రివ్యూస్
How was the movie?
తారాగణం
ధనుష్
సాయి పల్లవి
కృష్ణ
టోవినో థామస్
వరలక్ష్మి శరత్కుమార్
విద్యా ప్రదీప్
రోబో శంకర్
కల్లూరి వినోద్
కాళి వెంకట్
రాఘవన్ మురుగన్
మనోబాల
ఆడుకలం నరేన్
ఇ. రాందాస్
అరంతాంగి నిషా
విన్సెంట్ అశోకన్
అవినాష్ రఘుదేవన్
అజయ్ ఘోష్
స్టంట్ సిల్వా
స్టాలిన్
సంగిలి మురుగన్
సేతు లక్ష్మి
రాక్ ప్రభు
పసి సత్య
ఎం. కామరాజ్
సిబ్బంది
బాలాజీ మోహన్
దర్శకుడుధనుష్
నిర్మాతయువన్ శంకర్ రాజా
సంగీతకారుడుప్రసన్న జికె
ఎడిటర్కథనాలు
Jani Master: జానీ మాస్టర్ను బెస్ట్ కొరియోగ్రాఫర్గా నిలబెట్టిన టాప్-10 సాంగ్స్ ఇవే!
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. తనను కొద్ది కాలంగా లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడం టాలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యువతి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్పై ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ కోసం గాలింపు ముమ్మరం చేసిన సైబరాబాద్ ఎస్వోటీ పోలీసుల బృందం ఎట్టకేలకు ఆయనను గోవాలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి కోర్టులో హాజరుపరిచి నగరానికి తీసుకొస్తున్నట్లు సమాచారం.
[toc]
అసలేం జరిగిందంటే?
జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘2017లో జానీ మాస్టర్ నాకు పరిచయమయ్యాడు. 2019లో అతని బృందంలో సహాయ నృత్య దర్శకురాలిగా చేరాను. ముంబయిలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్తో పాటు నేను, మరో ఇద్దరు సహాయకులం వెళ్లాం. అక్కడ హోటల్లో నాపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పని చేయలేవని బెదిరించాడు. దీన్ని అవకాశంగా తీసుకుని హైదరాబాద్ నుంచి ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణకు తీసుకెళ్లిన సందర్భాల్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. షూటింగ్ సమయంలోనూ వ్యానిటీ వ్యాన్లో అసభ్యంగా ప్రవర్తించేవాడు’ అని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం (సెప్టెంబర్ 19) ఆయన్ని అరెస్ట్ చేశారు. సైబరాబాద్ ఎస్వోటీ పోలీసు బృందం గోవాలోని లాడ్జిలో అతడిని అదుపులోకి తీసుకుంది.
తప్పు చేస్తే ఒప్పుకోండి: మంచు మనోజ్
మైనర్ అయినప్పటి నుంచి జానీ మాస్టర్ తనను వేధించాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదైన తర్వాత నుంచి జానీ మాస్టర్ కనిపించకుండా పోయారు. దీనిపై నటుడు మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ ఆరోపణలు చేసినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, భావితరాలకు ప్రమాదకర సందేశాన్నిస్తుందని అభిప్రాయపడ్డారు. జానీ మాస్టర్ నిజాన్ని ఎదుర్కొని పోరాడాలని, ఏ తప్పు చేయకపోతే ధైర్యంగా నిలబడి పోరాడాలని హితవు పలికారు. ఒకవేళ మీరు తప్పు చేసి ఉంటే ఆ విషయాన్ని అంగీకరించండి అని మంచు మనోజ్ స్పష్టం చేశారు. ‘జానీ మాస్టర్.. మీరు కెరీర్లో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు. కానీ మీపై ఈస్థాయిలో ఆరోపణలు రావడం చూస్తుంటే గుండె బద్దలవుతోంది. ఎవరిది తప్పు అనేది చట్టం చూసుకుంటుంది. ఈ వ్యవహారంలో వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులకు అభినందనలు తెలుపుతున్నాను. చట్టానికి ఎవరూ అతీతులు కారన్న విషయం దీనితో స్పష్టమవుతోంది’ అని మంచు మనోజ్ పేర్కొన్నారు.
https://twitter.com/HeroManoj1/status/1836692133216174368
జానీ మాస్టర్ టాప్-10 సాంగ్స్
జానీ మాస్టర్పై వచ్చిన లైంగిక ఆరోపణల అంశాన్ని కాస్త పక్కన పెడితే ఆయన బెస్ట్ కొరియోగ్రాఫర్ అన్న విషయాన్ని అందరూ అంగీకరించాల్సిందే. అతి తక్కువ కాలంలోనే తన ప్రతిభతో స్టార్ కొరియోగ్రాఫర్గా ఆయన ఎదిగారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ ఇండస్ట్రీలలో పలు సూపర్ హిట్ సాంగ్స్కు నృత్యాన్ని అందించారు. ఈ క్రమంలోనే ఇటీవల నేషనల్ అవార్డు సైతం అందుకొని దేశంలోనే బెస్ట్ కొరియోగ్రాఫర్గా నిలిచారు. ఇప్పటివరకూ ఆయన కొరియోగ్రఫీలో వచ్చిన టాప్ -10 సాంగ్స్ ఏవో ఇప్పుడు చూద్దాం
మేఘం కరిగేనా (తిరు)
తమిళంలో ధనుష్ హీరోగా రూపొందిన ‘తిరుచిత్రంబళం’ సినిమా తెలుగులో 'తిరు' పేరుతో డబ్ అయ్యింది. ఈ సినిమాలోని 'మేఘం కరిగేనా' సాంగ్ను జానీ మాస్టర్ అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేశారు. ధనుష్, నిత్య స్టెప్పులను నెక్స్ట్ లెవల్లో కంపోజ్ చేశారు. గతంలో ప్రభుదేవ చేసిన ‘వెన్నెలవే వెన్నలవే’ తరహాలో ఈ సాంగ్ అందరినీ మెస్మరైజ్ చేసింది. ఇందుకుగాను 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో నేషనల్ బెస్ట్ కొరియోగ్రాఫర్గా ఎంపికై అందరి ప్రశంసలు అందుకున్నారు.
https://www.youtube.com/watch?v=0IdqwA2GXgY
అరబిక్ కుతు (బీస్ట్)
విజయ్ హీరోగా తెరకెక్కిన బీస్ట్ సినిమాలోని అరబిక్ కుతు సాంగ్ యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. జానీ మాస్టర్ కొరియోగ్రాఫీకి తమిళ ఆడియన్స్ ఫిదా అయ్యారు. విజయ్ బాడీ లాంగ్వేజ్కు తగ్గట్లు స్టెప్స్ కంపోజ్ చేసిన విధానం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. నటి పూజా హెగ్డే కూడా కెరీర్ బెస్ట్ స్టెప్స్తో ఓ ఊపు ఊపింది.
https://www.youtube.com/watch?v=vOYJmUE_U24
రంజితమే (వారసుడు)
విజయ్, రష్మిక జంటగా నటించిన ‘వారసుడు’ చిత్రంలోని రంజితమే సాంగ్ కూడా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ పాటలో విజయ్, రష్మిక డ్యాన్స్ దెబ్బకు థియేటర్లు ఈలలు, గోలలతో దద్దరిల్లాయి. ముఖ్యంగా సాంగ్ చివరిలో వచ్చే సింగిల్ టేక్ స్టెప్ విజయ్ ఫ్యాన్స్ను ఉర్రూతలూగించింది. ఈ సాంగ్తో జానీ మాస్టర్కు జాతీయ స్థాయిలో పేరు వచ్చింది.
https://www.youtube.com/watch?v=RoBavDxV-Y8
రారా రక్కమ్మ (విక్రాంత్ రోణ)
విక్రాంత్ రోణ సినిమాలోని రారా రక్కమ్మ సాంగ్ దేశంలోని మ్యూజిక్ లవర్స్ను షేక్ చేసింది. ముఖ్యంగా జానీ మాస్టర్ అందించిన సిగ్నేచర్ స్టెప్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యింది. చాలా ముంది యువత ఆ హుక్ స్టెప్పై రీల్స్ చేసి వైరల్ అయ్యారు. ఈ ఐటెం సాంగ్లో బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండజ్, కన్నడ నటుడు సుదీప్తో ఆడిపాడింది.
https://www.youtube.com/watch?v=aC9KBju5BNY
నువ్వు కావాలయ్యా (జైలర్)
రజనీకాంత్ గత చిత్రం ‘జైలర్’లో నువ్వు కావాలయ్యా సాంగ్ విపరీతంగా ట్రెండ్ అయ్యింది. మిల్క్ బ్యూటీ తమన్న వేసిన హుక్ స్టెప్కు యూత్ ఫిదా అయ్యారు. ఈ సాంగ్ను కూడా జానీ మాస్టర్ కంపోజ్ చేయడం విశేషం. ఈ పాటకు యూట్యూబ్లో మిలియన్స్ కొద్ది వ్యూస్ వచ్చాయి. రీల్స్ సైతం పెద్ద ఎత్తున చేశారు.
https://www.youtube.com/watch?v=xMOuFKJmjNk
రౌడీ బేబీ (మారి 2)
సాయి పల్లవి, ధనుశ్ నటించిన ‘మారి 2’లోని రౌడీ బేబి సాంగ్ క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ పాట యూట్యూబ్లో ఎన్నో సంచలనాలు సృష్టించింది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీకి తోడు సాయిపల్లవి, ధనుష్ స్టెప్పులు అందరినీ కట్టిపడేశాయి. వాస్తవానికి మెుదట ఈ సాంగ్ ప్రభుదేవ వద్దకు వెళ్లింది. ఆయన బిజీగా ఉండటంతో జానీ మాస్టర్ ఈ పాటను కంపోజ్ చేశారు. ప్రభుదేవా పర్యవేక్షణలో సాంగ్ చిత్రీకరణ జరిగింది.
https://www.youtube.com/watch?v=O6FNcjUs0YI
బుట్టబొమ్మ (అల వైకుంఠపురంలో)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురంలో’ని బుట్టబొమ్మ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గాయకుడు అర్మాన్ మాలిక్ ఆలపించిన పాటకు జాని మాస్టర్ తనదైన శైలిలో స్టెప్పులు డిజైన్ చేశారు. సాహిత్యానికి తగ్గట్లు యూనిక్ స్టెప్పులను బన్నీ చేత వేయించి సాంగ్ సక్సెస్లో కీలకపాత్ర పోషించాడు.
https://www.youtube.com/watch?v=2mDCVzruYzQ
సినిమా చూపిస్తా మావా (రేసు గుర్రం)
‘రేసుగుర్రం’లోని మాస్ బీట్ ఉన్న సినిమా చూపిస్తా మావ పాటను కూడా జానీ మాస్టరే కొరియోగ్రాఫ్ చేశారు. ఇందులో బన్నీ, శ్రుతి హాసన్ వేసే స్టెప్పులు వీక్షకులను ఫిదా చేశాయి. ఆధ్యాంతం ఉత్సాహాం నింపేలా జానీ మాస్టర్ ఈ పాటను కంపోజ్ చేయడం విశేషం.
https://www.youtube.com/watch?v=H7EAJW8jYzA
లైలా ఓ లైలా (నాయక్)
రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో నటించి మెప్పించిన సినిమా ‘నాయక్’. ఈ సినిమాలో ‘లైలా ఓ లైలా’ పాటతో చెర్రీ ఓ బెస్ట్ డాన్సర్ అని అంతా ఫిక్స్ అయ్యారు. పక్క ఇండస్ట్రీ వాళ్లు కూడా చెర్రీ టాప్ డాన్సర్ అని ప్రశంసించారు. ఈ పాటలో మాస్ స్టెప్పులకు తగ్గట్టుగానే చాలా క్లాసిక్ స్టెప్పులను కూడా జానీ మాస్టర్ చాలా పర్ఫెక్ట్గా సెట్ చేశాడు.
https://www.youtube.com/watch?v=HGgHSi-kg78
ఏం మాయో చేశావే (ద్రోణ)
2009లో నితిన్ హీరోగా వచ్చిన ‘ద్రోణ’ సినిమాతో జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ‘ఢీ’ షోలో జానీ మాస్టర్ టాలెంట్ చూసిన నితిన్ ఈ అవకాశాన్ని ఆయనకు అందించారు. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన ’ఏం మాయ చేశావో’ సాంగ్ అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. నితిన్ చేత ఆ స్థాయిలో స్టెప్పులు వేయించిన కొరియోగ్రాఫర్ ఎవరూ అంటూ అంతా జానీ మాస్టర్ కోసం తెగ సెర్చ్ చేశారు. ఆ సాంగ్ తర్వాత నుంచి జానీ మాస్టర్ వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
https://www.youtube.com/watch?v=DPdL89Ho4P8
సెప్టెంబర్ 19 , 2024
Nayakudu 2023 Review: వడివేలు, ఉదయనిధి కెరీర్ బెస్ట్ నటన… నాయకుడు సినిమా ప్రేక్షకులను మెప్పించిందా?
నటీనటులు : ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్, ఫహాద్ ఫాజిల్, వడివేలు, లాల్
రచన, దర్శకత్వం : మారి సెల్వరాజ్
ఛాయాగ్రహణం : తేని ఈశ్వర్
ఎడిటర్ : ఆర్కే సెల్వ
సంగీతం : ఏఆర్ రెహమాన్
నిర్మాత : ఉదయనిధి స్టాలిన్
దేశంలోని ప్రముఖ దర్శకుల జాబితాలో మారి సెల్వరాజ్ పేరు తప్పకుండా ఉంటుంది. తన సినిమాల ద్వారా ఆయన ప్రజా సమస్యలను టచ్ చేస్తుంటారు. అందుకే ఆయన నుంచి సినిమా వస్తుందంటే ప్రతీ ఒక్కరిలోనూ అంచనాలు పెరిగిపోతుంటాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లేముందు ఉదయనిధి స్టాలిన్ తన చివరి సినిమా అవకాశాన్ని మారి సెల్వరాజ్కు ఇచ్చారు. తమిళనాట ‘మామన్నన్’గా విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికే పెద్ద సక్సెస్ అయింది. ఉదయనిధి స్టాలిన్తో పాటు ఫహాద్ ఫాజిల్, వడివేలు, కీర్తి సురేష్ వంటి భారీ స్టార్ క్యాస్ట్ కూడా ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా?
కథ:
రఘువీరా (ఉదయనిధి స్టాలిన్) ఒక మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్. అతని తండ్రి తిమ్మరాజు (వడివేలు) రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే. లీల (కీర్తి సురేష్), రఘువీరా క్లాస్మేట్. కాలేజీ రోజుల నుంచి ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉన్నప్పటికీ కనీసం మాట్లాడుకోరు. కాలేజీ అయిపోయాక లీల ఉచిత వైద్యం కోసం ఇన్స్టిట్యూట్ స్థాపిస్తుంది. దీనికోసం రఘువీరా తన మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ను ఇచ్చేస్తాడు. ఓ రోజు రత్నవేలు (ఫహాద్ ఫాజిల్) అన్న (సునీల్ రెడ్డి) మనుషులు ఇన్స్టిట్యూట్ దాడి చేసి బిల్డింగ్ను ధ్వంసం చేస్తారు. గొడవ పెద్దది కావడంతో సెటిల్ చేయడానికి రత్నవేలు దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇది కులాల మధ్య గొడవగా ఎలా మారింది? అనేది అసలు కథ. ఇది తెలియాలంటే థియేటర్స్కు వెళ్లాల్సిందే.
