఏం చేస్తారు?
ప్రీతి తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లు అని తెలుస్తోంది.
ప్రీతి ముకుందన్ ఏం చదివారు?
ఈ బ్యూటీ బిటెక్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చేసింది.
ప్రీతి ముకుందన్ ఎక్కడ చదివారు?
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచ్చి (NIT-T)
ప్రీతి ముకుందన్కు భరతనాట్యం వచ్చా?
ఈ భామకు డ్యాన్స్ అంటే మహా ఇష్టం. తన ఐదో ఏట నుంచి భరతనాట్యానికి శిక్షణ తీసుకుంది. ‘కన్నప్ప’ చిత్రంలో అవకాశం రావడానికి ఈ నైపుణ్యం కూడా ఓ కారణమని ఇండస్ట్రీలో టాక్.
ప్రీతి ముకుందన్ ఎలాంటి డ్యాన్స్లు చేయగలదు?
ప్రీతి తొలుత క్లాసికల్ డ్యాన్సర్. ఆ తర్వాత హిప్హాప్, సినీ ఫోక్, వెస్టర్న్ తదితర వాటిలో కూడా పట్టు సాధించిది. కళాశాల సమయంలో పలు డ్యాన్స్ ఈవెంట్స్లో పాల్గొని ప్రీతి బహుమతులు కూడా అందుకుంది.
ప్రీతి ముకుందన్ కెరీర్ ఎలా మెుదలైంది?
సినిమాల్లోకి రాకముందు ప్రీతి కొంతకాలం పాటు మోడల్గా పనిచేసింది. ప్రముఖ కంపెనీలకు సంబంధించిన ప్రొడక్ట్స్ను ప్రమోట్ చేసింది.
ప్రీతి ముకుందన్ చేసిన మ్యూజిక్ ఆల్బమ్స్ ఏవి?
మోడలింగ్ తర్వాత ప్రీతి యూట్యూబ్ కేంద్రంగా పలు మ్యూజిక్ ఆల్బమ్స్ చేసింది. ' Muttu Mu2' ఆల్బమ్తో ఆమె పేరు ఒక్కసారిగా తమిళనాడులో మార్మోగింది. ఈ వీడియోకు యూట్యూబ్లో 4.2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
ప్రీతి ముకుందన్ తొలి చిత్రం ఏది?
‘ఓం భీమ్ బుష్’ సినిమా ద్వారానే ప్రీతి తొలిసారి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. వాస్తవానికి ‘కన్నప్ప’.. తెలుగులో ఆమె ఓకె చెప్పిన మెుదటి చిత్రం. అది ఇంకా షూటింగ్ దశలోనే ఉంది.
ప్రీతి ముకుందన్ ఫ్యూజర్ ప్రాజెక్ట్స్?
ప్రస్తుతం తమిళంలో స్టార్ అనే సినిమా చేస్తోంది. బిగ్బాస్ ఫేమ్ కెవిన్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఎలాన్ దర్శకత్వం వహిస్తుండగా బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ప్రీతి ముకుందన్కు ఇష్టమైన హీరో, హీరోయిన్, ఫుడ్ ఏవి?
తన ఫేవరేట్ హీరో, హీరోయిన్లు, ఫుడ్ గురించి ప్రీతి ముకుందన్ ఏ వేదికపైన పంచుకోలేదు. ఇందుకు సంబంధించిన సమాచారం ప్రస్తుతం అందుబాటులో ఉంది.
ప్రీతి ముకుందన్ ఇన్స్టాగ్రామ్ ఐడీ?
https://www.instagram.com/preity_mukhundhan
మార్చి 22 , 2024
New Movie Posters: శివరాత్రి వేళ కొత్త సినిమా పోస్టర్ల సందడి.. ఓ లుక్కేయండి!
శివరాత్రి సందర్భంగా పలు కొత్త సినిమాల పోస్టర్లు విడుదలై నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేసి తెలుగు ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపాయి. పోస్టర్లతో పాటు తమ చిత్రాలకు సంబంధించిన క్రేజీ అప్డేట్లను ఫ్యాన్స్ ముందుకు తీసుకొచ్చాయి. శివరాత్రి స్పెషల్గా వచ్చిన కొత్త సినిమా పోస్టర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.
కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)
ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందుతున్న 'కల్కి 2898 ఏడీ' నుంచి శివరాత్రి కానుకగా కొత్త పోస్టర్ రిలీజైంది. ఈ చిత్రంలో ప్రభాస్ పేరును పోస్టర్ ద్వారా మూవీ టీమ్ తెలియజేసింది. ప్రభాస్ పాత్ర పేరును భైరవగా ప్రకటిస్తూ భవిష్యత్తుకు చెందిన కాశీ వీధుల నుంచి భైరవని పరిచయం చేస్తున్నాం' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.
కన్నప్ప (Kannappa)
మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కన్నప్ప ఫస్ట్ లుక్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. విల్లు గురిపెట్టిన కన్నప్పగా విష్ణు ఈ పోస్టర్లో కనిపించాడు. కాగా, ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రస్తుతం న్యూజిల్యాండ్లో జరుగుతోంది. అద్భుతమైన దృశ్య కావ్యంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
NBK109
నందమూరి బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు బాబీ కాంబోలో వస్తున్న 'NBK 109' చిత్రం నుంచి క్రేజీ గ్లింప్స్ విడుదలైంది. యాక్షన్ సీక్వెన్స్తో రూపొందించిన గ్లింప్స్లో బాలయ్యను బాబీ ‘నేచురల్ బోర్న్ కింగ్’ (NBK)గా చూపించారు. గ్లింప్స్లో చాలా స్టైలిష్ లుక్లో బాలయ్య అదరగొట్టారు. ఈ చిత్రంలో బాలయ్య క్యారెక్టర్ చాలా వైలెంట్గా ఉంటుందని తెలుస్తోంది.
https://twitter.com/i/status/1766375268804120887
ఓదెల 2 (Odela 2)
తమన్నా (Tamannaah Bhatia) లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. హీరోయిన్ హెబ్బా పటేల్ లీడ్ రోల్లో నటించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాకి సీక్వెల్గా ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అశోక్ తేజ దర్శకత్వంలో డైరెక్టర్ సంపత్ నంది క్రియేటర్గా ఈ మూవీ రూపొందుతోంది. శివరాత్రి కానుకగా ‘ఓదెల 2’ నుంచి శివ శక్తిగా తమన్నా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఒక చేతిలో దండకం, మరో చేతిలో డమరుకంతో నాగ సాధువు వేషంలో తమన్నా కనిపించింది.
షరతులు వర్తిస్తాయి! (Sharathulu Varthisthai)
చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ చిత్రం నుండి కూడా శివరాత్రి కానుకగా కొత్త పోస్టర్ విడుదలైంది. ‘ఈ దేశంలోని 80% మంది సామాన్యుల కథనే మన సినిమా’ అంటూ మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు. ఈ నెల 15వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు.
‘దేవకీనందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva)
తొలి సినిమాతోనే హీరోగా ఆకట్టుకున్న మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) చేస్తున్న రెండో సినిమా ‘దేవకీనందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకత్వం చేస్తున్నారు. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు కథ అందించడం విశేషం. కాగా, మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఓ స్పెషల్ లుక్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.
గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindi)
హీరోయిన్ అంజలి టైటిల్ రోల్లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో వచ్చిన ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్గా ఈ మూవీ తెరకెక్కుతోంది. శుక్రవారం శివరాత్రితో పాటు ‘ఉమెన్స్ డే’ కూడా కావడంతో దానికి గుర్తుగా ఇందులోని అంజలి పోస్టర్ను విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటిస్తుండగా సత్యం రాజేష్, షకలక శంకర్, అలీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
శ్రీరంగ నీతులు (Sri Ranga Neethulu)
సుహాస్ హీరోగా ప్రవీణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘శ్రీరంగ నీతులు’. ఈ సినిమాలో కార్తిక్ రత్నం మరో ప్రధాన హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి మహా శివరాత్రి సందర్భంగా స్పెషల్ లుక్ పోస్టర్ విడుదలైంది. సుహాస్, కార్తిక్ రత్నంతో పాటు నటి రుహాని శర్మ పోస్టర్లో కనిపించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇదే ఏడాది ద్వితియార్థంలో రిలీజ్ కానుంది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs Of Godavari)
విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. రౌడీ ఫెలో, ఛల్ మోహన్రంగ వంటి సినిమాలు తీసిన కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇక ఈ మూవీ నుంచి ఉమెన్స్ డే సందర్భంగా మేకర్స్ అంజలికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోస్టర్ను రిలీజ్ చేశారు.
సత్యభామ (Sathyabhama)
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘సత్యభామ’. అఖిల్ డేగల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని ఆరమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ, శ్రీనివాసరావు తక్కళపల్లి నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఉమెన్స్ డే సందర్భంగా కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.
మార్చి 09 , 2024
Prabhas Future Projects: 2025లోనూ ప్రభాస్ జోరు.. మూడు సినిమాలు పక్కా!
గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కెరీర్ ప్రస్తుతం పీక్స్లో ఉంది. ఆయన గత చిత్రాలైన ‘సలార్’ (Salaar: Part 1 - Ceasefire), ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ప్రభాస్ సత్తా ఏంటో మరోమారు నిరూపించాయి. అయితే ‘బాహుబలి 2’ తర్వాతి నుంచి ప్రభాస్ చిత్రాల జోరు ఒక్కసారిగా పెరిగింది. ఒకటికి తగ్గకుండా ప్రతీ ఏడాది తన సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే గతేడాది రెండు చిత్రాలతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ ఏడాది ఇప్పటికే ‘కల్కి’ రూపంలో పలకరించాడు. ఇక వచ్చే ఏడాది ఏకంగా మూడు చిత్రాలతో ప్రభాస్ ఆడియన్స్కు ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఆ మూడు చిత్రాలు లోడింగ్..!
