• TFIDB EN
  • మంగళవారం (2023)
    ATelugu
    మ‌హాల‌క్ష్మీపురంలోని ఓ జంట మ‌ధ్య అక్రమ సంబంధం ఉంద‌ని ఊరి గోడ‌ల‌పై రాత‌లు క‌నిపిస్తాయి. ఆ జంట అనూహ్య ప‌రిస్థితుల్లో చ‌నిపోతుంది. మ‌రో జంటకి కూడా అదే పరిస్థితి ఎదురై చ‌నిపోవ‌డంతో ఊరి ప్రజ‌ల్లో భ‌యం మొద‌ల‌వుతుంది. ఆ హత్యలన్ని మంగళవారం రోజునే జరుగుతుంటాయి. ఈ కేసును ఛేదించేందుకు ఎస్‌ఐ నందితా శ్వేత ప్రయత్నిస్తుంది. ఇంతకు ఆ హత్యల వెనుక ఉన్నది ఎవరు? అనేది మిగతా కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Hotstarఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    YouSay Review

    Mangalavaaram Review: ‘మంగళవారం’లో పాయల్‌ కెరీర్‌ బెస్ట్‌ నటన.. మరి సినిమా హిట్టా? ఫట్టా?

    RX 100’ సినిమాతో సినీప్రియుల్ని మెప్పించిన ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. ఆ సినిమాతోనే న‌టి పాయ‌ల్ రాజ్‌పూత్ కూడా తెలుగు వారికి ద‌గ్గ‌రైంది. తిరిగి వారి కాం...read more

    How was the movie?

    @maheshYadavv

    1 year ago

    తారాగణం
    పాయల్ రాజ్‌పుత్
    నందితా శ్వేత
    దివ్య పిళ్లై
    రవీంద్ర విజయ్
    చైతన్య కృష్ణ
    అజయ్ ఘోష్
    శ్రీతేజ్
    సిబ్బంది
    అజయ్ భూపతి
    దర్శకుడు
    స్వాతి గునుపాటినిర్మాత
    సురేష్ వర్మ ఎంనిర్మాత
    దాశరధి శివేంద్రసినిమాటోగ్రాఫర్
    కథనాలు
    Mangalavaaram Review: ‘మంగళవారం’లో పాయల్‌ కెరీర్‌ బెస్ట్‌ నటన.. మరి సినిమా హిట్టా? ఫట్టా?
    Mangalavaaram Review: ‘మంగళవారం’లో పాయల్‌ కెరీర్‌ బెస్ట్‌ నటన.. మరి సినిమా హిట్టా? ఫట్టా?
    నటీనటులు: పాయల్‌ రాజ్‌పూత్‌, నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్‌ అమిర్‌, రవీంద్ర విజయ్‌, కృష్ణ చైతన్య, అజయ్‌ ఘోష్‌ తదితరులు దర్శకత్వం: అజయ్‌ భూపతి సంగీతం: అజనీష్ లోకనాథ్‌ ఎడిటింగ్‌: మాధవ్‌ కుమార్‌ గుళ్లపల్లి సినిమాటోగ్రఫీ: శివేంద్ర దాశరథి నిర్మాత: స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్‌ వర్మ విడుదల: 17-11-2023 ‘RX 100’ సినిమాతో సినీప్రియుల్ని మెప్పించిన ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. ఆ సినిమాతోనే న‌టి పాయ‌ల్ రాజ్‌పూత్ కూడా తెలుగు వారికి ద‌గ్గ‌రైంది. తిరిగి వారి కాంబోలోనే తేరకెక్కిన లేటెస్ట్‌ మూవీ ‘మంగళవారం’. డార్క్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఇటీవల రిలీజైన టీజ‌ర్, ట్రైలర్లు ఈ ఆస‌క్తిని మరింత పెంచింది. అల్లు అర్జున్ వంటి స్టార్ ఈ చిత్ర ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మ‌రి ఈ మంగ‌ళ‌వారం క‌థేంటి? తెర‌పై ఎలాంటి వినోదాన్ని పంచింది? పాయ‌ల్- అజ‌య్‌ల‌కు విజ‌యాన్ని అందించిందా? ఈ కథనంలో చూద్దాం.  కథ మ‌హాల‌క్ష్మీపురంలోని ఓ జంట మ‌ధ్య అక్ర‌మ సంబంధం ఉంద‌ని ఊరి గోడ‌ల‌పై రాత‌లు క‌నిపిస్తాయి. ఆ జంట అనూహ్య ప‌రిస్థితుల్లో చ‌నిపోతుంది. మ‌రో జంటకి కూడా అదే పరిస్థితి ఎదురై చ‌నిపోవ‌డంతో ఊరి ప్ర‌జ‌ల్లో భ‌యం మొద‌ల‌వుతుంది. మంగళవారం రోజునే ఈ మరణాలు చోటుచేసుకోవడంతో గ్రామ‌దేవ‌త మాల‌చ్చ‌మ్మ జాత‌ర జ‌రిపించ‌క‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని ఊరి ప్ర‌జ‌లు భావిస్తారు. అయితే ఈ మిస్ట‌రీ మ‌ర్డ‌ర్స్ వెనుక ఏదో కుట్ర ఉంద‌ని ఎస్ఐ (నందితాశ్వేత‌) భావిస్తుంది. కానీ, ఊరి జ‌మీందారు ప్ర‌కాశం (చైత‌న్య కృష్ణ‌) మాట‌ల‌కు క‌ట్టుబ‌డి ఇమె ఇన్వేస్టిగేష‌న్‌కు ఎవ‌రూ స‌రిగా స‌హ‌క‌రించ‌రు. మరి ఆ హ‌త్య‌ల‌కు వెనుక ఉన్న మ‌ర్మం ఏమిటి? దెయ్యం రూపంలో శైలు (పాయ‌ల్ రాజ్‌పుత్‌) తిరుగుతోంద‌ని ఊరి ప్ర‌జ‌లు ఎందుకు భ్ర‌మ‌ప‌డ్డారు? ఈ హ‌త్య‌ల‌కు శైలుకు సంబంధం ఉందా? మ‌హాల‌క్ష్మీపురం నుంచి ఆమె వెలివేయ‌బ‌డ‌టానికి కార‌ణం ఏమిటి? అన్న‌దే మంగ‌ళ‌వారం సినిమా క‌థ‌. ఎలా సాగిందంటే? సినిమాలో తొలి 15 నిమిషాలు శైలు చిన్న‌త‌నం, రవితో ఆమె ప్రేమకథ, అతడి కుటుంబ నేపథ్యం చుట్టూ సాగుతుంది. ఆ త‌ర్వాత క‌థ వ‌ర్త‌మానంలోకి వ‌స్తుంది. జంట‌ల పేర్లు ఎవ‌రో అజ్ఞాత వ్య‌క్తి ఊరి గోడ‌ల‌పై రాయడం.. వారంతా గ్రామ దేవ‌త‌కు ఇష్ట‌మైన మంగ‌ళ‌వారం రోజునే చనిపోవడం తొలి భాగంలో చూపిస్తారు. ముఖ్యంగా విరామ సన్నివేశాలు తొలి భాగంలో థ్రిల్‌ ఇస్తాయి. ద్వితీయార్ధం మ‌ళ్లీ శైలు గ‌తంతోనే మొద‌ల‌వుతుంది. శైలుకు జ‌రిగిన అన్యాయం, ఆమెకున్న మాన‌సిక రుగ్మ‌త, దానివ‌ల్ల త‌ను ప‌డే యాత‌న రెండో పార్ట్‌లో చూపించారు. ప‌తాక స‌న్నివేశాలు మంచి ట్విస్ట్‌ల‌తో ఆస‌క్తిక‌రంగా ఉంటాయి.  ఎవరెలా చేశారంటే? శైలు పాత్ర‌లో పాయ‌ల్ చ‌క్క‌గా ఒదిగిపోయింది. గ్లామ‌ర్‌తో పాటు న‌ట‌న‌లోనూ అదరగొట్టింది. భావోద్వేగ‌భ‌రిత స‌న్నివేశాల్లో చ‌క్క‌గా జీవించింది. ఎస్సై పాత్ర‌లో నందితా శ్వేత ఆద్యంతం సీరియ‌స్ లుక్‌లో క‌నిపించింది. న‌ట‌న ప‌రంగా ఆమెకు పెద్ద‌గా స్కోప్‌ లేదు. అజ‌య్ ఘోష్ - ల‌క్ష్మ‌ణ్ మ‌ధ్య వ‌చ్చే కామెడీ  ట్రాక్ న‌వ్వులు పూయిస్తుంది. జ‌మిందారుగా చైత‌న్య కృష్ణ పాత్ర‌ను మంచిగా డిజైన్ చేశారు. శ్రీతేజ్‌, శ్ర‌వ‌ణ్ రెడ్డి, ర‌వీంద్ర విజ‌య్ త‌దిత‌రుల పాత్ర‌లు ప‌రిధి మేర‌కు ఉంటాయి.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే? దర్శకుడు అజయ్‌ ఈ సినిమాను మిస్టీక్‌ థ్రిల్లర్‌లా మెుదలుపెట్టి మధ్యలో హారర్‌ టచ్‌ ఇచ్చి ఆఖర్లో ఓ సందేశంతో ముగించారు. అక్ర‌మ సంబంధాల వ్య‌వహారం, డబల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఎబ్బెట్టుగా అనిపించేలా ఉన్నాయి. ఈ విషయంలో అజయ్‌ కాస్త జాగ్రత్త పడాల్సింది. మరోవైపు ప్రథమార్థంలో కథే కనిపించకపోవడం, ద్వితియాతార్థంలో పాత్రలకు సరైన ముగింపు ఇవ్వకపోవడం అతడి డైరెక్షన్‌లో మైనస్‌లుగా కనిపిస్తున్నాయి. పతాక సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ డైరెక్టర్‌ సినిమాని ముగించిన తీరు ఆడియన్స్‌కు అసంతృప్తిగా అనిపిస్తుంది. ఓవరాల్‌గా అజ‌య్ రాసుకున్న క‌థ కుటుంబ ప్రేక్ష‌కుల‌కు రుచించ‌క‌పోవ‌చ్చు. కానీ థ్రిల్లింగ్‌ సినిమాలు ఇష్టపడేవారికి నచ్చుతుంది. టెక్నికల్‌గా  టెక్నిక‌ల్‌గా ఈ సినిమా ఉన్న‌త స్థాయిలో క‌నిపిస్తుంది. అజ‌నీష్ నేప‌థ్య సంగీతం సినిమాకి ఓ కొత్త లుక్‌ను తీసుకొచ్చింది. జాతర పాట‌ను స్వ‌ర‌ప‌రిచిన తీరు.. దాన్ని తెర‌పై చిత్రీక‌రించిన విధానం ఆక‌ట్టుకుంటాయి. అలాగే శివేంద్ర ఛాయాగ్ర‌హ‌ణం మ‌రో ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ పాయ‌ల్ న‌ట‌న‌, గ్లామ‌ర్‌అజ‌నీష్ సంగీతంట్విస్ట్‌లు మైనస్‌ పాయింట్స్‌  నెమ్మ‌దిగా సాగే క‌థ‌నం ముగింపు రేటింగ్‌ : 3/5
    నవంబర్ 17 , 2023
    This Week OTT Releases: ఓటీటీలోకి వచ్చేసిన మంగళవారం.. ఈ ఏడాది చివర్లో 25 సినిమాలకుపైగా స్ట్రీమింగ్!
    This Week OTT Releases: ఓటీటీలోకి వచ్చేసిన మంగళవారం.. ఈ ఏడాది చివర్లో 25 సినిమాలకుపైగా స్ట్రీమింగ్!
