UATelugu2h 59m
జేడీ (విజయ్) కాలేజ్లో ప్రొఫసర్గా పనిచేస్తుంటాడు. కాలేజీ యాజమాన్యానికి మాత్రం జేడీ ప్రవర్తన నచ్చదు. ఈ క్రమంలో జరిగిన స్టూడెంట్ ఎన్నికల్లో కాలేజీ యాజమాన్యం గొడవలు సృష్టించి అతడిని కళాశాల వదిలి వెళ్లేలా చేస్తుంది. ఆ తరువాత జేడీ జువైనల్ హోంకు టీచర్గా వెళ్తాడు. అక్కడికి వెళ్లిన జేడీకీ అనుకోని ఒక సంఘటన ఎదురవుతుంది.
ఇంగ్లీష్లో చదవండి
మూవీ & ఓటీటీ అప్డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Primeఫ్రమ్
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
విజయ్
విజయ్ సేతుపతి
మహేంద్రన్
మాళవిక మోహనన్
ఆండ్రియా జెరెమియా
అర్జున్ దాస్
మాస్టర్ అక్షయ్ కుమార్
శంతను భాగ్యసరాజ్
గౌరీ కిషన్
నాసర్
అళగం పెరుమాళ్
సిబి భువన చంద్రన్
కులపుల్లి లీల
రమ్య సుబ్రమణియన్
రాజేష్
మహానది శంకర్
ప్రవీణ్
అరుణ్ అలెగ్జాండర్
రాజా రాణి పాండియన్
సాయి ధీనా
రమేష్ తిలక్
చేతన్
మాథ్యూ వర్గీస్
సుధ
రవిశంకర్
అజిత్ కోశి
రాహుల్ కన్నన్
సునీల్ రెడ్డి
కల్యాణి నటరాజన్
మోనా
విశాలిని
సురేఖ వాణి
సౌందర్య బాల నందకుమార్
లింటు రోనీ
ధీనా
లల్లూ
ఉదయరాజ్
పూవయ్యార్
శ్రీమాన్
సంజీవ్ వెంకట్
శ్రీనాథ్
ప్రేమ్ కుమార్
నాగేంద్ర ప్రసాద్
సంగీత వి
మాస్టర్ శక్తి
మాస్టర్ భావజ్
బ్రిగిడా సాగా
వాసంతి
సిబ్బంది
లోకేష్ కనగరాజ్
దర్శకుడుS. జేవియర్ బ్రిట్టోనిర్మాత
ఎస్ఎస్ లలిత్ కుమార్నిర్మాత
జగదీష్ పళనిసామినిర్మాత
అనిరుధ్ రవిచందర్
సంగీతకారుడుసత్యన్ సూర్యన్ ISC
సినిమాటోగ్రాఫర్ఫిలోమిన్ రాజ్
ఎడిటర్ర్కథనాలు
Sundaram Master Review: ‘సుందరం మాస్టర్’గా మెప్పించిన ‘వైవా హర్ష’.. సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు : హర్ష చెముడు, దివ్య సరిపడ, చైతు బాబు
రచన & దర్శకత్వం : కళ్యాణ్ సంతోష్
సంగీతం : సాయి చరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ : దీపక్ ఎరగేరా
ఎడిటర్ : కార్తిక్ ఉన్నవ
నిర్మాతలు : రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు
విడుదల తేదీ : 23-02-2024
హాస్య నటుడు హర్ష చెముడు ప్రధాన పాత్రలో (Sundaram Master Review) నటించిన చిత్రం ‘సుందరం మాస్టర్’ (Sundaram Master). దివ్య శ్రీపాద కథానాయిక. ఈ చిత్రాన్ని హీరో రవితేజ (Ravi Teja), సుధీర్ కుమార్ కుర్రు సంయుక్తంగా నిర్మించారు. కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. కాగా, ఈ చిత్రం ఇవాళ (ఫిబ్రవరి 23) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కథానాయకుడిగా హర్ష మెప్పించాడా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ
సుందరం మాస్టర్ (వైవా హర్ష) గవర్నమెంట్ స్కూల్లో సోషల్ టీచర్గా పనిచేస్తుంటాడు. ప్రభుత్వ ఉద్యోగం కావడంతో కట్నం ఎక్కువ ఇచ్చే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఆ ఏరియా ఎమ్మెల్యే (హర్ష వర్ధన్) ఇంగ్లీష్ నేర్పడం కోసం అతడిని మిర్యాలమెట్ట అనే గ్రామానికి పంపుతాడు. 90 ఏళ్లుగా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్న ఆ ఊరిలో ఓ విలువైన వస్తువు ఉందని.. దాన్ని తీసుకురావాలని సూచిస్తాడు. ఆ మిస్టరీ గ్రామానికి వెళ్లిన సుందరం మాస్టర్కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ ఊరికి బ్రిటిష్ వాళ్లకు ఉన్న సంబంధం ఏంటి? అక్కడి మనుషులు ఎలా ఉన్నారు? తను వెళ్లిన పనిని సుందరం పూర్తి చేశాడా? లేదా? అసలు దివ్య శ్రీపాద పాత్ర ఏంటి? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే?
కామెడీతో ఇన్నాళ్లు మెప్పించిన వైవా హర్ష (Sundaram Master Review).. ఈ సినిమాలో కామెడీతో పాటు అన్ని రకాల ఎమోషన్స్ని బాగా పండించాడు. హర్ష మాత్రమే ఈ పాత్రకి బాగా సూట్ అవుతాడు అనేలా చేసాడు. దివ్య శ్రీపాద ఆ ఊర్లో ఓ అనాధ పిల్లగా బాగా నటించింది. ఇక ఆ ఊర్లో ఉన్న జనాలుగా నటించిన ఆర్టిస్టులు అంతా అదరగొట్టేశారనే చెప్పొచ్చు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ ఎంచుకున్న కథ కొత్తగా అనిపిస్తుంది. కథనం కూడా ఆయన ఆసక్తికరంగా ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించాడు. ముఖ్యంగా అడవులు, జలపాతం మధ్యలో ఉన్న చిన్న ఊరును ఆయన చాలా అందంగా చూపించాడు. గ్రామస్తులకు ఇంగ్లీష్ నేర్పే క్రమంలో సుందరం మాస్టర్ పడ్డ కష్టాలు ప్రేక్షకులకు నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ ముందు వరకు నవ్వించిన సుందరం మాస్టర్ను తర్వాత డైరెక్టర్ సీరియస్ మోడ్లోకి తీసుకెళ్లాడు డైరెక్టర్. సెకండాఫ్ అంతా ఫిలాసఫీ చూట్టూ తిప్పారు. ఆ సన్నివేశాలను డీల్ చేయడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. ఫస్టాఫ్ అంతా సరదా సరదా సన్నివేశాలతో నడిపించి.. సెకండాఫ్లో మాత్రం డైరెక్టర్ నిరాశపరిచాడు.
టెక్నికల్గా
ఈ సినిమా సాంకేతిక విభాగం అద్భుత పనితీరు కనబరిచింది. ఊరిని అద్భుతంగా డిజైన్ చేసిన ఆర్ట్ డిపార్ట్మెంట్కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. సాయి చరణ్ పాకాల ఇచ్చిన సంగీతం, దీపక్ ఎరగేరా కెమెరా వర్క్ ఆకట్టుకుంటాయి. ఇక నిర్మాతగా రవితేజ, సుధీర్ కుమార్ ఓ మంచి సినిమానే అందించారు. నిర్మాణ విషయంలో కూడా తక్కువ బడ్జెట్ లోనే మంచిగా తీసినట్టు అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
హర్ష నటనకామెడీ సంగీతం
మైనస్ పాయింట్స్
పసలేని క్లైమాక్స్ లాజిక్కు అందని సీన్లు
Telugu.yousay.tv Rating : 3/5
ఫిబ్రవరి 23 , 2024
Tollywood: రాకేష్ మాస్టర్పై ఇంత చిన్నచూపా?... టాలీవుడ్లో కనీసం ఒక్క హీరో అయినా స్పందించారా? మీకంటే వాళ్లే నయం!