‘బాహుబలి’ (Baahubali), ‘బాహుబలి 2’ (Baahubali 2) చిత్రాల తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటి వరకూ టాలీవుడ్కు మాత్రమే పరిమితమైన ప్రభాస్ క్రేజ్ ఆ రెండు చిత్రాలతో గ్లోబల్ స్థాయికి చేరింది. ఆ క్రేజ్ను కాపాడుకోవడమే కాకుండా తన ప్రతీ సినిమాకు మరింత పెంచుకుంటూ రెబల్ స్టార్ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ లైనప్లో ఐదు బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. డైరెక్టర్ మారుతీతో ‘రాజా సాబ్’ (Raja Saab), సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ (Spirit), నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ‘కల్కి 2’ (Kalki 2), ప్రశాంత్ నీల్తో ‘సలార్ 2’ (Salaar 2)తో పాటు హను రాఘవపూడితో ఓ చిత్రం చేయనున్నాడు. పైన చెప్పుకున్న వాటిలో తొలి మూడు చిత్రాలు 2025లో రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘రాజా సాబ్’ను 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అటు ‘కల్కి 2‘ షూటింగ్ కూడా కొంతమేర పూర్తైనట్లు నిర్మాత అశ్వనీ దత్ ఇటీవల ఓ ఇంటర్యూలో చెప్పారు. వచ్చే ఏడాది ఇదే సమయానికి (జూన్ నెలలో) రిలీజ్ చేయవచ్చని హింట్ ఇచ్చారు. అటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో రానున్న ‘స్పిరిట్’ కూడా మరో రెండు నెలల్లో పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. వచ్చే ఏడాది చివరి కల్లా ఈ మూవీని రిలీజ్ చేయాలని సందీప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ నుంచి 2025లో మూడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా అని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.
వరుస సినిమాలతో ప్రభాస్ జోరు!
‘దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి’ అన్న సామెతను ప్రభాస్ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం అతడి కెరీర్ పీక్స్లో ఉన్న నేపథ్యంలో వరుసగా సినిమాలు చేస్తూ తన క్రేజ్ను, ఫాలోయింగ్ను మరింత పెంచుకునేందుకు డార్లింగ్ ప్రయత్నిస్తున్నాడు. శరవేగంగా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్కు డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. 2023లో ప్రభాస్ నుంచి ‘ఆదిపురుష్’, సలార్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ ఏడాది కల్కితో ఇప్పటికే ఆడియన్స్ను పలకరించిన ప్రభాస్ డిసెంబర్లో రానున్న ‘కన్నప్ప’లో ఓ క్యామియోతో అలరించనున్నాడు. ఆపై 2025లో మూడు చిత్రాలు, 2026 కోసం ‘సలార్ 2’, హను రాఘవపూడి దర్శకత్వంలోని చిత్రాన్ని రెడీ చేసుకున్నాడు. ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడానికి తారక్, అల్లుఅర్జున్, రామ్చరణ్ వంటి స్టార్ హీరోలు తడబడుతుంటే ప్రభాస్ మాత్రం అలవోకగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. అది కూడా పాన్ ఇండియా స్థాయి చిత్రాలను చక చక పూర్తి చేస్తుండటం ఇండస్ట్రీలో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
రేసుకు తెరలేపిన ప్రభాస్!
ప్రభాస్ అప్కమింగ్ చిత్రం 'రాజా సాబ్'ను 2025 సమ్మర్ కానుకగా తీసుకురాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్గా ఐదు (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ) భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే 2025 సమ్మర్ రేసులో పలు భారీ చిత్రాలు నిలిచాయి. నాగ చైతన్య 'తండేల్' (Thandel), నాగార్జున - ధనుష్ నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం 'కుబేర' (Kubera)ను వచ్చే ఏడాది వేసవిలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అటు ‘కేజీఎఫ్’ ఫేమ్ యష్ నటిస్తున్న 'టాక్సిక్' (Toxic) కూడా సమ్మర్ -2025 టార్గెట్గా రూపొందుతోంది. అటు హిందీలో సల్మాన్ నటిస్తున్న 'సికిందర్' కూడా ఈ రేసులో ఉన్నాయి. ప్రభాస్ సినిమా డేట్ను లాక్ చేసుకున్న నేపథ్యంలో ఆయా చిత్రాలు సమ్మర్లోనే రిలీజ్ అవుతాయా? లేక ప్రీపోన్ లేదా పోస్ట్ పోన్ చేసుకుంటాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.
జూలై 30 , 2024
Kannappa: ప్రభాస్ అంటే అది… ఆ ఒక్క కారణంతో రెమ్యునరేషన్ తిరస్కరించిన డార్లింగ్
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మాక పాన్ ఇండియన్ చిత్రం కన్పప్ప. ఈ చిత్రం నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ ఎంతో హైప్ను క్రియేట్ చేస్తోంది. గతవారం ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడని మేకర్స్ కన్ఫామ్ చేయడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటి వరకు ప్రభాస్ ఈ సినిమాలో ఏ పాత్రలో నటించనున్నాడన్నది సస్పెన్స్గా మారింది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. మరోవైపు ఈ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. ప్రతీ ఫ్రేమ్ రిచ్గా ఉండేందుకు డబ్బు ఎంతైన ఖర్చు పెట్టేందుకు మేకర్స్ వెనకాడటం లేదు. ఈ సినిమాకు అంతర్జాతీయ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. ఈ సినిమాకు కెమెరామెన్గా ప్రముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీ వంటి టెక్నిషియన్లు పనిచేస్తున్నారు. మెస్మరైజింగ్ విజువల్స్, దానికి తగిన కథ, స్క్రీన్ప్లేతో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలో ప్రభాస్తో పాటు మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, మోహన్ బాబు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ కన్నప్పను మంచు మోహన్ బాబు ప్రతిష్టాత్మంగా తెరకెక్కిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.
ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతంటే?
పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో భాగమైనప్పటి నుంచి ఓ క్రేజీ బజ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఎంత రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నాడు అని. అయితే దీనిపై తాజాగా ఓ స్పష్టత వచ్చింది. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని తెలిసింది. చాలా తక్కువ రోజులు ఈ చిత్రం కోసం ప్రభాస్ పనిచేస్తుండటంతో ఎలాంటి పారితోషికం తీసుకోవడం లేదని సమాచారం. మంచు విష్ణుతో ప్రభాస్కు చిన్నప్పటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉండటం కూడా కారణమైంది. అయితే మంచు విష్ణు ప్రభాస్కు బిగ్ ఎమౌంట్ ఆఫర్ చేసినప్పటికీ... ప్రభాస్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది.
శరవేగంగా షూటింగ్
ఇక తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్పను మంచు విష్ణు అన్ని తానై షూటింగ్ను శరవేగంగా జరుపుతున్నారు. ప్రతీ విషయంలోనూ ప్లాన్గా మందుకు వెళ్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 75శాతం వరకు పూర్తైనట్లు తెలిసింది. ప్రభాస్ రోల్ మీద ప్రస్తుతం షూటింగ్ జరుగుతోందని సమాచారం.గతేడాది నవంబర్లో మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా 'కన్నప్ప' ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర బృందం విడుదల చేసింది. శివలింగం వైపు కన్నప్ప గెటప్లో విల్లు ఎక్కుపెట్టినట్లు మంచు విష్ణును ఈ పోస్టర్లో చూపించారు. నాస్తికుడైన యోధుడు శివుడికి పరమభక్తుడిగా ఎలా మారడన్నది ఈ చిత్రంలో ప్రధాన కథగా చూపించనున్నారు.
టీజర్ డేట్ ఫిక్స్
కన్నప్ప నుంచి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న టీజర్ డేట్ ఫిక్సైంది. ఈ చిత్రం టీజర్ను మే 20న సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. అయితే టీజర్ విడుదల చేసే వేదికను ప్రఖ్యాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్కు మార్చారు. ఈ చిత్రం టీజర్ను కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారు. దీంతో టీజర్ ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మే 15 , 2024
Prabhas: మంచి మనసు చాటుకున్న ప్రభాస్.. ఆహ్వానానికి వెళ్తే భారీ విరాళం!
దేశం మెచ్చిన నటుల్లో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఒకరు. ఈ హీరో పేరు చెబితే బాక్సాఫీస్ రికార్డులు, పాన్ ఇండియా స్థాయి చిత్రాలే గుర్తుకువస్తాయి. అయితే ప్రభాస్కు మంచి మనసున్న వ్యక్తిగానూ గుర్తింపు ఉంది. ప్రభాస్ ఇప్పటివరకూ ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఎన్నడూ కాంట్రవర్సీల జోలికి పోలేదు. ఏ స్టేజీ మీద వివాదస్పద వ్యాఖ్యలు చేయలేదు. పైగా తన వద్దకు వచ్చిన వారికి పసందైన భోజనాన్ని పెట్టి వారి మన్ననలు పొందుతుంటాడు. అంతే కాకుండా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ మరోమారు తన మంచి మనసును చాటుకున్నాడు.
డైరెక్టర్స్కు భారీ విరాళం
లెజండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు (Dasari Narayana Rao Birthday) పుట్టిన రోజును పురస్కరించుకొని ఏటా మే 4న ‘డైరెక్టర్స్ డే’ (Directors Day)ను జరుపుకుంటున్నారు. ఈసారి వేడుకలను హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించాలని ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి అహ్వానించేందుకు అసోసియేషన్ సభ్యులు తాజాగా ప్రభాస్ను కలిశారు. ఈ సందర్భంగా వేడుకలు గ్రాండ్ చేయాలంటూ ప్రభాస్ వారికి రూ.35 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ విషయాన్ని అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వయంగా వెల్లడించారు. దీంతో హీరో ప్రభాస్పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఫుల్ స్వింగ్లో ప్రభాస్!