    గతవారం సలార్ విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుండగా.. ఆ సినిమాకు పోటీగా ఈవారం పెద్దగా సినిమాలు విడుదల కావడం లేదు. చాలావరకు తమ సినిమాలను కొత్త ఏడాది జనవరిలో రిలీజ్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయి. మరోవైపు ఓటీటీలో డిసెంబర్ ఇయర్ ఎండింగ్‌లో దాదాపు 25కు పైగా చిత్రాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఆ సినిమాలపై ఓ లుక్‌ వేద్దాం. థియేటర్లలో విడుదల కానున్న సినిమాలు డెవిల్ నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ చిత్రం డిసెంబర్ 29న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సిక్రెట్ ఏజెంట్‌గా నటిస్తున్నాడు. డెవిల్ సినిమాను అభిషేక్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు.  ధృవ నక్షత్రం తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన ధృవ నక్షత్రం సినిమా డిసెంబర్ 29 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉగ్రవాదులను ఏరిపారేసే ఆర్మి అధికారిగా విక్రమ్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో విక్రమ్ సరసన ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను గౌతమ్ వాసుదేవ్‌ మీనన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈవారం ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలు మంగళవారం వారం రోజులుగా ఓటీటీ రిలీజ్‌పై దాగుడు మూతలు ఆడుతున్న మంగళవారం సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. డిసెంబర్ 25 అర్ధరాత్రి నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. విడుదలకు ముందు భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. అజయ్ భూపతి డైరెక్షన్‌లో హర్రర్ చిత్రంగా మంగళవారం తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో పాయల్ రాజ్‌పూత్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది. ఇంకెందుకు ఆలస్యం.. మంచి హర్రర్ థ్రిల్లర్ చిత్రం చూసి ఎంజాయ్ చేయండి.  అన్నపూరాణి లేడీ సూపర్‌స్టార్‌ నయనతార నటించిన రిసెంట్ చిత్రం 'అన్నపూరాణి' డిసెంబర్ 29 నుంటి ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ చిత్రంలో జై, సత్యరాజ్, కెఎస్ రవికుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నికిలేష్ కృష్ణ  డెరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా తమిళంలో మాత్రమే విడుదలైంది. కానీ OTTలో తెలుగు, కన్నడ, హిందీ మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateMangalavaaramMovieTeluguDisney Plus HotstarDec 2612th FailMovieTelugu/HindiDisney Plus HotstarDec 29Katatan Si BoyMovieIndonesianAmazon PrimeDec 27Tiger 3MovieHindiAmazon PrimeDec 31Ricky Gervais: Armageddon Standup Comedy ShowEnglishNetflixDec 25Snag MovieEnglishNetflixDec 25Ko Gaye Hum Kaha MovieHindiNetflixDec 26Thank You I'm Sorry MovieSwedishNetflixDec 26Hell Camp: Teen Night Mare MovieEnglishNetflixDec 27A Very Good GirlMovieTagalogNetflixDec 27Miss SampoMovieMandarinNetflixDec 28Little DixieMovieEnglishNetflixDec 28Pokemon Concierge Web SeriesJapaneseNetflixDec 28AnnapooraniMovieTelugu Dubbed NetflixDec 29Shastri Virudh Shastri MovieHindiNetflixDec 29Three of UsMovieHindiNetflixDec 29Bad LandsMovieJapaneseNetflixDec 29Berlin MovieSpanishNetflixDec 29Dangerous Game: The Legacy MurdersMovieEnglishNetflixDec 31The AbandonedMovieMandarinNetflixDec 31Dono MovieHindiZee5Dec 29Once Upon Two TimesMovieHindiZee5Dec 29Safed MovieHindiZee5Dec 29Trolls and TogetherMovieEnglishBook My ShowDec 29The CurseWeb SeriesEnglishLion's Gate PlayDec 29
    డిసెంబర్ 26 , 2023
    Payal Rajput:  ఒంటిపై నూలు పోగు లేకుండా పాయల్‌ రాజ్‌పుత్‌… ‘మంగళవారం’ సినిమా కోసం అందాల తెగింపు
    Payal Rajput:  ఒంటిపై నూలు పోగు లేకుండా పాయల్‌ రాజ్‌పుత్‌… ‘మంగళవారం’ సినిమా కోసం అందాల తెగింపు
    RX 100 కాంబో మళ్లీ రిపీట్‌ కాబోతుంది. ఈ సారి మరింత డోసు పెంచారు. “మంగళవారం” అనే టైటిల్‌ పెట్టి పాయల్ రాజ్‌పుత్‌ టాప్‌ లెస్‌ ఫోటోను విడుదల చేశారు. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్‌లో సినిమా రూపుదిద్దుకుంటుంది. పాయల్‌ రాజ్‌పుత్‌ మెుదటి సినిమా నుంచే అందాల ఆరబోతతో  హద్దుల్లేకుండా చెలరేగిపోతుంది. RX 100లో కార్తీకేయతో రొమాన్స్‌ చేసి యువతను ఆకర్షించింది ఈ అమ్మడు.  ఆ సినిమా తర్వాత RDX లవ్‌, అనగనగా ఓ అతిథి చిత్రాల్లో బోల్డ్‌ క్యారెక్టర్‌లో నటించింది పాయల్‌. అందచందాలు ప్రదర్శించి ఆకట్టుకోవాలని చూసింది.  సామాజిక మాధ్యమాల్లోనూ హాట్‌ఫొటోస్‌తో చెలరేగుతుంది పంజాబీ సుందరి. బాత్‌రూమ్‌లో కేవలం టవల్‌పై ఉన్న ఫొటోలను పోస్ట్‌ చేసి షేక్ చేసింది. ఇటీవల ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉన్న హాట్‌ పిక్స్‌ వైరల్ అయ్యాయి. ఇందులోనూ టాప్‌లెస్‌గా కనిపించింది పాయల్ రాజ్‌పుత్‌.  సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ కలిసి అలాంటి ఫోజులు ఇవ్వటంపై ట్రోల్స్‌ ఎదుర్కొంది ఈ హీరోయిన్.  జిన్నా సినిమాలోనూ అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గలేదు. వీలైనంత వరకు న్యాయం చేసేందుకు ప్రయత్నించింది.  మంగళవారం సినిమాలో మరోసారి బోల్డ్‌ క్యారెక్టర్‌లో నటిస్తుంది ఈ భామ. శైలజ అనే పాత్రలో టాప్‌లెస్‌గా చేతి వద్ద సీతాకోక చిలుక ఉన్నట్లు కనిపించే ఫస్ట్‌ లుక్‌ సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది. RX 100 తర్వాత పాయల్‌ రాజ్‌పుత్‌కు తెలుగులో మంచి హిట్‌ లేదు. అందాల విందు చేసినా ఆఫర్లు మాత్రం పెద్దగా రావటం లేదు.  ఆఫర్లు లేని కారణంగానే బోల్డ్ పాత్రల్లోనూ నటించేందుకు పాయల్ రాజ్‌పుత్‌  సిద్ధపడుతున్నట్లు  తెలుస్తోంది.  RX 100, మహా సముద్రం చిత్రాలు తీసిన దర్శకుడు అజయ్‌ భూపతి మంగళవారం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.  మంగళవారం సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలం భాషల్లో రిలీజ్‌ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి కాంతార, విరూపాక్ష సంగీత దర్శకుడు అజనీష్‌ లోక్‌నాథ్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు.  అజయ్‌ భూపతి రిలీజ్‌ చేసిన ఈ లుక్‌పై ఆసక్తి నెలకొంది. వర్మ కాంపౌండ్‌ నుంచి వచ్చిన ఈ దర్శకుడు మెుదట్నుంచే విభిన్నమైన సినిమాలు తీస్తున్నాడు. 
    ఏప్రిల్ 25 , 2023
    <strong>Kiran Abbavaram: కిరణ్ అబ్బవరంను ట్రోలింగ్ చేసింది ఈ సినిమాలోనే! ఇంత దారుణామా?&nbsp;</strong>
    Kiran Abbavaram: కిరణ్ అబ్బవరంను ట్రోలింగ్ చేసింది ఈ సినిమాలోనే! ఇంత దారుణామా?&nbsp;
    టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కు(Kiran Abbavaram) ముఖ్య అతిథిగా అక్కినేని నాగచైతన్య కూడా హాజరయ్యారు. అయితే&nbsp; ఈ కార్యక్రమంలో కిరణ్ అబ్బవరం చేసిన భావోద్వేగ ప్రసంగం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కానీ ఈ చర్చ “క” సినిమా గురించి కాదు. ఇటీవల తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై&nbsp; కిరణ్ అబ్బవరం&nbsp; తన మనసులోని బాధను బయటపెట్టాడు. ఇప్పటివరకు కిరణ్ అబ్బవరం పలు ట్రోల్స్‌కి గురయ్యాడు.&nbsp; వీటిపై ఆయన ఎక్కువగా స్పందించకుండా తన పని తాను చూసుకుంటూ(Kiran Abbavaram Trolling Movie)&nbsp; వెళ్లిపోయేవాడు. ఈసారి మాత్రం ఆ ట్రోల్స్ మితిమీరుతున్నాయని భావించి గట్టిగా స్పందించాడు. ఈ ప్రసంగంతో ఇప్పుడు ఇండస్ట్రీలో అతని వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఈ సందర్భంలో కిరణ్ అబ్బవరం, ఒక సినిమాలో తన అనుమతి లేకుండా తనపై ట్రోల్ సన్నివేశాన్ని ఉపయోగించారని చెప్పుకొచ్చారు. " ఏదో షార్ట్ ఫిల్మ్స్‌ నుంచి వచ్చాను. ఏదో నా పని చేసుకుంటూ వెళ్తున్నాను. సంవత్సరానికి రెండు సినిమాలు. మూడు సినిమాలు చేస్తూన్నాని పక్కనపెడితే.. నా మీద కొంత మంది సినిమాలో ట్రోలింగ్ చేశారండి. నా మీదా..! ఏమన్న సంబంధమా? నా మీద ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది సినిమాలో.. కొంచెం రిక్వెస్టింగ్‌గానే అడుగుతున్నా.. ఎందుకన్న నామీదా.. నా పనేదో నేను చేసుకుంటున్నాను. ఏరోజైనా మిమ్మల్ని ఏమైనా అడిగానా? ఏంటి? ఓ సినిమాలో డైరెక్ట్‌గా నా మీదా ట్రోలింగ్ కనీసం నాకు ఇన్పర్‌మేషన్ లేదు. బ్రో, కిరణ్ బ్రో మీ గురించి ఒకటి సినిమాలో వేస్తున్నాం. ఎక్కడో నా ఫ్యాన్స్‌ నాకు చూపించి ఏంటి బ్రో నీ గురించి ఈ సినిమాలో కూడా ట్రోలింగ్ చేస్తున్నారు అని అంటే.. నేను రిక్వెస్టింగ్‌గా అడుగుతున్నా? మీ సినిమాలో నా గురించి ట్రోలింగ్ చేసేంత ఏం చేశాను నేను అని అంటూ" భావోద్వేగానికి లోనయ్యాడు. https://twitter.com/Movies4u_Officl/status/1851300009503064487 కిరణ్ అబ్బవరం ప్రసంగం తర్వాత ఇంతకు ఆ సినిమా ఏమై ఉంటుందని నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అయితే కిరణ్ ప్రస్తావించిన సన్నివేశం గత ఏడాది వచ్చిన కన్నడ డబ్బింగ్ సినిమా ‘హాస్టల్ స్టూడెంట్స్’లోని సన్నివేశం. ఈ చిత్రాన్ని ‘చాయ్ బిస్కెట్’ నిర్మాణ సంస్థ తెలుగులోకి డబ్బింగ్ చేసింది.&nbsp; ఆ సినిమా స్టార్టింగ్ సీన్ లో ఇద్దరు(Kiran Abbavaram Trolling Movie) స్టూడెంట్స్ కిరణ్ అబ్బవరం నటించిన ఓ సినిమా ట్రైలర్ గురించి చర్చిస్తూ ఒకరు కిరణ్ అబ్బవరం ట్రైలర్ వచ్చింది అంటాడు. ఇంకొకరు ఏంటీ&nbsp; "మళ్లీ వచ్చిందా?" అంటూ వెటకారంగా మాట్లాడతారు. అప్పట్లో కిరణ్ వరుసగా సినిమాలు చేస్తూ ఉండటంతో, ఆ సినిమాకు సంబంధించి అతని మీద సెటైర్ వేసినట్లు అనిపించింది. దీనిపై కిరణ్ ఈ ఈవెంట్ లో తన బాధను వ్యక్తం చేశాడు. కానీ, అతను ఎక్కడా కూడా ఆ సినిమా పేరు లేదా మేకర్స్ పేర్లు ప్రస్తావించలేదు. కానీ, తన మనసుకు బాధ కలిగిన విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పాడు. కిరణ్ స్పీచ్‌కి సోషల్ మీడియా&nbsp; నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. పాటి పాటలేని బేవర్స్ కొంత మంది ట్రోల్ చేసినంత మాత్రనా మీకు ఏం కాదు బ్రో అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి. నువ్ పట్టించుకోకు కిరణ్ అన్నా అంటూ మరో నెటిజన్ ఓదార్చే ప్రయత్నం చేశాడు. https://twitter.com/YugandharTarak/status/1851309020264771830 ఇక 'క' సినిమా దీపావళి రోజు(అక్టోబర్ 31)న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో నిర్మితమైంది. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం సరసన తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను సుజిత్ మద్దెల, సందీప్ మద్దెల ద్వయం డైరెక్ట్ చేసింది.
    అక్టోబర్ 30 , 2024
    Manchu Manoj: మంచు వివాదంలో కీలక మలుపు.. ఒకరి అరెస్టు
    Manchu Manoj: మంచు వివాదంలో కీలక మలుపు.. ఒకరి అరెస్టు
    మంచు ఫ్యామిలీలో చెలరేగిన వివాదం మరింత ముదురుతోంది. మంగళవారం వరుస ప్రెస్‌ మీట్స్‌ నిర్వహించిన మంచు మనోజ్‌, మంచు విష్ణు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. మంచు విష్ణు తన ప్రెస్‌ మీట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. సాయంత్రం వరకు టైమ్‌ ఇస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు ఈ వివాదానికి సంబంధించి ఓ వ్యక్తి పోలీసులు అరెస్టు చేశారు.&nbsp; విష్ణు.. మాస్ వార్నింగ్‌ మంచు ఫ్యామిలీ గొడవల్లో బయటవారి ప్రమేయం ఉందని మంచు విష్ణు అన్నారు. వారి వల్లే ఈ గొడవ పెద్దదైందని ఆరోపించారు. వారందరికీ సాయంత్రం వరకూ టైమ్ ఇస్తున్నట్లు చెప్పారు. వారంతట వారే ఇందులో నుంచి తప్పుకుంటే బాగుంటుందని చెప్పారు. లేదంటే వారి పేర్లు తానే బయటపెట్టాల్సి వస్తుందని వార్నింగ్‌ ఇచ్చారు. తనకు తన తండ్రి మాటే వేదవాక్కు అని, ఆయన చెప్పిందే చేస్తానని విష్ణు అన్నారు. అయితే తన తమ్ముడిపై ఎప్పుడూ దాడులు చేయనని విష్ణు అన్నారు.&nbsp; https://twitter.com/Telugu360/status/1866749230423085437 మోహన్‌బాబుకు ఊరట మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. మోహన్ బాబుకు పోలీసులు జారీచేసిన నోటీసులపై హైకోర్టు స్టే ఇచ్చింది. మంచు మనోజ్ ఫిర్యాదు నేపథ్యంలో రాచకొండ పోలీసులు మోహన్‌బాబుకు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరవ్వాలని కోరారు. ఈ నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం రాచకొండ పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే విధించింది. పోలీసుల ముందు విచారణకు హాజరయ్యేందుకు ఈ నెల 24వ తేదీ వరకు మినహాయింపు ఇచ్చింది. దాడి కేసులో ఒకరి అరెస్టు మంచు మనోజ్‌పై దాడి కేసులో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోహన్ బాబు మేనేజర్ కందుల వెంకట్ కిరణ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంచు మనోజ్‌పై దాడి చేసిన వారిలో కిరణ్ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అతడు విష్ణుకు ప్రధాన అనుచరుడిగానూ వ్యవహరిస్తున్నారు. కిరణ్‌తో పాటు దాడికి పాల్పడిన వినయ్‌ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. మంచు లక్ష్మి ఆసక్తిక పోస్టు మంచు ఫ్యామిలీ వివాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు కారణమైన నేపథ్యంలో మోహన్‌బాబు కూతురు, నటి మంచు లక్ష్మి ఓ ఆసక్తికర పోస్టు పెట్టారు. తన కుమార్తె చిరునవ్వులు చిందిస్తోన్న ఓ వీడియోను పోస్టు చేస్తూ 'పీస్‌' (శాంతి) అని క్యాప్షన్‌ పెట్టారు. ప్రస్తుత పరిస్థితుల రిత్యా ఆమె షేర్‌ చేసిన ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. అంతకుముందు కూడా ఓ ఇంట్రస్టింగ్‌ పోస్టును మంచు లక్ష్మి పోస్టు చేశారు. ఈ ఏడాది ఎన్నో పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పారు.&nbsp;
    డిసెంబర్ 11 , 2024
    Allu Arjun: పోలీసుల ఎదుట కంటతడి పెట్టిన బన్నీ? పొరపాటు జరిగిందని అంగీకారం?
    Allu Arjun: పోలీసుల ఎదుట కంటతడి పెట్టిన బన్నీ? పొరపాటు జరిగిందని అంగీకారం?
    సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో 'పుష్ప 2' హీరో అల్లు అర్జున్‌ పోలీసుల విచారణకు హాజరయ్యారు. మంగళవారం (డిసెంబర్‌ 24) ఉదయం 10.30 గం.ల జూబ్లీహిల్స్‌ ఇంటి నుంచి బన్నీ బయలుదేరారు. అతడితో పాటు తండ్రి అల్లు అరవింద్‌, మామ చంద్రశేఖర్‌ రెడ్డి, బన్నీ వాసు ఉన్నారు. చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో ఉ.11 గంటలకు అల్లు అర్జున్‌ విచారణ మెుదలైంది. ఏసీపీ రమేష్‌, ఇన్‌స్పెక్టర్‌ రాజు నాయక్‌ సమక్షంలో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ఆకాంక్ష్‌ యాదవ్‌ ఘటనకు సంబంధించి పలు ప్రశ్నలు వేశారు. అల్లు అర్జున్ ఎమోషనల్‌.. పోలీసుల విచారణ సందర్భంగా హీరో అల్లు అర్జున్‌ భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. సంధ్యా థియేటర్‌ తొక్కిసలాటకు సంబంధించి పోలీసులు చూపించిన వీడియో చూసి ఆయన ఎమోషనల్‌ అయినట్లు సమాచారం. తన వల్ల కొన్ని పొరపాటులు జరిగాయని పోలీసులతో అల్లు అర్జున్‌ అన్నట్లు తెలుస్తోంది. మెుత్తం 3 గంటల 35 నిమిషాల పాటు బన్నీని పోలీసులు ప్రశ్నించగా.. కొన్ని ప్రశ్నలకు తనకు సమాధానం తెలియదని బన్నీ చెప్పారు. మళ్లీ విచారణకు పిలిస్తే ఎప్పుడైనా హాజరు అవుతానని అల్లు అర్జున్‌ చెప్పినట్లు తెలుస్తోంది.  అల్లు విచారణ పూర్తి అంతకుముందు అల్లు అర్జున్‌ను సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ఆకాంక్ష్‌ యాదవ్‌ ప్రశ్నించారు. తొక్కిససలాటకు సంబంధించి కీలక ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. తొక్కిసలాటకు సంబంధించిన 10నిమిషాల వీడియోను చూపించి కొన్ని ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. బన్నీ స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన అనంతరం అతడ్ని విడిపెట్టినట్లు సమాచారం. కట్టుదిట్టమైన భద్రత మధ్య అల్లు అర్జున్‌ను పోలీసులు ఇంటి వద్ద విడిచిపెట్టారు.  https://twitter.com/ANI/status/1871431900340142523 ఆ ప్రశ్నలకు బన్నీ మౌనం..! చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో విచారణ కొనసాగింది. ‘తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు తెలుసు కదా’ అని పోలీసులు ప్రశ్నించగా అల్లు అర్జున్‌ నోరు మెదపలేదని తెలుస్తోంది. ఆ తర్వాత రోజు వరకు తనకు తెలియదని మీడియాకు ఎందుకు చెప్పారని పోలీసులు ప్రశ్నించగా ఈ క్వశ్చన్‌కు కూడా బన్నీ సైలెంట్‌గానే ఉన్నారని సమాచారం.  https://twitter.com/TOIHyderabad/status/1871462776591548839 బన్నీ కోసం 50 ప్రశ్నలు! సంధ్యా థియేటర్‌ ఘటనకు సంబంధించి మెుత్తం 50 ప్రశ్నలను అల్లు అర్జున్‌ కోసం సిద్ధం చేసినట్లు సమాచారం. ఒక్కొక్కటిగా ఆ ప్రశ్నలను బన్నీకి సంధించినట్లు తెలిసింది. దీనిపై బన్నీ ఇచ్చే సమాధానాన్ని బట్టి కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశముంది. లేటెస్ట్ అప్‌డేట్స్‌ ప్రకారం బన్నీ ఆచితూచి సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తుంది.  https://twitter.com/timesofindia/status/1871431495480750275 బన్నీని అడిగిన ప్రధాన ప్రశ్నలు ఇవే! తొక్కిసలాట ఘటనకు సంబంధించి బన్నీ కోసం 50 ప్రశ్నలను చిక్కడపల్లి పోలీసులు రెడీ చేసిన సంగతి తెలిసిందే. వాటిలో అతి ముఖ్యమైన ప్రశ్నలు మీడియా సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.&nbsp; 1. సంధ్య థియేటర్‌కు వచ్చే ముందు ఎవరి అనుమతి తీసుకున్నారు? 2. పోలీసులు అనుమతి ఉందని మీకు ఎవరు చెప్పారు? 3. పోలీసులు అనుమతి నిరాకరించినట్లు మీకు సమాచారం ఉందా? లేదా? 4. తొక్కిసలాటలో రేవతి చనిపోయినట్లు థియేటర్‌లో ఉన్నప్పుడు తెలిసిందా? లేదా? 5. రేవతి మరణం గురించి ఎవరూ చెప్పలేదని మీడియా ముందు ఎందుకు చెప్పారు? 6. రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా? లేదా? 7. అనుమతి లేకుండా రోడ్ షో ఎలా నిర్వహించారు? 8. మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్‌కు వచ్చారు? 9. మీతో వచ్చిన బౌన్సర్లు ఏ ఏజెన్సీకి సంబంధించిన వారు? 10. ఎంతమంది బౌన్సర్లను మీరు నియమించుకున్నారు? 11. అభిమానులు, పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్లు ఎవరు? 12. ఓ మహిళ చనిపోయిందని, మీరు థియేటర్ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు చెప్పారా? లేదా? 13. పోలీసులు చెప్పినా వెళ్లేందుకు ఎందుకు మొదట నిరాకరించారు? 14. రేవతి చనిపోయిన విషయాన్ని మీరు మొదట ఎప్పుడు తెలుసుకున్నారు?
    డిసెంబర్ 24 , 2024
    Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం
    Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం
    సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్‌, ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ప్రకటించారు. ఈ ఘటనలో గాయపడిన శ్రీతేజ్‌ను మంగళవారం కిమ్స్ ఆస్పత్రిలో ఆయన పరామర్శించారు. Courtesy Instagram: dilraju మీడియాతో మాట్లాడిన దిల్‌ రాజు, ‘‘ఇలాంటి సంఘటనలు జరగడం ఎంతో బాధాకరం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నన్ను ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా నియమించినప్పటి నుంచి నా బాధ్యతను సీరియస్‌గా తీసుకుంటున్నా. అయితే నేను అమెరికాలో ఉన్న కారణంగా ఇక్కడికి రాలేకపోయాను. అమెరికా నుంచి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిని కలిశా. ప్రస్తుతం జరిగిన ఘటనపై పూర్తిగా దృష్టి సారించాను. అల్లు అర్జున్‌ను కూడా త్వరలోనే కలుస్తా. పరిశ్రమలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటానికి చర్యలు తీసుకుంటాం. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయం చేస్తాం. రేవతి భర్త భాస్కర్‌కు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం,’’ అన్నారు. శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగవుతోంది ‘‘శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మెరుగవుతోంది. వైద్యులు అత్యుత్తమ చికిత్స అందిస్తున్నారు. తాను త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నా,’’ అని ఆయన పేర్కొన్నారు. https://twitter.com/FilmyBowl/status/1871521244375572512 అదంతా దుష్ప్రచారమే ‘‘సంధ్య థియేటర్ ఘటన ఎవరూ కావాలని చేసిందేం కాదు. ఇది ఒక అపశ్రుతి. కానీ ఈ సంఘటనపై కొందరు దుష్ప్రచారం చేస్తుండడం బాధాకరం. ప్రభుత్వం చిత్ర పరిశ్రమను దూరం పెడుతోందనేది అసత్య ప్రచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని విధాలా సినీ పరిశ్రమకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. త్వరలోనే చిత్ర పరిశ్రమ ప్రతినిధులతో కలిసి సీఎం గారిని కలవాలని యోచిస్తున్నాం. ఎలాంటి సమస్యలు కలుగకుండా పరిశ్రమ కోసం పూర్తిస్థాయి ప్రయత్నం చేస్తాను,’’ అని దిల్‌ రాజు వెల్లడించారు.
    డిసెంబర్ 24 , 2024
    <strong>Zainab Ravdjee: అఖిల్ కాబోయే భార్య గురించి ఈ టాప్ 10 సీక్రెట్స్ తెలుసా?</strong>
    Zainab Ravdjee: అఖిల్ కాబోయే భార్య గురించి ఈ టాప్ 10 సీక్రెట్స్ తెలుసా?
    అక్కినేని అఖిల్‌ (Akkineni Akhil) త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. మంగళవారం (నవంబర్‌ 26) జైనాబ్‌ రవద్జీ (Zainab Ravdjee)తో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు అక్కినేని అభిమానులతో పాటు సినీ లవర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో జైనాబ్‌, ఆమె కుటుంబానికి సంబంధించి సమాచారంపై ఓ లుక్కేద్దాం.&nbsp; జైనాబ్‌ (Zainab Ravdjee) హైదరాాబాద్‌కు చెందిన యువతి. థియేటర్ ఆర్టిస్టుతో పాటు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఆమెకు మంచి పేరుంది.&nbsp; వాస్తవానికి ముంబయికి నేపథ్యమున్న కుటుంబంలో జైనాబ్‌ (Akkineni Akhil) జన్మించింది.&nbsp; హైదరాబాద్‌లోనే పుట్టి పెరగడంతో ఇక్కడి కల్చర్‌కు బాగా అలవాటు పడింది.&nbsp; భారత్‌తో పాటు విదేశాల్లోనూ ఆమె థియేటర్‌ ఆర్టిస్టుగా వర్క్‌ చేశారు. దుబాయి, లండన్‌లో ప్రత్యేక ప్రదర్శనలు చేసి ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు.&nbsp; జైనాబ్‌లో ఓ మంచి పెయింటింగ్‌ కళాకారిణి కూడా. 27 ఏళ్ల వయసులోనే హైదరాబాద్‌లో 'రిఫ్లెక్షన్‌' పేరుతో మెగా ఎగ్జిబిషన్‌ నిర్వహించి జైనాబ్‌ అందరి దృష్టిని ఆకర్షించింది.&nbsp; రెండేళ్ల క్రితం జైనాబ్‌తో అఖిల్‌కు పరిచయం అయినట్లు తెలుస్తోంది. తొలుత మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నారట. మనసులు కలవడంతో ప్రేమికులుగా మారేందుకు ఎక్కువ సమయం పట్టలేదని సమాచారం. జైనాబ్‌ తండ్రి జుల్ఫీ రవద్జీ (Julbi Ravdjee) ప్రముఖ వ్యాపారవేత్త. ‘జెడ్‌.ఆర్‌. రెన్యువబుల్‌ ఎనర్జీ’ (ZR Renewable Energy Pvt Ltd) కంపెనీ ఉంది. దీనితో పాటు పలు కంపెనీల్లో వాటాలు ఉన్నట్లు సమాచారం.&nbsp; https://twitter.com/IndianEmbRiyadh/status/1234249638309453824 జుల్బీ రవద్జీ ఏపీలోని గత వైకాపా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. జగన్‌కు సలహాదారుడిగా ఆయన వర్క్‌ చేశారు.&nbsp; https://twitter.com/iamkandula/status/1492733739038044160 మిడిల్‌ ఈస్ట్‌ దేశాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా జుల్ఫీ పని చేశారు. ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడంలో తనవంతు కృషి చేశారు.&nbsp; https://twitter.com/IndianEmbRiyadh/status/1670451101542371329 జైనాబ్‌ రవద్జీకి ఒక సోదరుడు ఉన్నాడు. అతడి పేరు జైన్‌ రవద్జీ. ప్రస్తుతం ‘జెడ్‌.ఆర్‌. రెన్యువబుల్‌ ఎనర్జీ’ (ZR Renewable Energy Pvt Ltd) కంపెనీకి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు.&nbsp; జైనాబ్‌ తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్‌ను ప్రైవేటులో ఉంచింది. దీంతో ఆమె వ్యక్తిగత ఫొటోలు, ఇష్టాఇష్టాలు, ఇతర సమాచారం ఎవరికీ తెలియడం లేదు. జుల్బీ రవద్జీతో అక్కినేని కుటుంబానికి మంచి రిలేషన్ ఉన్నట్లు తెలుస్తోంది. వారి మధ్య స్నేహబంధం ఉన్నట్లు టాక్ ఉంది.&nbsp; జైనాబ్‌కు స్కిన్‌ కేర్‌కు సంబంధించిన ఓ సంస్థ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 'వన్స్‌ ఆపన్‌ ది స్కిన్‌' పేరుతో ఓ పేజీ నడుపుతోంది.&nbsp; View this post on Instagram A post shared by OnceUponTheSkin (@onceupontheskin) ఆ స్కిన్‌ కేర్‌ పేజీ ద్వారా చర్మ రక్షణకు సంబంధించిన టిప్స్‌ను యూత్‌కు అందిస్తోంది. చర్మం కాంతివంతంగా మెరిసేందుకు సలహాలు, సూచనలు ఇస్తోంది.&nbsp; అఖిల్‌ - జైనాబ్‌ పెళ్లిపై ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. నాగచైతన్య - శోభితా దూళిపాళ్లతో పాటే వీరి పెళ్లి కూడా జరపాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.&nbsp;
    నవంబర్ 27 , 2024
    Payal Rajput: ఇండస్ట్రీలో పాయల్ రాజ్‌పుత్‌కు వేధింపులు.. నటి సెన్సేషనల్‌ పోస్టు!
    Payal Rajput: ఇండస్ట్రీలో పాయల్ రాజ్‌పుత్‌కు వేధింపులు.. నటి సెన్సేషనల్‌ పోస్టు!
    ఆర్‌ఎక్స్‌ 100 (RX100) చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్‌ దృష్టిని ఆకర్షించిన నటి 'పాయల్‌ రాజ్‌పుత్‌' (Payal Rajput). ఆ మూవీ తర్వాత పలు చిత్రాల్లో చేసినప్పటికీ ఈ అమ్మడికి ఆ స్థాయి సక్సెస్‌ రాలేదు. ఇటీవల ‘RX100’ డైరెక్టర్‌తో చేసిన 'మంగళవారం' సినిమాతో పాయల్‌ తెలుగు ఆడియన్స్‌ను మరోమారు పలకరించింది. ఇందులో పాయల్‌ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇదిలా ఉంటే ఇదిలా ఉంటే తాజాగా ఇండస్ట్రీలో తనకు వేధింపులు ఎదురవుతున్నాయంటూ ఆమె చేసిన ఓ పోస్టు.. అందరినీ షాక్‌కు గురిచేసింది. ప్రస్తుతం ఈ విషయం చిత్ర పరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; అసలు ఏ జరిగిందంటే! 2020లో 'రక్షణ' అనే చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్‌ నటించింది. అయితే ఈ సినిమా ఇప్పటివరకూ విడుదల కాలేదు. కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ప్రదీప్‌ ఠాకూర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని జూన్‌ 7న విడుదల చేయనున్నట్లు లేటెస్ట్‌గా మేకర్స్‌ ప్రకటించారు. అయితే ఈ మూవీకి సంబంధించిన పారితోషికం ఇంతరవకూ తనకు చెల్లించలేదని పైగా ప్రమోషన్స్‌లో పాల్గొనాలని మేకర్స్‌ వేధింపులకు గురిచేస్తున్నారంటూ పాయల్‌ సంచలన ఆరోపణలు చేసింది. ‘చట్టపరమైన చర్యలు తీసుకుంటా’ ‘రక్షణ’ మేకర్స్‌ వేధింపులపై నటి పాయల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘమైన పోస్టు పెట్టింది. దీని ప్రకారం.. ‘చిత్రబృందం ఇప్పటివరకు నాకు పారితోషికం ఇవ్వలేదు. ఇటీవల నా సినిమాలు సక్సెస్‌ కావడంతో దానిని ఉపయోగించుకోవాలని మూవీ టీమ్‌ భావిస్తోంది. ఎలాంటి బకాయిలు చెల్లించకుండా ప్రమోషన్లకు రావాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాలేనని నా టీమ్‌ చెప్పినా వినడం లేదు. నన్ను తెలుగు సినిమా నుంచి బ్యాన్‌ చేస్తామని బెదిరిస్తున్నారు. నా ప్రతిష్ఠకు భంగం కలిగేలా నా పేరును వాడుకుంటున్నారు. ఇటీవల జరిగిన కొన్ని మీటింగ్స్‌లో నాపై అభ్యంతరకరంగా మాట్లాడారు. పారితోషికం విషయం తేల్చకుండా.. నా అనుమతి లేకుండా సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. అందుకే నా టీమ్ ఆ చిత్రబృందంపై న్యాయపరమైన చర్చలు తీసుకునేందుకు సిద్ధమైంది’ అని పాయల్‌ తెలిపింది.&nbsp; View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) పాయల్‌ బిజీ బిజీ 'మంగళవారం' మూవీ సక్సెస్‌తో పాయల్‌ ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేస్తోంది. తమిళంలో 'గోల్‌మాల్‌', 'ఏంజెల్‌' చిత్రాల్లో పాయల్‌ నటిస్తోంది. తెలుగులో 'కిరాతక' సినిమాలో చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ ప్రొడక్షన్‌ దశలో ఉన్నాయి. కాగా, విడుదల సిద్ధంగా ఉన్న ‘రక్షణ’ మూవీలో పాయల్‌ పోలీసు అధికారిణిగా కనిపించనుంది.&nbsp;
    మే 20 , 2024
    Millie Bobby Brown: 19 ఏళ్లకే నటికి నిశ్చితార్థం.. బోరున విలపిస్తున్న నెటిజన్లు!