ఎవరెలా చేశారంటే
ఈ సినిమాకు వడివేలు నటనే హైలెట్ అని చెప్పొచ్చు. ప్రథమార్థంలో అమాయకుడిగా, నిస్సహాయుడిగా, ద్వితీయార్థంలో కొడుకు కోసం ఎవరికైనా ఎదురించే ధైర్యవంతుడిగా వడివేలు నటన ఆకట్టుకుంటుంది. సెకండాఫ్లో కారులో ఫహాద్ ఫాజిల్కు వార్నింగ్ ఇచ్చే సీన్లో, ఉదయనిధి స్టాలిన్తో కలిసి కత్తి పట్టుకుని ఇంట్లో విలన్ కోసం ఎదురు చూసే సీన్లో ఆయన నటన గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక హీరో ఉదయనిధి స్టాలిన్ విషయానికొస్తే ఆయన కెరీర్లో ఇదే బెస్ట్ రోల్ అని చెప్పొచ్చు. ఎప్పటిలాగే ఉదయనిధి తన నటనతో ఆకట్టుకున్నాడు. అటు ఫహాద్ ఫాజిల్ కూడా అత్యుత్తమ నటన కనబరిచాడు. కీర్తి సురేష్ పాత్రకు నటనలో మంచి స్కోప్ ఉంది. లీల పాత్రలో ఆమె ఒదిగిపోయింది. మిగతా పాత్రదారులందరూ తమ పరిధి మేరకు నటించారు.
ఎలా సాగిందంటే
ప్రథమార్థం అంతా పాత్రలు, వాటి ఐడియాలజీల చుట్టూ తిరుగుతుంది. కీలకమైన అన్ని పాత్రల మధ్య ఫేస్ ఆఫ్కు రెడీ చేయడంతోనే ఫస్టాఫ్ అయిపోతుంది. ఫస్టాఫ్తో పోలిస్తే ద్వితీయార్థం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. రాజకీయ పోరాటం, ఎత్తులకు పైఎత్తులు వేయడం ప్రేక్షకుడిలో ఆసక్తిని పెంచుతాయి. శాంతిని కోరుకునే వడివేలు పాత్ర ఆలోచించేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో బుద్ధుడి విగ్రహాన్ని చూపించడం వంటివి వీక్షకులకు ఇంట్రస్టింగ్గా అనిపిస్తాయి. ఇక సినిమాకు డైలాగ్స్ ప్రధాన బలం అని చెప్పొచ్చు.
టెక్నికల్గా
మారి సెల్వరాజ్ ఈ సినిమాలోనూ తనదైన మార్క్ చూపించాడు. హీరో, విలన్ ఇద్దరి పాత్రలనూ ఒకేసారి ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది. పాత్రల పరిచయం వేగంగా చేసిన దర్శకుడు కొన్ని సీన్లను కూడా ట్రిమ్ చేసుంటే బాగుండేదని అనిపించింది. ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్ మధ్య వచ్చే ఫ్లాష్ బ్యాక్ నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. ఇక సినిమాకు మరో బలం ఏఆర్ రెహమాన్ సంగీతం. ఆయన స్వరపరిచిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ఎంతగానో దోహదం చేశాయి. తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ ఆక్టటుకుంటుంది. ఈ సినిమాకు నిర్మాత కూడా ఉదయనిధి స్టాలినే కాబట్టి ఖర్చుకు వెనకాడలేదు.
ప్లస్ పాయింట్స్
కథవడివేలు నటనరెహమాన్ సంగీతంఇంటర్వెల్ బ్యాంగ్
మైనస్ పాయింట్స్
సాగదీత సీన్స్నెమ్మదిగా సాగే కథనం
రేటింగ్: 3.25/5
జూలై 14 , 2023
War 2: ఎన్టీఆర్ ‘వార్ 2’ చిత్రంపై క్రేజీ అప్డేట్.. పూర్తిగా లుక్ మార్చిన తారక్
భారతీయ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘వార్ 2’ (War 2). YRF (Yash Raj Films) స్పై యూనివర్స్లో 6వ చిత్రంగా రానుండటంతో అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఇటీవల ‘బ్రహ్మస్త’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అయాన్ ముఖర్జీ.. ‘వార్ 2’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇండియన్ సూపర్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ హీరో జూ.ఎన్టీఆర్ (Jr NTR) ఈ సినిమాలో నటించనున్నారు. 'ఆర్ఆర్ఆర్' లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నేరుగా చేస్తున్న తొలి బాలీవుడ్ మూవీ కావడంతో హిందీతో పాటు తెలుగులోనూ ఈ ప్రాజెక్టుపై భారీ హైప్ నెలకొంది. 2019లో హృతిక్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటించిన ‘వార్’కి సీక్వెల్గా ఈ చిత్రం రానుంది. అయితే తాజాగా హృతిక్, తారక్లకు సంబంధించి సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
హృతిక్, తారక్ షూట్ ఎప్పుడంటే!
‘వార్ 2’ (War 2) చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్న హృతిక్ రోషన్ (Hrithik Roshan), తారక్ (Jr NTR) షూటింగ్కు సంబంధించి క్రేజీ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీని ప్రకారం 'వార్ 2'లో హృతిక్కు సంబంధించిన సన్నివేశాలను జపాన్లో చిత్రీకరించనున్నారు. షావోలిన్ టెంపుల్ దగ్గర హృతిక్ ఎంట్రీ సీన్స్ తెరకెక్కిస్తారని టాక్ వినిపిస్తోంది. మార్చి 7 నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. ఇక తారక్ విషయానికి వస్తే అతడు ఏప్రిల్లో షూటింగ్లో జాయిన్ అవుతాడని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల నుంచి తారక్-హృతిక్కు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తారని అంటున్నారు.
గాయం నుంచి కోలుకున్న హృతిక్!
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్.. వార్ 2 చిత్రం కోసం గత కొంతకాలం నుంచి వర్కౌట్స్ చేస్తున్నాడు. పర్ఫెక్ట్ బాడీ షేప్ పొందేందుకు జిమ్లో కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే రెండు వారాల క్రితం ఆయన జిమ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో అనుకున్న దానికంటే ‘వార్ 2’ షూట్ కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం హృతిక్ పూర్తి ఫిట్గా ఉండటంతో మార్చి 7 నుంచి ఆయనకు సంబంధించిన సన్నివేశాలను షూట్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు హృతిక్ కూడా ఓకే చెప్పడంతో మూవీ యూనిట్ జపాన్లో వాలిపోయేందుకు సిద్ధమవుతోంది.
https://twitter.com/i/status/1764908346640040382
‘వార్ 2’లో తారక్ గెటప్ అదేనా?
కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ (Devara) చిత్రంలో ప్రస్తుతం తారక్ నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి వరుస షెడ్యూల్స్లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇందులో తారక్కు జోడీగా బాలీవుడ్ స్టార్ నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తోంది. అయితే తాజాగా బెంగళూరులో జరిగిన ఓ పార్టీకి తారక్ సతీసమేతంగా హాజరయ్యాడు. అక్కడ తారక్ లుక్ చూసి అంతా ఫిదా అయ్యారు. మెున్నటి వరకూ కాస్త లావుగా కనిపించిన తారక్.. లేటెస్ట్ ఫొటోల్లో బరువు తగ్గి చాలా స్లిమ్ అయ్యారు. దేవరలో ఎన్టీఆర్ ద్విపాత్రిభినయం చేస్తున్నారని వార్తలొస్తున్న తరుణంలో ఎన్టీఆర్ ఇలా మారి ఆ గాసిప్స్ను కన్ఫార్మ్ చేశారని ఫ్యాన్స్ అంటున్నారు. మరోవైపు ‘వార్ 2’లోనూ తారక్ ఇదే గెటప్లో కనిపించబోతున్నట్లు సమాచారం.
‘వార్ 2’ రిలీజ్ ఎప్పుడంటే?
భారీ బడ్జెట్తో రూపొందనున్న 'వార్ 2' చిత్రం విడుదల తేదీని నిర్మాణ సంస్థ యశ్రాజ్ ఫిల్మ్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. 2025 ఆగష్టు 14న ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇందులో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్తో కూడిన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం ఉంది. హృతిక్ రోషన్కు ధీటుగా పవర్ఫుల్గా అతడి క్యారెక్టర్ సాగుతుందని సమాచారం. అటు బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం కూడా ‘వార్ 2’లో కీలక పాత్ర పోషించనున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటించనుంది.
మార్చి 05 , 2024
Tollywood Roundup 2023: గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
టాలీవుడ్లో ఏటా పదుల సంఖ్యలో కొత్త హీరోయిన్లు పరిచయం అవుతుంటారు. వారిలో ఎంత మంది సక్సెస్ అవుతారో చెప్పలేం. అందం, అభినయం, నటన వంటివి మాత్రమే వారిని హీరోయిన్స్గా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేస్తాయి. ప్రస్తుతం టాలీవుడ్లో చాలామంది కథానాయికలు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ను కలిగి ఉన్నారు. వీరిలో ఎవరు టాప్ అంటే చెప్పటం కష్టమే. అయితే 2023 ఏడాదిలో గూగుల్ సెర్చ్లో టాప్లో ఉన్న తెలుగు హీరోయిన్స్ జాబితా బయటకొచ్చింది. అందులోని హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
రష్మిక మందన్న
గూగుల్లో ఎక్కువ మంది శోధించిన తెలుగు హీరోయిన్ల జాబితాలో రష్మిక మందన్న అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవల ఈ భామ నటించిన యానిమల్ చిత్రం సూపర్ హిట్ కావడంతో రష్మిక పేరు మారుమోగింది. అంతకుముందు ఆమె డీప్ ఫేక్ వీడియోలు నెట్టింట వైరల్గా మారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. దీంతో రష్మిక గురించి ఎక్కువ మంది నెట్టింట శోధించారు.
మృణాల్ ఠాకూర్
‘సీతారామం’ మూవీతో మృణాల్ ఠాకూర్ స్టార్ హీరోయిన్ల సరసన చేరిపోయింది. ఈ ఏడాది బాలీవుడ్లో అక్షయ్ కుమార్తో సెల్ఫీ సినిమాలో నటించింది. అలాగే గుమ్రా, లస్ట్ స్టోరీస్-2, పిప్పా వంటి చిత్రాల్లో కనిపించి దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించింది. దీంతో పాటు సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా మోస్ట్ సెర్చ్డ్ హీరోయిన్ల జాబితాలో ఆమె రెండోస్థానంలో నిలిచింది.
శ్రీలీల
ఈ ఏడాది టాలీవుడ్లో అందరికంటే ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్గా శ్రీలీల నిలిచింది. ఈ సంవత్సరం ఆమె నటించిన నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాల ద్వారా ఈ భామ ప్రేక్షకులను పలకరించింది. మరో నాలుగు భారీ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. దీంతో ఆమె పేరు గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేయబడింది.
తమన్న భాటియా
మిల్కీ బ్యూటీ తమన్న గురించి కూడా ఎక్కువ మంది శోధించారు. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఆమె ప్రేమాయణం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్లో వీరిద్దరు స్క్రీన్ షేర్ చేసుకోవడంతో పాటు ఒకరిపైఒకరు ముద్దుల వర్షం కురిపించుకున్నారు. వాటికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు అప్పట్లో నెట్టింట వైరల్ అయ్యాయి.
సమంత
ఈ ఏడాది సమంత గురించి కూడా చాలా మందే శోధించారు. సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు ఆమె ప్రకటించడంతో సమంత పేరు ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వచ్చింది. అలాగే సామ్ రీసెంట్ మూవీ ‘ఖుషి’ హిట్ కావడంతో ఆమె పాపులారిటి మరింత పెరిగింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలను పెడుతూ ఫ్యాన్స్ను అలరిస్తుండటంతో ఎక్కువ మంది సమంత పేరును సెర్చ్ చేశారు.
అనుష్క శెట్టి
అనుష్క శెట్టి సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాదే వెండితెరపై తళ్లుక్కుమంది. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. సినిమా షూట్ మెుదలైనప్పటి నుంచి రిలీజ్ అయ్యేవరకూ ఏదోక రూపంలో ఆమె వార్తల్లో నిలుస్తూనే వచ్చారు.
కాజల్ అగర్వాల్
పెళ్లి తర్వాత సినిమాలకు విరామం ఇచ్చిన కాజల్.. ఈ ఏడాది స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇచ్చారు. బాలయ్య సరసన ఆమె చేసిన ‘భగవంత్ కేసరి’ మంచి విజయాన్ని సాధించింది. అలాగే కాజల్ చేసిన ఘోస్ట్, కరుంగపియం వంటి చిత్రాలు కూడా ఈ ఏడాదే వచ్చాయి.
కీర్తి సురేష్
ఈ ఏడాది దసరా సినిమా ద్వారా కీర్తి సురేష్ బ్లాక్బాస్టర్ హిట్ అందుకుంది. వెన్నెల పాత్రలో అద్భుత నటన కనబరిచి అందర్ని ఆశ్చర్యపరిచింది. పాన్ ఇండియా స్థాయిలో దసరా రిలీజ్ కావడంతో కీర్తి సురేష్ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. దీంతో కీర్తి గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మంది నెటిజన్లు శోధించారు.
రకుల్ ప్రీత్ సింగ్
ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి కూడా ఎక్కువ మంది సెర్చ్ చేశారు. ఈ ఏడాది తెలుగులో ఒక్క సినిమా కూడా ఆమె చేయలేదు. కానీ ఈ భామ పోస్టు చేసే గ్లామర్ ఫోటోలు కారణంగా రకుల్ తరుచూ ట్రెండింగ్లో నిలుస్తూ వచ్చారు.
కృతి శెట్టి
ఉప్పెన సినిమాతో స్టార్ హీరోయిన్గా మారిన కృతి శెట్టి వరుసగా సినిమా అవకాశాలను దక్కించుంది. ఈ భామ గురించి కూడా ఎక్కువ మంది నెటిజన్లు సెర్చ్ చేశారట. ఈ ఏడాది నాగ చైతన్య సరసన ఆమె చేసిన ‘కస్టడీ’ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
డిసెంబర్ 14 , 2023
Vyjayanthi Movies Hits : ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాణ సంస్థ వైజయంతీ బ్యానర్లో ఇన్ని హిట్ సినిమాలు ఉన్నాయా?
ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం.. థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కల్కి ఈ స్థాయి సక్సెస్ సాధించడం వెనక దర్శకుడు నాగ్ అశ్విన్తో పాటు నిర్మాణ సంస్థ ‘వైజయంతీ మూవీస్’ (Vyjayanthi Movies) బ్యానర్ పాత్ర కూడా ఎంతో ఉంది. నిర్మాత అశ్వనీ దత్ (Aswani Dutt) ఎంతో సాహాసోపేతంగా కల్కి చిత్రాన్ని నిర్మించారు. బడ్జెట్ అంతకంతకూ పెరుగుతున్నప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. క్వాలిటీ ఔట్పుట్ ఇవ్వాలన్న లక్ష్యంతో దర్శకుడు నాగ్ అశ్విన్కు బడ్జెట్ పరంగా పూర్తి స్వేచ్ఛను కల్పించారు. రూ.600 కోట్లకు పైగా వ్యయంతో ఇండియాలోనే అతి భారీ బడ్జెట్ ఫిల్మ్గా కల్కిని తీర్చిదిద్దారు. కల్కి లాంటి విజువల్ వండర్ను అందించిన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ పేరు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.
వైజయంతీ మూవీస్ ప్రస్థానం
అశ్వనీ దత్.. నిర్మాతగా తన ప్రస్థానాన్ని అభిమాన హీరో నందమూరి తారక రామారావు ఫిల్మ్తోనే ప్రారంభించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ను నిర్మించి దాని లోగోగా కృష్ణుడి అవతారంలో ఉన్న ఎన్టీఆర్ను పెట్టారు. 1975లో వచ్చిన 'ఎదురులేని మనిషి' చిత్రంతో వైజయంతీ మూవీస్ సంస్థ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తొలినాళ్లలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. బ్లాక్బాస్టర్ చిత్రాలను అందించడంలో మాత్రం వెనకడుగు వేయలేదు. ఈ బ్యానర్లో వచ్చిన పలు చిత్రాలు టాలీవుడ్లో ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. ఇంతకీ ఆ బ్లాక్బాస్టర్ చిత్రాలు ఏంటి? తెలుగు చిత్ర పరిశ్రమలో అవి ఎలాంటి మార్క్ను క్రియేట్ చేశాయి? ఇప్పుడు చూద్దాం.