ప్రస్తుతం దేశంలో ఏ స్టార్ హీరో చేతిలో లేనన్ని పాన్ ఇండియా చిత్రాలు ప్రభాస్ లిస్ట్లో ఉన్నాయి. ప్రభాస్ ఏ డైరెక్టర్కైనా ఓకే చెప్తే ఆ ప్రాజెక్ట్ మెుదలయ్యేది 2026 తర్వాతనే. ప్రభాస్ ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ప్రస్తుతం అతడు 'కల్కీ 2898 ఏడీ' సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. దీంతో పాటు మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ (Raja Saab) చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తర్వాత సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి స్పిరిట్ (Spirit) అనే టైటిల్ ఖరారు చేశారు. వీటితో పాటు ‘సలార్ సీక్వెల్’ ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’లోనూ ప్రభాస్ శివుడి పాత్ర పోషించనున్నాడు. అలాగే హను రాఘవపూడితో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాలన్నీ పూర్తవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది.
ఏప్రిల్ 23 , 2024
Shivarathri: శివ భక్తులు తప్పక చూడాల్సిన 5 సినిమాలు… సినిమా లింక్లు ఇవిగో..
శివరాత్రికి ఉండే ప్రత్యేకతే వేరు. ఈ రోజున భక్తి పరవశులై హిందువులు ఆధ్యాత్మికతలో మునిగి తేలుతారు. నీలకంఠేశుడిపైనే మనసు, తనువు లగ్నం చేసి నిష్ఠతో గడుపుతారు. శివరాత్రి రోజున ఉపవాస నియమాన్ని పాటించేవారు జాగారం చేస్తుంటారు. ఈ పవిత్ర రాత్రి సమయంలో మెలుకువతో ఉండి జీవితంలోని చీకట్లను తొలగించుకోవాలని చెబుతుంటారు. శివరాత్రి రోజున జాగారం కీలక ఘట్టం. ఈ సమయాన్ని కొందరు భజనకు కేటాయిస్తే మరికొందరు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇంకొందరు సినిమాలు చూస్తుంటారు. ప్రస్తుతం డిజిటల్ యుగంగా మారినందున చాలామంది ఫోన్లోనే సినిమాలు చూసేస్తున్నారు. అయితే, శివరాత్రి రోజున ఆధ్యాత్మికకు సంబంధించిన సినిమాలను చూడాలని భావించే వారు వీటిని ట్రై చేయొచ్చు.
భూ కైలాస్
అలనాటి సినిమా అయినప్పటికీ నేటికీ కొత్త అనుభూతిని కలిగించే సినిమా ఇది. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల కాంబోలో వచ్చిన సూపర్ హిట్ సినిమా. రావణాసురుడి పాత్రలో ఎన్టీఆర్ నటించారు. శివరాత్రికి మీకు తప్పకుండా మంచి అనుభూతిని అందిస్తుంది.
https://www.youtube.com/watch?v=I4C9hhuwxfQ
భక్త కన్నప్ప
1976లో వచ్చిన భక్తిరస చిత్రమే ‘భక్త కన్నప్ప’. శివుడి భక్తుడి పాత్రలో దివంగత కృష్ణం రాజు నటించారు. భక్త కన్నప్పగా ఆ పాత్రకు జీవం పోశారు. ఇది కూడా శివరాత్రి రోజున చూడదగిన సినిమానే.
https://www.youtube.com/watch?v=1_oYrqjgBEM
మహా శివరాత్రి
సాయికుమార్, రాజేంద్రప్రసాద్ కలిసి నటించిన సినిమా ఇది. మీనా ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. రేణుక శర్మ దర్శకత్వం వహించారు.
https://www.youtube.com/watch?v=ArgkDQzeHXk
శ్రీ మంజునాథ
శివరాత్రి సినిమాలనగానే వెంటనే ఈ సినిమా పేరే గుర్తొస్తుంది. అంతలా ఫేమస్ అయ్యింది ఈ సినిమా. నాస్తికుడు శివుడి భక్తుడిగా ఎలా మారాడో ఈ సినిమాలో చూపిస్తారు. భక్తుడిగా అర్జున్, శంకరుడిగా చిరంజీవి నటించారు. అర్జున్ సరసన సౌందర్య కీలక పాత్ర పోషించింది.
https://www.youtube.com/watch?v=6B_kgUvWGsQ
జగద్గురు ఆదిశంకర
ఆదిశంకరాచార్యుల జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పూర్తిగా ఆధ్యాత్మిక బాటలో సాగుతుందీ సినిమా. నాగార్జున, సాయికుమార్, మోహన్ బాబు, కమలిని ముఖర్జీ తదితరులు కీలక పాత్ర పోషించారు. శంకరచార్యులుగా కౌశిక్ బాబు నటించాడు.
https://www.youtube.com/watch?v=y8bB-aaVZv4
ఈ సినిమాలను చూసి మీలోని ఆధ్యాత్మిక భావాన్ని మరింత రెట్టింపు చేసుకోండి. శివరాత్రి జాగారాన్ని ఫలప్రదం చేయండి.
మార్చి 08 , 2024
This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు ఇవే!
కొత్త సంవత్సరం మెుదలైంది. సంక్రాంతి కానుకగా పెద్ద సినిమాలన్నీ రాబోతున్నాయి. దీంతో ఈ వారం థియేటర్లలో చెప్పుకోతగ్గ చిత్రాలు రావడం లేదు. దీంతో అందరి దృష్టి ఓటీటీపైన పడింది. ఇందుకు తగ్గట్లే ఈ వారం బోలెడన్ని కొత్త చిత్రాలు, వెబ్సిరీస్లు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు / వెబ్సిరీస్లు
కాలింగ్ సహస్ర
సుడిగాలి సుధీర్ నటించిన కాలింగ్ సహస్ర మూవీ ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా (జనవరి 1 నుంచి) స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని అరుణ్ విక్కిరాల డైరెక్ట్ చేశాడు. డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు. సుడిగాలి సుధీర్ టీవీ ప్రేక్షకులకు సుపరిచితం కావడంతో త్వరగా ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఈ మూవీలో డాలీషా ఫిమేల్ లీడ్గా నటించింది.
హాయ్ నాన్న
నానీ లేటెస్ట్ మూవీ 'హాయ్ నాన్న' ఈ వారమే ఓటీటీలోకి రాబోతోంది. నెట్ఫ్లిక్స్ వేదికగా జనవరి 4నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. తొలుత ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని భావించారు. కానీ మరీ ఆలస్యం అవుతుందన్న ఉద్దేశంతో ముందే స్ట్రీమింగ్లోకి తీసుకొస్తున్నారు. ఇందులో నానికి జోడీగా మృణాల్ థాకూర్ నటించింది.
కంజూరింగ్ కన్నప్పన్
గతేడాది కోలీవుడ్లో విడుదలై సూపర్ హిట్గా నిలిచిన 'కంజూరింగ్ కన్నప్పన్' ఈ వారమే ఓటీటీలోకి విడుదల రాబోతోంది. హారర్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 5న నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీని వీక్షించవచ్చు. ఈ చిత్రంలో రెజీనా, నాసర్, శరణ్య ముఖ్య పాత్రల్లో నటించారు.
#90s
హీరో శివాజీ, వాసుకి ప్రధాన పాత్రల్లో ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరిస్ '#90’s'. ‘ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనేది ట్యాగ్ లైన్. ఈటీవీ విన్ వేదికగా జనవరి 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మధ్యతరగతి కుటుంబం చుట్టు అల్లుకున్న సన్నివేశాలు, భావోద్వేగాలు వీక్షకులను ఆకట్టుకుంటాయని మేకర్స్ తెలిపారు. ఈ సిరీస్లోని సరదాలు, ఆనందాలు, సంఘర్షణలు మనసుకు హత్తుకునేలా ఉంటాయని పేర్కొన్నారు.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateBitconMovieEnglishNetflixJan 01Fool me onceSeriesEnglishNetflixJan 01You Are What You Eat: A Twin ExperimentSeriesEnglishNetflixJan 01Delicious in DungeonSeriesEnglish/JapaneseNetflixJan 04The brothers son SeriesEnglishNetflixJan 04Good griefMovieEnglishNetflixJan 05IshuraSeriesEnglish/JapaneseDisney HotStarJan 03Perilloor Premier LeagueSeriesMalayalamDisney HotStarJan 05Marry my husbandSeriesEnglish/KoreanAmazon PrimeJan 01LOL: Last One Laughing Quebec 2SeriesEnglishAmazon PrimeJan 05TejasMovieHindiZee5Jan 05Meg 2: The trenchMovieTelugu/EnglishJio CinemaJan 03Cubicles Season 3MovieHindiSonyLIVJan 05
జనవరి 05 , 2024
Prabhas: సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్లోనూ ప్రభాస్ హీరోనే.. అతడి హెల్పింగ్ నేచర్కు బిగ్ సెల్యూట్!
టాలీవుడ్లో గొప్ప మనసున్న హీరోల్లో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఒకరు. రీల్ లైఫ్లోనే కాదు నిజ జీవితంలోనే తాను హీరోనేని ప్రభాస్ పలు సందర్భాల్లో నిరూపించుకున్నారు. కష్టాల్లో ఉన్నవారికి చేయుత అందించి మంచి మనసు చాటుకున్నారు. అందుకే జయపజయాలతో సంబంధం లేకుండా ప్రభాస్ను అందరూ ఇష్టపడుతుంటారు. అతడి మంచితనానికి సెల్యూట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ మరోమారు తన మంచి మనసును చాటుకున్నారు. కేరళ వరద బాధితులకు భారీ ఎత్తున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. దీంతో ప్రభాస్ పేరు మరోమారు మార్మోగుతోంది.