టాలీవుడ్లో ఒకప్పటి స్టార్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్( Rakesh Master) ఆదివారం తుది శ్వాస విడిచారు. చాలా రోజుల నుంచి రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం ఉదయం హన్-మ్యాన్ అనే సినిమా షూటింగ్లో ఆయనకు రక్త విరేచనాలు అయ్యాయి. అక్కడే రాకేష్ మాస్టర్ను పరిశీలించిన వైద్యులు ఆరోగ్యం విషమించినట్లు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్ను మూశారు.
అయితే ఆయన మృతిపై ఏ ఒక్క టాలీవుడ్ ప్రముఖుడు సంతాప సందేశం విడుదల చేయలేదు. రామ్గోపాల్ వర్మ నుంచి చిరంజీవి వరకు ఏ ఒక్కరు స్పందించలేదు. రాకేష్ మాస్టర్ చిన్న వ్యక్తి ఏమి కాదు.. దాదాపు 1500 సినిమాలకు కొరియోగ్రఫి చేశారు. ప్రభాస్, రామ్పొత్తినేని, రవితేజ, వేణు వంటి హీరోలు, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, సత్య మాస్టర్ వంటి స్టార్ కొరియోగ్రాఫర్లు కేరీర్ ఆరంభంలో ఆయన నుంచి డ్యాన్స్ మెళకువలు నేర్చుకున్నవారే. రామ్పొత్తినేని నటించిన దేవదాసు మూవీకి రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. కనీసం ఆయన పనిచేసిన సినిమాలకు చెందిన నిర్మాతలు కానీ, హీరోలు కానీ స్పందిస్తే బాగుండేది.
వివాదాలే ఒంటరిని చేశాయి..
యూట్యూబ్ వేదికగా రాకేష్ మాస్టర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని అనేకమంది హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామ్ గోపాల్ వర్మ, ఎన్టీఆర్, శ్రీరెడ్డి, బాలకృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు, మంచు లక్ష్మిలను లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. అలాగే తన శిష్యులైన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లపై పలు ఇంటర్వ్యూల్లో అసభ్య పదజాలంతో దూషించారు. వారికి అవకాశాలు ఇచ్చి అందలం ఎక్కిస్తే.. చివరికి తనను పట్టించుకోలేదని చాలా సార్లు కంటతడి పెట్టుకున్నారు. ముక్కుసూటి తనం, నిజాలను నిర్భయంగా చెప్పడం వంటి లక్షణాలు ఆయన్ను ఇండస్ట్రీ నుంచి దూరం చేశాయి. దీంతో ఆయనకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.
పొట్ట కూటి కోసం..
అవకాశాలు తగ్గడంతో పొట్ట కూటి కోసం రాకేష్ మాస్టర్ డ్యాన్స్ స్కూల్ రన్ చేశారు. దీంతో పాటు SRK ENTERTAINMENT అనే యూట్యూబ్ ఛానెల్ను ఓపెన్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫాలోవర్లను భారీగా పెంచుకున్నారు. డ్యాన్స్ ఈవెంట్లతో పాటు జబర్దస్త్ లాంటి కామెడీ షోల్లో నటించారు. ఒకనొకప్పుడు ఖరీదైన కార్లలో కనిపించిన రాకేష్ మాస్టర్.. చనిపోయే నాటికి అద్దె ఇంట్లో ఉండే పరిస్థితికి పడిపోయారు.
వ్యక్తిగతంగా ఎలా ఉన్నా.. రాకేష్ మాస్టర్ మాత్రం సేవా దృక్పథం కలవారు. కోవిడ్ సమయంలో తన దగ్గర ఉన్న డబ్బునంత ఖర్చు చేశారు. రోజుకు 200 మందికి అన్నదానం చేశారు. వారికి కావాల్సిన సామాగ్రిని కొనిచ్చారు. ఇంత చేసినా ఏరోజు ఆయన బయటకు చెప్పుకోలేదు.
వీళ్లే నయం..!
తాను చనిపోతానని ముందే తెలిసిన రాకేష్ మాస్టర్... చివరి రోజులు ఆనందంగా గడపాలని నిర్ణయించుకున్నారు. సోషల్ మీడియా స్టార్లతో ఓ పొగ్రాంను ఏర్పాటు చేశారు. ఆవేశం స్టార్, స్వాతినాయుడు, అగ్గిపెట్ట మచ్చతో కలిసి 'మ్యాన్షన్ హౌత్ విత్ మై హౌస్' అనే షోలో చాలా సంతోషంగా గడిపారు. తమను చేరదీసి ఆశ్రయం కల్పించిన రాకేష్ మాస్టర్ మృతి చెందటంతో వారంతా కన్నీరుమున్నీరయ్యారు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మాత్రం రాకేష్ మాస్టర్ కడసారి చూపుకు నోచుకున్నారు. రాకేష్ మాస్టర్ భౌతిక కాయాన్ని చూసి శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ బోరున విలపించారు.
ఏ సంబంధం లేనివారే ఇంత బాధపడితే... ఆయన నుంచి సినిమాలు చేయించుకున్న ప్రొడ్యూసర్లు, హీరోలు, డైరెక్టర్లు కనీసం ఒక్క సంతాప సందేశం కూడ విడుదల చేయకపోవడం నిజంగా విచారకరం. చనిపోయిన వ్యక్తితో ఎన్ని వివాదాలు ఉన్నా, ఎంత శత్రుత్వం ఉన్నా... ఆ వ్యక్తి చనిపోయాడు కదా..! మీ మీ బిజీ షెడ్యూల్స్ వల్ల రాకేష్ మాస్టర్ కడసారి చూపుకు వెళ్లకపోయినా కనీసం మానవత్వం చాటుకోవాల్సిన బాధ్యత ఇండస్ట్రీ పెద్దలకు లేదా? అని సినీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
జూన్ 20 , 2023
RAKESH MASTER: ఏపీ కల్తీ మద్యమే రాకేష్ మాస్టర్ను చంపేసిందా?... ఇవిగో సాక్ష్యాలు!
టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ తీవ్ర అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే రాకేష్ మాస్టర్ మృతి కారణాల పట్ల సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాకేష్ మాస్టర్ చనిపోవడానికి ఏపీలో అమ్ముతున్న చీప్ లిక్కర్, కల్తీ మద్యమే కారణమని వైసీపీ సర్కారును ట్రోల్ చేస్తున్నారు. అక్కడ విరివిగా లభించే 'బూమ్ బూమ్' బీర్లను రాకేశ్ మాస్టర్ ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యం చెడిపోయి ప్రాణాలు కోల్పోయారని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు వీడియోలను షేర్ చేస్తున్నారు.
https://twitter.com/mana_Prakasam/status/1670462301533765632?s=20
ఏపీలో మద్యపానం నిషేధం పేరిట తొలుత మద్యం ధరలు భారీగా పెంచారని గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత నకిలీ, కల్తీ మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇచ్చి విచ్చలవిడిగా అమ్ముతున్నారనీ ఆరోపించారు. వీటి తయారీ వెనుక ఉన్నది వైసీపీ నేతలే ఉన్నారని గతంలో ప్రతిపక్షాలు కూడా పెద్దఎత్తున విమర్శించిన సంగతి తెలిసిందే. బ్రాండెడ్ మద్యం అమ్మకం వల్ల ప్రభుత్వానికి ఆదాయం రాదని.. అందుకే చీప్ మద్యానికి అనుమతించారని కామెంట్లు చేస్తున్నారు. కల్తీ మద్యానికి రాకేష్ మాస్టర్ బలి అయ్యారని పోస్టులు పెడుతున్నారు.
https://twitter.com/apramayanam/status/1670464153348190209?s=20
మరణం ముందే తెలుసు..