    Millie Bobby Brown: 19 ఏళ్లకే నటికి నిశ్చితార్థం.. బోరున విలపిస్తున్న నెటిజన్లు!
    బ్రిటన్‌కు చెందిన ప్రముఖ యువనటి మిల్లీ బాబీ బ్రౌన్‌ 19 ఏళ్ల వయసులో తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. జాక్ బొంగియోవితో తనకు మంగళవారం నిశ్చితార్థం కూడా జరిగినట్లు మిల్లీనే స్వయంగా ప్రకటించింది. మూడేళ్లుగా తాము ప్రేమలో ఉన్నామని పెళ్లి ద్వారా ఒకటి కాబోతున్నామని చెప్పుకొచ్చింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో రొమాంటిక్‌ పిక్చర్‌ను షేర్ చేసింది. అయితే జాక్‌, మిల్లీ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇప్పుడు అదే ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తమ పెళ్లి ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. View this post on Instagram A post shared by Millie Bobby Brown (@milliebobbybrown) మిల్లీ బాబీ బ్రౌన్‌… నెట్‌ఫ్లిక్స్‌ వెబ్‌సిరీసెస్‌లో నటించి చాలా ఫేమస్‌ అయింది. స్టేంజర్‌ థింగ్స్‌ సిరీస్‌ల ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇందులో ఆమె నటనకు గాను యాక్టర్స్‌ గిల్డ్‌ అవార్డు కూడా లభించింది. ఆ తర్వాత గాడ్జిల్లా, ఎనోలా హోమ్స్‌, గాడ్జిల్లా Vs కాంగ్‌, ఎనోలా హోమ్స్‌-2 వంటి చిత్రాల ద్వారా సినీ ప్రేక్షకులకు దగ్గరైంది. సినిమాలు వెబ్‌సిరీస్‌లో నటిస్తూనే పాటల ఆల్బమ్స్‌ చేస్తూ మిల్లీ వరల్డ్‌ ఫేమస్‌గా మారిపోయింది. ఈ తరం యువకుల కలల రాకుమారిగా కీర్తింప బడుతోంది. అటువంటి మిల్లీ వివాహ బందంలోకి అడుగు పెడుతుండంపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. 19 ఏళ్లకే పెళ్లి ఏంటంటూ వ్యంగ్యంగా మీమ్స్‌ పెడుతున్నారు. మిల్లీ వయసులో తాము ఏం చేసేవారమో చెబుతూ ఫన్నీ పోస్టులు పెడుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; 19 వయసుకే మిల్లీ బాబీ బ్రౌన్‌ పెళ్లి చేసుకోబోతోంది. కానీ, 24 ఏళ్లు ఉన్న నేను ఏమీ సాధించకుండా ఉండిపోయానని అర్థం వచ్చేలా నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ మేరకు అనన్య పాండేకు సంబంధించిన వీడియోను ట్రెండ్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1645971994192785410 19 ఏళ్ల మిల్లీ పెళ్లికి సిద్ధమైతే.. 23 ఏళ్ల తాను "Ee Sala cup namde" #RCB అని ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నానని ఓ నెటిజన్‌ పెట్టిన పోస్టు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.&nbsp; https://twitter.com/RakshanRak/status/1645857802722902017 19 ఏళ్ల వయసులో సమోసాలు తింటూ.. చట్నీ కోసం పోరాడేవాడినని ఓ నెటిజన్‌ పెట్టిన పోస్టు నవ్వులు పూయిస్తోంది.&nbsp; https://twitter.com/ayusharyan09/status/1645891008130084864 మిల్లీ బాబీ బ్రౌన్‌ కేవలం 19 ఏళ్లేనా అని ఆశ్యర్యపోతూ... సినిమా/వెబ్‌సిరీస్‌లో ఆమె చేసిన పాత్రలను ఓ నెటిజన్ పోస్టు చేశాడు.&nbsp; https://twitter.com/Mr_Stranger8/status/1645747169243332608 19 ఏళ్లకే మిల్లీ పెళ్లి పీటలు ఎక్కబోతుంటే తాను మాత్రం సోల్‌మేట్‌ కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నానని ఫీల్‌ అవుతూ నెటిజన్స్ పెట్టిన పోస్టులు తెగ ట్రెండింగ్ అవుతోంది. https://twitter.com/mukesh1yadav87/status/1646002836818501632 https://twitter.com/GunaPeram/status/1645842111236034560 https://twitter.com/i/status/1645915342185836544 మిల్లీ బాబీ బ్రౌన్‌కు 19 ఏళ్లు వచ్చేశాయా. చివరిసారిగా తనను ఓ చిన్నపిల్లగా చూసినట్లు గుర్తుందే అంటూ ఓ నెటిజన్‌ మిల్లీ చిన్నప్పటి ఫోటోను షేర్ చేశాడు.&nbsp; https://twitter.com/swaraj_gadge/status/1645848151117684738 19 ఏళ్ల మిల్లీ తెలివైనది, సక్సెస్‌ఫుల్‌, టాలెంటెడ్‌, ధనవంతురాలు, అందమైనది కూడా.. 20 ఏళ్ల నేను మాత్రం కాలేజీకి వెళ్లడానికి నిద్ర కూడా లేవలేకపోతున్నా అంటూ ఓ నెటిజన్ పెట్టిన వీడియో నవ్వులు పూయిస్తోంది.&nbsp; https://twitter.com/ggukksbae/status/1645829000483475457 19 ఏళ్లకే మిల్లీ ఎంగేజ్‌మెంట్ చేసుకుంటే.. 24 ఏళ్ల తాను బెడ్‌పై కూర్చొని బనాన చిప్స్‌ తింటూ మిల్ #She is 19 ట్రెండ్‌ చూస్తున్నట్లు రియా చోప్రా అనే యువతి పోస్టు పెట్టింది.&nbsp; https://twitter.com/riachops/status/1645835897773125633
    ఏప్రిల్ 12 , 2023
    <strong>Niharika Konidela: ‘ప్రాణం పోవడం పెద్ద విషయం’.. బన్నీపై నిహారిక షాకింగ్ కామెంట్స్‌!</strong>
    Niharika Konidela: ‘ప్రాణం పోవడం పెద్ద విషయం’.. బన్నీపై నిహారిక షాకింగ్ కామెంట్స్‌!
    హైదరాబాద్ సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు కారణమైన సంగతి తెలిసిందే. హీరో అల్లు అర్జున్ (Allu Arjun) కెరీర్‌లోనే మాయని మచ్చలాగా మిగిలిపోయింది. బన్నీ రాక నేపథ్యంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ్‌ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం (డిసెంబర్‌ 7) సికింద్రాబాద్‌ కిమ్స్‌కు వెళ్లిన బన్నీ ఆంక్షల మధ్య శ్రీతేజ్‌ను పరామర్శించారు. ఇదిలా ఉంటే మెగా డాటర్‌ నిహారిక కొణిదెల (Niharika Konidela) సంధ్యా థియేటర్‌ ఘటనపై తొలిసారి స్పందించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.  నిహారిక ఏమన్నదంటే.. కోలీవుడ్‌లో నిహారిక నటించిన ఫస్ట్‌ ఫిల్మ్ 'మద్రాస్‌ కారన్‌' రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మరో రెండ్రోజుల్లో జనవరి 10న ఈ మూవీ రిలీజ్‌ కానుంది. షాన్‌ నిగమ్‌ హీరోగా చేసిన ఈ చిత్రానికి వాలి మోహన్‌ దాస్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిహారిక ఓ ఇంటర్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా సంధ్యా థియేటర్‌ ఘటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సంధ్య థియేటర్‌ ఘటన నన్ను ఎంతో బాధించింది. ఇలాంటి ఘటనలను ఎవరూ ఊహించరు. మహిళ మృతి చెందడం బాధకరం. ప్రాణం కోల్పోవడం అనేది చాలా పెద్ద విషయం. నా హృదయం ముక్కలైంది. ఇలాంటి ఘటనలు ఎవరికీ జరగకూడదు. తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. మరోసారి ఇండస్ట్రీలో ఇలాంటి విషాదం చోటు చేసుకోవద్దని కోరుకుంటున్నా. ఈ దుర్ఘటన నుంచి అల్లు అర్జున్‌ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు’ అని నిహారిక చెప్పుకొచ్చింది.  https://twitter.com/pakkatelugunewz/status/1876916188577431653 ‘బన్నీ నుంచి ఎంతో నేర్చుకున్నా’ మెగా హీరోల నుంచి ఏమేమి నేర్చుకున్నారన్న ప్రశ్నలకు నిహారిక ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. అల్లు అర్జున్‌ గురించి మాట్లాడుతూ అతడి నుంచి ఎంతో నేర్చుకున్నట్లు చెప్పింది. ‘అల్లు అర్జున్‌ లుక్స్‌ పరంగా ఎంతో కేరింగ్‌ తీసుకుంటాడు. సినిమా సినిమాకు స్టైల్‌, లుక్‌ మార్చుకుంటాడు. ఈ విషయంలో బన్నీ నాకు ఇన్‌స్పిరేషన్‌’ అని నిహారిక తెలిపింది. సోదరుడు వరుణ్‌ తేజ్‌ గురించి మాట్లాడుతూ తన ప్రతీ సినిమాకు సైన్‌ చేసే ముందు అతడితో డిస్కస్‌ చేస్తానని చెప్పింది. అటు రామ్‌చరణ్‌తో చాలా సరదాగా ఉంటానని, ఇంటర్వ్యూల్లో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా వ్యవహరించాలి అన్నది ఆయన్ను చూసి నేర్చుకున్నట్లు నిహారిక చెప్పుకొచ్చింది.  నిహారిక.. రొమాంటిక్‌ సాంగ్‌ గుర్తుందా? కొద్ది రోజుల క్రితం నెట్టింట హల్‌చల్‌ చేసిన నిహారిక బోల్డ్ రొమాంటిక్‌ సాంగ్‌.. 'మద్రాస్‌ కారణ్‌' (Madras Kaaran) సినిమాలోనిదే. మణి రత్నం 'సఖి' సినిమాలో మాధవన్‌, షాలిని చేసిన 'నగిన నగిన' పాటకు రీమిక్స్‌గా ఆ సాంగ్‌ రూపొందింది. ఇందులో నిహారిక, షాన్‌ నిగమ్‌ మధ్య ముద్దు సన్నివేశాలు, బోల్డ్‌ - రొమాంటిక్‌ సీన్స్‌ ఉన్నాయి. నిహారిక ఆ స్థాయిలో రొమాన్స్‌ చేయడం అదే తొలిసారి. దీంతో ఆ తమిళ సాంగ్‌ నెట్టింట తెగ వైరల్ అయ్యింది. కొందరు నిహారిక ప్రదర్శనను ప్రశంసించగా ఎక్కువ మంది విమర్శించారు. అందరూ అభిమానించే మెగా ఫ్యామిలీకి ఇలాంటి బోల్డ్‌ సాంగ్‌లో చేయడం ద్వారా నిహారిక తలవొంపులు తెచ్చిందని ట్రోల్స్ చేశారు.  https://twitter.com/SivareddE/status/1865713969794806123 కోలీవుడ్‌లో గతంలోనే మెరిసినా నిహారిక.. 'మద్రాస్‌ కారణ్‌' (Madras Kaaran) చిత్రానికి వాలి మోహన్‌ దాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీ హీరోయిన్‌గా నిహారిక చేస్తోన్న ఫస్ట్‌ తమిళ చిత్రం. అయితే నటిగా మాత్రం ఆమెకు ఇది రెండో ఫిల్మ్‌. నిహారిక గతంలోనే ఓ తమిళ చిత్రంలో నటించింది. విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా చేసిన 'ఓరు నళ్లనాళ్‌ పాతు సోల్రెన్‌' చిత్రంలో నిహారిక కనిపించింది. 2018లో ఈ సినిమా విడుదలైంది. ఇక నిహారిక విషయానికి వస్తే ఆమె హీరోయిన్‌గా ‘ఒక మనసు’, ‘హ్యాపీ వెడ్డింగ్‌’, ‘సూర్యకాంతం’ చిత్రాలు చేసింది. ‘డార్లింగ్‌’, ‘కమిటీ కుర్రోళ్లు’ (ప్రొడ్యూసర్‌గా కూడా) చిత్రాల్లో క్యామియో ఇచ్చింది. ప్రస్తుతం 'మద్రాస్‌ కారణ్‌'తో పాటు తెలుగులో ‘వాట్‌ ద ఫిష్‌’ చిత్రంలో నిహారిక నటిస్తోంది. అలాగే నిర్మాతగాను రాణించేందుకు ప్రయత్నిస్తోంది. 