రూ. 2 కోట్లు విరాళం
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలమంది నిరాశ్రయులుగా మారారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యల కోసం హీరో ప్రభాస్ భారీ విరాళాన్ని ప్రకటించారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.2 కోట్లు ఇస్తున్నట్లు ప్రభాస్ టీమ్ ప్రకటించింది. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి అంత మెుత్తం ప్రకటించిన హీరో ప్రభాస్ కావడంతో ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ప్రభాస్ రీల్లోనే కాదు రియల్ లైఫ్లోనూ హీరో అంటూ పోస్టులు పెడుతున్నారు.
అండగా సెలబ్రిటీలు!
ప్రకృతి విపత్తు నుంచి వయనాడ్ త్వరగా కోలుకునేందుకు ప్రభాస్తో పాటు పలువురు సినీ ప్రముఖులూ తమ వంతు సాయాన్ని ప్రకటించారు. ఆ విషాద ఘటనపై స్పందించిన చిరంజీవి, రామ్చరణ్ రూ.కోటి విరాళంగా ప్రకటించారు. అల్లు అర్జున్ రూ.25 లక్షలు, హీరో సూర్య, ఆయన భార్య జ్యోతిక, సోదరుడు కార్తి సంయుక్తంగా రూ.50 లక్షలు, నయనతార - విఘ్నేశ్ శివన్ దంపతులు రూ.20 లక్షలు కేరళ సీఎం సహాయ నిధికి అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే మలయాళ నటులు మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ కలిపి రూ.35 లక్షలు, ఫహాద్ ఫాజిల్ రూ.25 లక్షలు, కమల్ హాసన్ రూ. 25 లక్షలు, విక్రమ్ రూ.20 లక్షలు, రష్మిక రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. నటుడు మోహన్లాల్ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొనడమే కాకుండా తాను వ్యవస్థాపకుడిగా ఉన్న విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా రూ. 3 కోట్ల విరాళం ప్రకటించారు.
గతంలోనూ ఇలాగే..
కేరళకు ఏ కష్టం వచ్చినా హీరో ప్రభాస్ ఆపన్న హస్తం అందిస్తూనే ఉంటారు. 2018 కేరళ వరదల సమయంలోనూ ప్రభాస్ అండగా నిలిచారు. రూ.కోటి విరాళాన్ని ప్రకటించి కేరళ ప్రజలకు అండగా నిలిచారు. మరోవైపు ప్రభాస్ ఏటా వంద మంది విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఆ విద్యార్థులకు సంబంధించి స్కూల్ ఫీజులను ప్రభాస్ చెల్లిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త కూడా నెట్టింట వైరల్ అవుతోంది. అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పది అని గ్రహించిన ప్రభాస్ ఈమేరకు తన వంతు సాయం అందిస్తున్నట్లు ఫ్యాన్స్ అంటున్నారు. లక్షల్లో ఫీజులు కడుతున్నా తమ హీరో ఎప్పుడు ప్రచారం చేసుకోలేదని ప్రశంసిస్తున్నారు.
https://twitter.com/i/status/1821114197213626764
డైరెక్టర్స్కు భారీ విరాళం
ఈ ఏడాది మేలో ‘డైరెక్టర్స్ డే’ సందర్భంగా వేడుకల కోసం రూ.35 లక్షలు విరాళంగా ఇచ్చి ప్రభాస్ గొప్ప మనసు చాటుకున్నాడు. ఈ విషయాన్ని అసోసియేషన్ సభ్యులు స్వయంగా వెల్లడించారు. లెజండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రతీ ఏటా మే 4న డైరెక్టర్స్ డేను నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా ఎల్బీ స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించగా దీనికి ఆహ్వానించేందుకు డైరెక్టర్ అసోసియేషన్ సభ్యులు ప్రభాస్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా వేడుకలు బాగా నిర్వహించాలంటూ ప్రభాస్ వారికి డబ్బు అందజేశాడు. దీంతో హీరో ప్రభాస్పై సర్వత్రా ప్రశంసల వర్షం కురిసింది.
ఫుల్ స్వింగ్లో ప్రభాస్!
ప్రస్తుతం దేశంలో ఏ స్టార్ హీరో చేతిలో లేనన్ని పాన్ ఇండియా చిత్రాలు ప్రభాస్ లిస్ట్లో ఉన్నాయి. ప్రభాస్ ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ప్రస్తుతం అతడు మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ (Raja Saab) చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తర్వాత సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి స్పిరిట్ (Spirit) అనే టైటిల్ ఖరారు చేశారు. వీటితో పాటు ‘సలార్ సీక్వెల్’ ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’లోనూ ప్రభాస్ శివుడి పాత్ర పోషించనున్నాడు. అలాగే హను రాఘవపూడితో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాలన్నీ పూర్తవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది.
ఆగస్టు 07 , 2024
Chandra Mohan: సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత.. ఆయన గురించి ఈ విషయాలు తెలుసా?
టాలీవుడ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ (78) కన్నుమూశారు. గత కొంత కాలంగా షుగర్, గుండె, డయాలసిస్ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం (నవంబర్ 11న) తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు హైదరాబాద్లో సోమవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మరణంపై సెలబ్రిటీలు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చంద్రమోహన్ మృతి నేపథ్యంలో ఆయనకు సంబంధించిన పూర్తి సమాచారం YouSay మీ ముందుకు తీసుకొచ్చింది.
కుటుంబ నేపథ్యం
చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రమోహనరావు. ఏపీలోని కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 1945 మే 23న ఆయన జన్మించారు. మేడూరు, బాపట్లలో చదువుకున్నారు. ఈయన దివంగత దర్శకుడు కె.విశ్వనాథ్కి చాలా దగ్గరి బంధువు. చంద్ర మోహన్ భార్య పేరు జలంధర. ఈమె రచయిత్రి. వీరికి మధుర మీనాక్షి, మాధవి అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మధుర మీనాక్షి సైకాలజిస్ట్గా అమెరికాలో స్థిరడ్డారు. రెండో కుమార్తె మాధవి చెన్నైలో వైద్యవృత్తిలో సేవలందిస్తున్నారు.
సినిమా నేపథ్యం
చంద్రమోహన్ 1966లో ‘రంగుల రాట్నం’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 1987లో ‘చందమామ రావే’ చిత్రానికి ఉత్తమ హాస్యనటుడిగా, 2005లో ‘అతనొక్కడే’ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ‘పదహారేళ్ల వయసు’ సినిమాకుగానూ ఫిలిం ఫేర్ అవార్డు గెలుచుకున్నారు. ‘రంగుల రాట్నం’, ‘ఆమె’ ‘పదహారేళ్ల వయసు’, ‘సీతామహాలక్ష్మి’, ‘రాధాకల్యాణం’, ‘రెండు రెళ్ల ఆరు’, ‘చందమామ రావే’, ‘రామ్ రాబర్ట్ రహీమ్’ చిత్రాలతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. 55 ఏళ్ల సినీ కెరీర్లో దాదాపు 932 సినిమాలలో నటించారు.
చంద్రమోహన్ మెచ్చిన చిత్రాలు
సినిమాల్లోకి రాకపోయి ఉంటే డబ్బులు లెక్కపెట్టే ఉద్యోగం చేసుకుని ఉండేవాడినని ఓ ఇంటర్యూలో చంద్రమోహన్ చెప్పారు. ఫస్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా ఇండస్ట్రీలో కొనసాగాలా? వద్దా? అని ఒకటికి రెండుసార్లు ఆలోచించినట్లు చెప్పుకొచ్చారు. అంతిమంగా సినిమావైపే అడుగులు వేశారు. తన కెరీర్లో ‘సిరిసిరిమువ్వ’, ‘శుభోదయం’, ‘సీతామహాలక్ష్మి’, ‘పదహారేళ్ల వయసు’ చిత్రాలను ఎన్నటికీ మర్చిపోలేనని చెప్తూ ఉండేవారు.
లక్కీ హీరోగా గుర్తింపు
ఒకప్పుడు చంద్రమోహన్ను అందరూ లక్కీ హీరోగా అనేవారు. ఆయనతో ఏ హీరోయిన్ అయినా నటిస్తే సినిమా హిట్ అవ్వాల్సిందే. అలా కెరీర్ ప్రారంభంలో శ్రీదేవి (Sri Devi), జయసుధ (Jayasuda), జయప్రద (Jaya Prabha) ఆయనతో కలిసి నటించి హిట్స్ అందుకున్నారు. చంద్రమోహన్-సుధ కాంబినేషన్ అయితే సూపర్హిట్ అయింది. అటు చంద్రమోహన్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా చిత్రాలు చేశారు. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ నటించారు. ఈయన నటించిన చివరి చిత్రం ఆక్సిజన్.
సంపాదనలో శూన్యమే!
చంద్రమోహన్ 50 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ పెద్దగా ఆస్తులు కూడబెట్టలేదు. చివరి రోజుల్లో ఆయన సాదాసిదా జీవితాన్నే గడిపారు. వందల కోట్లు విలువ చేసే ఆస్తులు పోగొట్టుకున్నట్లు చంద్రమోహన్ స్వయంగా ఓ ఇంటర్యూలో తెలిపారు. హైదరాబాద్ కోంపల్లిలో 35 ఎకరాల ద్రాక్ష తోట కొన్నప్పటికీ చూసుకోవడం వీలుపడటం లేదని దాన్ని అమ్మేశారు. శోభన్ బాబు చెబుతున్నా వినకుండా చెన్నైలోని 15 ఎకరాలు కూడా విక్రయించేశారు. దాని విలువ ప్రస్తుతం రూ.30 కోట్లపైనే. శంషాబాద్ ప్రధాన రహదారి పక్కన ఆరు ఎకరాలు కొన్నప్పటికీ దాన్ని నిలుపుకోలేకపోయారు.