అగ్నిపర్వతం
వైజయంతీ మూవీస్ బ్యానర్పై వచ్చిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘అగ్నిపర్వతం’ (Agni Parvatam) ఒకటి. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ డబుల్ రోల్స్ చేయగా.. రాధ, విజయశాంతి హీరోయిన్లుగా కనిపించారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ ఫిల్మ్ అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ నట విశ్వరూపం చూపించారు. ఈ చిత్రం కృష్ణ కెరీర్లో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో కృష్ణ దూకుడుగా చెప్పిన ‘అగ్గి పెట్టుందా?’ డైలాగ్ అప్పట్లో మారుమోగింది. అలాగే ‘కదులుతున్న అగ్నిపర్వతం’ సాంగ్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. నటుడిగా సరికొత్త కృష్ణను పరిచయం చేసింది. మూవీ కథ ఏంటంటే.. ‘జమదగ్ని తన తల్లిని విడిచిపెట్టినందుకు అతని తండ్రిని ద్వేషిస్తాడు. అయితే అతని శత్రువులు సమస్య సృష్టించేందుకు జమదగ్ని సవతి సోదరుడిని తెరపైకి తెస్తారు. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.
https://www.youtube.com/watch?v=FaJqLrjanQM
జగదేక వీరుడు అతిలోక సుందరి
వైజయంతీ మూవీస్ రొటిన్ చిత్రాలనే కాకుండా ప్రయోగాత్మక ఫిల్మ్స్ కూడా తీయగలదని ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం నిరూపించింది. మెగాస్టార్ కెరీర్లో మరుపురాని చిత్రంగా నిలిచిపోయింది. సోషియో ఫాంటసీ జానర్లో రూపొందిన ఈ చిత్రం.. అప్పట్లో కలెక్షన్ల మోత మోగించింది. ఈ చిత్రం విడుదలకు ముందు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను వరదలు అతలాకుతలం చేశాయి. అయినా ఈ చిత్రం అఖండ విజయాన్ని నమోదు చేసుకోవడం విశేషం. రూ. 2 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ ఫిల్మ్.. ఆ రోజుల్లో రూ.15 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాకు ఇళయరాజా అందించిన మధురమైన పాటలు ఇప్పటికీ ఎక్కడోచోట మారుమోగుతూనే ఉన్నాయి. కథ ఏంటంటే ‘నలుగురు అనాథలకు ఆశ్రయిమిచ్చిన రాజు.. గైడ్గా పనిచేస్తుంటాడు. రాజుకు అనుకోకుండా ఓ రోజు ఇంద్రుడి కుమార్తె ఇంద్రజకు చెందిన ఉంగరం దొరుకుతుంది. ఆ ఉంగరం కోసం ఇంద్రజ తిరిగి భూమి మీదకు వస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.
శుభలగ్నం
జగపతిబాబు హీరోగా, ఆమని, రోజా హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం యూనిక్ కాన్సెప్ట్తో తెరకెక్కింది. భార్య భర్తలు సంతోషంగా జీవించడానికి డబ్బుతో సంబంధం లేదని నిరూపించింది. డబ్బు కోసం భర్తనే అమ్మేసిన భార్య.. చివరికి మారి భర్తను ఎలా దక్కించుకుంది? అన్న కాన్సెప్ట్తో ఈ సినిమా రూపొందింది. అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీలోని ‘చిలకా ఏ తోడు లేక’ అనే పాటకు ఉత్తమ గీత రచయితగా సిరివెన్నెలకు నంది పురస్కారం రావడం విశేషం. కథ ఏంటంటే.. ‘డబ్బుపై ఆశతో రాధ తన భర్తను ధనవంతురాలైన లతకు ఇచ్చి పెళ్లి చేస్తుంది. ఫలితంగా ఆమెకు కోటి రూపాయలు లభిస్తాయి. అయితే కాలక్రమంలో భర్త తోడు లేని జీవితం వృథా అని భావిస్తుంది’.
గోవిందా గోవిందా
నాగార్జున - రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో వచ్చిన 'గోవిందా గోవిందా'.. అప్పట్లో బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుంది. వెంకటేశ్వర స్వామి కిరీటం చుట్టూ తిరిగే ఈ సినిమా కథ తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. ఇందులో శ్రీదేవి తెలుగు ఆడియన్స్ ఎంతగానో మిస్మరైజ్ చేశారు. కథ ఏంటంటే.. ‘భగవంతుడైన వేంకటేశ్వరుడు.. దైవిక ఆయుధాన్ని ఉపయోగించి భూమిపై గందరగోళ పరిస్థితిని పరిష్కరించాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఈ ఆయుధంపై ఉన్న ఆభరణాలను కొంతమంది దుండగులు దొంగిలించినప్పుడు పరిస్థితి దిగజారుతుంది’.
ఓటీటీ వేదిక : సన్ నెక్స్ట్
రాజకుమారుడు
వైజయంతీ మూవీస్ బ్యానర్ ద్వారానే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరిచయం చేశారు. కథానాయకుడిగా అతడి ఫస్ట్ ఫిల్మ్ 'రాజకుమారుడు'ను కల్కి నిర్మాత అశ్వనీదత్ నిర్మించారు. ఈ సినిమాకు ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నంది అవార్డు సైతం వచ్చింది. చాలా సెంటర్లలో ఈ సినిమా 100 రోజులకు పైగా ఆడింది. ప్లాట్ ఏంటంటే.. 'సెలవులను ఎంజాయ్ చేయడానికి వచ్చిన రాజ్.. రాణిని చూసి ప్రేమలో పడతాడు. అయితే కుటుంబం ఒత్తిడితో ఆమె ప్రేమను వదులుకుంటాడు. ఇంతకి రాణి ఎవరు? ఆమె ఫ్యామిలీతో రాజ్ కుటుంబానికి ఉన్న వైరం ఏంటి? చివరికి వారు ఎలా ఒక్కటయ్యారు?' అన్నది కథ.
ఇంద్ర
మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ను మరోస్థాయికి తీసుకెళ్లిన చిత్రంగా 'ఇంద్ర'కు పేరుంది. ఈ సినిమాలో చిరు.. తొలిసారి ఫ్యాక్షనిస్టు పాత్ర పోషించారు. నిర్మాత అశ్వనీదత్కు ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. 2002లో ఉత్తమ నటుడిగా చిరంజీవికి నంది పురస్కారం వచ్చేలా చేసింది. 'రాయలసీమలో రెండు కుటుంబాల మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతుంటుంది. ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యర్థుల చెల్లెలితో ఇంద్ర పెళ్లికి అంగీకరిస్తాడు. కట్ చేస్తే సాధారణ జీవితం కోసం ఇంద్ర మారుపేరుతో కాశీకి వెళ్లిపోతాడు. ఇంద్ర కాశీకి ఎందుకు వెళ్లాడు? తిరిగి ప్రత్యర్థులపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు?' అన్నది కథ.
స్టూడెంట్ నెంబర్ 1
దర్శకధీరుడు రాజమౌళిని నిర్మాత అశ్వని దత్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తారక్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన మెుట్ట మెుదటి చిత్రం 'స్టూడెంట్ నెం.1' అశ్వనీదత్ నిర్మాత. వైజయంతీ మూవీస్ సబ్ బ్యానర్ అయి స్వప్న సినిమాస్ ఈ మూవీని తెరకెక్కించింది. ఈ సినిమా 73 కేంద్రాల్లో 50 రోజులు, 42 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ప్రదర్శించబడింది. ఈ సినిమాని రూ.1.85 కోట్లతో నిర్మించగా రూ.12 కోట్లు వసూలు చేసింది. కథ ఏంటంటే.. ‘ఆదిత్యకు ఇంజినీర్ కావాలని కోరిక. కానీ అతని తండ్రి లాయర్ కావాలని ఆదేశిస్తాడు. అయితే లా చదవడం ఇష్టం లేని ఆదిత్య పరీక్ష రాసేందుకు వెళ్లే క్రమంలో ఓ అమ్మాయిని రక్షించబోయి సమస్యల్లో పడతాడు. ఆదిత్య తండ్రి అతన్ని ఇంటి నుంచి గెంటేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.
మహర్షి
మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే, అల్లరి నరేష్ ప్రధాన పాత్రల్లో చేసిన మహార్షి చిత్రానికి.. అశ్వనీ దత్ సహా నిర్మాతగా వ్యవహరించారు. 2019 సంవత్సరానికి గాను 10 విభాగాల్లో విభాగాల్లో సైమా అవార్డ్స్ నామినేట్ కాగా.. అందులో 5 పురస్కారాలను మహర్షి కైవసం చేసుకోవడం విశేషం. ‘రిషి (మహేష్) ఓ మల్టీ నేషనల్ కంపెనీకి సీఈవోగా ఉంటాడు. కాలేజీ రోజుల్లో తన కోసం ఫ్రెండ్ రవి చేసిన త్యాగం గురించి తెలుసుకుంటాడు. అతడ్ని వెతుక్కుంటూ ఊరికి వెళ్లిన రిషికి అతడు సమస్యల్లో ఉన్నట్లు తెలుస్తుంది. అప్పుడు రిషి తన ఫ్రెండ్ కోసం ఏం చేశాడు? ఎలా అండగా నిలబడ్డాడు?’ అన్నది కథ.
ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్
సీతారామం
2022లో తెరకెక్కిన సీతారామం చిత్రం.. ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నిర్మాతగా అశ్వని దత్ వ్యవహరించారు. ఈ సినిమాతో మృణాల్ ఠాకూర్ రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్గా మారిపోయింది. రూ.30 కోట్లతో తెరకెక్కిన సీతారామం చిత్రం.. బాక్సాఫీస్ వద్ద రూ.91-98 కోట్లు కొల్లగొట్టింది. ప్లాట్ ఏంటంటే.. ‘ఆర్మీ అధికారి రామ్ (దుల్కర్ సల్మాన్) ఓ అనాథ. ఆ విషయాన్ని రేడియోలో చెప్పినప్పటి నుంచి అతడికి ఉత్తరాలు వెల్లువెత్తుతాయి. పెద్ద కుటుంబం ఏర్పడుతుంది. ఓ అమ్మాయి మాత్రం నీ భార్య సీతామహాలక్ష్మి (మృణాల్ ఠాకూర్) అని సంబోధిస్తూ ఉత్తరాలు రాస్తుంటుంది. ఇంతకీ ఈ ఆమె ఎవరు? అనాథ అయిన రామ్కు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఆమెని కలుసుకునేందుకని వచ్చిన రామ్కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి?’ అనేది కథ.
ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్ & హాట్స్టార్
కల్కి 2898 ఏడీ
నిర్మాత అశ్వని దత్.. ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని నిర్మించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్పై వచ్చిన అతి భారీ బడ్జెట్ చిత్రం ‘కల్కి’ కావడం విశేషం. ఈ సినిమాను మైథాలిజీ & ఫ్యూచరిక్ జానర్లలో నిర్మించారు. ఇందులో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్ర పోషించిగా.. విలన్గా కమల్ హాసన్ చేశారు. దిశాపటానీ, దీపిక పదుకొణె ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
వైజయంతీ మూవీస్ సబ్ బ్యానర్స్లో వచ్చిన హిట్ చిత్రాలు
బాణం
అశ్వని దత్ కుమార్తె ప్రియాంక దత్.. త్రీ ఎంజెల్స్ బ్యానర్పై తొలిసారి బాణం చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీ ద్వారా నారా రోహిత్ హీరోగా పరిచయం అయ్యారు. ప్లాట్ ఏంటంటే.. ‘మాజీ నక్సలైట్ కొడుకు అయిన భగత్ ఒక చిన్న పట్టణంలో నివసిస్తుంటాడు. స్థానిక గ్యాంగ్స్టర్ దౌర్జన్యాల నుంచి ప్రజలను కాపాడేందకు IPS అధికారి కావాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా? లేదా?’ అన్నది కథ.
సారొచ్చారు
ప్రియాంక దత్ నిర్మించిన ఈ సినిమా.. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంది. ఇందులో రవితేజ, కాజల్ రిచా గంగోపాథ్యాయ ప్రధాన పాత్రలు పోషించారు. ప్లాట్ ఏంటంటే.. 'సంధ్య కార్తిక్ను ప్రేమిస్తుంది. అయితే అతడికి ఇదివరకే పెళ్లైన విషయాన్ని తెలుసుకుంటుంది. ఇంతకీ కార్తిక్ గతం ఏంటి? కార్తిక్, సంధ్య కలిశారా? లేదా?’ అన్నది స్టోరీ.
ఓటీటీ వేదిక : హాట్స్టార్ & ఆహా
Sir Ocharu Movie Posters TollywoodAndhra.in
ఎవడే సుబ్రహ్మణ్యం
కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మెుట్టమెుదటి ఫిల్మ్ 'ఎవడే సుబ్రహ్మణ్యం'. ఇందులో నాని, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ టాలెంటెడ్ డైరెక్టర్గా నాగ్ అశ్విన్కు గుర్తింపు తీసుకొచ్చింది. ప్లాట్ ఏంటంటే.. ‘మెటీరియలిస్టిక్ స్వభావం కలిగిన సుబ్రమణ్యం జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు హిమాలయాలకు వెళ్తాడు. ఈ క్రమంలో అనుబంధాల పట్ల తన వైఖరిని మార్చుకుంటాడు’.
ఓటీటీ వేదిక : సన్ నెక్స్ట్
మహానటి
అశ్వని దత్ రెండో కుమార్తె స్వప్న దత్ ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి కూడా కల్కి ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వం వహించారు. స్వప్న సినిమా బ్యానర్పై రూపొందిన ఈ చిత్రం.. మహానటి సావిత్రి జీవత కథ ఆధారంగా తెరకెక్కింది. ‘సావిత్రి ఇండస్ట్రీలోకి ఎలా అడుగుపెట్టారు? నటుడు జెమినీ గణేషన్ ఆమె జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించారు? జీవత చరమాంకంలో ఆమె ఎలాంటి కష్టాలు అనుభవించారు?’ అన్నది స్టోరీ.
ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్
జాతి రత్నాలు
వైజయంతి మూవీస్ సబ్ బ్యానర్ అయిన 'స్వప్న సినిమా'.. జాతిరత్నాలు మూవీని నిర్మించింది. ప్లాట్ ఏంటంటే.. ‘మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారు’ అనేది కథ.
ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్
జూన్ 29 , 2024
This Week Releases: ఈ వారం(June 29, 30) రిలీజ్ కానున్న చిత్రాలు, వెబ్ సిరీస్లు ఇవే..!
జూన్ నెలలో ఆఖరి వారంలోకి అడుగు పెట్టేశాం. నెలాఖరున పలు చిత్రాలు థియేటర్ల వద్ద సందడి చేయడానికి రెడీగా ఉన్నాయి. డిఫరెంట్ జానర్లలో తెరకెక్కిన సినిమాలు ఈ వారం(June 29,30) విడుదల అవుతుండటం విశేషం. థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ పలు వెబ్సిరీస్లు ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఆ విశేషాలు తెలుసుకుందాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
స్పై(SPY)
నిఖిల్ సిద్ధార్థ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమే ‘స్పై’. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా మారి ఈ సినిమాను తెరకెక్కించాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ నేపథ్యంలో జరిగిన సంఘటనల ఆధారంగా దీనిని తెరకెక్కించినట్లు చిత్రబృందం చెబుతోంది. వాస్తవికతకు దగ్గరగా, నిజ జీవిత స్పై ఏజెంట్లు ఎలా ఉంటారో ఇందులో చూపించినట్లు మూవీ టీం వెల్లడించింది. కె.రాజశేఖర్ రెడ్డి కథ అందించి ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మించాడు. ఐశ్వర్య మీనన్ నిఖిల్ సరసన నటించింది. జూన్ 29న విడుదలకు సిద్ధమవుతోంది.