ఎప్పుడూ యూట్యూబ్లో ఎంటర్టైన్ చేసే రాకేష్ మాస్టర్ మృతిని చూసి తట్టుకోలేని అభిమానులు ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. రాకేష్ మాస్టర్ తాను చనిపోతాననే విషయం తనకు ముందే తెలుసు. తన అనారోగ్యం గురించి తెలిసినా... అందర్ని నవ్విస్తూ కడుపులోనే తన బాధను దాచుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాకేశ్ మాస్టర్ మృతిపై సోషల్ మీడియాలో నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులు పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ.. "నా శరీరంలో మార్పు కనిపిస్తోంది. అది నాకు తెలుస్తోంది. నువ్వు ఉదయించే సూర్యుడివి నువ్వు అయితే… నేను అస్తమించే సూర్యుడిని. అమ్మా, నాన్నలను బాగా చూసుకో'' అంటూ వీడియోలో చెబుతున్నట్లు ఉంది. దీంతో తాను చనిపోతానన్న విషయం తనకు ముందే తెలుసని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.
https://twitter.com/Devineni_Hari/status/1670424465300402177?s=20
రాకేష్ మాస్టర్ చివరి కోరిక
ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్యూ ఇచ్చిన రాకేష్ మాస్టర్ తన చివరి కోరిక ఏమిటో చెప్పారు. ఆయన చనిపోయాక ఎక్కడ సమాధి చేయాలో పేర్కొన్నారు. 'ఇల్లు, దుస్తులు, శరీరం ఏదీ శాశ్వతం కాదు. నా మామగారి సమాధి పక్కన వేప మెుక్క నాటా. దాన్ని పెంచుతా. నేను చనిపోయిన తర్వాత ఆ చెట్టు కిందే నన్ను సమాధి చేయండని యూట్యూబ్ ఛానెల్స్కు విజ్ఞప్తి చేశా' అని మాస్టర్ అన్నారు.
డాక్టర్లు ఏమన్నారు?
రాకేశ్ మాస్టర్ మృతిపై గాంధీ ఆస్పత్రి వైద్యులు బులెటెన్ విడుదల చేశారు. ఉదయం రక్త విరేచనాలు కావడంతో మధ్యాహ్నం గాంధీ ఆసుపత్రిలో రాకేష్ మాస్టర్ అడ్మిట్ అయ్యారు. ఆయనకు డయాబెటిస్, సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ తీవ్రంగా ఉండటంతో శరీరంలోని చాలా అవయవాలు దెబ్బతిన్నాయి అని గాంధీ సూపరింటిండెంట్ రాజారావు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు రాకేశ్ మాస్టర్ తుదిశ్వాస విడిచారని పేర్కొన్నారు.
ప్రభాస్కు డ్యాన్స్ శిక్షణ
రాకేశ్ మాస్టర్కి ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరుంది. దాదాపు 1500కు పైగా సినిమాలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఈయన దగ్గర శిక్షణ తీసుకున్నవారే. కెరీర్ ఆరంభంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హీరో వేణు ప్రత్యూష మొదలైన సినీ నటులు రాకేష్ మాస్టర్ వద్ద శిక్షణను పొందారు. లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు మొదలైన సినిమాలలోని పాటలకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అలాగే ఈటీవీ వేదికగా ప్రారంభమైన డ్యాన్స్ షో ఢీ లో బషీర్ అనే కంటెస్టెంట్కు మాస్టర్గా వ్యవహరించాడు. ఆయన మృతికి తెలుగు చిత్ర పరిశ్రమ నివాళులు అర్పిస్తోంది.
https://twitter.com/CreatorYog/status/1670510684935962625?s=20
జూన్ 19 , 2023
Kalki 2898 AD: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు ట్వీట్ వెనక నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్..!
ప్రభాస్ హీరోగా చేస్తోన్న సైన్స్ ఫిక్షన్ ఫ్యూచరిస్టిక్ సినిమా 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD)పై వరల్డ్ వైడ్గా బజ్ ఏర్పడింది. ఈ సినిమాను మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రంగా కల్కి రికార్డు సృష్టించింది. జూన్ 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండటంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమా ప్రమోషన్స్ను షురూ చేశారు. సినిమాలో రోబిటిక్ వెహికల్గా కీలక పాత్ర పోషించిన బుజ్జి అనే వాహనాన్ని ఇటీవల అందరీ పరిచయం చేసి ఆశ్చర్యపరిచాడు. సినిమా కోసం స్పెషల్గా తయారు చేయించిన వెహికల్ కావడంతో బుజ్జిపై అందరి దృష్టి పడింది. ప్రస్తుతం బుజ్జిని ఉపయోగించుకొని డైరెక్టర్ నాగ్ అశ్విన్ సరికొత్త ప్రమోషన్స్కు తెరలేపారు.
అపర కుబేరుడికి రిక్వెస్ట్
ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడైన టెస్లా అధినేత ఎలా మస్క్ (Elon Musk)కు.. 'కల్కి 2898 ఏడీ' డైరెక్టర్ నాగ్ అశ్విన్ తాజాగా ఓ రిక్వెస్ట్ పెట్టారు. బుజ్జి వెహికల్ను నడపడానికి ఆహ్వానిస్తున్నట్లు ఓ ట్వీట్ను ఎలాన్ మస్క్కు ట్యాగ్ చేశాడు. ‘ప్రియమైన ఎలాన్ మస్క్ సర్.. మా బుజ్జిని చూడటానికి, డ్రైవ్ చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఇది 6 టన్నుల బరువుతో సరికొత్తగా డిజైన్ చేశాం. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం, అద్భుతమైన ఇంజినీరింగ్ వర్క్తో నిర్మించబడింది. మీకు బుజ్జి తప్పకుండా మంచి అనుభూతిని ఇస్తుంది' అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.
https://twitter.com/nagashwin7/status/1795534761072693594
ట్వీట్ వెనక మాస్టర్ ప్లాన్
అపర కుభేరుడు ఎలాన్ మస్క్కు నాగ్ అశ్విన్ ట్వీట్ పెట్టడం వెనక ఓ మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు కనిపిస్తోంది. కల్కి సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ టీమ్ ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఎలాన్ మస్క్ దృష్టిని కల్కి మీదకు మళ్లిస్తే అది గ్లోబల్ స్థాయిలో మూవీకి ప్లస్ అవుతుందని నాగ్ అశ్విన్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే అసాధ్యమని తెలిసినా బుజ్జిని నడపాలని, ఇండియాకు రావాలని ఆయన మస్క్ను కోరినట్లు సమాచారం. ఇప్పటికే నాగ్ అశ్విన్ ట్వీట్పై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. చాలా మంది భారతీయులు ట్వీట్పై స్పందిస్తున్నారు. ఈ అడ్వాన్స్డ్ వెహికల్ను నడపాలని మస్క్కు సైతం సూచిస్తున్నారు. అటు మస్క్ కూడా అశ్విన్ ట్వీట్కు సమాధానం ఇస్తే అది ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ అవుతుంది. 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి రావాల్సినంత ప్రమోషన్ వరల్డ్ వైడ్గా వచ్చేస్తుంది.
బుజ్జిని నడిపిన చైతూ
బుజ్జి వెహికల్పై మనసు పారేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya).. ఇప్పటికే దానిపై ఓ రైడ్ కూడా వేశాడు. రేసింగ్ కోర్స్లా ఉన్న చోట రయ్రయ్ అంటూ ఇటీవల ఈ కారును డ్రైవ్ చేసాడు. అందుకు సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఎక్స్లో షేర్ చేయగా అది వైరల్గా మారింది. అనంతరం బుజ్జి వెహికల్కు హాట్యాఫ్ చెప్పిన చైతూ.. అదొక ఇంజనీరింగ్ అద్భుతమని కొనియాడాడు. బుజ్జితో తాను సరదాగా గడిపినట్లు చెప్పుకొచ్చారు.
https://twitter.com/chay_akkineni/status/1794262966986215753
బుజ్జి ఎందుకు స్పెషలో తెలుసా?
బుజ్జి అనే ఫ్యూచరస్టిక్ కారును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వెహికల్ తయారీ కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంతో శ్రమించారు. మహీంద్రా సంస్థ, జయం ఆటోమోటివ్ భాగస్వామ్యంతో పాటు చాలా మంది ఇంజినీర్లతో బుజ్జి కారును తయారు చేయించారు. ఇది తయారు చేసేందుకు సుమారు రెండేళ్ల కాలం పట్టిందట. బుజ్జి వాహనానికి ముందు రెండు, వెనుక ఒకటే భారీ టైర్లు ఉన్నాయి. ఈ టైర్లు తయారు చేసేందుకే చాలా కసరత్తులు చేశారు. సియట్ కంపెనీతో ఈ టైర్లను తయారు చేయించారు. సుమారు 6 టన్నుల బరువు ఉన్న బుజ్జీని తయారు చేసేందుకు సుమారు రూ.7 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం.