చెయ్యి చాలా మంచిదట!
చంద్రమోహన్ దగ్గర ఆస్తి నిలవలేదు కానీ, ఆయన చేతితో ఒక్క రూపాయి తీసుకున్నా బాగా కలిసొస్తుందని చాలామంది నమ్మకం. అందుకని కొత్త ఏడాది ప్రారంభంలో (జనవరి 1) ఎంతోమంది ఆయన ఇంటికి వెళ్లి చంద్రమోహన్ చేతుల మీదుగా డబ్బు తీసుకునేవారు. ఈ విషయాన్ని చంద్రమోహన్ భార్య, రచయిత్రి జలంధర స్వయంగా తెలిపారు.
నవంబర్ 11 , 2023
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు మరో క్రేజీ ఆఫర్.. డెబ్యూ లేకుండానే ముగ్గురు స్టార్ హీరోలతో!
దశాబ్దాల కాలం పాటు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ రాని పేరు ప్రఖ్యాతలు.. కొందరికి రాత్రికి రాత్రే వచ్చేస్తుంటాయి. ఒక్క బ్లాక్ బాస్టర్తో స్టార్లుగా మారిపోతుంటారు. ఒకప్పుడు ఎక్కువగా హీరోల్లో ఇలాంటి పరిస్థితి కనిపించేంది. కానీ, ప్రస్తుతం ఈ ట్రెండ్ హీరోయిన్ల వైపు మళ్లింది. ఒక్క సక్సెస్తో హీరోల కంటే హీరోయిన్లే ఔట్స్టాండింగ్ ఫేమ్ను సొంతం చేసుకుంటున్నారు. అయితే ఈ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) ఇందుకు విరుద్దం. తెలుగులో ఇప్పటివరకూ ఒక్క సినిమా రిలీజ్ కానప్పటికీ ఆమె టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది. ఈ అమ్మడిని వెతుక్కుంటూ అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే రవితేజ, విజయ్దేవరకొండ వంటి స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీ.. ఇప్పుడు టాలీవుడ్లో మరో సినిమాకు ఓకే చెప్పింది.
దుల్కర్ సల్మాన్కు జోడీగా..
భాగ్యశ్రీ బోర్సే పేరు.. ప్రస్తుతం టాలీవుడ్లో మార్మోగుతోంది. ఈ అమ్మడితో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) తెలుగులో నేరుగా చేయబోయే చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా ఎంపికైంది. గతంలో దర్శకుడు పరుశురామ్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన రవి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెల్లడైంది. ఇందులో నటించేందుకు భాగ్యశ్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, అగ్రిమెంట్ కూడా కుదుర్చుకుందని మేకర్స్ స్పష్టం చేశారు. దీంతో భాగ్యశ్రీ క్రేజ్ టాలీవుడ్లో మామూల్గా లేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
భాగ్యశ్రీ ప్రాజెక్ట్స్
భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పటికే తెలుగులో రెండు స్టార్ హీరోల సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) హీరోగా చేస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) సినిమాతో తొలిసారి టాలీవుడ్ ఆఫర్ను భాగ్యశ్రీ బోర్సే దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) - గౌతం తిన్ననూరి (Gowtam Tinnanuri) కాంబోలో వస్తోన్న చిత్రంలో ఈ అమ్మడికి అవకాశం దక్కింది. ఈ మూవీ షూటింగ్లో కూడా భాగ్యశ్రీ పాల్గొంటున్నట్లు సమాచారం. ఇక నేచురల్ స్టార్ నాని (Hero Nani) హీరోగా సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో రానున్న మూవీలోనూ హీరోయిన్గా భాగ్యశ్రీ పేరును పరిశీలిస్తున్నట్లు టాక్ ఉంది. అన్నీ కుదిరితే త్వరలోనే నాని - భాగ్యశ్రీ కాంబోపై అధికారిక ప్రకటన సైతం రానుంది. ఇలా డెబ్యూ రిలీజ్ కాకుండానే టాలీవుడ్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ ఈ బ్యూటీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
భాగ్యశ్రీ నేపథ్యం ఇదే..
భాగ్యశ్రీ బోర్సేది మహారాష్ట్రలోని పుణే. హిందీ చిత్రం 'యారియాన్ 2'తో ఆమె వెండితెరకి పరిచయమైంది. అంతకుముందు చాలా యాడ్స్లో మోడల్గా పని చేసింది. ఈమె చేసిన యాడ్స్లో క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ బాగా ఫేమ్ తెచ్చి పెట్టింది. ఇక ‘యారియాన్ 2’లో ఈ బ్యూటీ యాక్టింగ్కి ఫిదా అయిన డైరెక్టర్ హరీశ్ శంకర్.. ‘మిస్టర్ బచ్చన్’లో ఛాన్స్ ఇచ్చారు. అలా టాలీవుడ్లో బజ్ క్రియేట్ చేసిన ఈ అమ్మడు మరిన్ని ఆఫర్లను దక్కించుకుంది. చూడటానికి చాలా క్యూట్గా ఉండే భాగ్యశ్రీ.. సోషల్ మీడియాలో చాలా చురుగ్గా వ్యవహరిస్తుంటుంది. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్కు గ్లామర్ ట్రీట్ ఇస్తూ.. సినిమాలకు అతీతంగా తన క్రేజ్ను పెంచుకుంటోంది.
జూన్ 11 , 2024
ADIPURUSH: ఆదిపురుష్లో అల్లు అర్జున్ సర్ప్రైజ్ రోల్... పసిగట్టిన ఫ్యాన్స్!
ఆదిపురుష్ మూవీ టాక్ తెలుగులో ఎలా ఉన్నప్పటికీ.. హిందీ బెల్ట్లో మాత్రం పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. థియేటర్ల వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ప్రభాస్ కెరీర్లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్గా నిలవనుందని సంబరపడిపోతున్నారు. ఆదిపురుష్ సినిమాలో ఏ సీన్కా ఆ సీన్ దేనికవే ప్రత్యేకంగా నిలిచాయని చెబుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఆదిపురుష్ సినిమాలో అల్లు అర్జున్ కెమియో రోల్ చేశాడని నెట్టింట చర్చ మొదలైంది. ఎవరికీ చెప్పకుండా ఫ్యాన్స్ను బన్నీ సర్ప్రైజ్ చేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఓ ఫొటోను సోషల్ మీడియాలో పొస్ట్ చేసి.. ఆ క్యారెక్టర్ చేసింది అల్లు అర్జునే(ALLU ARJUN )నంటూ పెద్ద ఎత్తున చర్చకు తెర లేపారు. వానర సేనలో ఆ క్యారెక్టర్ చేసింది బన్నీనే అంటూ ఢంకా బజాయించి చెబుతున్నారు.
మరికొంత మంది అతను అల్లు అర్జున్ కాదని వాదిస్తున్నారు. కానీ పొలికలు మాత్రం పుష్ప సినిమాలో అల్లు అర్జున్ను పొలి ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు. నుదుటిపై బొట్టు, క్రాఫ్ అచ్చం పుష్పరాజ్లా(PUSHPA RAJ) ఉన్నాడంటూ ట్రోల్ చేస్తున్నారు.
అయితే కొంతమంది యాంటీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావాలనే బన్నీ(BUNNY) టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. అల్లు అర్జున్ పాన్ ఇండియా పాపులారిటీని తట్టుకోలేకే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు.
మరి ఓవర్ కాకపోతే… ఆదిపురుష్లో అల్లు అర్జున్ ఉండటం ఏంటీ విడ్డూరంగా అని మరికొంతమంది ట్రోలర్లను ఏకిపారేస్తున్నారు.
న్యూట్రల్ ఫ్యాన్స్ మాత్రం ఫ్యాన్స్ వార్లో అల్లు అర్జున్ను లాగొద్దని సూచిస్తున్నారు. ప్రభాస్, బన్నీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి(ALLU ARJUN TROLLS) ట్రోల్స్తో వారి స్నేహాన్ని చెడగొట్టద్దని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
https://twitter.com/dev66612/status/1668960061782368257?s=20
తన సొంత థియేటర్ AAA సినిమాస్లో తొలి చిత్రంగా ఆదిపురుష్ వేసి ప్రభాస్పై తనకున్న అభిమానాన్ని అల్లు అర్జున్ చాటుకున్నారని పేర్కొన్నారు.
కృష్ణం రాజు చనిపోయిన రోజు అల్లు అర్జున్కు సైమా అవార్డు రావడంతో ఆయన తన సంతోషాన్ని ట్వీట్ చేశారు. దీనిపై అప్పట్లో ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున బన్నీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యావత్ టాలీవుడ్ శోకసంద్రంలో ఉంటే అల్లు అర్జున్ ఆనందంగా ట్వీట్ చేయడం ఏమిటని బన్నీని ట్రోల్ చేశారు. అప్పటి నుంచి అల్లు అర్జున్కు ప్రభాస్ ఫ్యాన్స్కు మధ్య చిన్న గ్యాప్ వచ్చింది.
జూన్ 17 , 2023
Underrated Telugu Movies: కథ బాగున్నా బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైన చిత్రాలు ఇవే!
సాధారణంగా ఏ సినిమాకైనా కథ తొలి ప్రాధాన్యంగా ఉంటుంది. కంటెంట్ సరిగా లేకపోతే ఎంతటి స్టార్ హీరోను పెట్టినా ఆ సినిమా విజయం సాధించదు. అయితే టాలీవుడ్లో కొన్ని చిత్రాలు ఇప్పటికీ మిస్టరీనే. అద్భుతమైన కథ, స్టార్ హీరోలు ఉన్నప్పటికీ ఆయా చిత్రాలు అనూహ్యంగా పరాజయాలను చవి చూశాయి. ఎన్నో ఆశలతో నిర్మించిన నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి. ఇప్పటివరకూ టాలీవుడ్లో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. వాటిలో బెస్ట్ కథతో వచ్చిన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
ఆరెంజ్ (Orange)
రామ్చరణ్ (Ramcharan) హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) తెరకెక్కించిన చిత్రం ‘ఆరెంజ్’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఒక యూనిక్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందో ఇప్పటికీ మిస్టరీనే. కొద్ది నెలల క్రితం ఈ సినిమాను రీరిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే ‘ఆరెంజ్’ ఆ రోజుల్లో రావాల్సిన చిత్రం కాదని.. ఇప్పుడు గనుక రిలీజై ఉంటే బ్లాక్బాస్టర్ విజయం అందుకునేదని సినిమా లవర్స్ అంటున్నారు.