సామజవరగమన(Samajavaragamana)
శ్రీవిష్ణు కథానాయకుడిగా వస్తున్న చిత్రమే ‘సామజవరగమన’. వినూత్నమైన ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్రబృందం చెబుతోంది. ఈ మూవీకి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించగా రాజేశ్ దండా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. మూవీకి గోపీ సుందర్ సంగీతం అందించాడు. రెబా మోనికా జాన్ కథానాయిక. నరేశ్, సత్య, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూన్ 29న విడుదలకు సిద్ధమైంది.
ఇండియానా జోన్స్(Indiana Jones)
సాహసోపేతమైన సినిమాలకు ప్రత్యేక అభిమానులు ఉంటారు. ఈ కోవలో వచ్చిన ఇండియానా జోన్స్ సిరీస్ అప్పట్లో ఎంతగానో అలరించింది. ఇప్పుడు ఇదే సిరీస్లో మరో చిత్రం రాబోతోంది. ‘ఇండియానా జోన్స్ అండ్ డయల్ ఆఫ్ డెస్టినీ’ సినిమా జూన్ 29న విడుదల కాబోతోంది. తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సిరీస్లో దాదాపు 14 ఏళ్ల క్రితం చివరి చిత్రం వచ్చింది. మళ్లీ ఇప్పుడే థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయింది.
మాయా పేటిక(Mayaa Petika)
శ్రీనివాస్, పాయల్ రాజ్పుత్, సునీల్, పృథ్వీ తదితరులు కలిసి నటించిన చిత్రం ‘మాయా పేటిక’. సెల్ఫోన్ చుట్టూ జరిగే కథగా ఈ సినిమా సాగనుందని చిత్రబృందం వెల్లడించింది. రమేశ్ రాపార్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎప్పుడో పూర్తయింది. ఎట్టకేలకు జూన్ 30న విడుదల అయ్యేందుకు ముస్తాబైంది.
లవ్ యూ రామ్(Love You Ram)
ప్రముఖ రచయిత, దర్శకుడు దశరథ్ కథ అందించి నిర్మిస్తున్న సినిమా ‘లవ్ యూ రామ్’. తనదైన శైలిలో ఈ ప్రేమ కథను చెక్కారు దశరథ్. విభిన్నమైన మనస్తత్వాలు ఉన్న ఇద్దరు ప్రేమికుల కథ ఎక్కడిదాకా సాగింది? చివర్లో ఎలాంటి మలుపులు తిరిగిందనేది తెరపై చూడాల్సిందేనని చిత్రబృందం తెలిపింది. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ జంటగా నటించగా బి.వి.చౌదరి దర్శకత్వం వహించాడు. దశరథ్తో నిర్మాణ బాధ్యతలు పంచుకున్నాడు. జూన్ 30న చిత్రం రిలీజ్ కానుంది.
ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలు, వెబ్సిరీస్లు
TitleCategoryLanguagePlatformRelease DateWeekend Family Season 2Web SeriesEnglishDisney + HotstarJune 28Lust Stories 2Web SeriesHindiNetflixJune 29See You In my Nineteenth LifeWeb SeriesKoreanNetflixJune 29Jack ran Season 4Web SeriesEnglishAmazon Prime June 30CelebrityWeb SeriesKoreanNetflixJune 30The Night Manager Season 2Web SeriesHindiDisney+ HotstarJune 30Arthamainda ArunkumarWeb SeriesTeluguAhaJune 30SargentWeb SeriesHindiJio CinemaJune 30
జూన్ 26 , 2023
Review: ‘బలగం’ ఓ చక్కటి పల్లెటూరి కథాచిత్రం
కమెడియన్ వేణు ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా ఏళ్లకు దర్శకుడిగా మారి తీసిన సినిమా ‘బలగం’. తొలి సినిమానే ప్రతిష్టాత్మక నిర్మాత దిల్రాజు కాంపౌండ్లో తెరకెక్కడం విశేషం. తెలంగాణలో బలగం అంటే బంధుగణం. బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు, అన్నదమ్ముల ప్రేమలు, పల్లెటూరి మనస్తత్వాలు ఇలా అన్ని రంగరించి ఓ ఎమోషనల్ డ్రామాగా వేణు ఈ సినిమాను తెరకెక్కించాడు. మరి తన ప్రయత్నం ఎంతమేరకు విజయవంతమైందో చూద్దాం.
చిత్రబృందం
నటీనటులు: ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, రచ్చ రవి, మురళీధర్ గౌడ్, రూప లక్ష్మి, జయరాం, విజయలక్ష్మి, వేణు టిల్లు తదితరులు
దర్శకత్వం: వేణు ఎల్దండి
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: ఆచార్య వేణు
నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత
https://www.youtube.com/watch?v=8R3Vcy5CaPc
కథ:
ఓ పల్లెటూరిలో అందరితో సరదాగా ఉండే ఓ ముసలాయన కొమురయ్య( సుధాకర్ రెడ్డి). అతడి మనవడు సాయిలు (ప్రియదర్శి). విపరీతంగా అప్పులు చేసిన సాయిలు పెళ్లి చేసుకుని ఆ కట్నం డబ్బులతో అప్పు తీర్చాలనుకుంటాడు. కానీ సరిగ్గా వరపూజ రోజున అతడి తాత కొమురయ్య చనిపోతాడు. దీనికి తోడు చావు ఇంట్లో జరిగిన గొడవతో పెళ్లి కూడా ఆగిపోతుంది. ఇదే సమయంలో 20 ఏళ్ల క్రితమే ఊరి నుంచి వెళ్లిపోయిన కొమురయ్య చిన్న కొడుకు, కూతురు (సాయిలు మేనత్త) తండ్రి మరణవార్త విని ఊరికి వస్తారు. సాయిలు మేనత్త తన కూతురు సంధ్యను తీసుకుని వస్తుంది. సంధ్యను చూసి ఇష్టపడిన సాయిలు, తనకు బాగా ఆస్తి కూడా ఉందని తెలుసుని ఎలాగైనా తనని ప్రేమలో పడేయాలనుకుంటాడు. కానీ కర్మ రోజున కొమురయ్య పిండాన్ని ఏ కాకీ ముట్టుకోదు. అక్కడ సాయిలు మామ,బాబాయ్ల మధ్య గొడవ జరుగుతుంది. కాకి ముట్టకపోవడం ఊరికి అరిష్టమని భావించిన గ్రామ పెద్దలు.. కొమురయ్య కోరిక తీరకపోవడం వల్లే ఇలా జరుగుతోందని అనుకుంటారు. 11వ రోజు కాకి ముట్టకపోతే వారిని ఊరి నుంచి వెలివేస్తామని హెచ్చరిస్తారు. ఆ తర్వాత జరిగే నాటకీయ పరిణామాలు, తాత చావును సాయిలు ఎలా వాడుకున్నాడు. చివరికి ఏం జరిగింది అనేదే కథ.
ఎలా ఉంది:
చక్కటి తెలంగాణ పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కిన సినిమా ‘బలగం’. పల్లెటూరి యాస, సంస్కృతి, అమాయకత్వం, మొండితనం, మూర్ఖత్వం ఇలా అన్ని కోణాలను దర్శకుడు వేణు చక్కగా తెరకెక్కించాడు. తొలి సినిమానే అయినా అలా ఎక్కడా అనిపించదు. ప్రతి పాత్రా చాలా సహజంగా ఉంది. సినిమా చూస్తున్నంత సేపు మనమే ఆ ఊరిలో ఉండి సాయిలును చూస్తున్నట్లు ఉంటుంది. భావోద్వేగాలు, కామెడీ చాలా సహజంగా ఉంటాయి. తెలంగాణ పల్లెటూరిలో ఓ వ్యక్తి చనిపోయినప్పుడు ఉండే పరిస్థితిని చాలా సహజంగా తెరకెక్కించాడు. తాత చావు, ఓ కాకి చుట్టూ కథ నడిపిస్తూ.. కామెడీ పండిస్తూ ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాడు. ఫస్టాఫ్ పాత్రల పరిచయం, కామెడీ ఉంటుంది. కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. సెకండాఫ్లో చివరి 15 నిమిషాల సినిమా కంటతడి పెట్టిస్తుంది. మన ఇంట్లో ఉండే తాత, నాయినమ్మ, అమ్మమ్మలను గుర్తుచేసేలా ఉంటుంది. భావోద్వేగాలు ఎంత చక్కగా పండాయో, కామెడీ కూడా అంతే చక్కగా పండింది.
నటీ నటులు:
సాయిలు పాత్రలో ప్రియదర్శి జీవించాడనే చెప్పాలి. నిజంగా మన ఇంటి పక్క సాయిలును చూసినట్టే ఉంటుంది. హీరోయిన్గా కావ్య బాగా నటించింది. సుధాకర్ రెడ్డి పాత్ర కాసేపే ఉన్నా చాలా బాగా చేశారు. రచ్చ రవి తన కామెడీతో మెప్పించాడు. ఇతర నటీ నటులు కూడా తమ పరిధిమేరకు నటించారు.
సాంకేతిక పనితీరు:
దర్శకుడు వేణు తొలి సినిమా అయినా చాలా చక్కగా తెరకెక్కించాడు. స్టార్ క్యాస్ట్ లేకపోయినా సినిమాలో ఉన్న నటులంతా సహజంగా నటించారు. కథనం విషయంలో కాస్త నెమ్మదిగా అనిపిస్తుంది. భీమ్స్ సిసిరోలియే సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. ఆచార్య వేణు సినిమాటోగ్రఫీ మెచ్చుకోవాలి. పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు. సినిమా చాలా సహజంగా కనిపించడానికి వేణు సినిమాటోగ్రఫీ చాలా సాయపడింది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కాసర్ల శ్యామ్ సాహిత్యం గురించి. చివరి 15 నిమిషాలు చక్కటి ఎమోషన్స్ పండాయంటే అందుకు కారణంగా చివర్లో వచ్చే బుర్ర కథ. దీనికి కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ నిజంగా అద్భుతంగా ఉంటాయి. ప్రొడక్షన్ పరంగా సినిమాకు ఏ లోటు లేదు.
బలాలు
కథ
కథా నేపథ్యం
భావోద్వేగాలు
కామెడీ
పాటల్లో సాహిత్యం
బలహీనతలు
కొన్ని చోట్ల సాగదీత సీన్లు
స్టార్ క్యాస్ట్ లేకపోవడం
ఒక్కమాటలో
చక్కటి భావోద్వేగాలతో ఉండే పల్లెటూరి కుటుంబ కథా చిత్రం బలగం. ఈ వీకెండ్కి ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్లాలనుకుంటే ‘బలగం’ మిస్ కాకూడని సినిమా.
రేటింగ్
3/5
మార్చి 03 , 2023
Neha Shetty: టాలీవుడ్లో దూకుడు మీదున్న టిల్లు బ్యూటీ.. ఆశలన్నీ దానిపైనే!
యంగ్ బ్యూటీ నేహా శెట్టి.. టాలీవుడ్లో వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకుపోతోంది. కుర్ర హీరోలకు ప్రధాన ఆప్షన్గా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
యువ నటుడు విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) చిత్రంలో.. నేహా హీరోయిన్గా చేస్తోంది. ఈ చిత్రం సమ్మర్ కానుకగా మే 17న రిలీజ్ కానుంది.
ఇటీవల వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) చిత్రంలోనూ ఈ బ్యూటీ మెరిసింది. తనకు పాపులారిటీ తీసుకొచ్చిన ‘డీజే టిల్లు’ (DJ Tillu)లోని రాధిక పాత్రలో మరోమారు తెరపై సందడి చేసింది.
నేహా శెట్టి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తే.. ఈ భామ కర్ణాటకలోని మంగళూరులో డిసెంబర్ 6, 1999లో జన్మించింది.
సినిమాల్లోకి రాకముందు మోడల్గా కెరీర్ను ప్రారంభించిన నేహా.. మిస్ మంగళూరు-2014 టైటిల్ను గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.
2016లో వచ్చిన 'ముంగరు మలే 2' (Mungaru Male 2) అనే కన్నడ చిత్రంతో నేహా సినీ రంగ ప్రవేశం చేసింది. ఇందులో నందిని పాత్ర పోషించి ఆకట్టుకుంది.
పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో వచ్చిన ‘మెహాబూబా’ (Mehbooba) ద్వారా నేహా శెట్టి.. తెలుగు తెరపై అడుగుపెట్టింది. ఇందులో పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా చేశాడు.
ఆ తర్వాత 'గల్లీ రౌడీ' (Gully Rowdy), ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Most Eligible Bachelor) చిత్రాలు చేసింది. ఆ రెండూ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఈ భామకు పెద్దగా గుర్తింపు రాలేదు.
2022లో వచ్చిన ‘డీజే టిల్లు’ (2022) సినిమాతో నేహా శెట్టి రాత్రికి రాత్రి విపరీతమైన పాపులారిటీ సంపాదించింది.
యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda)తో నేహా చేసినా రొమాన్స్ యూత్కు బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా ఆమె చేసిన రాధిక పాత్ర యూత్లో చెరగని ముద్ర వేసింది.
ఆ తర్వాత చేసిన 'బెదురులంక 2012' (Bedurulanka 2012) చిత్రం హిట్ టాక్ తెచ్చుకోగా.. అనంతరం చేసిన 'రూల్స్ రంజన్' మాత్రం ఈ భామ ఆశలను అడియాశలు చేసింది.
ప్రస్తుతం నేహా శెట్టి ఆశలన్నీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ పైనే ఉన్నాయి. ఈ సినిమా విజయం సాధిస్తే టాలీవుడ్లో తనకు తిరుగుండదని ఈ అమ్మడు భావిస్తోంది.
యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న నేహా.. ఓ వైపు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలోనూ చురుగ్గా వ్యవహరిస్తోంది.
ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్లను తన మాయలో పడేస్తోంది. నేహా పోస్టు చేసిన ప్రతీ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం నేహా ఇన్స్టాగ్రామ్ ఖాతాను 12 లక్షల మంది ఫాలో అవుతున్నారు.
ఏప్రిల్ 13 , 2024
Failure Hero’s: స్టార్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా విఫలమవుతున్న టాలీవుడ్ హీరోలు తెలుసా?
ప్రస్తుతం టాలీవుడ్లో వారసుల హవా నడుస్తోంది. దిగ్గజ నటుల కుటుంబం నుంచి వచ్చిన వారు ఇప్పుడు స్టార్ హీరోలుగా మారి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. బాలకృష్ణ, పవన్కళ్యాణ్, మహేశ్ బాబు, రామ్చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్లు టాలీవుడ్లో దిగ్గజ హీరోలుగా స్థిరపడ్డారు. అయితే స్టార్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు తాపత్రయపడుతున్నారు. కాలక్రమంలో కొందరు అవకాశాలు లేక సినిమాలకు దూరం కాగా, మరికొందరు ఉపయోగించుకొని క్యారెక్టర్ ఆర్టిస్టుగా మిగిలిపోయారు. ఇంతకీ ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చుద్దాం.
అక్కినేని అఖిల్:
అక్కినేని నాగార్జున తనయుడిగా అఖిల్(Akhil) ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అయితే అతడు చేసిన అఖిల్, హలో, మిస్టర్ మజ్నూ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలం అయ్యాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ హిట్ కొట్టిన అఖిల్.. ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న ఏజెంట్ చిత్రంపై ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రం ఫలితంగా అఖిల్ కెరీర్ ఆధారపడి ఉంది.
అల్లు శిరీష్:
చిరంజీవి మేనల్లుడు, అల్లు అరవింద్ కుమారుడు శిరీష్ (Allu Sirish) మంచి హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయాడు. ‘గౌరవం’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన అల్లు శిరీష్ ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. అయితే ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రం మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ ‘కొత్త జంట’, ‘ఒక్క క్షణం’, ‘ఊర్వశివో.. రాక్షసివో’ ఫెయిల్యూర్స్తో శిరీష్ సినీ కెరీర్ మరింత డల్ అయ్యింది.