కల్కి బడ్జెట్ తెలిస్తే షాకే!
‘కల్కి 2898 ఏడీ’ చిత్రం జూన్ 27వ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీలో ప్రభాస్తో పాటు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, తమిళ లెజెండ్ కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె, దిశా పటానీ కీలకపాత్రలు చేశారు. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా వస్తోంది. సుమారు రూ.600 కోట్ల వరకు ఈ చిత్రానికి బడ్జెట్ వెచ్చించినట్టు అంచనాలు ఉన్నాయి. సంతోష్ నారాయణన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.
మే 29 , 2024
Ram Charan vs Chiranjeevi: చిరంజీవి లేదా తారక్తో రామ్ చరణ్ బిగ్ ఫైట్.. దిల్రాజు మాస్టర్ ప్లాన్!
మెగా పవర్స్టార్ రామ్చరణ్ (Ramcharan), కియారా అద్వానీ (Kiara Advani) జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Sankar) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్లోని ఆర్.కే బీచ్లో జరుగుతోంది. ఓపెన్ ప్లేస్లో చిత్రీకరణ జరుగుతుండటంతో షూటింగ్ స్పాట్ నుంచి ప్రధాన తారాగణానికి సంబంధించిన ఫొటోలు బయటకొస్తున్నాయి. ఇటీవలే రామ్చరణ్ లుక్ బయటకు రాగా అది నెట్టింట తెగ ట్రెండింగ్ అయ్యింది. తాజాగా హీరోయిన్ కియారా లుక్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. మరోవైపు తారక్ ‘దేవర’ లేదా చిరంజీవి ‘విశ్వంభర’కు పోటీగా ‘గేమ్ ఛేంజర్’ బరిలో నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
వెంటాడుతున్న లీకుల బెడద!
‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని లీకుల బెడద వెంటాడుతోంది. వాటిని కంట్రోల్ చేసేందుకు చిత్ర యూనిట్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతోంది. తాజాగా వైజాగ్ షూటింగ్ స్పాట్ నుంచి హీరోయిన్ కియారా ఫొటోలు లీక్ కావడం మేకర్స్ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఫొటోల్లో కియారా చాలా అందంగా కనిపించింది. శారీలో తెలుగింటి అమ్మాయిలాగా తళతళ మెరిసిపోయింది. ఈ భామ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన రామ్చరణ్ ఫొటోలతో ఈమె పిక్స్ను జత చేసి వీరి పెయిర్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫొటోలు మీరు చూడండి.
https://twitter.com/i/status/1769462838765240477
https://twitter.com/i/status/1769381487143776301
దసరా, సంక్రాంతి పరిశీలన!
గేమ్ ఛేంజర్ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఈ సినిమా విడుదలపై ఇండస్ట్రీలో కొత్త చర్చ మెుదలైంది. నిర్మాణ సంస్థ కూడా సరైన తేదీ కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా రెండు పెద్ద పండగలను నిర్మాత దిల్రాజు పరిశీలిస్తున్నట్లు టాక్. దసరా లేదా సంక్రాంతి సందర్భంగా 'గేమ్ ఛేంజర్'ను రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని ఆయన సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం భారీ బడ్జెట్తో రూపొందిన నేపథ్యంలో ఫెస్టివల్ డేస్ అయితేనే సరిగ్గా ఉంటుందని భావిస్తున్నారట. ఈ విషయాన్ని రామ్చరణ్ పుట్టిన రోజు నాడు 'జరగండీ.. ' పాటతో పాటు చెప్పాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. పోస్టు ప్రొడక్షన్ పనులు ప్లానింగ్ చేసుకొని డేట్ చెప్పే యోచనలో యూనిట్ ఉందట.
చిరు - చరణ్ - తారక్.. బిగ్ ఫైట్!
అయితే దసరా, సంక్రాంతికి రెండు బడా హీరోల చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. తారక్ (Jr NTR) హీరోగా కొరటాల శివ రూపొందిస్తున్న ‘దేవర’ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది. అటు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘విశ్వంభర’ చిత్రం సంక్రాంతిన విడుదలయ్యేందుకు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ రెండు పండగల్లో ఏదోక దానిని ‘గేమ్ ఛేంజర్’ ఫిక్స్ చేసుకోనున్న నేపథ్యంలో ఇండస్ట్రీలో మరో బిగ్ ఫైట్ చూసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’లో కలిసి నటించిన తారక్తో రామ్ చరణ్ పోటీ పడతాడా? లేదా తండ్రికి సవాలు విసురుతాడా? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దీనిపై మార్చి 27న రామ్చరణ్ పుట్టిన రోజు సందర్భంగా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
చరణ్ కొత్త సినిమాపై క్రేజీ న్యూస్!
ఇక గేమ్ ఛేంజర్ తర్వాత రామ్చరణ్.. బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇందులో చరణ్కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ చేయనుంది. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ కూడా ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని ఆ పాత్రకు అమితాబ్ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. అలాగే 'యానిమల్'లో విలన్గా ఆకట్టుకున్న బాబీ డియోల్ కూడా ఈ సినిమా నటించే అవకాశముందట. చరణ్కు అతడు ప్రత్యర్థిగా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీటిపై చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మార్చి 18 , 2024
RAKESH MASTER: ప్రభాస్, రామ్ పొత్తినేని, రవితేజకు డ్యాన్స్ నేర్పింది రాకేష్ మాస్టరే!.. ఇవిగో వీడియోలు!
రాకేష్ మాస్టర్ హ్యాష్ ట్యాగ్(#RakeshMaster) సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ఆయన గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూల తాలుకు వీడియోలను ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. ఎంతో మంది డ్యాన్స్ మాస్టర్లు, హీరోలకు శిక్షణ ఇచ్చిన రాకేష్ మాస్టర్ చివరి రోజుల్లో అందరికీ దూరమై ఏకాకిగా మిగలడంపై పలువరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముక్కు మీద కోపం, నిజాలను నిర్భయంగా చెప్పడం, ఎవర్నీ లెక్కచేయని మనస్తత్వం రాకేష్ మాస్టర్ను ఒంటరి చేసిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ప్రభాస్కు మాస్టర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ తొలి రోజుల్లో ఆయనకు డ్యాన్స్ శిక్షణ అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాస్కు రాకేష్ మాస్టర్ శిక్షణ ఇస్తున్న ఫొటోను నెటిజన్లు షేర్ చేశారు.
https://twitter.com/SumanthOffl/status/1670414528235073537?s=20
RAPOకు డ్యాన్స్ శిక్షణ
యంగ్ హీరో రామ్ పొత్తినేని కూడా రాకేష్ మాస్టర్ దగ్గర డ్యాన్స్లో మెళకువలు నేర్చుకున్నవాడే. ఆయన నటించిన దేవదాసు సినిమాకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఆ సినిమాలోని డ్యాన్స్... RAPOకు ఎంత పేరు తెచ్చిందో తెలిసిందే.
https://twitter.com/RamUniversal1/status/1670429314993594368?s=20
మాస్ మహారాజా రవితేజ నటించిన ఓ సినిమాలోని ఫుల్ సాంగ్లో రాకేష్ మాస్టర్ రవితేజతో కలిసి డ్యాన్స్ చేశారు.
https://twitter.com/avinashgoud00/status/1670430461372534785?s=20
1500 సినిమాలకు కొరియోగ్రఫీ
రాకేశ్ మాస్టర్ ఒకానొక దశలో టాలీవుడ్లో టాప్ కొరియోగ్రాఫర్గా కొనసాగారు. దాదాపు 1500కు పైగా సినిమాలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఈయన దగ్గర శిక్షణ తీసుకున్నవారే. ఈటీవీ డ్యాన్స్ షో ద్వారా రాకేష్ మాస్టర్ ప్రతిభ చాలా మందికి తెలిసింది.
https://twitter.com/CreatorYog/status/1670510684935962625?s=20
జనసేనకు ఓటు వేస్తా..
తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తిగతంగా ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో రాకేష్ మాస్టర్ తెలిపారు. జనసేనకే తాను ఓటు వేస్తానని బహిరంగంగా ప్రకటించారు. జనసేనపై అభిమానంతో చేతిపై వేసుకున్న టాటూను చూపించారు. ఓటు వేసేటప్పుడు కులాలు పట్టించుకోనని స్పష్టం చేశారు. తాను రెడ్డి సామాజిక వర్గమైనా ఓటు మాత్రం పవన్ కళ్యాణ్కే వేస్తానని పేర్కొన్నారు.
https://twitter.com/Vamsitweetzz/status/1670428040638386181?s=20
శేఖర్కు లైఫ్ ఇచ్చాడు..
తన తమ్ముడు ఎంతో మందికి లైఫ్ ఇచ్చాడు అని రాకేష్ మాస్టర్ అక్కగారు అన్నారు. శేఖర్, జానీ, సత్య మాస్టర్లు చాలా కాలం పాటు తన తమ్ముడి ఇంట్లోనే ఉండేవారని చెప్పారు. రాకేష్ మాస్టర్ ఎవరికీ అన్యాయం చేయలేదని వివరించారు. డ్యాన్స్ ప్రొఫెషన్ వల్ల కుటుంబానికి దూరమయ్యానరని వెల్లడించారు. ఈ మధ్య ఫొన్ చేసి మమ్మల్ని కలవాలని ఉందని చెప్పుకొచ్చారు. అనారోగ్య సమస్యల వల్ల తననే ఇక్కడకు రావాలని కోరినట్లు చెప్పారు. అంతలోనే తన తమ్ముడు చనిపోవడం బాధకలిగిస్తోందని కన్నీటి పర్యంతం అయ్యారు.
https://www.facebook.com/watch/?v=188462650858056
శేఖర్ మాస్టర్తో చెడింది ఇక్కడే..
శేఖర్ మాస్టర్ను తన కన్న కొడుకులాగా చూసుకున్నాని పలు ఇంటర్వ్యూల్లో రాకేష్ మాస్టర్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ 150 సినిమాలో రెండు పాటలకు కొరియోగ్రఫీ చేసే అవకాశం శేఖర్ మాస్టర్కు వచ్చింది. అయితే ఆ విషయం తనకు శేఖర్ చెప్పలేదని రాకేష్ మాస్టర్ తెలిపారు. ఇంట్లో భార్యకు చెప్పాడు కానీ తనకు చెప్పలేదని పేర్కొన్నారు. ఇతరులతో తాము ఎలా ఉన్నా.. తమ మధ్య మాత్రం అబద్దాలు, దాపరికాలు తావు ఉండొద్దని ప్రతిజ్ఞ చేశామని చెప్పుకొచ్చారు. కానీ ఆ విషయాన్ని శేఖర్ మరిచాడని ఆరోపించారు. తనకు వచ్చిన అవకాశాలను శేఖర్కు ఇప్పించానని చెప్పుకొచ్చారు. తాను చనిపోతే... తన శవాన్ని కూడా శేఖర్ తాకొద్దని రాకేష్ మాస్టర్ అన్నారు.
అయితే ఇదే విషయమై శేఖర్ మాస్టర్ కూడా స్పందించారు. ఖైదీ 150 సినిమాలో రెండు పాటలకు అవకాశం వచ్చిందని కానీ అవి కన్ఫర్మ్గా తెలియదని వెల్లడించాడు. కన్ఫర్మ్ అయ్యాక రాకేష్ మాస్టర్కు చెబుదామని అనుకున్నాని పేర్కొన్నాడు. తనను ఏరా పోరా అన్నా పడుతానని.. కానీ తన భార్యకు కాల్ చేసి అసభ్యంగా మాట్లాడరని శేఖర్ చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచే వీరి మధ్య దూరం పెరిగింది. మరి ఈరోజు రాకేష్ మాస్టర్ అంత్య క్రియలకు శేఖర్ మాస్టర్ వస్తారో లేదో చూడాలి మరి..
జూన్ 19 , 2023
దివ్య శ్రీపాద గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
టాలీవుడ్లో తమ క్రేజ్ను క్రమంగా పెంచుకుంటున్న తెలుగు అమ్మాయిల్లో 'దివ్య శ్రీపాద' ఒకరు. రీసెంట్గా 'సుందరం మాస్టర్' (Sundaram Master) సినిమా ద్వారా ఈ భామ హీరోయిన్గా మారిపోయింది. అంతకుముందు 'డియర్ కామ్రేడ్', 'కలర్ ఫొటో', 'మిస్ ఇండియా', 'జాతి రత్నాలు' వంటి హిట్ చిత్రాల్లో సైడ్ పాత్రలకే పరిమితమైంది. 'సుందరం మాస్టర్'లో చక్కటి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించింది. మరి దివ్య శ్రీపాద వ్యక్తిగత జీవితం గురించి చాలామందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం
దివ్య శ్రీపాద అసలు పేరు?
దివ్య దృష్టి
దివ్య శ్రీపాద ఎప్పుడు పుట్టింది?
1996, సెప్టెంబర్ 5న జన్మించింది
దివ్య శ్రీపాద ఎక్కడ పుట్టింది?
దివ్య శ్రీపాద హైదరాబాద్లో జన్మించింది.
దివ్య శ్రీపాద నటించిన తొలి సినిమా?
డియర్ కామ్రెడ్ (2019)
దివ్య శ్రీపాద నటించిన తొలి వెబ్సిరీస్
హెడ్స్ అండ్ టేల్స్(2021)
దివ్య శ్రీపాద ఎత్తు ఎంత?
5 అడుగుల 6గుళాలు
దివ్య శ్రీపాద అభిరుచులు?
కూకింగ్
దివ్య శ్రీపాద ఇష్టమైన ఆహారం?
నాన్వెజ్
దివ్య శ్రీపాదకు ఇష్టమైన కలర్?
వైట్
దివ్య శ్రీపాదకు ఇష్టమైన హీరో?
పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ
దివ్య శ్రీపాద ఏం చదివింది?
MBA
దివ్య శ్రీపాద పారితోషికం ఎంత తీసుకుంటుంది?
ఒక్కొ సినిమాకు రూ. 30లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.
దివ్య శ్రీపాద సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
దివ్య శ్రీపాద సినిమాల్లోకి రాకముందు IBM కంపెనీలో పనిచేసింది.
దివ్య శ్రీపాద ఎన్ని భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు?
తెలుగు, హిందీ, ఇంగ్లీష్, అరబిక్, ఫ్రెంచ్, తెలుగు భాషాల్లో అనర్గళంగా మాట్లాడుతుంది.
https://www.youtube.com/watch?v=P1fCyBtJyC0
దివ్య శ్రీపాద ఇన్స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/divyasripada/
ఏప్రిల్ 29 , 2024
సత్యదేవ్ (Satyadev) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన హీరోల్లో సత్యదేవ్ ఒకరు. బ్లఫ్ మాస్టర్, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి సినిమాల సక్సెస్తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందాడు. తనదైన యాక్టింగ్తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. టాలీవుడ్లో విలక్షణ నటుడిగా కొనసాగుతున్న సత్యదేవ్ గురించి చాలా మందికి తెలియని విషయాలు ఇప్పుడు చూద్దాం.
సత్యదేవ్ అసలు పేరు?
సత్యదేవ్ కంచరణా
సత్యదేవ్ ఎత్తు ఎంత?
5 అడుగుల 10 అంగుళాలు
సత్యదేవ్ తొలి సినిమా?
మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం ద్వారా సత్యదేవ్ ఇండస్ట్రీకి నటుడిగా పరిచయమయ్యాడు. హీరోగా అతను నటించిన తొలి చిత్రం 'బ్లప్ మాస్టర్'
సత్యదేవ్ ఎక్కడ పుట్టాడు?
విశాఖపట్నం, ఏపీ
సత్యదేవ్ పుట్టిన తేదీ ఎప్పుడు?