    జనవరి 08 , 2025
    <strong>Allu Arjun: అల్లు అర్జున్ వైద్య ఖర్చులు పెట్టలేదు.. ప్రభుత్వమే భరిస్తోంది: సీపీ</strong>
    Allu Arjun: అల్లు అర్జున్ వైద్య ఖర్చులు పెట్టలేదు.. ప్రభుత్వమే భరిస్తోంది: సీపీ
    'పుష్ప 2' (Pushpa 2) ప్రీమియర్స్‌ సందర్భంగా హైదరాబాద్‌ సంధ్యా థియేటర్‌లో తీవ్ర తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్‌ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి థియేటర్‌ యజమానులతో సహా అల్లు అర్జున్‌ను సైతం పోలీసులు అరెస్టు (sandhya theatre stampede case) చేశారు. ఆ మర్నాడు అల్లు అర్జున్‌ మధ్యంతర బెయిల్‌పై విడుదల కూడా అయ్యారు. అయితే ఈ ఘటన జరిగిన అనంతరం ఓ వీడియో రిలీజ్‌ చేసిన బన్నీ.. శ్రీతేజ్‌ వైద్య ఖర్చులు తాము భరిస్తారమని భరోసా కల్పించారు. ఈ క్రమంలో తాజాగా శ్రీతేజ్‌ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ బన్నీపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి.  సీపీ ఏమన్నారంటే సంధ్యా థియేటర్‌ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్‌ (9) ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటన జరిగినప్పటి నుంచి అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. వైద్యులు అతడికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం (డిసెంబర్‌ 17) హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌, హెల్త్‌ సెక్రటరీ డా. క్రిస్టీనాతో ఆస్పత్రిని సందర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సీపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఆ రోజు జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్‌ బ్రెయిన్‌కు డ్యామేజ్‌ జరిగింది. ఆక్సిజన్‌ అందక ఐపాక్సియా అనే బ్రెయిన్‌ డ్యామేజ్‌ స్జేజ్‌కి వెళ్లారు. రికవరీ కావడానికి టైమ్‌ పడుతుందని డాక్టర్లు చెప్పారు. వెంటిలేటర్‌ సపోర్ట్‌తో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ఈ చికిత్స సుదీర్ఘంగా సాగే అవకాశముంది' అని చెప్పారు. అల్లు అర్జున్‌ టీమ్‌ చికిత్స ఖర్చు భరిస్తుందా? అని ఓ జర్నలిస్టు ప్రశ్నించగా 'ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరిస్తోంది’ అంటూ సీపీ సమాధానం ఇచ్చారు.  https://twitter.com/NtvTeluguEnt/status/1869019199290659067 https://twitter.com/revathitweets/status/1868989039027921387 బన్నీపై నెటిజన్ల విమర్శలు.. వైద్య ఖర్చులు తామే భరిస్తామని బన్నీ ప్రకటించి కూడా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఘటనకు కారణమైనందున శ్రీతేజ్‌ వైద్య ఖర్చులు పెట్టుకోవాల్సిన బాధ్యత బన్నీకి ఉందని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం వైద్య ఖర్చులు ఎందుకు భరించాలని నిలదీస్తున్నారు. ఆ డబ్బు ప్రజలదని, తప్పు మీరు చేసి ఆ భారం తమపై మోపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అటు కాంగ్రెస్‌ వర్గాలు సైతం బన్నీ వీడియోను, సీపీ కామెంట్స్‌ను పక్క పక్కన పెట్టి వీడియోలను ట్రెండింగ్ చేస్తున్నాయి. అయితే అల్లు అర్జున్‌ను కావాలని బదనామ్‌ చేస్తున్నారని బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వైద్య ఖర్చులు భరిస్తానని బన్నీ చెప్పాడని ఆస్పత్రి బిల్స్‌ చూపిస్తే గాని తాము నమ్మమని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/AapannaHastham/status/1869034820879155677 బాధితుల వెర్షన్‌ ఏంటంటే సీపీ ఆనంద్‌ చేసిన కామెంట్స్‌ను ఖండిస్తూ అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ మరో వీడియోను వైరల్ చేస్తున్నారు. మృతురాలు రేవతి భర్త, శ్రేతేజ్‌ తండ్రి భాస్కర్‌ ఓ మీడియాకు ఇచ్చిన బైట్‌ను ట్రెండింగ్‌ చేస్తున్నారు. అందులో మూవీ టీమ్‌ తమను సంప్రదించినట్లు భాస్కర్‌ స్పష్టం చేశారు. 'మైత్రీ మూవీ ప్రొడ్యూసర్స్‌ రవి సార్, బన్నీ వాసు సార్ వచ్చారు. ఆస్పత్రి డాక్టర్లతో మాట్లాడారు. ఏ సమస్య ఉన్నా తాము కేర్‌ తీసుకుంటామని హాస్పిటల్ ఇన్‌ఛార్జ్‌తో చెప్పారు. బాబు గురించి ఆందోళన వద్దని, తాము చూసుకుంటామని నాకు భరోసా ఇచ్చారు. మా తరపున బాబుకి సపోర్ట్‌ ఉంటుందని, శ్రీతేజ్‌ కోలుకోవాలని ప్రార్థించమని అన్నారు’ అని భాస్కర్‌ స్పష్టం చేశారు. అయితే ఈ బైట్ తొక్కిసలాట జరిగిన ఒక రోజు గ్యాప్‌తో (డిసెంబర్‌ 6) రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే బన్నీ టీమ్‌ రంగంలోకి దిగిందని ఫ్యాన్స్‌ అంటున్నారు.  https://twitter.com/PavanBaipalli/status/1869074646165016770
    డిసెంబర్ 18 , 2024
    <strong>Manchu Manoj: తండ్రి చేసిన తప్పెంటో చెప్పేసిన విష్ణు.. కంటతడి పెట్టిన మనోజ్‌</strong>
    Manchu Manoj: తండ్రి చేసిన తప్పెంటో చెప్పేసిన విష్ణు.. కంటతడి పెట్టిన మనోజ్‌
    మంచు మోహన్‌ బాబు కుటుంబం (Manchu Family)లో చెలరేగిన వివాదం రోజు రోజుకి ముదిరి పాకాన పడుతోంది. గంటకో మలుపు తిరుగుతూ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు తావిస్తోంది. మోహన్‌ బాబు (Mohan Babu), మంచు మనోజ్‌ (Manchu Manoj) మధ్య రాజుకున్న వివాదంలో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. తొలుత ఆస్తుల వ్యవహారంలా కనిపించినా రోజులు గడుస్తున్న కొద్ది కుటుంబంలోని మరిన్ని లొసుగులు వెలుగు చూస్తున్నాయి. పరస్పరం ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం, ఫ్యామిలీ గొడవలు ప్రస్తావిస్తూ లేఖలు విడుదల చేయడం, ప్రెస్‌మీట్‌లు పెట్టి ఒకరినొకరు విమర్శించుకోవడం, మీడియాపై మోహన్‌ బాబు దాడి ఇలా వరుస ఘటనలతో మంచు లొల్లి తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారుతోంది.&nbsp; మోహన్‌ బాబు హెల్త్‌ బులెటిన్‌ మంగళవారం రాత్రి ఘర్షణ అనంతరం మోహన్‌బాబు అస్వస్థకు గురై ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌ కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు తాజాగా హెల్త్‌ బులెటిన్‌ రిలీజ్‌ చేశారు. 'డిసెంబర్ 10న రాత్రి 8 30 గంటలకు మోహన్ బాబు గారిని హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. బాడీ పెయిన్స్, యాంగ్జైటీతో సృహలేని స్థితిలో ఆయన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హుటాహుటిన ఆయకు ఎమర్జెనీ వైద్యాన్ని అందించాం.. ఆయన ఎడమ కంటి కింద గాయం అయింది.. రక్తపోటు చాలా పెరిగింది.. హార్ట్ రేట్ కూడా చాలా ఎక్కువగా పెరిగింది.. తగిన చికిత్సను అందించాం.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిమితంగానే ఉంది' అని వైద్యులు తెలిపారు. https://twitter.com/Hyderabad_Mail/status/1866749374581313939 రచ్చ పెట్టుకుంటే గెలవలేరు: విష్ణు కుటుంబంలో చెలరేగిన వివాదం నేపథ్యంలో మంచు విష్ణు (Manchu Vishnu) తాజాగా ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ క్రమంలో మంచు మనోజ్‌ చేస్తోన్న ఆరోపణలు గురించి మీడియా ప్రతినిధులు వివరణ కోరారు. అయితే ఫ్యామిలీ విషయాల గురించి తాను స్పందించనని విష్ణు తేల్చిచెప్పారు. కానీ, ఆత్మ గౌరవ పోరాటమంటూ మనోజ్‌ చేసిన వ్యాఖ్యలపై విష్ణు స్పందించాడు. ‘ప్రేమతో గెలవాల్సింది.. రచ్చ పెట్టుకుంటే ఎవరు గెలవలేరండి’ అంటూ చెప్పుకొచ్చాడు. మీరు మనోజ్‌ను శత్రువుగా చూస్తున్నారన్న ప్రశ్నపై ‘దాని గురించి చెప్పేదేమి లేదండి. ఇమ్మెచ్యూర్‌గా ఫ్యామిలీ గురించి తను మాట్లాడొచ్చు. చిన్నవాడిగా అవగాహన లేకుండా ఏదైనా చెప్పవచ్చు. మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఫ్యామిలీ గురించి మాట్లాడను’ అని అన్నాడు.&nbsp; https://twitter.com/10TvTeluguNews/status/1866746906011111783 మా నాన్న చేసిన తప్పు అదే: విష్ణు తాజా ప్రెస్‌ మీట్‌లో మంచు మనోజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మా నాన్న చేసిన పెద్ద తప్పు ఏదైన ఉందంటే అది ముగ్గురు పిల్లలను ఎక్కువగా ప్రేమించడమేనని అన్నారు. 'ఫిల్మ్ ఇండస్ట్రీ మా కుటుంబం. ఇండస్ట్రీలో ఉన్నవారందరికీ ఇది తెలుసు. మీడియాకు నాదొక రిక్వెస్ట్‌. మీకు ఫ్యామిలీస్‌ ఉన్నాయి.. ఫాదర్స్‌ ఉన్నారు. ఏ కుటుంబం పర్ఫెక్ట్‌గా ఉండదు. పెద్దలంటారు ఫ్యామిలీస్ ఆర్‌ కాంప్లికేటెడ్ అని. నేననుకున్నా నా ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందని, కలిసిమెలిసి ఉంటామని అనుకున్నాం. అన్‌ఫార్చ్యునేట్‌గా ఇలా ప్రెస్‌ మీట్‌ పెట్టాల్సి వస్తది, ఇలా మాట్లాడాల్సి వస్తది, ఇలాంటి పరిస్థితి నా ఫ్యామిలీకి వస్తదని ఎప్పుడు ఊహించలేదు’ అని విష్ణు అన్నారు.&nbsp; https://twitter.com/abntelugutv/status/1866750818646626628 ‘నాన్నను&nbsp; క్షమించండి’ మంగళవారం రాత్రి జర్నలిస్టుపై మోహన్‌ బాబు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా మంచు విష్ణు స్పందించారు. 'జర్నలిస్టుపై దాడి విచారకరం. జర్నలిస్ట్‌పై దాడిని ఖండిస్తున్నా. మా నాన్న తప్పు చేసుంటే క్షమించాలి. ఆయన మీడియాతో చాలా గౌరవంగా ఉంటారు. తరాలుగా మా నాన్న అంటే ఏంటో అందరికీ తెలుసు. సమాజంలో ఎవరూ పర్‌ఫెక్ట్‌ కాదు. ఉమ్మడి కుటుంబంలో కొన్ని గొడవలు వచ్చాయి. చివరికి అన్నీ సర్దుకుంటాయని అనుకుంటున్నా. నిన్నటి దాడిలో నాన్నకు గాయాలయ్యాయి. గొడవలతో మా అమ్మ ఆస్సత్రి పాలైంది. గేట్లు పగలగొట్టి మనోజ్‌ ఇంట్లోకి వచ్చాడు’ అని విష్ణు అన్నారు. కంటతడి పెట్టిన మనోజ్‌.. మంచు విష్ణు కంటే ముందు సోదరుడు మనోజ్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించి పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో కంటతడి పెట్టి బావోద్వేగానికి గురయ్యారు.‘నా కుటుంబ సభ్యులను ఏమీ అడగలేదు. ఇంట్లో వాళ్ల ఆదాయం మీద ఆధారపడలేదు. సొంతకాళ్లపై పనిచేసుకుంటున్నాను.  ఆస్తికోసం మా నాన్నతో గొడవ పడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. మా నాన్న దేవుడు.. కానీ.. ఈరోజు చూస్తున్నది మా నాన్నను కాదు. ఇవాళ పోలీసుల విచారణకు హాజరవుతాను. నేను ఎవరిపై దాడి చేశానో సీసీ కెమెరాల దృశ్యాలు చూపించండి. పోలీసుల విచారణ తర్వాత మిగతా విషయాలు వెల్లడిస్తా’ అని మనోజ్‌ వ్యాఖ్యానించారు. https://twitter.com/swetchadaily/status/1866744650738044980 'అందుకే ఇంటికి వచ్చా'.. కొంతమంది బంధువులు, నాన్న సన్నిహితుల సూచనతో ఈ ఇంటికి వచ్చానని మనోజ్‌ తెలిపారు. ‘ఎన్నో ఏళ్లుగా బయట ఉంటున్నావు. ఇంట్లో అమ్మానాన్న మాత్రమే ఉన్నారు. మీ అన్న ఫ్యామిలీతో దుబాయ్‌కు షిఫ్ట్‌ అయ్యాడు. నీ భార్య గర్భవతిగా ఉంది. ఆమెకు తల్లిదండ్రులు లేరు. ఈ సమయంలో నీ భార్యకు మీ తల్లి, పెద్దవాళ్ల అవసరముంది. ఒక్కడివే ఎలా చూసుకుంటావు?’ అని వారు నాతో అన్నట్లు చెప్పారు. తన భార్య కూడా వారిని సమర్థించి..&nbsp; మాట వినాలని కోరడంతో ఈ ఇంటికి తిరిగి వచ్చానని వివరించారు.&nbsp; ‘అన్న కోసం గొడ్డులా పనిచేశా’ తనపై చాలా ఆరోపణలు చేస్తున్నారని మంచు మనోజ్‌ అన్నారు. ‘దీనికి నేనేమీ చెప్పలేను. ఆధారాలు మాత్రమే చూపించగలను. నేనెప్పటినుంచో కూర్చొని మాట్లాడదామన్నాను. ప్రేమించిన అమ్మాయిని పెళ్లిచేసుకున్నాను. ఆమె కోసం పోరాడాను. అందులో తప్పేముంది? పది మంది కోసం నిలబడినందుకు నేను చెడ్డవాడిని అయ్యాను. ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ చేశాను. రమ్మంటే వచ్చాను.. పొమ్మంటే పోయాను. ఎన్ని సినిమాలు చేయమంటే అన్ని చేశాను. అన్న కంపెనీల్లో పనిచేశాను. గొడ్డులా కష్టపడ్డాను. మనస్ఫూర్తిగా, సంతోషంగా చేశాను. ఏ రోజూ ఒక్క రూపాయి అడిగింది లేదు.. ఆశించింది లేదు’ అని అన్నారు.&nbsp; https://twitter.com/abntelugutv/status/1866742963445043239