అ! (Awe)
హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది. విభిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. చూసిన చాలామంది ఈ సినిమాను థియేటర్లో చూసుంటే బాగుండేదని నెట్టింట కామెంట్స్ చేశారు. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే.. మల్టిపుల్ పెర్సనాలిటీ డిసార్డర్ అనే వ్యాధితో బాధపడే కాళి అనే అమ్మాయి తనలో కలిగే ఒక్కో ఫీలింగ్కు ఒక్కో క్యారెక్టర్ను సృష్టించుకుంటూ పోతుంది. ఆ పాత్రల ద్వారా తన భావాలను చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. మూవీ ఎంత బాగున్నప్పటికీ కమర్షియల్గా విజయం సాధించలేదు.
C/o కంచరపాలెం (C/o Kancharapalem)
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ను సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువ మంది ఈ సినిమాను చూశారు. నాలుగు ప్రేమల కథల సమాహారమే ఈ సినిమా. కంచరపాలెంలో మెుదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు వారి కథలు ఎలా ముగిశాయి? అన్నది కథ. వెంకటేష్ మహా తెరకెక్కించిన ఈ చిత్రం హృదయాలకు హత్తుకుంటుంది.
అంటే సుందరానికి (Ante Sundaraniki)
నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నజ్రీయా హీరోయిన్గా వైవిధ్యమైన దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రం ‘అంటే సుందరానికి’. ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. కథలోకి వెళ్తే.. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. ఇందులో నాని నటన తన గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ సినిమా కమర్షియల్గా విజయాన్ని సాధించలేకపోయింది.
అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu)
నారా రోహిత్ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్కు కంటతడి పెట్టిస్తుంది. అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు నష్టాలు మిగిల్చింది.
కర్మ (Karma)
యంగ్ హీరో అడవి శేషు (Adivi Sesh) నటించిన తొలి చిత్రం ‘కర్మ’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ టెలివిజన్ ప్రీమియర్స్లో మంచి టీఆర్పీ రేటింగ్ను సాధించింది. ఇందులో హీరోకి అతీంద్రియ శక్తులు ఉంటాయి.
1: నేనొక్కడినే (1: Nenokkadine)
సుకుమార్ - మహేష్ బాబు కాంబినేషన్లో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులను కన్ఫ్యూజన్లో పడేసింది. ఆడియన్స్కు ఈ సినిమా అర్థమయ్యేలోపే చివరికి డిజాస్టర్గా మిగిలిపోయింది. ఈ సినిమా కథలోకి వెళ్తే.. హీరోకి బాధాకరమైన గతం ఉంటుంది. దాని వల్ల అతడ్ని కొన్ని ఆలోచనలు వెంటాడుతాయి. ఈ క్రమంలో హీరో జీవితంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు హీరో గతం ఏంటి? అన్నది సినిమా కథ. ఈ సినిమా టీవీల్లోకి వచ్చాక మంచి ఆదరణ పొందడం విశేషం.
ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindi)
ఈ సినిమా పేరు చెప్పగానే అందరికీ నవ్వు వస్తుంది. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. అయితే ఇదంతా ఓటీటీలోకి వచ్చిన తర్వాతనే. థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు. ఎప్పుడైతే ఓటీటీలోకి వచ్చిందో ఈ సినిమా అప్పట్లో ట్రెండింగ్లోకి వెళ్లిపోయింది. బోరింగ్ సమయంలో ఇప్పటికీ చాలా మంది ఈ సినిమాను చూస్తుంటారు. ఇందులోని పాత్రలు ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి.
వేదం (Vedam)
అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్గుడ్ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్గా ఈ సినిమా ఫ్లాప్ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు.. ఆర్థికంగా విజయాన్ని అందించలేకపోయారు. ప్రొడ్యుసర్లు నష్టాలను చవిచూడటంతో ఈ సినిమా థియేటర్లలో ఒక ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది.
ఖలేజా (Khaleja)
ఒక సినిమా హిట్ కావడానికి అవసరమైన అన్ని హంగులు ‘ఖలేజా’లో ఉన్నాయి. స్టార్ హీరో - హీరోయిన్లు, బలమైన కథ, మంచి సంగీతం, అద్భుతమైన డైరెక్షన్ ఇలా అన్నీ సమకూరిన కూడా ఈ చిత్రం ఫ్లాప్గా నిలిచింది. టీవీల్లో చూసిన వారంతా ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందా? అని ఇప్పటికీ ప్రశ్నించుకుంటూనే ఉంటారు. కథలోకి వెళ్తే.. ఒక గ్రామాన్ని తెలియని వ్యాధి పీడిస్తుంటుంది. ఆ వ్యాధి వల్ల అనేక మంది చనిపోతుంటారు. దేవుడే తమను కాపాడతాడు అని నమ్మిన గ్రామ ప్రజలు... క్యాబ్ డ్రైవర్ రాజులో అతీంద్రియ శక్తిని కనుగొంటారు. ఆ తర్వాత ఏమైంది? అన్నది స్టోరీ.
విరాట పర్వం
సాయి పల్లవి (Sai Pallavi), రానా (Rana Daggubati) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘విరాటపర్వం’. ఈ సినిమా నక్సల్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నక్సల్స్ కథకు అద్భుతమైన ప్రేమను జోడించి దర్శకుడు వేణు ఉడుగుల ఈ సినిమాను వైవిధ్యంగా తెరకెక్కించారు. ఓటీటీలో మంచి ఆదరణ పొందిన ఈ సినిమా.. థియేటర్లలో మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు.
రిపబ్లిక్ (Republic)
మెగా హీరో సాయిధరమ్ తేజ్, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'రిపబ్లిక్'. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. ఈ సినిమా వీక్షకులకు బాగా నచ్చినప్పటికీ కమర్షియల్గా విజయాన్ని అందుకోలేదు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ.
మెంటల్ మదిలో (Mental Madilo)
శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన 'మెంటల్ మదిలో' (2017) సినిమా కూడా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా ఆడియన్స్ను అలరించింది. రొటిన్ లవ్ స్టోరీలకు భిన్నంగా రూపొందిన ఈ చిత్రం యూత్కు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. సినిమా ఎంత బాగున్నప్పటికీ నిర్మాతలకు కష్టాలు తప్పలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన మేర విజయాన్ని సాధించలేకపోయింది. కథలోకి వెళ్తే.. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడతాడు. వారిలో ఒకరినే ఎన్నుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అతడు ఏం చేశాడు? అన్నది స్టోరీ.
మార్చి 22 , 2024
2022 బెస్ట్ ఓటీటీ చిత్రాలు
]అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించాడు. ఓ నిర్లక్షరాస్యుడు అతడి చర్యల కారణంగా జైలుకు వెళ్తాడు. చదువు ఎంత అవసరమో గుర్తించి జైలులో ఉన్నప్పుడే 10వ తరగతి పూర్తి చేస్తాడు. సినిమా అందరినీ మెప్పిస్తుంది.దస్వీ - హాట్ స్టార్
ఫిబ్రవరి 13 , 2023
Comedian Satya: స్టార్ కమెడియన్గా అవతరిస్తున్న సత్య.. మరో బ్రహ్మానందం అవుతాడా?
ప్రముఖ కమెడియన్ సత్య పేరు ప్రస్తుతం టాలీవుడ్లో మార్మోగుతోంది. తాజాగా విడుదలైన ‘మత్తు వదలరా 2’ చిత్రంలో సత్య కామెడీ హిలేరియస్గా ఉందంటూ సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. తెలుగులో స్టార్ కమెడియన్గా సత్య స్థిరపడిపోతాడంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ జనరేషన్ కమెడియన్స్లో సత్య మరో బ్రహ్మానందంగా మారతారంటూ నెట్టింట విస్తృతంగా పోస్టులు కనిపిస్తున్నాయి. దశాబ్దంన్నర పాటు సత్య పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం లభిస్తోందని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇండస్ట్రీలో సత్య దూకుడు చూస్తుంటే మిగతా కమెడియన్లు సైడ్ అవ్వాల్సిందేనన్న టాక్ వినిపిస్తోంది.
సత్య వన్ మ్యాన్ షో!
శుక్రవారం రిలీజైన 'మత్తు వదలరా 2' చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు కమెడియన్ సత్యను ఆకాశానికెత్తుతున్నారు. ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులున్నా, హీరో శ్రీ సింహా అయినా అందరూ సత్య గురించే మాట్లాడుకుంటున్నారు. మత్తువదలరాతో పోలిస్తే స్క్రిప్టు వీక్ అయినా సినిమాలో వేరే ఆకర్షణలు అంతగా పేలకపోయినా సత్య కామెడీ మాత్రం భలే వర్కవుట్ అయింది. తొలి సీన్ నుంచి చివరి వరకు ప్రతి సీన్లోనూ సత్య నవ్వించాడు. ముఖ్యంగా సినిమాలోని ‘16 ఏళ్ల వయసు’ పాటలో సత్య డ్యాన్స్కు భీభత్సమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో చాలా మైనస్లు ఉన్నప్పటికీ సత్య తన కామెడీతో వాటన్నింటిన సైడ్ చేసేశాడని వీక్షకులు అంటున్నారు. సత్య ఇలాంటి పర్ఫార్మెన్స్ తన తర్వాతి చిత్రాల్లోనూ చేస్తే స్టార్ కామెడియన్గా స్థిర పడటం ఖాయమని అంటున్నారు.