1989 జులై 4
సత్యదేవ్కు వివాహం అయిందా?
దీపికతో 2016లో పెళ్లి జరిగింది. 2020లో ఈ జంటకు ఒక కొడుకు జన్మించాడు. పేరు సావర్ణిక్
సత్యదేవ్ ఫెవరెట్ హీరో?
మెగాస్టార్ చిరంజీవి
సత్యదేవ్ తొలి హిట్ సినిమా?
జ్యోతి లక్ష్మి చిత్రం సత్యదేవ్కు మంచి గుర్తింపు తెచ్చింది. ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య, గాడ్ఫాదర్ వంటి చిత్రాలు హిట్గా నిలిచాయి.
సత్యదేవ్కు ఇష్టమైన కలర్?
బ్లాక్ అండ్ వైట్
సత్యదేవ్ తల్లిదండ్రుల పేర్లు?
ప్రసాద్ రావు, లక్ష్మి
సత్యదేవ్కు ఇష్టమైన ప్రదేశం?
విశాఖపట్నం
సత్యదేవ్ ఏం చదివాడు?
ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కొద్దికాలం బెంగుళూరులో పనిచేశాడు.
సత్యదేవ్ ఎన్ని సినిమాల్లో నటించాడు?
2024 వరకు 30 సినిమాల్లో నటించాడు.
సత్యదేవ్కు ఇష్టమైన ఆహారం?
దోశ
సత్యదేవ్ నికర ఆస్తుల విలువ ఎంత?
రూ. 7.5 కోట్లు
సత్యదేవ్ సినిమాకి ఎంత తీసుకుంటాడు?
సత్యదేవ్ ఒక్కో సినిమాకి రూ.1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు తీసుకుంటున్నాడు.
https://www.youtube.com/watch?v=bLnXyZ4pzhE
మార్చి 21 , 2024
Manamey Movie Review: శర్వానంద్, కృతి శెట్టి వరుస ఫెయిల్యూర్స్కు ‘మనమే’ చెక్ పెట్టిందా?
నటీనటులు : శర్వానంద్, కృతి శెట్టి, సీరత్ కపూర్, అయేషా ఖాన్, రాహుల్, రామకృష్ణ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ తదితరులు
రచన, దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య
సంగీతం : హీషం అబ్దుల్ వహాబ్
సినిమాటోగ్రాఫర్ : విష్ణు శర్మ
నిర్మాతలు : వివేక్ కుచిబొట్ల, కృతి ప్రసాద్
విడుదల తేదీ: 07 జూన్, 2024
యంగ్ హీరో శర్వానంద్ చేసిన చిత్రాలకు టాలీవుడ్లో ప్రత్యేకంగా నిలుస్తాయి. పక్కింటి అబ్బాయిలా కనిపించే చిత్రాల్లో నటించి చాలా సార్లు ఆడియన్స్ను మెప్పించాడు. ఇప్పుడు కూడా అలాంటి కథతోనే శర్వానంద్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శర్వానంద్, హీరోయిన్ కృతిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మనమే’ (Manamey). శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మాస్టర్ విక్రమ్ ఆదిత్య ముఖ్య పాత్ర పోషించారు. జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ఎంతో కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్కు విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో చూద్దాం.
కథేంటి
విక్రమ్ (శర్వానంద్) పని పాట లేకుండా తాగుతూ తిరుగుతుంటాడు. కనిపించిన అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తూ ప్లే బాయ్గా వ్యవహరిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు విక్రమ్ బెస్ట్ ఫ్రెండ్ అనురాగ్ (త్రిగుణ్), అతని భార్య శాంతి ప్రమాదంలో చనిపోతారు. దీంతో అనురాగ్ కొడుకు ఖుషీ (మాస్టర్ విక్రమ్ ఆదిత్య)ని పెంచాల్సిన బాధ్యత విక్రమ్, సుభద్ర (కృతిశెట్టి)లపై పడుతుంది. వారిద్దరు పిల్లాడిని ఎలా పెంచారు? అసలు సుభద్ర ఎవరు? ఖుషీతో ఆమెకున్న సంబంధం ఏంటి? ఖుషీని పెంచే క్రమంలో సుభద్ర - విక్రమ్ ఎలా దగ్గరయ్యారు? అప్పటికే పెళ్లి నిశ్చయమైన సుభద్ర.. విక్రమ్తో రిలేషన్కు ఒప్పుకుందా? లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
నటుడు శర్వానంద్.. విక్రమ్ పాత్రలో చాలా సెటిల్డ్గా నటించాడు. ఫుల్ ఎనర్జీతో కనిపించి ఆకట్టున్నాడు. కామెడీ, లవ్, ఎమోషన్తూ కూడిన సన్నివేశాల్లో తనదైన మార్క్తో అలరించాడు. హీరోయిన్ కృతి శెట్టికి ఇందులో ప్రాధాన్యం ఉన్న పాత్రనే లభించింది. శర్వానంద్ - కృతిశెట్టి కెమెస్ట్రీ ఆకట్టుకుంది. అటు మాస్టర్ విక్రమ్ ఆదిత్య.. ఖుషీ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో ఆ బాలుడి పాత్రే ఎంతో కీలకం. ఇక రాజ్ కందుకూరి, త్రిగుణ్ పాత్రలు కథకు ఎంతో బలాన్ని అందించాయి. వెన్నెల కిషోర్ తనదైన కామెడీ టైమింగ్తో నవ్వించాడు. విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో రాహుల్ రవీంద్రన్ మెప్పించాడు. సచిన్ ఖేదెకర్, సీత, ముఖేష్ రిషి, తులసి, సీరత్ కపూర్ తమదైన నటనతో ఆకట్టుకున్నారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
తల్లిదండ్రులు - పిల్లల మధ్య బాండింగ్ ఎలా ఉండాలన్న కాన్సెప్ట్తో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య 'మనమే' సినిమాను తెరకెక్కించారు. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా ఆడియన్స్ను ఆకట్టుకునే ప్రయత్నంలో కొద్దిమేర సక్సెస్ అయ్యారు. జాలీగా తిరిగే హీరో.. ఫ్రెండ్ కొడుకు బాధ్యతను మోయాల్సి రావడం, ఇందుకు హీరోయిన్ సహకరించడం, వాటి తాలుకా వచ్చే సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ ఓ మాదిరిగా గడిచిపోయింది. ఇక సెకండాఫ్కు వచ్చేసరికి దర్శకుడు కథ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసినట్లు అనిపిస్తుంది. కథతో సంబంధం లేని సన్నివేశాలు తెరపై జరుగుతుండటం కన్ఫ్యూజన్ను క్రియేట్ చేస్తాయి. ఇక క్లైమాక్స్ను మంచి ఎమోషనల్ సీన్స్తో ముగించడం సినిమాకు ప్లస్ అయ్యింది. అయితే విలన్ ట్రాక్ను ఇంకాస్త బెటర్గా రాసుకుంటే బాగుండేది. సినిమాలో చాలా చోట్ల ఎమోషనల్ మిస్ అయ్యింది. మెుత్తంగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య అనుకున్న పాయింట్ బాగానే ఉంది కానీ దాన్ని తెరకెక్కించే క్రమంలోనే కాస్త తడబడ్డాడు.
టెక్నికల్గా
టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమాటోగ్రఫీ కలర్ఫుల్గా ఉంది. లండన్ లొకేషన్స్ని బాగానే క్యాప్చర్ చేశారు. పాటలు పెద్దగా గుర్తుండవు గానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మూవీకి తగ్గట్లు ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాతలు పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
శర్వానంద్, మాస్టర్ విక్రమ్ ఆదిత్య నటనఎమోషనల్ సీన్స్సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
సాగదీత సీన్స్విలన్ ట్రాక్ఎడిటింగ్
Telugu.yousay.tv Rating : 3/5
https://telugu.yousay.tv/do-you-know-these-top-secrets-about-kriti-shetty.html
జూన్ 07 , 2024
This Week Movies: ఈ వారం మీ ఆనందాన్ని రెట్టింపు చేసే చిత్రాలు/ సిరీస్లు ఇవే!