    డిసెంబర్ 11 , 2024
    <strong>Pushpa 2: పుష్ప బ్రాండ్‌తో పాప్‌కార్న్స్‌, కూల్‌ డ్రింక్స్‌.. ఫొటోలు వైరల్</strong>
    Pushpa 2: పుష్ప బ్రాండ్‌తో పాప్‌కార్న్స్‌, కూల్‌ డ్రింక్స్‌.. ఫొటోలు వైరల్
    ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా పుష్ప 2 (Pushpa 2) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్‌ (Sukumar) తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్‌ కావడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్‌ 5న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. అటు ఓవర్సీస్‌లోనూ పుష్ప ప్రమోషన్స్‌ వినూత్నంగా నిర్వహించేందుకు థియేటర్స్‌ యజమానులు రెడీ అయ్యారు.&nbsp; నెల రోజుల్లో పుష్పగాడి రాక 'పుష్ప 2' రిలీజ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో మూవీ అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సడెన్‌గా కొత్త పోస్టర్‌ రిలీజ్‌ చేసి పుష్ప టీమ్ అందరినీ సర్‌ప్రైజ్‌ చేసింది. సినిమా విడుదలకు సరిగ్గా నెల రోజుల సమయం ఉండటంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం (నవంబర్‌ 5) సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో పుష్పరాజ్‌ (అల్లు అర్జున్‌), భన్వర్‌సింగ్ షెకావత్‌ (ఫహద్‌ ఫాజిల్‌) ఎదురెదురుగా నిలబడి ఉన్నారు. అంతేకాదు, త్వరలోనే ట్రైలర్‌ను (pushpa 2 trailer) కూడా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.&nbsp; https://twitter.com/PushpaMovie/status/1853694508623683871 గ్రాండ్‌గా ట్రైలర్‌ లాంచ్‌! ‘పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫైరు’ అంటూ వచ్చిన పుష్ప ట్రైలర్‌ అప్పట్లో ఎంత ట్రెండ్‌ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అంతకుమించిన స్థాయిలో ట్రైలర్‌ కట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో వారం, పది రోజుల్లోనే ట్రైలర్‌ను తీసుకొచ్చేలా కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలైన పాట్నా, కొచ్చి, చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌లో ఓకేసారి ట్రైలర్ విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిసింది. ఈనెల 15న ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. సినిమా విడుదలకు కనీసం రెండు వారాల ముందు ట్రైలర్‌ విడుదల చేస్తే ప్రేక్షకుల్లో మరింత హైప్‌ను క్రియేట్‌ చేయోచ్చని మేకర్స్‌ భావిస్తున్నట్లు తెలిసింది. పాప్‌కార్న్‌ డబ్బాలతో ప్రమోషన్స్‌ ‘పుష్ప2’ విడుదలకు సరిగ్గా 30 రోజులు మాత్రమే ఉండటంతో అటు విదేశాల్లోనూ ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా అమెరికాలోని థియేటర్స్‌లో వినూత్న ప్రచారాన్ని మొదలు పెట్టారు.&nbsp; పుష్ప బ్రాండ్‌ పాప్‌కార్న్‌ టబ్స్‌, కూల్ డ్రింక్ బాటిల్స్‌ను&nbsp; యూఎస్‌లోని అన్ని థియేటర్స్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నవంబరు 13న విడుదలయ్యే ‘కంగువా’ ప్రీమియర్స్‌తో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకూ ఏ ఇండియన్ సినిమా&nbsp; ఇలాంటి ప్రత్యేక ప్రమోషన్‌ చేయలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్&nbsp; మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పుష్ప 2 టీమ్‌ వీటికి సంబంధించిన ఫొటోలను ఎక్స్‌లో పంచుకోవడం విశేషం.&nbsp; https://twitter.com/RegalMovies/status/1853467449280082009 ఈనెల 6 నుంచి ఐటెం సాంగ్‌ షూట్‌! ‘పుష్ప’ మూవీ పాటలు ఎంత పెద్ద హిట్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినిమాలోని ‘ఊ అంటావా ఊ ఊ&nbsp; అంటావా’ అనే ఐటెం సాంగ్‌ దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ పాటలో సమంత తన అందంతో మెస్మరైజ్‌ చేసింది. బన్నీ-సామ్‌ కలిసి వేసిన స్టెప్స్‌ యువతరాన్ని ఉర్రూతలూగించాయి. దీంతో ‘పుష్ప2’ లోనూ ఆ తరహా ఐటెం సాంగ్ ఉండాలని డైరెక్టర్‌ సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్ల పేర్లు బయటకు రాగా ఫైనల్‌గా యంగ్‌ బ్యూటీ శ్రీలీలను ఫైనల్‌ చేసినట్లు తెలుస్తోంది. నవంబర్‌ 6 నుంచి సాంగ్ షూట్‌ కూడా మెుదలు కానున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే శ్రీలీల డ్యాన్స్‌కు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. గుంటూరుకారం సినిమాలో సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో కలిసి చేసిన ఐటెం సాంగ్ ఎంత ప్రజాదారణ పొందిందో అందరికి తెలిసిందే. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన బన్నీ, ఈ కుర్ర హీరోయిన్‌తో ఏ స్థాయిలో స్టెప్పులు ఇరగదీస్తాడోనని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే చర్చించుకుంటున్నారు.&nbsp; ‘పుష్ప 3’ పక్కా ‘పుష్ప 2’కి కొనసాగింపుగా మూడో పార్ట్‌ కూడా ఉంటుందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. హీరో అల్లు అర్జున్‌, డైరెక్టర్‌ సుకుమార్ సైతం మూడో పార్ట్‌ గురించి పలుమార్లు హింట్స్ ఇచ్చారు. ఈ క్రమంలో ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత రవి శంకర్ ‘పుష్ప 3’ కచ్చితంగా ఉంటుందని అధికారిక ప్రకటన చేశారు. పార్ట్‌ 3 కి సంబంధించి సాలిడ్‌ లీడ్‌ తమకు దొరికిందని, కాబట్టి కచ్చితంగా 'పుష్ప 3' ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. అయితే పార్ట్‌ 3ని ఎప్పుడు పట్టాలెక్కిస్తారన్న అంశంపై మాత్రం నిర్మాత రవిశంకర్ స్పష్టమైన కామెంట్స్‌ చేయలేదు.&nbsp; పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్‌తో కలిసి బన్నీ ఓ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నాడు. అటు సుకుమార్‌ సైతం రామ్‌చరణ్‌తో సినిమాను అనౌన్స్‌ చేశారు. ఆ ప్రాజెక్ట్‌లు పూర్తైన తర్వాత ‘పుష్ప 3’ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.&nbsp; https://twitter.com/i/status/1849383805657690194
    నవంబర్ 05 , 2024
    Ram Charan: రామ్‌చరణ్‌ వరల్డ్ రికార్డ్‌.. బ్రిటన్‌ రాణి తర్వాత మనోడే!
    Ram Charan: రామ్‌చరణ్‌ వరల్డ్ రికార్డ్‌.. బ్రిటన్‌ రాణి తర్వాత మనోడే!
    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్‌గా మారారు. ‘RRR’ బ్లాక్‌ బాస్టర్ తర్వాత అతడు చేసిన ‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే చరణ్‌ ఇటీవల రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేశాడు. అంబానీ ఇంట వివాహానికి సైతం ఈ కారులోనే వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ఈ కారు రిజిస్టేషన్‌కు చరణ్ స్వయంగా వెళ్లారు. ఈ కారుకు సంబంధించిన నెంబర్‌ ప్లేట్ సైతం నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; ఫ్యాన్సీ నెంబర్ ఇదే! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ (Rolls Royce Car) కారును కొనుగోలు చేశారు. ఆ కారుకు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా రవాణాశాఖ ‘TG 09 C 2727’ నెంబర్‌ను కేటాయించింది. ఆ వాహనం రిజిస్ట్రేషన్ కోసం మంగళవారం ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ సెంట్రల్ జోన్ ఆఫీసుకు వచ్చారు. ఆయన రాకతో ఆఫీసులో సందడి నెలకొంది. అభిమానులు సెల్ఫీలు దిగారు. రవాణాశాఖ అధికారులు, సిబ్బంది సైతం కలిశారు. ఫొటోలు దిగారు. వాహన రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతో వెళ్లిపోయారు. https://twitter.com/i/status/1848718642428711223 ఎన్నికోట్ల ఖర్చంటే! చరణ్‌ రోల్స్ రాయిస్ కారును రూ.7.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా చరణ్‌ ఏరి కోరి మరి ‘TG 09 C 2727’ ఫ్యాన్సీ నెంబర్‌ను కారుకు ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం రూ.10-20 లక్షల వరకూ రుసుము చెల్లించినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పటికే చరణ్‌ దగ్గర చాలా కార్లే ఉన్నాయ్‌. ఇప్పుడు ఆ చెర్రీ గ్యారేజ్‌లోకి మరో కారు వచ్చి చేరింది. కాగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా రోల్స్‌ రాయిస్‌ కారునే వినియోగిస్తున్నారు. అలాగే పలువురు సెలబ్రిటీస్‌ దగ్గర కూడా ఈ కారు ఉంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌ కారుకి సంబంధించిన ఫ్యాన్సీ నెంబర్‌ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1811294194205425882 రామ్‌చరణ్‌ అరుదైన ఘనత సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌లో రామ్‌చరణ్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. చరణ్‌తో పాటు ఆయన పెంపుడు శునకం ‘రైమ్‌’ విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల వీటికి సంబంధించిన కొలతలను సైతం మ్యూజియం ప్రతినిధులు తీసుకున్నారు. అయితే బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ - 2 కూడా గతంలో తన పెంపుడు జంతువుతో మైనపు విగ్రహంగా కనిపించారు. ఆమె తర్వాత చరణ్‌ మాత్రమే తన పెట్‌ డాగ్‌తో మైనపు విగ్రహంగా కనిపించబోతున్నాడు. ఈ అరుదైన ఘనత సాధించిన తొలి సెలబ్రిటీగా రామ్‌చరణ్‌ నిలిచాడు. ‘రైమ్ నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది. నా వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని మిళితం చేస్తూ ఈ విగ్రహం రూపుదిద్దుకోవడం ప్రత్యేకంగా భావిస్తున్నాను’ అని చరణ్‌ అన్నారు. https://twitter.com/Nilzrav/status/1840120654193897699 రికార్డు ధరకు ఓటీటీ హక్కులు! రామ్‌చరణ్‌ లేటెస్ట్‌ ప్రాజెక్ట్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ రూ.110 కోట్లకు గేమ్‌ ఛేంజర్‌ స్ట్రీమింగ్‌ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. కేవ‌లం సౌత్ లాంగ్వేజెస్ డిజిట‌ల్ రైట్స్ కోస‌మే అమెజాన్‌ ఇంత మెుత్తాన్ని ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. హిందీ డిజిట‌ల్ రైట్స్‌ను మ‌రో ఓటీటీ సంస్థ‌కు అమ్మేందుకు మేక‌ర్స్ ప్ర‌య‌త్నాలు చేస్తోన్న‌ట్లు తెలిసింది. మొత్తంగా ఓటీటీ ద్వారానే మేక‌ర్స్‌ రూ.150 కోట్ల మేర సొమ్ము చేసుకునే పరిస్థితులు ఉన్నాయని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 'గేమ్‌ ఛేంజర్‌' రిలీజ్‌కు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ అంత పెద్ద మెుత్తంలో ఓటీటీ హక్కులు అమ్ముడుపోవడం మాములు విషయం కాదని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
    అక్టోబర్ 23 , 2024
    <strong>Devara Promotions: దేవర ప్రమోషన్స్‌ సరైన దారిలో వెళ్లడం లేదా? టాలీవుడ్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారా?</strong>
    Devara Promotions: దేవర ప్రమోషన్స్‌ సరైన దారిలో వెళ్లడం లేదా? టాలీవుడ్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారా?
    మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ తారక్‌ హీరోగా, స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'దేవర'పై పాన్‌ ఇండియా స్థాయిలో బజ్‌ ఏర్పడింది. 'ఆర్‌ఆర్‌ఆర్‌' వంటి గ్లోబల్‌ హిట్‌ తర్వాత తారక్‌ నటించిన మూవీ కావడంతో తారక్‌ ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్‌ కూడా ‘దేవర’ కోసం తెగ ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్‌ 27న ఈ చిత్రం రిలీజ్‌ కానుండటంతో దేవర టీమ్‌ మూవీ ప్రమోషన్స్‌తో బిజీ బిజీగా గడుపుతోంది. అయితే నార్త్‌పైనే తారక్‌ &amp; కో ఫోకస్‌ పెట్టడంతో తెలుగు ఆడియన్స్‌లో అసంతృప్తికి కారణమవుతోంది. దేవర నుంచి ఇప్పటివరకూ వచ్చిన ఏ ప్రమోషన్ ఈవెంట్‌ అయినా ఒక్కటీ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి రాలేదు. దీంతో టాలీవుడ్‌ను నిర్లక్ష్యం చేస్తూ దేవర టీమ్ తప్పుచేస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.&nbsp; చెన్నై ప్రమోషన్స్‌పై ట్రోల్స్‌ పాన్​ ఇండియా స్టార్​​ ఎన్టీఆర్​​ హీరోగా స్టార్​​ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'దేవర'. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్‌ మంగళవారం (సెప్టెంబర్‌ 17) చెన్నైలో ల్యాండ్‌ అయ్యింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో తారక్‌తో పాటు హీరోయిన్‌ జాన్వీ కపూర్‌, డైరెక్టర్‌ కొరటాల శివ, సంగీత దర్శకుడు అనిరుధ్‌, తమిళ నటుడు కలైయరసన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తారక్‌ మాట్లాడుతూ తమిళ దర్శకుడు వెట్రిమారన్‌తో సినిమా చేయాలని ఉందని తన మనసులో మాట పంచుకున్నారు. ఇది తమిళ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నప్పటికీ తెలుగు సినిమా లవర్స్‌ మాత్రం ఫీలవుతున్నారు. తారక్‌ వంటి స్టార్‌ హీరో తనతో సినిమా చేయమని ఓ తమిళ డైరెక్టర్‌ను రిక్వెస్ట్‌ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తారక్‌ తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారని ట్రోల్స్‌ చేస్తున్నారు.&nbsp; కపిల్ శర్మ షోలో దేవర టీమ్‌! దేవర టీమ్‌ ముంబయిలోనూ గత కొన్ని రోజులుగా వరుస ప్రమోషన్స్‌ నిర్వహిస్తూ సినిమాపై హైప్‌ పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా దేశంలోనే ఎంతో పాపులర్ అయిన ‘కపిల్‌ శర్మ సీజన్‌ 2’ షోలో తారక్‌ పాల్గొన్నాడు. బాలీవుడ్‌లో ఎంత పెద్ద తోపు హీరో అయిన ‘కపిల్ శర్మ షో’లో పాల్గొనాల్సిందే. ఆ షోకు ప్రాంతాలకు అతీతంగా ఫ్యాన్స్‌ ఉన్నారు. దీంతో ఆ షోకు వెళ్తే తమ చిత్రాలకు కావాల్సినంత ప్రమోషన్స్ వస్తాయని బాలీవుడ్ స్టార్స్ భావిస్తుంటారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' ప్రమోషన్స్‌ సమయంలోనూ రాజమౌళి, తారక్‌, రామ్‌చరణ్‌ ఈ షోలో పాల్గొని సందడి చేశారు. ఈ క్రమంలోనే తాజాగా తారక్‌ మరోమారు దేవర కోసం ఆ షోలో అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజై ఆకట్టుకుంటోంది. ఈ షోలో తారక్‌తో పాటు జాన్వీ కపూర్‌, అలియా&nbsp; భట్‌, సైఫ్‌ అలీఖాన్‌ తదితురులు పాల్గొన్నారు. టీమ్ ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ &amp; కో కూడా ప్రోమోలో కనిపించడం గమనార్హం. ఈ ఎపిసోడ్‌ సెప్టెంబర్‌ 21న రాత్రి 8 గం.లకు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లోకి రానుంది. https://twitter.com/NetflixIndia/status/1834826983017976063 హిందీ బిగ్‌బాస్‌ 18లో తారక్‌? హిందీలో బిగ్‌ బాగ్‌&nbsp; షోకు చాలా పాపులారిటీ ఉంది. త్వరలోనే సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా బిగ్‌బాస్‌ హిందీ సీజన్‌ 18 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దేవర టీమ్‌ బిగ్‌బాస్‌కు వెళ్లి తమ సినిమాను ప్రమోట్‌ చేసుకోనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. దీనిపై దేవర టీమ్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే నార్త్‌లో సినిమా ప్రమోషన్స్‌కు ఏ చిన్న అవకాశం దొరికిన తారక్‌ &amp; కో ఏమాత్రం వదులుకోవడం లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇదిలా ఉంటే అక్టోబర్‌ 4 నుంచి బిగ్‌బాస్‌ 18 స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తోంది. అప్పటికే దేవర రిలీజై ఉంటుంది. మరి దేవర టీమ్‌ హిందీ బిగ్‌బాస్‌లోకి వెళ్తుందో లేదో చూడాలి.&nbsp; యానిమల్‌ డైరెక్టర్‌తో ఇంటర్యూ దేవర టీమ్‌ను యానిమల్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాతో ఇటీవల ఇంటర్యూ చేశారు. ఇందులో తారక్‌తో పాటు డైరెక్టర్‌ కొరటాల శివ, సైఫ్‌ అలీఖాన్‌, జాన్వీ కపూర్‌ పాల్గొన్నారు. ఈ చిట్‌ చాట్‌ చాలా ఫన్నీగా సాగింది. ఇందులో సందీప్‌ పలు ఆసక్తికర ప్రశ్నలను దేవర టీమ్‌కు సంధించారు. దానికి తనదైన శైలిలో జాన్వీ, తారక్‌ బదులిచ్చారు. తారక్‌ మాట్లాడుతూ దేవర యాక్షన్‌ డ్రామా అని, మాస్‌ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుందని చెప్పారు. మరోవైపు చాలా సంవత్సరాలుగా తారక్‌, నేను మంచి స్నేహితులమని శివ కొరటాల తమ బాండింగ్‌ గురించి చెప్పారు. 35 రోజులు అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌ చేసినట్లు ఎన్టీఆర్‌ చెప్పగా, ‘దేవర’ అందరి కెరీర్‌లో బెస్ట్‌ మూవీ అవుతుందని జాన్వీ అన్నారు. ఈ సినిమా రన్‌ టైమ్‌ పై సందీప్‌ సరదాగా కామెంట్‌ చేశారు. దానికి తారక్‌ యానిమల్‌ రన్‌ టైమ్‌ ఎంత అని అడగగా 3 గంటల 24 నిమిషాలని నవ్వుతూ సందీప్‌ రెడ్డి వంగా చెప్పారు. అయితే సందీప్‌ రెడ్డి వంగా తెలుగు డైరెక్టర్ అయినప్పటికీ ఇంటర్యూలో అంతా ఇంగ్లీషులో సాగడంతో తెలుగు ప్రేక్షకులు ఓన్‌ చేసుకోలేకపోతున్నారు. పూర్తి ఇంటర్యూ కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి.&nbsp; https://www.youtube.com/watch?v=EzNPma48bVM మరి టాలీవుడ్‌ ప్రమోషన్స్‌ ఎక్కడా? గత కొన్ని రోజులుగా ‘దేవర’ టీమ్‌ ఫోకస్‌ మెుత్తం బాలీవుడ్ పైనే ఉంది. అక్కడ సినిమాను బాగా ప్రమోట్‌ చేయగలిగితే వసూళ్లు గణనీయంగా ఉంటాయని టీమ్‌ భావిస్తూ ఉండవచ్చు. ఈ నేపథ్యంలో సినిమాకు కీలకమైన ట్రైలర్‌ను కూడా ముంబయిలోనే రిలీజ్‌ చేశారు. అదే సమయంలో తెలుగులోనూ పార్లర్‌గా దేవర ప్రమోషన్స్‌ నిర్వహిస్తే బాగుండేదన్న కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. తెలుగులో తారక్‌ స్టార్‌ హీరో ఇమేజ్‌ ఉన్న నేపథ్యంలో ఎలాగైన మంచి వసూళ్లు వస్తాయన్న ధీమాలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. నార్త్‌లో నిర్వహించిన ప్రమోషన్స్‌తో పోలిస్తే తెలుగులో పెద్దగా ప్లాన్‌ చేస్తున్నట్లు కూడా కనిపించడం లేదు. యంగ్‌ హీరోలు సిద్ధు, విశ్వక్‌లతో ఎన్టీఆర్‌, కొరటాల ఇంటర్యూను ప్లాన్‌ చేయడం అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. యంగ్ హీరోలతో ఇంటర్వ్యూ చూడడానికి ఎంటర్‌టైనింగ్‌గా కనిపించినా ఎన్టీఆర్‌కి ఉన్న రేంజ్ ఏంటి? వారితో ఇంటర్వ్యూ ఏంటి? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మహేశ్‌, ప్రభాస్‌, రాజమౌళితో ఉన్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకొని వారిలో ఎవరితోనైనా ఇంటర్యూ నిర్వహించి ఉంటే తెలుగులో బాగా ప్లస్ అయ్యేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. ‘సలార్‌’ టీమ్‌తో రాజమౌళి చేసిన ఇంటర్యూ గురించి గుర్తుచేస్తున్నాయి. ఇప్పటివరకైతే ప్రమోషన్స్‌లో బాలీవుడ్‌పై పెట్టిన శ్రద్ధ టాలీవుడ్‌పై కనిపించడం లేదన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. దీన్ని దేవర టీమ్ ఎలా కవర్‌ చేసుకుంటుందో చూడాలి.&nbsp;
    సెప్టెంబర్ 18 , 2024
    <strong>Devara Movie: జూ.ఎన్టీఆర్‌కు కలిసిరాని సెంటిమెంట్ ‘దేవర’కు షాక్‌ తప్పదా?</strong>
    Devara Movie: జూ.ఎన్టీఆర్‌కు కలిసిరాని సెంటిమెంట్ ‘దేవర’కు షాక్‌ తప్పదా?
    జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబోలో రూపొందిన ‘దేవర’ (Devara: Part 1) చిత్రం ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది నేషన్‌గా మారిపోయింది. సెప్టెంబర్‌ 27న ఈ మూవీ రిలీజ్‌ కానుండటంతో చిత్ర యూనిట్‌ సినిమా ప్రమోషన్స్‌పై ఫోకస్‌ పెట్టింది. ఇటీవల పలు సాంగ్స్‌ రిలీజ్‌ చేసిన దేవర టీమ్‌ మంగళవారం (సెప్టెంబర్‌ 10) ట్రైలర్‌నూ రిలీజ్‌ చేసింది. ఈ ట్రైలర్‌ అందరి అంచనాలను అందుకుంటూ సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేసింది. తారక్‌ ఇందులో తండ్రి-కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్లు మేకర్స్‌ ట్రైలర్‌ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఇది తారక్ అభిమానుల్లో కొత్త భయానికి తెరతీసింది. గతంలో తారక్‌ చేసి ద్విపాత్రాభినయం చిత్రాలు ఫ్లాప్‌ కావడంతో ‘దేవర’ ఫలితం ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.&nbsp; డ్యూయల్ అంటే ఫసక్కేనా! ‘దేవర’ చిత్రంలో తారక్‌ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. అయితే తారక్‌ గతంలోనూ పలు చిత్రాల్లో డ్యూయల్‌ రోల్స్‌ (Jr NTR Dual Role Films) చేశారు. ‘ఆంధ్రావాలా’, ‘శక్తి’, ‘అదుర్స్‌’ చిత్రాల్లో అతడు రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించారు. వీటిలో తారక్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘ఆంధ్రావాలా’. పూరి జగన్నాథ్‌ దర్శకత్వలో రూపొందిన ఈ చిత్రం భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ‘శక్తి’ మూవీలోనూ తారక్‌ ద్విపాత్రాభినయం చేసి చేతులు కాల్చుకున్నారు. ఈ రెండు చిత్రాలు తారక్‌, అతడి ఫ్యాన్స్‌కు పీడకలను మిగిల్చాయి. ఆ తర్వాత చేసిన ‘అదుర్స్‌’ ప్రయోగం కొద్దిమేర ఫలించినా కమర్షియల్‌గా ఆ సినిమా సక్సెస్‌ కాలేదు. రూ.26 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ‘అదుర్స్‌’ కేవలం రెండు కోట్ల మార్జిన్‌ (రూ.28 కోట్ల గ్రాస్‌) మాత్రమే సాధించింది. అయితే తారక్‌ రెండు కంటే ఎక్కువ పాత్రలు చేసిన ‘జై లవ కుశ’ మాత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇందులో తారక్‌ డ్యూయల్‌ రోల్‌ కాకుండా త్రిపాత్రాభినయం చేయడం గమనార్హం.&nbsp; ‘దేవర’ హిట్‌ కష్టమేనా! జూనియర్‌ ఎన్టీఆర్‌ డ్యూయల్‌ రోల్స్‌ చేసినప్పుడల్లా ఏదోక ఎదురు దెబ్బ తగులుతూనే ఉందని సినీ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. గత చిత్రాలు అనుభవాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తారక్‌ను వెంటాడుతున్న ఈ బ్యాడ్‌ సెంటిమెంట్‌ ‘దేవర’పై కూడా పనిచేస్తే భారీ దెబ్బ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తారక్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఈసారి ‘దేవర’ కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు. ఎన్నో ఏళ్లుగా తమను వెంటాడుతున్న ఈ బ్యాడ్‌ సెంటిమెంట్‌కు ‘దేవర’తో తారక్‌ చెక్‌ పెడతాడని స్పష్టం చేస్తున్నారు. అటు ‘దేవర’ ట్రైలర్‌ కూడా అదిరిపోయిందని ఈ సినిమా పక్కాగా విజయం సాధిస్తుందని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ‘దేవర’ సినిమా సక్సెస్‌ కావాలని మనమూ కోరుకుందాం.&nbsp; ‘NTR 31’లోనూ డ్యూయల్ రోల్‌! తారక్‌ (Jr NTR) హీరోగా ‘కేజీఎఫ్‌’ ఫేమ్ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘NTR 31’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. అయితే ఈ సినిమాలోనూ జూ.ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి కెరీర్‌లో ఎప్పుడు చేయని 75 ఏళ్ల వృద్ధుడి పాత్ర అని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంకో పాత్రలో మాఫియా డాన్‌గా తారక్‌ కనిపిస్తారని టాక్‌ వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. NTR 31 చిత్రానికి ‘డ్రాగన్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ‘దేవర’కు ఊహించని ఫలితం ఎదురైతే ‘NTR 31’ను కూడా ఆ సెంటిమెంట్‌ వెంటాడే ప్రమాదం ఉంది.&nbsp; దేవర ట్రైలర్‌ ఎలా ఉందంటే? దేవర ట్రైల‌ర్‌ ప్ర‌కాష్ రాజ్ గంభీర‌మైన వాయిస్ ఓవ‌ర్‌తో ప్రారంభ‌మైంది. ‘కులం లేదు మతం లేదు భయం అసలే లేదు.. కానీ, మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి’ అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ‘మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగడితే.. ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అయితా’ వంటి డైలాగ్‌తో ఎన్టీఆర్ (దేవర) క్యారెక్టరైజేషన్‌ని చూపించారు. పార్లర్‌గా విలన్ బైరా (సైఫ్ అలీ ఖాన్) పాత్రని అతని గ్యాంగ్ చేస్తున్న దారుణాలను కూడా చూపించారు. ‘దేవర’ని చంపాలని ఆ గ్యాంగ్ ఆలోచిస్తున్న టైంలో ఇంకో ఎన్టీఆర్ (వర) పాత్రని పరిచయం చేశారు. అతను మహా పిరికివాడు అన్నట్టు హీరోయిన్ జాన్వీ కపూర్ పరిచయం చేసింది. మరోపక్క ‘దేవర’ (Devara) బ్రతికున్నాడా? చనిపోయాడా? బైరా గ్యాంగ్ వల్ల వరకి అలాగే ఆ ఊరి జనాలకి ఎలాంటి సమస్యలు తలెత్తాయి? అనే సస్పెన్స్‌ను మాత్రం దర్శకుడు కొరటాల శివ మెయింటైన్ చేస్తూ ‘దేవర’ మొదటి భాగం ట్రైలర్ ఉంది.&nbsp; https://www.youtube.com/watch?v=5cx7rvMvAWo
    సెప్టెంబర్ 11 , 2024
    <strong>Bharateeyudu 2 Trolls: 106 ఏళ్ల వయసులో ఎగిరెగిరి ఆ ఫైట్స్ ఏంటి..? ఏకిపారేస్తున్న నెటిజన్లు!</strong>
    Bharateeyudu 2 Trolls: 106 ఏళ్ల వయసులో ఎగిరెగిరి ఆ ఫైట్స్ ఏంటి..? ఏకిపారేస్తున్న నెటిజన్లు!