15 ఏళ్ల కృషి..
కమెడియన్గా దాదాపు దశాబ్దంన్నర కిందట్నుంచి సత్య ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ సరైన బ్రేక్ రావడానికి చాలా ఏళ్లే పట్టింది. సునీల్ తర్వాత అలాంటి టిపికల్ కామెడీ టైమింగ్తో చూడగానే నవ్వు తెప్పించే కమెడియన్ సత్య చాలా ఏళ్ల పాటు అతను చిన్న చిన్న పాత్రలతోనే నెట్టుకొచ్చాడు. ఐతే గత కొన్నేళ్ల నుంచి నెమ్మదిగా అతను ఎదుగుతున్నాడు. మంచి క్యారెక్టర్ పడిన ప్రతిసారీ అదిరిపోయే కామెడీతో సినిమాకు ఆకర్షణగా మారుతున్నాడు. ‘మత్తు వదలరా’, ‘రంగబలి’, ‘బెదురులంక 2012’, ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ లాంటి సినిమాల్లో తన కామెడీతో కడుపుబ్బ నవ్వించాడు. హీరోగా చేసిన ‘వివాహ భోజనంబు’లో నవ్వించడంతో పాటు కన్నీళ్లు సైతం పెట్టించాడు. గతంతో పోలిస్తే చాలా బిజీ అయినప్పటికీ తన టాలెంటుని పూర్తిగా వాడుకునే సినిమా రాలేదు. ఇప్పుడు ‘మత్తువదలరా-2’ సత్యకు ఆ లోటును తీర్చిందనే చెప్పాలి.
సత్యపై డైరెక్టర్ల ఫోకస్!
ప్రతీ సినిమాకు గ్రాఫ్ పెంచుకుంటూ దూసుకెళ్తున్న సత్యపై టాలీవుడ్ డైరెక్టర్ల దృష్టి పడినట్లు తెలుస్తోంది. పలువురు స్టార్ డైరెక్టర్లు తమ సినిమాలో అతడి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సత్యతో సెపరేట్ కామెడీ ట్రాక్ పెట్టించే యోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంలోనూ సత్యకు ఫుల్ లెంగ్త్ రోల్ దక్కింది. ఇందులో సత్య కామెడీ ఆకట్టుకున్నప్పటికీ సినిమా ఫ్లాప్ కావడంతో పెద్దగా గుర్తింపు లభించలేదు.
ఆ కమెడియన్లకు గట్టి పోటీ!
ప్రస్తుతం టాలీవుడ్లో చాలా మంది కమెడియన్లు ఉన్నారు. సీనియర్ హాస్య నటుడు అలీ, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, గెటప్ శ్రీను, సప్తగిరి, చమ్మక్ చంద్ర, తాగుబోతు రమేష్, ధన్రాజ్ తదితరులు వరుసగా సినిమాలు చేస్తూ స్టార్లుగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం సునీల్ సైతం హీరోగా మానేసి కమెడియన్గా, విలన్గా సినిమాలు చేస్తున్నారు. అయితే వీరందరికీ కమెడియన్ సత్య నుంచి గట్టి పోటీ ఎదురుకానుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సత్య గ్రాఫ్ దృష్ట్యా దర్శక నిర్మాతల ఫస్ట్ ఛాయిస్ అతడు అవుతాడని అంటున్నారు. కాబట్టి టాలీవుడ్లోని ఇతర హాస్య నటులు సైతం తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించకపోతే సినిమా అవకాశాలు సన్నగిల్లే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు.
సెప్టెంబర్ 14 , 2024
NBK 109 vs Devara: బాక్సాఫీస్ బరిలో బాలయ్య, తారక్, రవితేజ .. ఎవరిది పైచేయి?
టాలీవుడ్లో సినిమా - సినిమాకు మధ్య పోటీ సాధారణమే. ఒకే రోజున రెండు, మూడు చిత్రాలకు పైగా రిలీజవుతూ ఒకదానికొకటి సవాలు విసురుకుంటాయి. అయితే ఆ పోటీ ముగ్గురు స్టార్ హీరోల మధ్య ఉంటే ఎంత రసవత్తరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. త్వరలో అటువంటి పోటీనే టాలీవుడ్లో చూడబోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) బాక్సాఫీస్ వద్ద తలపడేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఒకే రోజున వారి సినిమాలు రిలీజ్ అయ్యేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రసవత్తర పోరులో ఎవరు పైచేయి సాధిస్తారన్న ఆసక్తి ఇప్పటి నుంచే అభిమానుల్లో మెుదలైంది.
బాలయ్య vs రవితేజ
నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 'NBK 109' చిత్రం చేస్తున్నారు. గత కొంత కాలంగా ఈ సినిమా షూటింగ్కు బాలయ్య దూరంగా ఉన్నప్పటికీ అతడి పాత్ర మినహా రిమైనింగ్ షూటింగ్ను బాబీ శరవేగంగా నిర్వహిస్తున్నారు. ఏపీ ఎలక్షన్స్ ముగియడంతో త్వరలోనే బాలయ్య సెట్స్లోకి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బాలయ్య పైన ఉన్న సీన్స్ త్వరగా షూట్ చేసి సెప్టెంబర్ 27న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. మరోవైపు మాస్ మహారాజ్ రవితేజ - దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) కాంబోలో 'మిస్టర్ బచ్చన్' మూవీ తెరకెక్కుతోంది. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) 'ఓజీ' (OG) సినిమా వాయిదా పడటంతో ప్రస్తుతం హరీష్ శంకర్ ఫుల్ ఫోకస్ మెుత్తం రవితేజ చిత్రంపైనే పెట్టారు. చాలా ఫాస్ట్గా షూటింగ్ జరుపుతున్నారు. ఈ మూవీని కూడా సెప్టెంబర్ 27న రిలీజ్ చేయాలని హరీష్ శంకర్ పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే బాలయ్య - రవితేజ బాక్సాఫీస్ ఎదుట తలపడే అవకాశం మెండుగా కనిపిస్తోంది. ఈ ఆసక్తికర పోరులో విజయం ఎవరినీ వరిస్తుందో చూడాలి.
గతంలో బాలయ్యదే పైచేయి
బాలకృష్ణ - రవితేజ బాక్సాఫీస్ వద్ద తలపడటం ఇదే తొలిసారి కాదు. గతంలో చాలా సందర్భాల్లో వారు చేసిన చిత్రాలు ఒకే రోజు విడుదలయ్యాయి. గతేడాది బాలయ్య చేసిన ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari), రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) ఒకే రోజున బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. అయితే ఈ పోరులో బాలకృష్ణ పైచేయి సాధించారు. ఆయన చేసిన ‘భగవంత్ కేసరి’ చిత్రం.. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ప్రశంసలు అందుకుంది. అయితే ‘టైగర్ నాగేశ్వరరావు’ మాత్రం రూ. 48 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈసారి కూడా బాలయ్యదే గెలుపు అని నందమూరి ఫ్యాన్స్ అంటుంటే.. కాదు కాదు రవితేజనే బాక్సాఫీస్ కింగ్గా నిలుస్తాడని అతడి ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
దేవర నుంచి గట్టిపోటీ తప్పదా?
తారక్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'దేవర' (Devara) చిత్రం.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం.. 'దేవర'ను సైతం సెప్టెంబర్ 27న రిలీజ్ చేయాలని కొరటాల టీమ్ భావిస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఆ రోజున రావాల్సిన పవన్ కల్యాణ్ 'ఓజీ' చిత్రం వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో దేవరను రెండు వారాల ముందుగానే రిలీజ్ చేస్తే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇదే జరిగితే ఆ రోజున బాక్సాఫీస్ వద్ద త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది.
'NBK109' నుంచి క్రేజీ గ్లింప్స్
నందమూరి బాలకృష్ణ- యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో వస్తోన్న ‘NBK 109’ చిత్రం నుంచి ఇటీవలే క్రేజీ గ్లింప్స్ విడుదలైంది. బాలయ్య బర్త్డే రోజున ఈ స్పెషల్ గ్లింప్స్ను మేకర్స్ రిలీజ్ చేశారు. "దేవుడు చాలా మంచోడయ్యా.. దుర్మార్గులకి కూడా వరాలిస్తాడు.. వీళ్ల అంతు చూడాలంటే కావాల్సింది.. జాలి, దయ, కరుణ ఇలాంటి పదాలకి అర్థాలే తెలియని అసురుడు" అనే డైలాగ్తో గ్లింప్స్ మొదలైంది. ఇక డైలాగ్ పూర్తి కాగానే బాలయ్య అలా నడుచుకుంటూ ఎంట్రీ ఇచ్చారు. ఇక గ్లింప్స్ చివరిలో గుర్రంపై బాలయ్య కనిపించిన సీన్ హైలెట్గా ఉంది. మీరూ గ్లింప్స్ చూసేయండి.
https://www.youtube.com/watch?v=Ib7bmm-PiaU
జూన్ 13 , 2024
EXCLUSIVE: టాలీవుడ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సైడ్ రోల్స్.. ఓ లుక్కేయండి!
సాధారణంగా సినిమాలో హీరో, హీరోయిన్ పాత్రలే ప్రేక్షకులకు ఎక్కువగా గుర్తుంటాయి. విలన్ నటన బట్టి ఆ పాత్రనూ ఆదరించేవారు ఉంటారు. అయితే కొన్నిసార్లు క్రేజ్తో సంబంధం లేకుండా సైడ్ పాత్రలు కూడా ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేస్తుంటాయి. తెరపై ఆ పాత్ర సాగుతున్నంతసేపు తమ వెంటే ప్రేక్షకుల అటెన్షన్ను తీసుకువెళ్తుంటాయి. టాలీవుడ్లో మరో పదేళ్లు గడిచినా ఆ పాత్రలకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గదని చెప్పవచ్చు. ఇంతకీ ఆ పాత్రలు ఏవి? వాటి ప్రత్యేకతలు ఏంటి?