అల్లరి నరేష్:
దిగ్గజ హాస్య దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నరేష్ (Allari Naresh) తన తొలి చిత్రం ‘అల్లరి’ తోనే అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత వచ్చిన ‘తొట్టి గ్యాంగ్’, ‘సీమశాస్త్రి’, ‘బెండు అప్పారావు’ సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ దశలో కామెడీ స్టార్గా ఎదుగుతున్నట్లే కనిపించిన నరేష్.. వరుస ఫ్లాప్లతో ఆ ట్యాగ్కు దూరమయ్యాడు. వరుసగా సినిమాలు చేసినా అవేమి చెప్పుకోదగ్గ హిట్స్ ఇవ్వకపోవడంతో నరేష్కు హీరో అవకాశాలు తగ్గాయి. దీంతో కారెక్టర్ ఆర్టిస్టుగా మారిన నరేష్.. గమ్యం, శంభో శివ శంభో, మహర్షి చిత్రాలతో అలరించాడు. ఇటీవల ‘నాంది’, ‘మారేడుమిల్లి ప్రజానికం’ సినిమాలతో హీరోగా రీఎంట్రీ ఇచ్చాడు నరేష్.
సుశాంత్:
అక్కినేని నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ (Sushanth) 2008లో కాళిదాసు చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అయితే ఆ చిత్రం డిజాస్టర్గా నిలవగా తర్వాతి ఏడాది వచ్చిన కరెంటు మూవీతో సుశాంత్ పర్వాలేదనిపించాడు. కానీ అడ్డా, దొంగాట, ఆటాడుకుందా రా, చిలాసౌ వంటి చిత్రాలు వరుసగా ఫ్లాప్ కావడంతో సుశాంత్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో సుశాంత్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారు. అలా వైకుంఠపురం చిత్రంలో నటించి మెప్పించారు. ప్రస్తుతం సుశాంత్ రావణాసుర, భోళాశంకర్ చిత్రాల్లో నటించారు.
ఆది పినిశెట్టి:
దిగ్గజ డైరెక్టర్ రవి రాజా పినిశెట్టి వారసుడిగా ఆది పినిశెట్టి (Aadi pinisetty) టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2006లో ఒక V చిత్రం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆది పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత తమిళంలో పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్ద హీరో రెంజ్ సంపాదించలేకపోయాడు. దీంతో ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు రోల్స్ చేస్తున్నాడు.
ఆది:
నటుడు సాయికుమార్ వారసుడిగా ఆది సినిమాల్లోకి వచ్చాడు. తొలి చిత్రం ‘ప్రేమ కావాలి’ తో మంచి యాక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చేసిన లవ్లీ, సుకుమారుడు, గాలిపటం, గరం వంటి సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆది కెరీర్ ఒడిదొడుకులకు లోనైంది. దీంతో ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆది.. ఇటీవలే ‘మేక పులి’ సిరీస్ ద్వారా ఆకట్టుకున్నాడు.
రాజా గౌతం:
హాస్య నటుడు బ్రహ్మానందం కుమారుడు రాజా గౌతం 2004లో ‘పల్లకిలో పెళ్లి కూతురు’ చిత్రం ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో గౌతం సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చాడు. మళ్లీ 2014లో ‘బాసంతి’ సినిమాతో గౌతమ్ ప్రేక్షకులను పలకరించాడు. అది కూడా ఫెయిలవ్వగా ఆ తర్వాత మను, బ్రేక్ ఔట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి.
అరుణ్ దాసరి:
టాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ దాసరి నారాయణరావు తన సినిమాలతో ఎంతో మంది నటులను స్టార్ హీరోలుగా తీర్చిదిద్దారు. అలాంటి దర్శకుడి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అరుణ్ దాసరి తెలుగు ప్రేక్షకులను మెప్పిండంలో విఫలమయ్యారు. 2001లో చిన్నా సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైన అరుణ్ ఆకట్టుకోలేకపోయారు. ఆ తర్వాత చేసిన ‘ఆది విష్ణు’ చిత్రం సైతం ఫ్లాప్గా నిలవడంతో అరుణ్ హీరో కెరీర్ మసకబారిపోయింది. అయితే ఆ తర్వాత పలు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించిన అరుణ్ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.
ఏప్రిల్ 03 , 2023
EXCLUSIVE: ఈ జనరేషన్ మెగాస్టార్లు.. స్వయంకృషితో స్టార్లుగా ఎదిగిన టాలీవుడ్ కుర్ర హీరోలు వీరే!
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది కథానాయకులు ఉన్నారు. స్టార్ హీరోల కుటుంబాల నుంచి వచ్చిన వారసులు, దర్శక నిర్మాతల తనయులు.. హీరోలుగా మారి తామేంటో నిరూపించుకున్నారు. అయితే కొందరు మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి టాలీవుడ్లో స్టార్డమ్ను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. కసి, పట్టుదల ఉంటే ఇండస్ట్రీలో ఎవరైనా పైకి రావొచ్చని ఆ కుర్ర హీరోలు నిరూపించారు. ఇంతకీ ఆ కథానాయకులు ఎవరు? ఇండస్ట్రీలో తమ ప్రస్థానాన్ని ఎలా మెుదలు పెట్టారు? వారిని స్టార్లుగా మార్చిన చిత్రాలు ఏవి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
నాని
స్వయం కృషితో పైకొచ్చిన ఈ తరం హీరో అనగానే అందరికీ ముందుగా నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించిన నాని.. ‘అష్టా చమ్మా’ సినిమాతో హీరోగా మారాడు. ‘భీమిలి కబడ్డి జట్టు’, ‘అలా మెుదలైంది’, ‘పిల్ల జమిందార్’, ‘ఈగ’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘భలే భలే మగాడివోయ్’, ‘నేను లోకల్’, ‘జెర్సీ’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘దసరా’, ‘హాయ్ నాన్న’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా మారిపోయాడు. నాని నటించిన లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ ఆగస్టు 29న విడుదల కానుంది.
విజయ్ దేవరకొండ
యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. హీరో ఫ్రెండ్, ప్రాధాన్యం లేని పాత్రల్లో నటిస్తూ సరైన అవకాశాల కోసం ఎదురుచూశాడు. ‘నువ్విలా’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన విజయ్.. ‘లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రాల్లో సైడ్ రోల్స్లో చేశాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'పెళ్లి చూపులు' చిత్రంతో తొలిసారి ఫుల్ లెన్త్ హీరోగా మారాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన 'అర్జున్ రెడ్డి'తో విజయ్ రాత్రికి రాత్రే స్టార్గా ఎదిగాడు. యూత్లో మంచి క్రేజ్ సంపాదించాడు. 'గీతా గోవిందం' ఫిల్మ్ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్కూ విజయ్ దగ్గరయ్యాడు. రీసెంట్గా ‘ఫ్యామిలీ స్టార్’తో విజయ్ తెలుగు ఆడియన్స్ను పలకరించాడు.
సిద్ధు జొన్నలగడ్డ
హైదరాబాద్లో పుట్టి పెరిగిన యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda).. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాడు. చిత్ర పరిశ్రమలో తెలిసిన వారు ఎవరూ లేకపోవడంతో చిన్న పాత్రలతో కొద్ది రోజులు నెట్టుకొంచాడు. ‘జోష్’, ‘ఆరెంజ్’, ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘డాన్ శీను’ చిత్రాల్లో పెద్దగా గుర్తింపు లేని పాత్రల్లో నటించాడు. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో వచ్చిన 'LBW' (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) మూవీతో సిద్ధూ హీరోగా మారాడు. 'గుంటూరు టాకీస్' చిత్రం హీరోగా అతడికి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత అడపాదడపా చిత్రాలు చేసినప్పటికీ సిద్ధుకు చెప్పుకోతగ్గ హిట్ రాలేదు. 2022లో వచ్చిన 'డీజే టిల్లు' ఈ యంగ్ హీరో కెరీర్ను మలుపు తిప్పింది. ప్రేమ పేరుతో మోసపోయిన టిల్లు పాత్రలో సిద్ధు జీవించేశాడు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్గా వచ్చిన టిల్లు స్క్వేర్ కూడా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. అంతేకాదు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సిద్ధూను స్టార్ హీరోల సరసన నిలబెట్టింది. దీంతో 'టిల్లు క్యూబ్' తీసేందుకు మేకర్స్ సన్నాహాలు మెుదలు పెట్టారు.
నవీన్ పొలిశెట్టి
యువ కథానాయకుడు నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) సైతం.. ఇండస్ట్రీలో ఎవరి సపోర్టు లేకుండా స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. కెరీర్ తొలినాళ్లల్లో ప్రాధాన్యం లేని పాత్రల్లో నవీన్ నటించాడు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్' చిత్రంతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయయ్యాడు. ఆ తర్వాత 'డీ ఫర్ దోపిడి', ‘1 నేనొక్కడినే’ చిత్రాల్లో చేసినప్పటికీ పెద్దగా ఫేమ్ రాలేదు. అయితే 2019లో వచ్చిన ఏజెంట్ 'సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రం.. నవీన్ పోటిశెట్టి పేరు మార్మోగేలా చేసింది. ఇందులో నవీన్ చెప్పే ఫన్నీ డైలాగ్ డెలివరీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఇక 'జాతి రత్నాలు' ఫిల్మ్తో నవీన్ పొలిశెట్టి క్రేజ్ మరో స్థాయికి చేరింది. ఇటీవల స్టార్ నటి అనుష్కతో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రంలో ఈ యంగ్ హీరో నటించగా ఆ ఫిల్మ్ కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో టాలీవుడ్లో నవీన్ మినిమమ్ గ్యారంటీ హీరోగా మారిపోయాడు.
తేజ సజ్జ
యువ హీరో తేజ సజ్జ (Teja Sajja).. ఒకప్పుడు బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించాడు. చిరంజీవి, మహేష్బాబు, వెంకటేష్, పవన్ కల్యాణ్, శ్రీకాంత్, జూ.ఎన్టీఆర్ చిత్రాల్లో నటించాడు. కాగా, 2019లో వచ్చిన 'జాంబిరెడ్డి' సినిమాతో తేజ సజ్జా హీరోగా మారాడు. ఆ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత చేసిన ఇష్క్, అద్భుతం సినిమాలు కూడా హిట్ టాక్ తెచ్చుకున్నాయి. రీసెంట్గా అతడు నటించిన ‘హనుమాన్’ (Hanu Man) సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వం వహించిన ఈ సినిమా.. నార్త్లో విశేష ఆదరణ సంపాందించింది. దీంతో తేజ సజ్జా క్రేజ్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం అతడు సూపర్ యోధ అనే ఫిల్మ్లో నటిస్తున్నాడు.
అడవి శేషు
స్టార్ హీరో అడవి శేషు (Adivi Sesh)కు కూడా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు. తొలి చిత్రం 'కర్మ'తో హీరోగా మారిన అతడు.. అరంగేట్రంతోనే మంచి గుర్తింపు సంపాదించాడు. ఆ తర్వాత ‘పంజా’, ‘బలుపు’, ‘రన్ రాజా రన్’, ‘బాహుబలి’, ‘అమీ తుమీ’ వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్లో కనిపించాడు. ఆ తర్వాత వచ్చిన 'గూడఛారి' చిత్రం అడివి శేషు కెరీర్ను మలుపు తిప్పింది. ఈ స్పై థ్రిల్లర్ చిత్రం తెలుగు ఆడియన్స్ను విపరీతంగా ఆకర్షించింది. ఆ తర్వాత చేసిన ‘ఎవరు’, ‘మేజర్’, ‘హిట్: సెకండ్ కేసు’ కూడా సూపర్ హిట్స్గా నిలవడంతో ఈ యువ నటుడు స్టార్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం అడివి శేషు.. గూడఛారి సీక్వెల్లో నటిస్తున్నాడు.
ప్రియదర్శి
యువనటుడు ప్రియదర్శి (Priyadarshi Pulikonda)కి చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉండేది. ఇండస్ట్రీలో తనకంటూ ఎవరు లేనప్పటికీ అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరిగాడు. చివరికీ 2016లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన 'టెర్రర్' చిత్రంలో ఉగ్రవాది పాత్రతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అదే ఏడాది వచ్చిన ‘పెళ్లి చూపులు’ అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో 'నావు చావు నేను చస్తా.. నీకెందుకు' డైలాగ్తో అతడు బాగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో హాస్య పాత్రల్లో కనిపించిన ప్రియదర్శి.. 'జాతి రత్నాలు' మూవీతో మరింత పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలోనే గతేడాది వచ్చిన 'బలగం' సినిమా ప్రియదర్శిని స్టార్ నటుడిగా నిలబెట్టింది. ఇటీవల వచ్చిన ‘మంగళవారం’, ‘ఓం భీమ్ బుష్’ చిత్రాల్లో లీడ్ రోల్స్లో నటించి ప్రియదర్శి అలరించాడు.
ఏప్రిల్ 17 , 2024
The Kerala Story : రచ్చ రేపుతున్న ‘ది కేరళ స్టోరీ’.. వివాదానికి ప్రధాన కారణం అదేనా?
'ది కేరళ స్టోరీ ' చిత్రం విడుదలకు ముందే తీవ్ర దుమారం రేపుతోంది. మే 5న ఈ సినిమా విడుదల కానుండగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయోద్దంటూ కేరళ ప్రభుత్వం సహా కాంగ్రెస్, సీపీఐ, ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ‘ది కేరళ స్టోరీ’ విద్వేషపూరితంగా చిత్రీకరించారని, సినిమా విడుదల చేస్తే మత సామరస్యం దెబ్బతింటుందని పలువురు ఏకంగా సుప్రీకోర్టునే ఆశ్రయించారు. ఈ స్థాయిలో వివాదం రాజుకోడానికి కారణమేంటి? ఈ చిత్రంపై సుప్రీంకోర్టు ఎలా స్పందించింది? కేరళ కంటే తమిళనాడు ఎందుకు ఎక్కువగా ఆందోళన చెందుతోంది? అసలు ఈ సినిమా సెన్సార్ క్లియర్ చేసుకుందా? వంటి ప్రశ్నలకు ఈ ప్రత్యేక కథనంలో సమాధానం చూద్దాం.
వివాదానికి బీజం:
సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ‘ది కేరళ స్టోరీ’ అదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలో నటించారు విపుల్ అమృత్లాల్ షా నిర్మాతగా వ్యవహరించారు. కేరళలో 2016-17 మధ్య 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడ అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఓ నలుగురు యువతులు మతం మారి ఉగ్రవాద సంస్థ ఐసిస్లో చేరతారు. ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో కథ చూపించడం వివాదానికి దారితీసింది. ‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఏప్రిల్ 26న విడుదలవ్వగా అప్పటి నుంచే దీనిపై రాజకీయ రగడ మొదలైంది.
కేరళ సీఎం ఆగ్రహం
'ది కేరళ స్టోరీ' ట్రైలర్.. కేరళ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై ఆ రాష్ట్ర సీఎం స్పందించారు. ‘రాష్ట్రంలో మతపరమైన విభజన, ద్వేషాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఈ చిత్రం నిర్మించినట్లు అర్థమవుతుంది. ‘లవ్ జిహాదీ’ అంశాన్ని దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, హోం మంత్రిత్వశాఖ కూడా తిరస్కరించినా.. కేరళను ప్రపంచం ముందు అవమానించేందుకే మరోసారి దీన్ని తెరపైకి తీసుకొచ్చారు’ అంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శించారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ఈ ప్రయత్నాలు చేస్తున్నాయని.. వారి రాజకీయాలు ఇక్కడ సాగవని పరోక్షంగా భాజపా, RSSలకు చురకలు అంటించారు.