    గ్లోబల్‌ స్టార్‌ కమల్‌ (Kamal Hassan) హాసన్‌ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ చిత్రం 'భారతీయుడు 2' (Bharateeyudu 2). స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై జాతీయ స్థాయిలో బజ్‌ ఉంది. విశ్వనటుడు కమల్‌ హాసన్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్‌ మూవీ 'భారతీయుడు 2' (Bharateeyudu 2). హీరో సిద్ధార్థ్‌ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లు హీరోయిన్లుగా చేశారు. జులై 12న ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం (జూన్‌ 25) ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో సేనాపతి పాత్రలో కమల్‌ హాసన్‌ అదరగొట్టారు. అయితే కొందరు మాత్రం కమల్‌ పాత్రను టార్గెట్‌ చేస్తూ నెట్టింట ట్రోల్స్‌ చేస్తున్నారు.&nbsp; ట్రోల్స్‌కు కారణమిదే? 'భారతీయుడు 2' సినిమాలో 106 సంవత్సరాల వయసున్న వ్యక్తిగా కమల్‌ హాసన్‌ కనిపించారు. ముఖం మెుత్తం ముడతలతో.. పార్ట్ -1 (భారతీయుడు)లోని సేనాపతి కంటే మరింత వయసు మళ్లిన వ్యక్తిగా దర్శకుడు కమల్‌ను చూపించారు. యంగ్‌ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా యాక్షన్ సీక్వెన్స్‌లు పెట్టినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. అవినీతిలో కూరుకుపోయిన అధికారులను ఎంతో సాహసోపేతంగా కమల్‌ హత్య చేయడం గమనించవచ్చు. అయితే వందేళ్లకు పైబడిన వ్యక్తి ఇలా యాక్షన్ సీక్వెన్స్‌లో దుమ్ములేపడం లాజిక్‌లెస్‌గా ఉందంటూ కొందరు సోషల్‌ మీడియా వేదికగా ట్రోల్స్‌ చేస్తున్నారు. ఆ వయసులో కాళ్లు, చేతులు కదపడానికే కష్టంగా ఉంటుందని.. కానీ, సేనాపతి మాత్రం అలవోకగా స్టంట్స్‌ చేసేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఆ వయసులో ఉన్న తాత ఈ రేంజ్‌లో ఫైట్లు, ఎగిరెగిరి కొట్టడాలు ఎలా సాధ్యమవుతాయంటూ ప్రశ్నిస్తున్నారు. సినిమాటిక్‌ ఫ్రీడం ఉండొచ్చు కానీ, మరీ ఈ స్థాయిలో కాదని హితవు పలుకుతున్నారు.&nbsp; శంకర్‌.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ 'భారతీయుడు 2'లో కమల్‌ పాత్ర గురించి వస్తోన్న ట్రోల్స్‌పై డైరెక్టర్‌ శంకర్‌ స్పందించారు. తనదైన శైలిలో ఆ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ‘106 సంవత్సరాల వ్యక్తి ఇలా ఫైట్స్ చేయడం సాధ్యమే. చైనా దేశంలో లూజియా అనే ఓ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ ఇప్పటికీ 120 ఏళ్ల వయసులో కూడా గాల్లో ఎగురుతూ విన్యాసాలు చేస్తున్నారు. ఆయన గాల్లో ఎగురుతూ కిక్స్ ఇస్తూ, ఫైట్స్ చేస్తున్నారు. ఆయన ప్రేరణతోనే సేనాపతి పాత్రను తీర్చిదిద్దాం’ అంటూ శంకర్‌ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్‌ శంకర్‌కు పలువురు నెటిజన్లు మద్దతిస్తున్నారు. సినిమాను సినిమాలాగా చూడాలని.. లాజిక్స్‌ గురించి ఆలోచిస్తే ఏ మూవీ చూడలేరని కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; ట్రైలర్ ఎలా ఉందంటే? 'ఇండియన్‌ 2' నుంచి విడుదలైన లేటెస్ట్ ట్రైలర్.. అందరి అంచనాలను అందుకుంటూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ట్రైలర్‌లో.. హీరో సిద్దార్థ్‌ను ఓ స్టూడెంట్‌లా చూపించారు. అన్యాయాలు, అక్రమాలను ఎదిరించే పాత్రలో అతడు కనిపించాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. దీంతో సమాజంలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయని ట్విటర్‌లో 'ఆయన మళ్లీ రావాలి' హ్యాష్‌టాగ్‌ను యూత్‌ ట్రెండ్‌ చేస్తారు. దీంతో సేనాపతి రీఎంట్రీ ఇస్తాడు. అవినీతి చేసిన కొందరిని శిక్షించడం ట్రైలర్‌లో చూడవచ్చు. విజువల్స్‌ పరంగా ట్రైలర్‌ చాలా రిచ్‌గా ఉంది. యాక్షన్‌ సన్నివేశాలను డైరెక్టర్‌ శంకర్‌ తనదైన మార్క్‌తో తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. అనిరుధ్‌ అందించిన నేపథ్యం సంగీతం కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.&nbsp; https://www.youtube.com/watch?v=H1GFcXaNXHU
    జూన్ 26 , 2024
    Celebrities In Politics: పవన్‌ కల్యాణ్‌ To కంగనా రనౌత్‌.. ఎన్నికల్లో సత్తా చాటిన సెలబ్రిటీలు వీరే!
    Celebrities In Politics: పవన్‌ కల్యాణ్‌ To కంగనా రనౌత్‌.. ఎన్నికల్లో సత్తా చాటిన సెలబ్రిటీలు వీరే!
    దేశంలో సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. సినీ పరిశ్రమ నుంచి వచ్చి ప్రముఖ రాజకీయ నేతలుగా ఎదిగిన వారు దేశంలో చాలామందే ఉన్నారు. అందులో కొందరు పార్టీలు పెట్టగా, మరికొందరు వివిధ పార్టీల్లో చేరి విజయాలను అందుకున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాలు సహా.. దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. మంగళవారం (జూన్‌ 4) ఓట్ల లెక్కింపు జరగ్గా.. పలువురు సెలబ్రిటీలు గణనీయమైన విక్టరీని సొంతం చేసుకున్నారు. మరికొందరు ఓటమీని చవిచూశారు. వారెవరో ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; పవన్‌ కల్యాణ్‌ (ఆంధ్రప్రదేశ్‌) జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) 2024 ఏపీ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్‌గా మారారు. అధికార వైకాపా ప్రభుత్వాన్ని కూలతోసే లక్ష్యంతో పని చేసి సక్సెస్‌ అయ్యారు. ఆయన ప్రోత్సాహంతో ఏర్పడిన ఎన్‌డీఏ (టీడీపీ + జనసేన + భాజపా) కూటమి 175 సీట్లకు గాను ఏకంగా 164 కైవసం (టీడీపీ 135, జనసేన 21, భాజపా 8) చేసుకుంది. అటు 25కు గాను 21 ఎంపీ స్థానాలను (టీడీపీ 16, భాజపా 3, జనసేన 2) సొంతం చేసుకుంది. పొత్తులో భాగంగా పవన్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేయగా 100స్ట్రైక్‌రేట్‌తో అన్ని స్థానాల్లో విజయ దుందుభి మోగించడం విశేషం. పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం నియోజక వర్గం నుంచి 70 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది.. తొలిసారి అసెంబ్లీ అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో కొలువుదీరనున్న ఏపీ ప్రభుత్వంలో పవన్‌ కీలక పాత్ర పోషించనున్నారు.&nbsp; https://twitter.com/i/status/1797987460137549943 నందమూరి బాలకృష్ణ (ఆంధ్రప్రదేశ్‌) హిందూపురంలో సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఘనవిజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి టీఎన్ దీపికపై (TN Deepika) ఆయన 31,602 ఓట్లతో గెలుపొందారు. ఇది ఆయనకు హ్యాట్రిక్ విజయం. ఎన్టీ రామారావు (Sr NTR) రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచే కంచుకోటగా ఉన్న హిందూపురంలో.. బాలకృష్ణ 2014 నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు. https://twitter.com/i/status/1797996139146617307 కంగనా రనౌత్‌ (హిమాచల్‌ ప్రదేశ్‌) హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ నుంచి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ (భాజపా తరఫున) అరంగేట్రంలోనే విజయం సాధించారు.&nbsp; కాంగ్రెస్‌ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్‌పై 74వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. హేమామాలిని (ఉత్తర్‌ ప్రదేశ్‌) ఒకప్పటి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ హేమమాలిని.. ఈ దఫా కూడా ఎన్నికల్లో నిలబడి సత్తా చాటారు. యూపీలోని మథుర నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ముకేశ్‌ ధంగర్‌పై 2.93 లక్షల మెజార్టీతో ఆమె గెలుపొందారు.&nbsp; రవి కిషన్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌) ‘రేసు గుర్రం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన నటుడు రవికిషన్‌ కూడా ఈ సార్వత్రిక ఎన్నికల్లో మంచి విజయాన్ని అందుకున్నారు. గోరఖ్‌పుర్‌ (యూపీ)లో తన సమీప ప్రత్యర్థి భోజ్‌పురి నటి కాజల్‌ నిషాద్‌ (ఎస్పీ)పై లక్ష ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచారు.&nbsp; శతృఘ్న సిన్హా (బెంగాల్‌) సీనియర్‌ సినీ నటుడు, అసన్‌సోల్‌ సిట్టింగ్‌ ఎంపీ శతృఘ్న సిన్హా (టీఎంసీ) వరుసగా రెండోసారి విజయం సాధించారు. భాజపా అభ్యర్థి ఎస్‌.ఎస్‌ అహ్లూవాలియాపై దాదాపు 60వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సురేశ్‌ గోపి (కేరళ) సినీయర్‌ మలయాళ నటుడు సురేశ్‌ గోపి కేరళలో భాజపాకు తొలి విజయాన్ని అందజేశాడు. త్రిసూర్‌ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సురేశ్‌ గోపి 74వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో భాజపా తొలిసారి కేరళలో బోణి చేసినట్లైంది.&nbsp; https://twitter.com/i/status/1797900510726676534 మనోజ్‌ తివారి (ఢిల్లీ) నార్త్‌ ఈస్ట్‌ దిల్లీ నుంచి భోజ్‌పురి నటుడు మనోజ్‌ తివారీ భాజపా అభ్యర్థిగా వరుసగా మూడోసారి పోటీ చేశారు. తాజా ఫలితాల్లో ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై 1,38,778 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.&nbsp; https://twitter.com/i/status/1798059260410318868 అరుణ్‌ గోవిల్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌) బుల్లితెరపై రాముడిగా అలరించిన ప్రముఖ నటుడు అరుణ్‌ గోవిల్‌ (భాజపా).. ఈ ఎన్నికల్లో గెలుపొందారు. ఉత్తర్‌ప్రదేశ్‌ మేరఠ్‌లో తన సమీప ఎస్పీ అభ్యర్థి సునీతా వర్మపై 10,585 ఓట్ల ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయాన్ని కైవసం చేసుకున్నారు.&nbsp; విజయ్‌ వసంత్‌ (తమిళనాడు) తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎంపీ, తమిళ నటుడు విజయ్‌ వసంత్‌ తన సమీప భాజపా అభ్యర్థి పొన్‌ రాధాకృష్ణన్‌పై 1,79,097 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.&nbsp; దీపక్‌ అధికారి (బెంగాల్‌) బెంగాల్‌లోని ఘటల్‌ నుంచి తృణమూల్‌ సిట్టింగ్‌ ఎంపీ అయిన సినీ నటుడు దీపక్‌ అధికారి అలియాస్‌ దేవ్‌ తన సమీప భాజపా అభ్యర్థి, సినీ నటుడు హిరణ్మయ్‌ ఛటోపాధ్యాయపై 1.82 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు. ఓడిపోయిన సెలబ్రిటీలు నవనీత్‌ రాణా (మహారాష్ట్ర) తెలుగులో పలు సినిమాల్లో అలరించిన నటి నవనీత్‌ రాణా వరుసగా రెండోసారి అమరావతి (మహారాష్ట్ర) నుంచి తలపడ్డారు. అయితే.. కాంగ్రెస్‌ అభ్యర్థి బల్వంత్‌ బసవంత్‌ వాంఖడే చేతిలో 19 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. లాకెట్‌ ఛటర్జీ (బెంగాల్‌) పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నుంచి సినీ నటి, సిట్టింగ్‌ ఎంపీ లాకెట్‌ ఛటర్జీ (భాజపా) మరోసారి ఇదే స్థానం నుంచి బరిలో దిగారు. ఆమెకు పోటీగా టీఎంసీ మరో ప్రముఖ నటి రచనా బెనర్జీని నిలబెట్టింది. ఈ క్రమంలోనే రచన 76 వేల ఓట్ల ఆధిక్యంతో జయకేతనం ఎగురవేశారు.
    జూన్ 05 , 2024
    పాయల్ రాజ్‌పుత్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    పాయల్ రాజ్‌పుత్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    పాయల్ రాజ్‌పుత్&nbsp; 2017లో పంజాబీ చిత్రం "చన్నా మెరేయా"తో వెండితెరకు పరిచయమైంది. తెలుగులో "RX 100" చిత్రం ద్వారా విస్తృత గుర్తింపు పొందింది. ఈ రెండు చిత్రాలు ఆమెకు మంచి విజయాలను అందించాయి. పాయల్ రాజ్‌పుత్ చాలా తక్కువ వ్యవధిలో అనేక విజయవంతమైన ప్రాజెక్ట్‌లలో భాగం అయ్యింది. "RX 100", "వెంకీ మామ," "RDX లవ్, "మంగళవారం", "తమిళ చిత్రం "ఏంజెల్" వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.&nbsp; శృంగార తారగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిను పాయల్ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. పాయల్ రాజ్‌పుత్ ముద్దు పేరు? టింకీ పాయల్ రాజ్‌పుత్ ఎప్పుడు పుట్టింది? 1990, డిసెంబర్ 6న జన్మించింది పాయల్ రాజ్‌పుత్ తొలి సినిమా? చన్నా మేరేయా (2017) పాయల్ రాజ్‌పుత్‌కు తెలుగులో తొలి సినిమా? RX 100(2018) పాయల్ రాజ్‌పుత్ ఎత్తు ఎంత? 5 అడుగుల 7అంగుళాలు&nbsp; పాయల్ రాజ్‌పుత్ ఎక్కడ పుట్టింది? ఢిల్లీ పాయల్ రాజ్‌పుత్ ఏం చదివింది? యాక్టింగ్‌లో డిప్లోమా చేసింది పాయల్ రాజ్‌పుత్&nbsp; అభిరుచులు? &nbsp;మోడలింగ్, ట్రావెలింగ్ పాయల్ రాజ్‌పుత్‌కు ఇష్టమైన ఆహారం? బిర్యాని పాయల్ రాజ్‌పుత్‌కి&nbsp; ఇష్టమైన కలర్ ? బ్లాక్, వైట్ పాయర్ రాజ్‌పుత్ తల్లిదండ్రుల పేర్లు? విమల్ కుమార్ రాజ్‌పుత్( అకౌంట్ టీచర్), నిర్మల రాజ్‌పుత్ పాయల్ రాజ్‌పుత్‌కి ఇష్టమైన హీరో? సల్మాన్ ఖాన్ పాయల్ రాజ్‌పుత్‌కి ఇష్టమైన హీరోయిన్? దీపికా పదుకునే పాయల్ రాజ్‌పుత్ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.60లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది పాయల్ రాజ్‌పుత్&nbsp; ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/rajputpaayal/ పాయల్ రాజ్‌పుత్&nbsp; బాయ్ ఫ్రెండ్? పాయల్ రాజ్‌పుత్ ముంబైకి చెందిన మోడల్ సౌరబ్ డింగ్రాతో డేటింగ్‌లో ఉంది. పాయల్‌కు వచ్చిన అవార్డులు? &nbsp;తెలుగులో "RX 100"చిత్రానికి గాను ఉత్తమ తొలిచిత్ర నటిగా సైమా అవార్డును పొందింది. పాయల్ రాజ్‌పుత్&nbsp; సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? పాయల్ రాజ్‌పుత్&nbsp; సినిమాల్లోకి రాకముందు టీవీ సీరియళ్లలో నటించింది. మహాకుంభ్, సప్నోంసే భరె నైనా అనే సీరియళ్లలో పాయల్ నటించింది. https://www.youtube.com/watch?v=jPSBXjYO9uU
    ఏప్రిల్ 08 , 2024

    @2021 KTree