సత్యరాజ్ (బాహుబలి)
బాహుబలిలో ప్రభాస్, రాణా పాత్రల తర్వాత అందరికీ గుర్తుండిపోయే రోల్ కట్టప్ప. దర్శకుడు రాజమౌళి ఈ పాత్రను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దాడు. కట్టప్ప పాత్ర లేకుండా బాహుబలి చిత్రాన్ని అసలు ఊహించలేము. సీనియర్ నటుడు సత్యరాజ్ (Sathyaraj) ఆ పాత్రలో పరాకయప్రవేశం చేసి మరి నటించాడు.
ప్రకాష్ రాజ్ (అతడు)
మహేష్ కెరీర్లో వచ్చిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘అతడు’ ఒకటి. ఇందులో మహేష్ బాబు (Mahesh Babu) తర్వాత ఆ స్థాయిలో ఆకట్టుకునే పాత్ర ప్రకాష్ రాజ్ది. సీబీఐ ఆఫీసర్గా అతడి అందరినీ అలరించాడు. కేసు దర్యాప్తు సందర్భంగా ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్స్, ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
https://youtu.be/Kk93JgAM7wA?si=5saRnFWzIEeDf3fR
సుకుమారి (మురారి)
మహేష్ బాబు హీరోగా కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన ‘మురారి’ (Murari) చిత్రం అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులోని శబరి పాత్రలో సీనియర్ నటి మెప్పించింది. మహేష్ జాతకంలో ఉన్న గండం వల్ల అతడికి ఏం జరుగుతుందో అని భయపడుతూ సినిమాలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. హీరో కోసం చివర్లో ప్రాణ త్యాగం చేసి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది.
https://youtu.be/3GrsswRGUaA?si=TgwJ6hZRa0rtRu18
శ్రీకాంత్ (శంకర్దాదా MBBS)
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా చేసిన ‘శంకర్ దాదా MBBS’ చిత్రం అప్పట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసింది. ఇందులో ‘ఏటీఎం’ అనే పాత్ర ఎంతో కీలకమైనది. సీనియర్ నటుడు శ్రీకాంత్ (Srikanth) ఈ పాత్రలో కనువిందు చేశాడు. చిరుకి రైట్గా ఉంటూ సందర్భానుసరంగా వచ్చే సీన్లలో నవ్వులు పూయించాడు. ఈ మూవీకి సీక్వెల్గా వచ్చిన ‘శంకర్ దాదా జిందాబాద్’లోనూ శ్రీకాంత్ ఈ తరహా పాత్రనే చేసి అదరగొట్టాడు.
https://youtu.be/QHdvEYMIOao?si=K5wkBfT-Y1gUFlZ3
రాజేంద్ర ప్రసాద్ (ఆ నలుగురు)
డబ్బు మాత్రమే సంతోషాన్ని ఇవ్వదని నిరూపించిన చిత్రం ‘ఆ నలుగురు’ (Aa Naluguru). ఇందులో రఘు రామయ్య పాత్రలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) నటించాడు. నైతిక విలువలు కలిగిన ఓ పత్రికా ఎడిటర్గా, ఎంత కష్టం వచ్చినా న్యాయంగా వ్యవహరించే ఆ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేసి మరి నటించారు.
https://youtu.be/AYZjTMg2EbM?si=iOSHIruH84KVRJ-0
శ్రీహరి (నువ్వొస్తానంటే నేనొద్దంటానా)
సిద్ధార్థ్ - త్రిష జంటగా డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో నటుడు శ్రీహరి (Srihari)కి మంచి పాత్ర దక్కింది. హీరోయిన్కు అన్నగా ఆయన ఎంతో అద్భుతంగా నటించాడు. అన్న అంటే ఎలా ఉండాలో ఈ పాత్ర ద్వారా తెలియజేశారు. క్లైమాక్స్లో హీరో చేసిన హత్యను తనపైన వేసుకొని జైలుకు వెళ్లే దృశ్యాలు ఆడియన్స్కు బాగా కనెక్ట్ అవుతాయి.
https://youtu.be/WNCwQvHa1w4?si=f2K-X2pSMJSzfQtd
గొల్లపూడి మారుతిరావు (లీడర్)
దిగ్గజ నటుడు గొల్లపూడి మారుతిరావు (Gollapudi Maruti Rao).. ‘లీడర్’ సినిమాలో ఓ అద్భుతమైన క్యామియో చేశారు. సీనియర్ పొలిటిషన్గా హీరో రాణాతో ఆయన చెప్పే డైలాగ్స్ ప్రస్తుత రాజకీయాలకు అద్దం పడతాయి. ఆ సీన్పై మీరు ఓ లుక్కేయండి.
https://youtu.be/AjLNxJCU1Cs?si=nNVLqa_4N5Md1O8y
అభినవ్ గోమఠం (ఈ నగరానికి ఏమైంది)
తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న హాస్య నటుల్లో అభినవ్ గోమఠం ఒకరు. ఈ నగారానికి ఏమైంది చిత్రం ద్వారా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. కౌషిక్ పాత్రలో తన కామెడీ టైమింగ్తో అదరగొట్టాడు.
https://youtu.be/qAluEZGqhh8?si=xRLufanS8xSuqf9h
సుహాసిని (నువ్వు నాకు నచ్చావ్)
వెంకటేష్ - ఆర్తి అగర్వాల్ జంటగా చేసిన ఈ చిత్రంలో సీనియర్ నటి సుహాసిని (Suhasini) హీరోయిన్కు అత్తగా మెప్పించింది. అత్తింటిలో కొందరి ఆడవారి కష్టాలు ఎలా ఉంటాయో తన డైలాగ్స్ ద్వారా కళ్లకు కట్టింది. ముఖ్యంగా క్లైమాక్స్లో హీరోయిన్ తండ్రిని పెళ్లికి ఒప్పించే సీన్ అదరహో అనిపిస్తుంది.
https://youtu.be/XlXM5l95rEg?si=pepiyzzgooAEmbwe
మే 01 , 2024
Anupama Parameswaran: బొల్డ్ రోల్… అనుపమ జాతకం మార్చనుందా?
గ్లామర్ డాల్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా బ్లూ కలర్ చీరతో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. మత్తెక్కించే ఫోజుల్లో కనిపించి కైఫేక్కిస్తోంది. బ్లూకలర్ స్లీవ్ లెస్ జాకెట్ ధరించిన ఈ మలయాళీ బ్యూటీ… తన ఎద అందాలను ఆరబోసింది.
నాజూకైన నడుము ఒంపులతో, మత్తెక్కించే లుక్స్తో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది
టిల్లు స్కేర్ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్లో తన కెరీర్కు ఈ సినిమా విజయం టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆశపడుతోంది.
ఒకప్పుడు అందాల ప్రదర్శనకు దూరంగా ఉన్న అనుపమ.. టిల్లు స్కేర్ చిత్రంలో బొల్డ్ లుక్లో అన్నింటికీ సై అంటూ హింట్ ఇచ్చింది
ఈ సినిమాలో ఏకంగా మూడు సార్లు సిద్ధు జొన్నలగడ్డతో లిప్ లాక్ సీన్లలో నటించి ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసింది.
ఈ చిత్రంలో అనుపమ లుక్స్, బొల్డ్ అటైర్ ప్రేక్షకులను కన్నార్పకుండా చేసింది. మునుపెన్నడులేని విధంగా అనుపమ కనిపించే సరికి ప్రేక్షకులు కనుల విందు చేసుకున్నారు.
గతంలోనూ 'రౌడీ బాయ్స్' చిత్రంలో రొమాంటిక్ సీన్లలో నటించినా… ఆ డోస్ టిల్లు స్కేర్లో అనుపమ పెంచేసింది.
ఈ చిత్రంలో బోల్డ్ రోల్తో అనుపమతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు లైన్లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది
గత కొంతకాలంగా సరైన విజయం లేక ఆందోళనలో ఉన్న అనుపమ ఈ సినిమా ద్వారా బౌన్స్ బ్యాక్ అయిందని చెప్పవచ్చు. అనుపమ ఈ చిత్రంలో బోల్డ్ లుక్లో నటించేసరికి ఆమెపై సోషల్ మీడియాలో అభిమానులు ట్రోల్ చేశారు.
అయితే ఈ ట్రోల్స్పై మనస్తాపం చెందిన అనుపమ… క్యారెక్టర్ ఏమి కోరుకుంటుందో తాను అదే చేశానని సమాధానం చెప్పింది. గతంలో స్టార్ హీరోయిన్లు క్యారెక్టర్కు అనుగుణంగా బోల్డ్ పాత్రలు చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేసింది.
ప్రస్తుతం సౌత్ సిని పరిశ్రమల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఈ మలయాళి సోయగం… తెలుగు, తమిళం, మలయాళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనుపమ నటించిన కార్తికేయ 2 చిత్రం తెలుగులోనే కాకుండా.. పాన్ ఇండియా లెవల్లో మంచి విజయం సాధించింది.
ఈ సినిమాలో అనుపమ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇందులో హీరో నిఖిల్తో పోటీ పడి మరీ నటించింది.
కార్తికేయ 2 తర్వాత అనుపమ 'బటర్ఫ్లై', '18 పేజెస్' చిత్రాల్లో నటించింది. ఇందులో '18 పేజెస్' మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమిళంలో సైరెన్, మలయాళంలో మరో చిత్రం కోసం తన డేట్స్ ఇచ్చింది.
మార్చి 30 , 2024