సినిమాను బ్యాన్ చేయాలి
‘ది కేరళ స్టోరీ’ చిత్రం విడుదలను కేరళ అధికార పార్టీతోపాటు విపక్ష కాంగ్రెస్ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. సమాజంలో విషం చిమ్మేందుకు భావప్రకటనా స్వేచ్ఛ ఓ లైసెన్సు కాదంటూ మండిపడింది. రాష్ట్రంలో చిత్రం విడుదలకు అనుమతి ఇవ్వకూడదని కాంగ్రెస్, డీవైఎఫ్ఐ, ఐయూఎంఎల్ వంటి యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. అంతర్జాతీయ స్థాయిలో కేరళను అవమానించే రీతిలో ఈ చిత్రం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీశన్ పేర్కొన్నారు. మత విశ్వాసాలను దెబ్బతీసేందుకు ఓ వర్గం యత్నిస్తోందని ఐయూఎంఎల్ జాతీయ కార్యదర్శి పీకే ఫిరోజ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా సినిమాను వ్యతిరేకిస్తూ ట్విట్ చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛను తప్పుగా చిత్రీకరించారని మండిపడ్డారు.
తమిళనాడు అలెర్ట్
ది కేరళ స్టోరి రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో తమిళనాడు ప్రభుత్వాన్ని ఇంటెలిజెన్స్ బృందాలు అలెర్ట్ జారీ చేశాయి. తమిళనాడులో మూవీ విడుదలైతే రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు, నిరసనలు చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. ‘కేరళ స్టోరీ’ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకోవాలని ప్రభుత్వానికి నిఘా వర్గాలు సూచించాయి. అయితే ఇప్పటి వరకు తమిళనాడులో సినిమాను విడుదల చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని రాష్ట్ర పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అన్ని థియేటర్లలో పొన్నియన్ సెల్వన్-2 నడుస్తున్నట్లు చెప్పాయి. ధియేటర్ యాజమానులు ‘ది కేరళ స్టోరీ’ని ఇప్పట్లో రిలీజ్ చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదని పేర్కొన్నాయి.
సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలు
‘ది కేరళ స్టోరీ’ ఇటీవలె సెన్సార్ పూర్తి చేసుకుంది. వివాదస్పదంగా మారిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘A సర్టిఫికేట్’ ఇచ్చింది. అంతేగాక సినిమాలోని వివిధ సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దేవుళ్లకు సంబంధించిన డైలాగులు కొందరి మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని తెలిపింది. మరికొన్ని పదాలను సవరించాలని కోరింది. మొత్తం 10 సన్నివేశాలు వివాదాస్పదంగా ఉన్నాయని పేర్కొంది. వాటిని డిలీట్ చేయాలని చెప్పింది. పలు సవరణలతో మే 5న చిత్ర విజయానికి అనుమతించింది.
సుప్రీంకోర్టు స్పందన
‘ది కేరళ స్టోరీ’ సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన అభ్యర్థనను ధర్మాసనం నిరాకరించింది. ‘ది కేరళ స్టోరీ’లో విద్వేషపూరితమైన ప్రసంగాలు, వీడియోలు ఉన్నాయని దాఖలైన పిటీషన్పై కోర్టు స్పందించింది. ‘ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ పొందింది. మీరు దీని విడుదలను సవాల్ చేయాలనుకుంటే ఆ సర్టిఫికెట్తో తగిన ఫోరంను సంప్రదించండి’ అని సుప్రీంకోర్టు పిటిషనర్లకు సూచించింది.
మే 03 , 2023
Rudrudu Review: రుద్రుడిగా లారెన్స్ రివేంజ్ తీర్చుకున్నాడా.. సినిమా ఎలా ఉందంటే?
నటినటులు: రాఘవ లారెన్స్, ప్రియా భవాని, నాజర్, పూర్ణిమ భాగ్యరాజ్
దర్శకత్వం: కదిరేసన్
సినిమాటోగ్రఫీ: R.D. రాజశేఖర్
సంగీతం: G.V. ప్రకాష్
ఎడిటర్ : ఆంటోని
నేపథ్య సంగీతం: శామ్ C.S
రాఘవ లారెన్స్ అంటే తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. డ్యాన్సర్గా కెరీర్ ప్రారంభించిన లారెన్స్ ఆ తర్వాత డైరెక్టర్గా మారి పలు హిట్ సినిమాలు తీశాడు. ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తూప్రేక్షకులను అలరిస్తున్నాడు. లారెన్స్ హీరోగా, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ముని, కాంచన, కాంచన 2, కాంచన 3 సినిమాలు బాక్సాఫీసు వద్ద భారీ హిట్ అందుకున్నాయి. దీంతో లారెన్స్ మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన రుద్రుడు సినిమా ఇవాళ (ఏప్రిల్ 14) రిలీజ్ అయింది. మరి ఈ సినిమా విజయం సాధించిందా? లారెన్స్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడా? అసలు సినిమా కథ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
కథ:
రుద్రుడు (లారెన్స్), అనన్య (ప్రియా భవానీ శంకర్) భార్య భర్తలు. ఒక సాధారణ ఉద్యోగం చేసుకునే రుద్రుడు తన భార్యతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. ఆనందంగా సాగిపోతున్న రుద్రుడు జీవితంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంటుంది. ఎంతగానో ప్రేమించిన భార్యను గుర్తుతెలియని దుండగులు అతి దారుణంగా హత్య చేస్తారు. దీంతో రుద్రుడి జీవితం ఒక్కసారిగా తలకిందులు అవుతుంది. తన భార్యను హతమార్చిన వారిని వదిలిపెట్టకూడదని రుద్రుడు నిర్ణయించుకుంటాడు. వారిని ఎలాగైన పట్టుకొని చంపేయాలని వేట మెుదలెడతాడు. అసలు అనన్యను ఎందుకు చంపారు? దుండుగల వెనక ఎవరు ఉన్నారు? విలన్లపై రుద్రుడు ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు? అనేది అసలు కథ.
ఎవరెలా చేశారంటే:
రుద్రుడు పాత్రలో రాఘవ లారెన్స్ చాలా బాగా నటించాడు. యాక్షన్, సెంటిమెంట్ సీన్లలో తనదైన నటనతో లారెన్స్ మెప్పిస్తాడు. ఇక డ్యాన్సుల్లో లారెన్స్కు వంక పెట్టాల్సిన పనిలేదు. ప్రతీకారంతో రగిలిపోయే వ్యక్తిగా లారెన్స్ అద్భుతంగా నటించాడు. యాక్షన్ సీన్స్లో లారెన్స్ పర్ఫార్మెన్స్ సినిమాకే హైలెట్ అని చెప్పాలి. అటు ప్రియా భవాని నటన కూడా పర్వేలేదనిపిస్తుంది. ఉన్న కొద్దిసేపైన లారెన్స్తో పోటీ పడి మరీ ఆమె నటించింది. ఇక విలన్ పాత్రలో శరత్బాబు ఆకట్టుకున్నాడు. ఎప్పటిలాగే తన అనుభవాన్ని ఉపయోగించి పాత్రకు ప్రాణం పోశాడు.
టెక్నికల్గా
డైరెక్టర్ కదిరేసన్ ఒక రొటిన్ స్టోరీతో సినిమాను తెరకెక్కించాడు. నటీనటులు ఎంత బాగా చేసినప్పటికీ సినిమాను ఎప్పుడో చూసిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. హీరో, హీరోయిన్ లవ్ సీన్స్, పెళ్లి చేసుకోవడం అంతా బాగుందనుకునే లోపే ప్రియా భవానీ హత్య జరగడం పెద్ద సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. కానీ, ఆ తర్వాత హీరో రీవెంజ్ తీర్చుకునే సన్నివేశాలన్నీ పేలవంగా అనిపిస్తాయి. ఇకపోతే సినిమాటోగ్రఫీ బాగుంది. G.V ప్రకాష్ సంగీతం ఆకట్టుకోలేదు. పాటల్లో ఒకటిమాత్రమే వినసొంపుగా ఉంది. అయితే శామ్ C.S ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది.
ప్లస్ పాయింట్స్
లారెన్స్ నటననేపథ్య సంగీతంపతాక సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
రొటిన్ స్టోరీసంగీతం
రేటింగ్: 2/5
ఏప్రిల్ 15 , 2023
Bhargavi Nilayam OTT Review: ఆత్మతో రైటర్ స్నేహం చేస్తే.. ‘భార్గవి నిలయం’ ఎలా ఉందంటే?
నటీనటులు : టొవినో థామస్, చెంబన్ వినోద్, రోషన్ మ్యాథ్యూ, రీమా కల్లింగల్, షైన్ టామ్ చాకో, అభిరామ్ రాధా కృష్ణ
డైరెక్టర్: ఆషిక్ అబు
సినిమాటోగ్రఫీ : గిరిష్ గంగాధరన్
ఎడిటింగ్ : వి. సాజన్
సంగీతం : బిజిబాల్, రెక్స్ విజయన్
నిర్మాతలు : అషిక్ అబు, రీమా కల్లింగల్
ఓటీటీ : ఆహా
డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి ఈ వారం ఓ మలయాళ హర్రర్ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. 1964లో మలయాళంలో వచ్చిన ‘భార్గవి నిలయం’ (Bhargavi Nilayam) సినిమాను తిరిగి 2023లో ‘నీలవెలిచం’ (Neelavelicham) పేరుతో కొన్ని మార్పులు చేసి రిమేక్ చేశారు. ఈ మూవీలో స్టార్ హీరో టోవినో థామస్, రీమా కల్లింగల్, రోషన్ మాథ్యూ, షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రల్లో నటించారు. అశిక్ అబు దర్శకత్వం వహించాడు. గతేడాది ఏప్రిల్లో రిలీజ్ అయిన ఈ చిత్రం మలయాళ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. తాజాగా ఆ సినిమాను తెలుగులో ‘భార్గవి నిలయం’ (Bhargavi Nilayam)గా అనువాదం చేసి ఓటీటీలో తీసుకొచ్చారు. ఆహా వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
సముద్రతీరానికి సమీపంలో ఉన్న పల్లెటూళ్లో భార్గవి నిలయం చాలా రోజులుగా మూతపడి ఉంటుంది. ఆ బంగళా పేరు వింటనే ఊరివాళ్లు వణికిపోతుంటారు. భార్గవి (రీమా కల్లింగల్) అనే అమ్మాయి ఆత్మగా మారి ఆ ఇంట్లో తిరుగుతుందని అందులో అడుగుపెట్టిన వారిని చంపడానికి ప్రయత్నిస్తుందనే ఊహాగానాలు వినిపిస్తుంటాయి. ఈ క్రమంలో బషీర్ (టోవినో థామస్) అనే రైటర్ ఆ ఊరికి కొత్తగా వస్తాడు. భార్గవి నిలయం చరిత్ర గురించి తెలియక అందులో అద్దెకు దిగుతాడు. ఇల్లు మారేందుకు డబ్బుల్లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఆత్మతో స్నేహం చేస్తాడు. ఆమెపై కథ రాయాలని ఫిక్సవుతాడు. అసలు భార్గవి ఎందుకు చనిపోయింది? ఆమెను ప్రాణంగా ప్రేమించిన శివకుమార్ (రోషన్ మాథ్యూ) ఎలా అదృశ్యం అయ్యాడు? ఈ ప్రేమ జంట జీవితంలోని మిస్టరీని బషీర్ ఎలా బయటపెట్టాడు? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
రచయిత పాత్రలో టోవినో థామస్ నటన బాగుంది. అతడి లుక్, డైలాగ్ డెలివరీ గత చిత్రాలకు భిన్నంగా కొత్తగా అనిపిస్తాయి. సినిమా మెుత్తాన్ని ఆయన భుజస్కందాలపై వేసుకొని మోశారు. కీలక సన్నివేశాల్లో నటుడిగా తన మార్క్ ఏంటో చూపించాడు. అటు ప్రేమ జంటగా రీమా కల్లింగల్, రోషన్ మథ్యూ పర్వాలేదనిపించారు. విలన్గా టామ్ చాకో యాక్టింగ్ బాగుంది. విలన్ పాత్రపై అతడు గట్టి ప్రభావాన్నే చూపారు. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
ఆషిక్ అబు ఒక రొటిన్ స్టోరీనే ఈ సినిమాకు ఎంచుకున్నప్పటికీ కథనాన్ని మాత్రం ఆసక్తికరంగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఒక ప్రేమ జంట జీవితంలోని విషాదాన్ని ఓ రచయిత వెలికితీసే క్రమంలో వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. భార్గవి ఆత్మ ఉన్న ఇంట్లో హీరో దిగడం, ఆ ఊరి వాళ్లు భయంకరమైన కథలతో అతడ్ని భయపెట్టడం ఇంటస్ట్రింగ్గా అనిపిస్తాయి. అసలేం జరుగుతుందా అన్న ఆసక్తిని కలిగిస్తాయి. ఈ క్రమంలో వచ్చే కొన్ని హార్రర్ ఎలిమెంట్స్ భయపెడతాయి. ఇంటర్వెల్కు ముందు హీరోకు ఆత్మతో దోస్తీ కుదరడంతో సెకండాఫ్పై ఆసక్తి ఏర్పడుతుంది. ద్వితియార్థంలో భార్గవి - శివకుమార్ లవ్స్టోరీ, వారి ప్రేమకథకు విలన్ ఎవరన్నది డైరెక్టర్ చూపించారు. భార్గవి మరణానికి కారణంతో పాటు ఆమె రివేంజ్ డ్రామాను ఆసక్టికరంగా చూపించి కథ ముగించారు. అయితే రొటిన్ స్టోరీ, బోరింగ్ లవ్ ట్రాక్, రెగ్యులర్ హార్రర్ సీన్స్ సినిమాకు మైనస్గా చెప్పవచ్చు.
టెక్నికల్గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్ మంచి పనితీరు కనబరిచాడు. తన కెమెరా పనితనంతో 1964 కాలం నాటి పరిస్థితులను కళ్లకు కట్టాడు. అటు నేపథ్య సంగీతం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
టోవినో థామస్ నటనఆసక్తికర కథనంసాంకేతిక విభాగం
మైనస్ పాయింట్స్
రొటిన్ హార్రర్ కాన్సెప్ట్థ్రిల్లింగ్ అంశాలు లేకపోవడం
Telugu.yousay.tv Rating : 3/5
సెప్టెంబర్ 06 , 2024
Ashu Reddy Bold Pics: బ్రా లెస్ బ్లేజర్లో అషు రెడ్డి ఘాటు అందాలు.. చూస్తే పిచ్చెక్కిపోతారు!
జూ.సమంతగా పాపులర్ అయిన అషు రెడ్డి అందాల జాతర చేయడంలో స్టార్ హీరోయిన్స్కు ఏమాత్రం తీసిపోవడం లేదు.
ఎప్పటికప్పుడు గ్లామర్ డోస్ పెంచుతూ సోషల్ మీడియాలో హాట్ ఫొటోలను షేర్ చేస్తోంది. తన అందాలతో నెటిజన్లను కవ్విస్తోంది.
తాజాగా రెడ్ కలర్ బ్లేజర్లో అషు అందాల జాతర చేసింది. బ్రా లెస్ కోట్లో ఉప్పొంగుతున్న ఎద అందాలతో రచ్చ రచ్చ చేసింది.
ఘాటైన రెడ్ మిర్చిని తలపిస్తూ నెటిజన్లకు చెమటలు పట్టిస్తోంది. ఈ అమ్మడి మత్తెక్కించే అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
ఇక అషు రెడ్డి వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆమె అమెరికాలోని టెక్సాస్లో జన్మించింది.
సోషల్ మీడియా రీల్స్ ద్వారా అషు తొలుత ఫేమస్ అయ్యింది. ఈ క్రమంలోనే జూ.సమంతగా గుర్తింపు పొందింది.
2018లో వచ్చిన 'ఛల్ మోహన్ రంగ' (Chal Mohana Ranga) చిత్రం ద్వారా అషు తొలిసారి ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
ఆ తర్వాతి ఏడాదే ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 3’ (Bigg Boss Telugu)లో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది.
బిగ్బాస్తో వచ్చిన ఫేమ్తో ‘#పీకే’ (#PK), ‘ఏ మాస్టర్ పీస్’ (A Masterpiece) వంటి చిత్రాల్లో అషుకి అవకాశం దక్కింది.
అదే సమయంలో బుల్లితెర వ్యాఖ్యాతగానూ మారి పలు షోలతో ఆడియన్స్ను ఎంటర్టైన్ చేసింది. తన అందచందాలతో అలరించింది.
ఈ క్రమంలో రామ్గోపాల్ వర్మతో అషు చేసిన బోల్డ్ ఇంటర్యూ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఆర్జీవీ ఇంటర్యూతో ఈ అమ్మడి పేరు సోషల్ మీడియాలో ఒక్కసారిగా మారుమోగిపోయింది.
ఇక అషు రెడ్డికి బాగా ఇష్టమైన హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan). అతడి పేరున ఒంటిపై టాటూ కూడా వేసుకుంది.
నెట్టింట నిత్యం ట్రెండింగ్లో నిలిచే ఈ అమ్మడికి వెండితెర (Tollywood)పై పెద్దగా అవకాశాలు రావడం లేదు.
దీంతో తెలుగు పరిశ్రమలోనూ సత్తా చాటేందుకు అషు ప్రయత్నిస్తోంది. అందాల ప్రదర్శనలో రోజు రోజుకు డోస్ పెంచుతోంది.
తద్వారా తన గ్లామర్తో సిల్వర్ స్క్రీన్ను ఓ ఊపు ఊపేందుకు సిద్ధంగా ఉన్నానన్న సంకేతాలు పంపుతోంది.
ప్రస్తుతం అషు ఇన్స్టాగ్రామ్ ఖాతాను 2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
సెప్టెంబర్ 04 , 2024
Iman Esmail: ‘ఫౌజీ’ బ్యూటీ ఇమాన్వీ గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
ప్రస్తుతం ఇమాన్వీ (Iman ismaili) పేరు ఇండస్ట్రీలో మారుమోగుతోంది. ప్రభాస్ - హనురాఘవపూడి కాంబోలో రూపొందనున్న 'ఫౌజీ' (Fouji) చిత్రంలో ఈ అమ్మడు హీరోయిన్గా నటిస్తుండటంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈమెపై పడింది. దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు అంతా ఆసక్తి కనబరుస్తున్నారు. ఆమెకు సంబంధించిన విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
అందంలో సౌందర్య, లుక్స్లో అనుష్కను తలపిస్తున్న ఈ ముద్దుగుమ్మ అసలు పేరు ఇమాన్ ఇస్మాయిల్ (Iman Esmail). ఆమె ఒక డ్యాన్సర్. సోషల్మీడియాలో కంటెంట్ క్రియేటర్.
ఇమాన్వీ తల్లిదండ్రులది పాకిస్తాన్లోని కరాచీ ప్రాంతం. వారు చాలా ఏళ్ల క్రితమే అమెరికాలోని లాస్ ఏంజిల్స్కు వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు.
1995 అక్టోబర్ 20న ఢిల్లీలో ఇమాన్వి జన్మించింది. చిన్నప్పటి నుంచి చదువులో టాపర్. ఎంబీఏ కూడా పూర్తి చేసింది.
ఇమాన్వీకి డ్యాన్స్ అంటే పిచ్చి. పేరెంట్స్ కూడా ఆమెను ఎంకరేజ్ చేశారు. అలనాటి బాలీవుడ్ హీరోయిన్లు రేఖ, మాధురీ దీక్షిత్, వైజయంతీ మాల వంటి వారు వేసే డ్యాన్స్ మూవ్మెంట్స్ ఉన్నవి ఉన్నట్లు చేయాలని ఆమె తల్లి ప్రోత్సహించేది.
2012లో సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ను ఇమాన్వి ప్రారంభించింది. అప్పటి నుంచి అందులో డ్యాన్స్ వీడియోలను పోస్టు చేసేది. అలా ఓ వైపు చదువుకుంటూనే డిజిటిల్ మీడియాలోనూ పేరు సంపాదించింది.
https://twitter.com/PollComic/status/1824721018407227845
నెట్టింట ఆమె అప్లోడ్ చేసే డ్యాన్స్ వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. యూబ్యూబ్లో ఆమె ఛానల్ను 18 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు.
https://twitter.com/devd_dhfm/status/1759251314696188032
ఇమాన్వి డ్యాన్స్ చూసి ఫిదా అయిన బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమెకు కొరియోగ్రాఫర్గా అవకాశమిచ్చారు. 2020లో ‘తాల్’ సినిమాలోని ‘రామ్ తా జోగీ’ అనే పాటకు ఆమె కొరియోగ్రాఫ్ చేసింది.
అంతేకాదు పలు పాపులర్ హిందీ సాంగ్స్కు తనదైన స్టైల్లో ఓన్గా డ్యాన్స్ చేసి యూట్యూబ్లో ఇమాన్వి షేర్ చేసేది. ఆ వీడియోలు పలుమార్లు వైరల్గా మారి ఇమాన్వీకి గుర్తింపు తీసుకొచ్చాయి.
https://twitter.com/follow_sai/status/1825010839734403406
ఇమాన్వీ ఇన్స్టాగ్రామ్ ఖాతా నిండా ఆమె డ్యాన్స్ వీడియోలే దర్శనమిస్తాయి. ఫుల్ గ్రేస్తో వేసిన స్టెప్పులు చూసి ఆమె ఫాలోవర్లు ఫిదా అవుతుంటారు.
అయితే ఇమాన్వి ఇప్పటివరకూ ఒక్క సినిమాలోనూ నటించలేదు. అయిన్పపటికీ ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ అవకాశం రావడం నిజంగా గ్రేట్ అని చెప్పవచ్చు.
దర్శకుడు హను రాఘవపూడి సోషల్ మీడియాలో ఈ అమ్మడి క్రేజ్ చూసి ఈ ఛాన్స్ ఇచ్చినట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
అయితే సినిమాలు చేయనప్పటికీ ఇమాన్వికి కెమెరా ఎక్స్పీరియన్స్ ఉంది. కొన్నేళ్ల క్రితం ‘బీయింగ్ సా-రా’ అనే ఒక షార్ట్ ఫిల్మ్లో మెయిన్ క్యారెక్టర్లో ఆమె నటించింది.
తనకు బీచ్లో సమయం గడపడం అంటే చాలా ఇష్టమని ఓ ఇంటర్యూలో ఇమాన్వీ తెలిపింది. అలలు చూస్తూ కూర్చుంటే ఎంత సమయమైనా తెలీదని ఈ అమ్మడు అంటోంది.
ఆగస్టు 19 , 2024
This Week Movies: ఈ వారం చిన్న చిత్రాలదే.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళ బ్లాక్బాస్టర్!
ఈ వారం (This Week Movies) చిన్న సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధమవుతున్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలు, సిరీస్లతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్సిరీస్లు ఎంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు
డార్లింగ్
ప్రియదర్శి (Priyadarshi), నభా నటేష్ (Nabha Natesh) లీడ్ రోల్స్లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'డార్లింగ్'. ఈ సినిమాకు అశ్విన్ రామ్ (Aswin Ram) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కె. నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
రామం రాఘవం
కమెడియన్ ధనరాజ్ డైరెక్టర్గా మారి చేసిన ద్విభాషా చిత్రం 'రామం రాఘవం' (Ramam Raghavam). ఇందులో సముద్రఖని, ధన్రాజ్ తండ్రి కొడుకులుగా నటించారు. ఈ చిత్రం జులై 19న తెలుగుతో పాటు తమిళంలోనూప్రేక్షకుల ముందుకు రానుంది. తండ్రీ కొడుకుల సెంటిమెంట్తో ఈ సినిమాను ఆసక్తికరంగా రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
పేక మేడలు
హీరోగా వినోద్ కిషన్ (Vinod Kishan), హీరోయిన్గా అనూష కృష్ణ (Anusha Krishna) నటిస్తున్న చిత్రం ‘పేకమేడలు’ (Peka Medalu). క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించింది. నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జులై 19న ప్రేక్షకులను పలకరించనుంది. అన్ని తరగతుల ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉంటుందని నిర్మాత రాకేష్ వర్రే అన్నారు.
క్రైమ్ రీల్
సిరి చౌదరి, పింక్ పాక్ సూర్య, జబర్దస్త్ అభి, భారత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘క్రైమ్ రీల్’ (Crime Reel). పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించిన సంజన అన్నే ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమవుతోంది. జూన్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సోషల్ మీడియా వల్ల యువత ఎలా చెడిపోతున్నారో ఇందులో చూపించాం. ఈ పాయింట్ అందరికీ కనెక్ట్ అవుతుంది’ అని డైరెక్టర్ సంజన అన్నారు.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్లు
‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం)
సలార్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన చిత్రం ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం). ఈ సినిమాకు అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వహించగా అమలాపాల్, కేఆర్ గోకుల్, జిమ్మీ జీన్ లూయిస్ కీలక పాత్రలు పోషించారు. సర్వైవల్ అడ్వెంచర్గా వచ్చిన ఈ చిత్రం మార్చి 28న విడుదలై ఘన విజయం సాధించింది. వరల్డ్ వైడ్గా రూ.150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కాగా, ఈ చిత్రం జూలై 19 నుంచి స్ట్రీమింగ్లోకి రానుంది. నెట్ఫ్లిక్స్ వేదికగా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ప్రసారం కానుంది.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateWanda RuseSeriesEnglishNetflixJuly 15T・P BONSeriesJapaneseNetflixJuly 17The Green Glow Gang 2SeriesEnglishNetflixJuly 17Kobla Kay Season 6SeriesEnglishNetflixJuly 18Tribhuvan Mishra CA TopperSeriesHindiNetflixJuly 18Sweet Home S 3SeriesKorean/EnglishNetflixJuly 19Nagendran’s HoneymoonsSeriesTelugu DubHotstarJuly 18BahishkaranaSeriesTeluguZee 5July 19BarzakhSeriesHindiZee 5July 19HotspotMovieTelugu DubAhaJuly 17My Spy: The Eternal CityMovieEnglishAmazon July 18Betty Law FeeSeriesEnglish/ SpanishAmazon July 19
జూలై 15 , 2024
Honeymoon Express Review: బోల్డ్ కంటెంట్ ఫుల్లు.. అవి మాత్రం నిల్లు.. ‘హనీమూన్ ఎక్స్ప్రెస్’ రివ్యూ!
నటీనటులు: చైతన్య రావు, హెబ్బా పటేల్, తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ తదితరులు
డైరెక్టర్ : బాల రాజశేఖరుని
సంగీతం : కల్యాణి మాలిక్
నేపథ్య సంగీతం : ఆర్.పి పట్నాయక్
నిర్మాత : కేకేఆర్, బాలరాజు
విడుదల తేదీ: 21 జూన్, 2024
చైతన్యరావు (Chaitanya Rao), హెబ్బా పటేల్ (Hebah Patel) ఫస్ట్ టైమ్ జోడీగా చేసిన చిత్రం ‘హనీమూన్ ఎక్స్ప్రెస్’ (Honeymoon Express). బాల రాజశేఖరుని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.కె.ఆర్, బాలరాజ్ సంయుక్తంగా నిర్మించారు. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకుందా? చైతన్యరావు, హెబ్బాపటేల్కు మంచి విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.
కథేంటి
ఇషాన్ (చైతన్య రావు), సోనాలి(హెబ్బా పటేల్) ఒక చిన్న యాక్సిడెంట్ ద్వారా పరిచయం అవుతారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకుంటారు. అయితే వీళ్లిద్దరి ఆలోచన విధానం వేర్వేరుగా ఉంటాయి. సోనాలి చాలా ఫాస్ట్ అయితే.. ఇషాన్ నిదానం. దీంతో ఇద్దరి మధ్య తరచూ ఏదోక సమస్యలు వస్తుంటాయి. ఓ రోజు వీరికి సీనియర్ కపుల్స్ పరిచయమై హనీమూన్ ఎక్స్ప్రెస్ అనే గేమ్ గురించి చెబుతారు. అలా వారిని ఓ రిసార్ట్కు పంపిస్తారు. ఇంతకీ హనీమూన్ ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? దాని వల్ల ఇషాన్ - సోనాలి మధ్య గొడవలు సద్దుమణిగాయా? వీరి శృంగార జీవితం బాగుపడిందా? లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
కొన్ని రోజులుగా వరుస చిత్రాలతో అలరిస్తున్న చైతన్య రావు.. ఈ సినిమాలోనూ చక్కటి నటన కనబరిచాడు. రెండు వేరియేషన్స్లో నటించి ఆకట్టుకున్నాడు. హీరోయిన్ హెబ్బా పటేల్ మరోమారు తన అందచందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వీరి మధ్య కెమెస్ట్రీ యూత్ను మెప్పిస్తుంది. సీనియర్ జంటగా తనికెళ్ల భరణి, సుహాసిని ఎప్పటిలాగే తమ సెటిల్డ్ నటనతో అలరించారు. థియేటర్లలో నవ్వులు పూయించారు. కథ మెుత్తంగా ప్రధానంగా ఈ నలుగురు మధ్యే సాగడం గమనార్హం. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
పెళ్లైన కొత్త జంట కొద్ది రోజులకే విడిపోవడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. యువ జంటలు చిన్న చిన్న పొరపొచ్చాలకే విడాకుల వరకూ వెళ్తున్నారు. ఈ అంశాన్నే కథాంశంగా తీసుకొని దర్శకుడు బాల శేఖరుని ఈ మూవీని తెరకెక్కించారు. పెళ్లైన తర్వాత ఒకరి ఇష్టాలను మరొకరు అర్థం చేసుకోవాలన్న సందేశాన్ని ఈ మూవీ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే కథ చెప్పే విషయంలో దర్శకుడు తడబడ్డాడు. సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ అంటూ కథను ఎటెటో తీసుకెళ్లి కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. యూత్ను అట్రాక్ట్ చేస్తూ తీసిన కొన్ని సీన్లు మరీ బోల్డ్గా అనిపిస్తాయి. వల్గారిటీ ఎక్కువగా ఉండటం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీకి కనెక్ట్ కాకపోవచ్చు. తమ జీవితాన్ని బాగు చేయడానికి వాళ్లే ఫ్యూచర్ నుంచి రావడం అనేది కాస్త కొత్తగా అనిపిస్తుంది.
టెక్నికల్గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. కల్యాణి మాలిక్ అందించిన పాటలు బాగున్నాయి. ఆర్.పి పట్నాయక్ అందించిన నేపథ్యం సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ తన పనిని ఇంకాస్త బెటర్గా నిర్వహించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు కూడా పర్వాలేదు.
ప్లస్ పాయింట్స్
చైతన్య రావు, హెబ్బా పటేల్ నటనసమకాలిన అంశాలు ఉండటంసంగీతం
మైనస్ పాయింట్స్
కథనం, స్క్రీన్ప్లేసాగదీత సన్నివేశాలు
Telugu.yousay.tv Rating : 2.5/5
https://telugu.yousay.tv/en/do-you-know-these-top-secrets-about-hebah-patel.html
జూన్ 21 , 2024
EXCLUSIVE: టాలీవుడ్లో కొత్త ట్రెండ్… దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు
'డైరెక్టర్' ని సినిమాకు టీమ్ లీడర్ లాంటి వాడు. హీరో నుంచి ఇతర నటీనటుల వరకు అతన్ని ఫాలో అవ్వాల్సిందే. అందుకే సినిమా ఫలితం ఎలా ఉన్నా అతకే ఆపాదిస్తారు. ప్రస్తుతం టాలీవుడ్లో ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది కుర్ర హీరోలు దర్శకుడు, రచయితలుగా కొత్త అవతారం ఎత్తుతున్నారు. టాలీవుడ్లో ఈ కోవలో హీరో నుంచి దర్శకులుగా మారిన వారి గురించి ఓసారి చూద్దాం.
అడవి శేషు(Adivi Sesh)
ఈ కేటగిరిలో మనకు ముందు గుర్తొచ్చే పేరు.. విలక్షణ నటుడు యంగ్ హీరో అడివి శేషు. 'కర్మ' అనే సినిమాతో డెరెక్టర్గా మారి అందరి దృష్టిని ఆకర్షించాడు.శేష్ ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించడమే కాకుండా అందులో ప్రధాన పాత్ర కూడా పోషించాడు. ఈ సినిమాకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత 'కిస్' సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా విజయవంతం కాలేదు. అయితే ప్రస్తుతం అడవి శేష్ రచయితగా, హీరోగా సత్తా చాటుతున్నాడు.
విశ్వక్ సేన్(Vishwak Sen)
ఈ నగరానికి ఏమైంది చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్లో మంచి టాలెంట్ దాగుంది. ఓ స్క్రీన్ప్లే రైటర్గా, రచయితగా, హీరోగా, డైరెక్టర్గా బహుముఖ ప్రజ్ఞను చాటుతున్నాడు. ఫలక్నామా దాస్(2019) చిత్రాన్ని డైరెక్ట్ చేసి ప్రశంసలు పొందాడు. ఈ చిత్రంలో నటించడంతో పాటు ప్రొడ్యూస్ చేశాడు. మరో నాలుగేళ్ల తర్వాత దాస్ కా ధమ్కీ(2023) చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇటీవల విడుదలైన గామి చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. విశ్వక్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల కావాల్సి ఉంది.
సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda)
ప్రస్తుతం టాలీవుడ్లో డైరెక్టర్లకు మోస్ట్ వాంటెడ్ హీరోగా సిద్ధు జొన్నలగడ్డ మారిపోయాడు. స్టార్ బాయ్ సిద్ధూ కూడా స్టోరీ రైటర్గా, స్క్రీన్ప్లే రచయితగా, ఎడిటర్గా సత్తా చాటుతున్నాడు. బ్లాక్ బాస్టర్ చిత్రం DJ టిల్లుకు స్టోరీ రాసిన సిద్ధు జొన్నలగడ్డ.. దాని సీక్వేల్ టిల్లు స్కేర్కు కూడా కథ అందించాడు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో సిద్ధు టాలెంట్ టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది. ఈ చిత్రాల కంటే ముందు గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల, మా వింత గాధ వినుమా చిత్రాలకు స్టోరీతో పాటు సంభాషణలు అందించాడు. టిల్లు స్కేర్ చిత్రం తర్వాత దీనికి సీక్వెల్గా టిల్లు క్యూబ్ ఉంటుందని ఇటీవల ప్రకటించారు.
రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran)
'అందాల రాక్షసి', 'టైగర్', 'అలా ఎలా' వంటి సినిమాలలో హీరోగా నటించిన రాహుల్ రవీంద్రన్.. 'చి..ల..సౌ' సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు. ఆ తర్వాత 'మన్మధుడు 2' సినిమాతో కింగ్ అక్కినేని నాగార్జున ను డైరెక్ట్ చేశాడు. 'స్నేహగీతం' 'ఇట్స్ మై లవ్ స్టోరీ' వంటి చిత్రాల్లో హీరోగా నటించిన వెంకీ అట్లూరి.. 'తొలిప్రేమ' సినిమాతో డైరెక్టర్ అవతరమెత్తాడు. ఈ క్రమంలో నటనను పక్కనపెట్టి 'మిస్టర్ మజ్ను' 'రంగ్ దే' వంటి సినిమాలను తెరకెక్కించాడు. అయితే టాలీవుడ్లో హీరోలు మెగా ఫోన్ పట్టుకోవడం ఇదే కొత్తకాదు. గతంలో దిగ్గజ నటులు ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, పవన్ కళ్యాణ్ డైరెక్టర్లుగా మారి తమ అభిరుచికి తగ్గ సినిమాలను తెరకెక్కించారు.
పవన్ కళ్యాణ్(Pawan Kalyan)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మెగాఫోన్ను చేత పట్టుకుని కట్, యాక్షన్ చెప్పారు. తన సొంత బ్యానర్లో తెరకెక్కిన 'జానీ' చిత్రానికి పవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్లాఫ్ అవడంతో పవన్ మళ్ళీ డైరెక్షన్ వైపు చూడలేదు. 'గుడుంబా శంకర్', 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాలకు స్టోరీ-స్క్రీన్ ప్లే అందించారు. టాలీవుడ్లో ఈ జనరేషన్లో హీరో నుంచి డైరెక్టర్గా మారిన నటుడు పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు.
ఆర్ నారాయణ మూర్తి(R. Narayana Murthy)
విప్లవ సినిమాల హీరో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి సైతం ఓ వైపు నటుడిగా రాణిస్తూనే నిర్మాతగా, డైరెక్టర్గా మారి... పలు సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించారు. అర్ధరాత్రి స్వాతంత్ర్యం సినిమా దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం. దండోరా, ఎర్రసైన్యం వంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.
ఎన్టీఆర్ &సూపర్ స్టార్ కృష్ణ
లెజెండరీ యాక్టర్ ఎన్టీర్ స్టార్ హీరోగా ఉన్న సమయంలోనే అనేక పౌరాణిక, జానపద చిత్రాలకు దర్శకత్వం వహించారు.'సీతారామ కళ్యాణం' అనే మూవీతో డైరెక్టర్గా ఆయనకు తొలి సినిమా. ఆ తర్వాత 'గులేభకావళి కథ' 'దాన వీర శూర కర్ణ' 'చాణక్య చంద్రగుప్తా' 'తల్లాపెళ్లామా' వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. ఓ వైపు స్టార్ హీరోగా కొనసాగుతూనే డైరెక్టర్గాను సక్సెస్ అయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా హీరోగా నటిస్తూనే డైరెక్టర్గా మారి పలు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు. . 'సింహాసనం' అనే భారీ బడ్జెట్ సినిమాతో డైరెక్టర్గా మారిన కృష్ణ.. ఆ తర్వాత ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను డైరెక్ట్ చేశారు. 'శంఖారావం', 'కలియుగ కర్ణుడు', 'ముగ్గురు కొడుకులు' 'కొడుకు దిద్దిన కాపురం' 'రిక్షావాలా' 'అన్నా తమ్ముడు' 'ఇంద్ర భవనం' 'అల్లుడు దిద్దిన కాపురం' 'రక్త తర్పణం' 'మానవుడు దానవుడు'వంటి హిట్ చిత్రాలను ఆయన తెరకెక్కించారు.
ఏప్రిల్ 01 , 2024
The Goat Life Review: పృథ్వీరాజ్ సుకుమారన్ కెరీర్ బెస్ట్ నటన.. ‘ది గోట్ లైఫ్’ సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు: ప్రృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, జిమ్మీ జీన్ లూయీస్, లీనా, సంతోష్ కీఝాత్తూర్, అకేఫ్ నజీం, శోభా మోహన్ తదితరులు
దర్శకుడు : బ్లెస్సీ
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
సినిమాటోగ్రఫీ : సునీల్ కే.ఎస్
నిర్మాతలు: బ్లెస్సీ, జిమ్మీ జీన్ లూయీస్, స్టీవెన్ ఆడమ్స్, కే.జీ అబ్రహం
విడుదల తేదీ : 28-03-2024
‘సలార్’తో (Salaar) తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). అంతకుముందు అతడు చేసిన మలయాళ చిత్రాలు తెలుగులో డబ్ అయినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. సలార్లో ప్రభాస్ ఫ్రెండ్గా నటించి తాజాగా మంచి పేరు గుర్తింపు సంపాదించాడు. తాజాగా అతడు నటించిన ‘ది గోట్ లైఫ్ : ఆడు జీవితం’ (The Goat Life : Aadujeevitham) మలయాళంతో పాటు తెలుగులోనూ ఇవాళ రిలీజైంది. బెన్యామిన్ రచించిన ‘గోట్ డేస్’ నవల ఆధారంగా దర్శకుడు బ్లెస్సీ ఈ సినిమాను తెరకెక్కించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది (The Goat Life Review In Telugu)? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఇప్పుడు చూద్దాం.
కథేంటి
ది గోట్ లైఫ్ చిత్ర కథ విషయానికి వస్తే.. కుటుంబ అవసరాల కోసం నజీబ్ అహ్మద్ (పృథ్వీరాజ్ సుకుమారన్) వలస కూలీగా సౌదీ అరేబియా వెళతాడు. అనుకోకుండా నజీబ్ సౌదీ అరేబియాలో తప్పిపోతాడు. గల్ఫ్లో పని చేసి డబ్బులు సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలనుకున్న నజీబ్ కల చెదిరిపోతుంది. ఏడారిలో బానిసగా మారి గొర్రెల కాపరిగా దుర్భరమైన జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతడు పడ్డ కష్టాలేంటి? బానిస సంకెళ్ళ నుండి నజీబ్ ఎలా బయటపడ్డాడు? తిరిగి ఇండియాకు వచ్చి తన కుటుంబ సభ్యులను నజీబ్ కలుసుకున్నాడా? లేదా? అనేది మిగతా కథ.
ఎవరెలా చేశారంటే?
‘ది గోట్ లైఫ్’ చిత్రాన్ని పృథ్విరాజ్ సుకుమారన్ అన్నీ తానై నడిపించాడు. ఆయన నటన, షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అబ్బురపరుస్తాయి. నజీబ్ పాత్రలో పృథ్వీరాజ్ను తప్ప మరో నటుడ్ని ఊహించుకోలేము. అంతగా ఆ పాత్రలో లీనమై నటించాడు పృథ్వీ. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన జీవించేశాడు. కెరీర్ బెస్ట్ నటనతో అదరగొట్టాడు. నటి అమలా పాల్ కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించింది. ఆమె తన పరిధి మేరకు నటించి మెప్పించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
దర్శకుడు బ్లెస్సీ ఈ సినిమాకు మనసులను హత్తుకునే కథను ఎంచుకున్నాడు. బానిసల జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో కళ్లకు కట్టాడు. ఫస్టాఫ్లో పృథ్వీ సౌదీకి రావడం.. అతడి పాస్పోర్టును లాక్కొని బానిసగా మార్చడం వంటివి చూపించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్కు ముందు వచ్చే సీన్ హృదయాలను బరువెక్కిస్తుంది. సౌదీలో ఎలాంటి దారుణాలు జరుగుతాయో కూడా దర్శకుడు ఈ సినిమాలో చూపించాడు. సెకండాఫ్లో ఆ బానిస సంకెళ్ల నుంచి హీరో తప్పించుకోవడం, కనుచూపు మేర కనిపించే ఏడారిలో అతడు పడే కష్టాలను తెరకెక్కించాడు. ముఖ్యంగా ఇసుక తుఫాను సీక్వెన్స్ను చాలా బాగా తెరకెక్కించాడు డైరెక్టర్. అయితే సినిమాలో సింహాభాగం అంతా పృథ్వీరాజ్ పడే కష్టాలే చూపించడం ఆడియన్స్కు బోర్ కొట్టిస్తుంది. పైగా సినిమా స్లో నేరషన్తో మరి నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. సుదీర్ఘమైన సినిమాను చూసినట్లు ఆడియన్స్ ఫీలవుతారు. కమర్షియల్ చిత్రాలను ఇష్టపడే వారికి ‘ది గోట్ లైఫ్’ అంతగా రుచించకపోవచ్చు.
టెక్నికల్గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే (The Goat Life Review In Telugu).. ప్రతీ విభాగం మంచి పనితీరు కనబరిచింది. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా ఆయన అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. అటు సినిమాట్రోగ్రాఫర్ కూడా చక్కటి ప్రతిభను కనబరిచాడు. సౌదీలోని ఎడారి పరిస్థితులను ఆ తన కెమెరా కళ్లతో అద్భుతంగా చూపించాడు. ప్రేక్షకులకు మంచి విజువల్ ట్రీట్ అందించాడు. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
ప్రృథ్వీరాజ్ సుకుమారన్ నటనభావోద్వేగ సన్నివేశాలుసంగీతం
మైనస్ పాయింట్స్
స్లో నారేషన్కమర్షియల్ హంగులు లేకపోవడం
Telugu.yousay.tv Rating : 3/5
మార్చి 28 , 2024
వరుణ్ తేజ్ (Varun Tej) గురించి మీకు తెలియని ఆసక్తికరమైన సంగతులు
మెగా ప్రిన్స్గా ఇండస్ట్రీకి పరిచయం అయిన వరుణ్ తేజ్… టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గద్దలకొండ గణేష్ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్తో మాస్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. కంచె, ముకుందా, తొలిప్రేమ వంటి హిట్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గరయ్యాడు. ప్రస్తుతం యంగ్ హీరోల్లో స్టార్ డంతో కొనసాగుతున్న వరుణ్ తేజ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
వరుణ్ తేజ్ అసలు పేరు?
సాయి వరుణ్ తేజ్. స్క్రీన్పై పెద్దదిగా ఉంటుందని తీసేశారట. అతని అన్ని సర్టిఫికెట్లలో ఇదే పేరు ఉంటంది.
వరుణ్ తేజ్ ఎత్తు ఎంత?
6 అడుగుల 4 అంగుళాలు
వరుణ్ తేజ్ తొలి సినిమా?
ముకుందా ద్వారా తొలిసారి నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత కంచె చిత్రం గుర్తింపు తెచ్చింది.
వరుణ్ తేజ్కు వివాహం అయిందా?
2023 నవంబర్ 1న లావణ్య త్రిపాఠితో ఇటలీలో పెళ్లి జరిగింది.
వరుణ్ తేజ్ క్రష్ ఎవరు?
తనకు తన భార్య లావణ్య త్రిపాఠి అంటే మొదటి నుంచి క్రష్ ఉండేదని.. తర్వాత అది ప్రేమగా మారి ఆమెనే పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు. అయితే సెకండ్ ఆప్షన్గా సాయి పల్లవి పేరు చెప్పాడు.
వరుణ్ తేజ్ తొలి బ్లాక్ బాస్టర్ హిట్స్?
గద్దలకొండ గణేష్, ఎఫ్2 వంచి చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టాయి.
వరుణ్ తేజ్కు ఇష్టమైన కలర్?
వైట్
వరుణ్ తేజ్ పుట్టిన తేదీ?
19 January 1990
వరుణ్ తేజ్ తల్లి పేరు?
పద్మజ
వరుణ్ తేజ్ వ్యాపారాలు?
ఆర్ట్స్ వర్క్స్ రీ సెల్లింగ్
వరుణ్ తేజ్కు ఎన్ని అవార్డులు వచ్చాయి?
సైమా అవార్డ్స్ల్లో ఉత్తమ హీరో కెటగిరీలో కంచె, గద్దలకొండ గణేష్, తొలిప్రేమ చిత్రాలకు గాను నామినేట్ అయ్యాడు. కానీ అవార్డులు రాలేదు.
వరుణ్ తేజ్ ఎన్ని సినిమాల్లో నటించాడు?
వరుణ్ తేజ్ 2024 వరకు 13 సినిమాల్లో హీరోగా నటించాడు.
https://www.youtube.com/watch?v=Mh9qxcJVGfI
వరుణ్ తేజ్కు ఇష్టమైన సినిమా?
ఇంద్ర
వరుణ్ తేజ్కు ఇష్టమైన ఆహారం?
థాయ్, మెక్సికన్ వంటలంటే ఇష్టం
వరుణ్ తేజ్ ఇల్లు ఎక్కడ?
వరుణ్ తేజ్ తన భార్య లావణ్య త్రిపాఠితో కలిసి హైదరాబాద్- మణికొండలో కొత్తగా నిర్మించిన ఇంటిలో ఉంటున్నాడు.
మార్చి 21 , 2024