ఈ సమ్మర్లో ఇప్పటివరకూ చిన్న చిత్రాలే థియేటర్లలో సందడి చేశాయి. అయితే జూన్ తొలి వారంలోనూ చిన్న సినిమాలే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు రాబోతున్నాయి. ఇందులో స్టార్ హీరోయిన్లకు సంబంధించిన లేడీ ఒరియెంటేడ్ మూవీస్ ఉన్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికరమైన చిత్రాలు పలకరించేందుకు రెడీగా ఉన్నాయి. మరి ఈ వారం థియేటర్లలో వస్తున్న చిత్రాలేంటి? ఓటీటీలో ఏయే సినిమాలు, సిరీస్లు రాబోతున్నాయో ఓ లుక్కేయండి.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
మనమే
స్టార్ హీరో శర్వానంద్, హీరోయిన్ కృతిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మనమే’ (Manamey). శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మాస్టర్ విక్రమ్ ఆదిత్య ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా ఈ నెల 7న థియేటర్లలోకి రానుంది. ప్రతీ ఒక్కరు కనెక్ట్ అయ్యే చిత్రం ఇదని మూవీ టీమ్ తెలిపింది. ఫ్యామిలీగా వెళ్లి ఈ సినిమాను అస్వాదించవచ్చని పేర్కొంది.
సత్యభామ
ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సత్యభామ’ (Satyabhama Movie). సుమన్ చిక్కాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కాజల్.. పోలీసు ఆఫీసర్గా నటించింది. ఈ చిత్రం జూన్ 7న విడుదల కానుంది. సత్యభామ ఓ విఫ్లవం అంటూ ఇటీవల కాజల్ చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలు పెంచింది.
రక్షణ
స్టార్ నటి పాయల్ రాజ్పుత్ పోలీసు పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘రక్షణ’ (Rakshana). ప్రణదీప్ ఠాకూర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. రోషన్, మానస్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 7న థియేటర్లలోకి రానుంది. ఓ పోలీసు ఆఫీసర్ జీవితంలో జరిగిన సంఘటన స్ఫూర్తిగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.
లవ్ మౌళి
నవదీప్ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్ మౌళి’ (Love Mouli). పంఖురి గిద్వానీ, భావన సాగి హీరోయిన్లుగా చేశారు. సి స్పేస్ సంస్థ సినిమాను నిర్మించింది. ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఎందుకు విడిపోతుంటారు? రాజీ పడితేనే బంధాలు నిలుస్తాయా? అన్న కాన్సెప్ట్తో ఈ మూవీని నిర్మించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
వెపన్
సత్యరాజ్, వసంత్ రవి ప్రధాన పాత్రలో నటించిన ‘వెపన్’ చిత్రానికి గుహన్ సెన్నియ్యప్పన్ దర్శకత్వం వహించారు. తాన్యా హోప్, రాజీవ్ మేనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డీసీ, మార్వెల్ తరహాలో సూపర్ హ్యూమన్ కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. జూన్ 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / సిరీస్లు
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateShooting StarsMovieEnglishNetflixJune 03Hitler and NazeesSeriesEnglishNetflixJune 05How To Rob A BankMovieEnglishNetflixJune 05Bade Mia Chote MiaMovieHindiNetflixJune 06Sweet ToothSeriesEnglishNetflixJune 06Hit ManMovieEnglishNetflixJune 07Perfect Match 2SeriesEnglishNetflixJune 07MaidanMovieHindiAmazon PrimeJune 05GunahSeriesHindiDisney + HotstarJune 05ClippedSeriesEnglishDisney + HotstarJune 04Star Wars: The EcolightSeriesEnglishDisney + HotstarJune 04The Legend Hanuman SeriesHindiDisney + HotstarJune 05GullakSeriesHindiSonyLIVJune 07Varshangalkku SheshamMovieMalayalamSonyLIVJune 07Boomer UncleMovieTamilAhaJune 07AbigailMovieEnglishBook My ShowJune 07Black OutMovieHindiJio CinemaJune 07
జూన్ 03 , 2024
Malavika Mohanan: వైట్ అరేబియన్ గుర్రంలా మాళవిక అందాలు
మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్.. తన గ్లామర్ షోతో మరోమారు నెట్టింట వైరల్గా మారింది. చాలీ చాలని గౌనులో ఫొటో షూట్ నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించింది.
తాజాగా ఫ్లవర్ డాట్ స్లీవ్లెస్ గౌనులో కనిపించిన ఈ అమ్మడు తన ఎద అందాలతో సోషల్ మీడియాలో రచ్చ రేపింది.
మతిపోగొట్టే విధంగా థైస్ అందాలను చూపిస్తూ ఫ్యాన్స్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. చురకత్తుల్లాంటి చూపులతో మరోమారు వారి మనసు దోచేసింది.
ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ ‘ఏం సొగసురా బాబు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మాళవిక హాట్ పిక్స్ను విపరీతంగా షేర్ చేస్తూ ట్రెండింగ్ చేస్తున్నారు.
ఈ బ్యూటీ వ్యక్తిగత విషయాలకు వస్తే.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మోహన్కు మాళవిక మోహన్ కుమార్తె. ఆమె కుటుంబం కేరళకు చెందినది అయినా పుట్టి పెరిగింది మాత్రం ముంబైలోనే.
‘పెట్టం పోలె’ అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది మాళవిక. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘పేట’ చిత్రంలో కీలక పాత్రలో నటించింది.
అనంతరం ‘మాస్టర్’ సినిమాలో విజయ్ సరసన నటించి స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఈ సినిమా తరువాత నుంచి మాళవిక వరుస అవకాశాలను అందుకుంటూ వస్తోంది.
ఈ క్రమంలోనే ధనుష్ పక్కన ‘మారన్’ చిత్రంలో నటించి మాళవిక తన క్రేజ్ను మరింత పెంచుకుంది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.
2020లో 'మసాబా మసాబా' అని టెలివిజన్ సిరీస్లోనూ మాళవిక నటించింది. ఇది నెట్ఫ్లిక్స్ వేదికగా ఇంగ్లీషు భాషలో స్ట్రీమింగ్లో ఉంది.
గతేడాది క్రిస్టీ (Christy) అనే మలయాళ చిత్రంలో నటించిన మాళవిక.. తన నటనతో అక్కడి ప్రేక్షకులను కట్టిపడేసింది.
ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) హీరోగా చేస్తోన్న ‘రాజా సాబ్’ (Raja Saab)లో మాళవిక హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా సక్సెస్తో తెలుగులో మరిన్ని ఆఫర్లు దక్కించుకోవాలని ఈ ముద్దుగుమ్మ భావిస్తోంది.
‘రాజా సాబ్’ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లోనూ గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం విజయం సాధిస్తే మాళవికకు పాన్ ఇండియా స్థాయిలో తిరుగుండదని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.
తమిళంలో విక్రమ్తో ‘తంగలాన్’ (Thangalaan) అనే సినిమాలో మాళవిక నటిస్తోంది. అలాగే హిందీలో ‘యుద్ర’ (Yudhra) ఫిల్మ్లో చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
ఇక మాళవిక అవార్డుల విషయానికి వస్తే.. 2019లో 'బియాండ్ ది క్లౌడ్స్' అనే బాలీవుడ్ చిత్రానికి గాను 'యాక్టింగ్ సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును ఆమె గెలుచుకుంది.
అలాగే 2022లో ‘మాస్టర్’ చిత్రానికి గాను బెస్ట్ అరేంగేట్ర నటిగా మాళవిక మోహనన్ నామినేట్ అయ్యింది. కొద్దిలో సైమా అవార్డును చేజార్చుకుంది.
వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ మాళవిక చురుగ్గా వ్యవహరిస్తోంది. తన అందాల ఆరబోతతో ఫ్యాన్స్ను అలరిస్తోంది.
స్టన్నింగ్ ఫిగర్తో హాట్ ఫోటో షూట్లు చేస్తూ ఆమె నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను 4 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.
మే 27 , 2024
Kannappa: 15 ఏళ్ల తర్వాత ప్రభాస్తో జత కట్టబోతున్న బాలీవుడ్ బ్యూటీ..!
నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) కలల ప్రాజెక్ట్గా సిద్ధమవుతోన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ‘మహాభారత’ సిరీస్ని రూపొందించిన ముఖేష్ కుమార్ సింగ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో చేయనుండగా.. శివరాజ్కుమార్, మోహన్లాల్, శరత్ కుమార్, మోహన్లాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు ఈ సినిమా కోసం పనిచేస్తున్నట్లు తెలిసింది. ఇదిలాంటే తాజాగా ‘కన్నప్ప’ సినిమాపై ఓ అప్డేట్ వచ్చింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు సంబంధించిన విషయం కావడంతో ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి!
‘కన్నప్ప’ చిత్రంలో ప్రభాస్ శివుడుగా నటించడం ఇప్పటికే ఖరారైంది. పార్వతి దేవి పాత్రలో తమిళ లేడి సూపర్ స్టార్ నయనతార (Nayanthara) చేయనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే తాజా అప్డేట్ ప్రకారం ఆ పాత్రను బాలీవుడ్ నటి పోషించబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ‘కంగనా రనౌత్’ (Kangana Ranaut) ప్రభాస్ పక్కన నటిస్తుందని అంటున్నారు. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. అలాగే మూవీకి సంబంధించిన మరిన్ని విషయాలు కూడా బయటకి రానున్నట్లు తెలుస్తోంది.
https://twitter.com/GetsCinema/status/1759893440500846829
15 ఏళ్ల తర్వాత..
ప్రభాస్-కంగనా కలిసి నటించడం ఇదే తొలిసారి కాదు. గతంలో వచ్చిన ‘ఏక్నిరంజన్’ (2009) చిత్రంలోనూ వీరిద్దరూ జోడీగా కనిపించారు. తెలుగులో కంగనాకు అదే తొలి చిత్రం. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే కలెక్షన్లు రాబట్టడంలో మాత్రం విఫలమైంది. ఈ సినిమాలో ప్రభాస్-కంగనా జోడీకి మంచి మార్కులే పడ్డాయి. వీరి కెమెస్ట్రీ చాలా బాగుందంటూ అప్పట్లో వార్తలు సైతం వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరు కలిసి నటించాలని భావించినప్పటికీ వీలు పడలేదు. ప్రస్తుత ప్రచారం నిజమైతే 15 ఏళ్ల తర్వాత ఈ జోడి మళ్లీ వెండితెరపై మెరవనుంది.
కన్నప్పపై విష్ణు ఫోకస్
తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్పను మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తూ.. ప్రతీ విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ న్యూజిలాండ్లో జరిగింది. టీమ్లో అందరికీ గాయాలు అవుతున్నా కూడా షూటింగ్కు మాత్రం బ్రేక్ ఇవ్వలేదు. విష్ణుకి కూడా షూటింగ్ టైమ్లో గాయాలైనట్లు వార్తలు వచ్చాయి. ఇలా ఎన్ని అడ్డంకులు వచ్చినా కన్నప్ప టీమ్ న్యూజిలాండ్ షెడ్యూల్ను పూర్తి చేసుకుని కొద్ది రోజుల క్రితం ఇండియాకు తిరిగొచ్చింది.
https://twitter.com/i/status/1730567740325535838
ఆకట్టుకున్న ఫస్ట్లుక్
గతేడాది నవంబర్లో మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా 'కన్నప్ప' ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర బృందం విడుదల చేసింది. హీరో ముఖం కనిపించకుండా శివలింగం వైపు ఓ యోధుడు విల్లు ఎక్కుపెట్టినట్లు ఈ పోస్టర్లో చూపించారు. దీన్ని షేర్ చేసిన మంచు విష్ణు.. 'కన్నప్ప' ప్రపంచంలోకి అడుగుపెట్టండి అంటూ క్యాప్షన్ జోడించారు. నాస్తికుడైన యోధుడు శివుడికి పరమభక్తుడిగా ఎలా మారడన్నది ఈ చిత్రంలో చూపించనున్నట్లు ఆ సందర్భంలో విష్ణు తెలిపారు.
‘కన్నప్ప’ వచ్చేది అప్పుడేనా!
కన్నప్ప సినిమా రిలీజ్కు సంబంధించి ఇటీవల ఓ వార్త బయటకొచ్చింది. ఈ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ను న్యూజిలాండ్లో ఫినిష్ చేసిన మూవీ బృందం.. తదుపరి షూట్ను కూడా త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తోందట. ఈ దసరాకు ‘కన్నప్ప’ను రిలీజ్ చేయాలని మంచు విష్ణు టార్గెట్గా పెట్టుకున్నాడని అంటున్నారు. దసరాకు రిలీజ్ చేస్తే ప్రేక్షకులకు మరింత రీచ్ అవుతుందని టీమ్ భావిస్తోందట. పాన్ ఇండియా రేంజ్లో విడుదల అవుతున్న ‘కన్నప్ప’ కోసం అన్నీ భాషల్లోని స్టార్స్తో ప్రమోషన్స్ చేయాలనే ఆలోచనతో టీమ్ ఉందని టాక్.
ఫిబ్రవరి 21 , 2024
This Week OTT Movies: ఈ వారం తెలుగులో సందడి చేసే OTT సినిమాలు ఇవే..!
ఎప్పటిలాగే ఈ వారం (This Week Movies) కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్సిరీస్లు ఎంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు
సుందరం మాస్టర్
హాస్య నటుడు హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సుందరం మాస్టర్’గా (Sundaram Master). దివ్య శ్రీపాద కథానాయిక. ఈ చిత్రాన్ని హీరో రవితేజ (RaviTeja), సుధీర్ కుమార్ కుర్రు సంయుక్తంగా నిర్మించారు. కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘సుందరం మాస్టర్’.. ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మస్తు షేడ్స్ ఉన్నయ్రా!
హాస్యనటుడు అభినవ్ గోమఠం లీడ్ రోల్లో చేసిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్రా!’ (Masthu Shades Unnai Ra). తిరుపతి రావు ఇండ్ల దర్శకుడు. తరుణ్ భాస్కర్, అలీ రెజా, వైశాలి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్.వి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భావోద్వేగాల మేళవింపుతో మంచి కామెడీ ఎంటర్టైనర్గా దీన్ని రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
సిద్ధార్థ్ రాయ్
బాల నటుడిగా పలు చిత్రాలతో (This Week Movies) అలరించిన దీపక్ సరోజ్ హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అతడు నటించిన ‘సిద్ధార్థ్ రాయ్’ (Siddharth Roy) చిత్రం ఈ వారమే విడుదల కాబోతోంది. ఇందులో తన్వి నేగి కథానాయిక. వి.యశస్వి దర్శకుడు. కొత్తతరం ప్రేమకథతో రూపొందిన ఈ సినిమా ప్రచార చిత్రాలు యువతను ఆకట్టుకుంటున్నాయి. ఫిబ్రవరి 23న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ముఖ్య గమనిక
విరాన్ ముత్తంశెట్టి హీరోగా.. కెమెరామెన్ వేణు మురళీధర్ తెరకెక్కించిన చిత్రం ‘ముఖ్య గమనిక’ (Mukhya Gamanika). లావణ్య కథానాయిక. రాజశేఖర్, సాయికృష్ణ సంయుక్తంగా నిర్మించారు. ‘థ్రిల్లింగ్ అంశాలతో సాగే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 23నే విడుదల కానుంది.
సైరెన్
జయం రవి, అనుపమ పరమేశర్వన్, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్ డ్రామా ‘సైరెన్’ (Siren). ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో గంగ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తిసురేష్ పోలీసు ఆఫీసర్గా నటిస్తున్న ఈ చిత్రంలో జయం రవి రెండు విభిన్నమైన పాత్రలు పోషించారు.
ఆర్టికల్ 370
అందాల తార యామీ గౌతమ్ (Yami Gautam) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆర్టికల్ 370’ (article 370). ఆదిత్య సుహాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆర్టికల్ 370 నేపథ్యంలో కశ్మీర్లో జరిగిన పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీలో వచ్చే చిత్రాలు/సిరీస్లు ఇవే
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
Title CategoryLanguagePlatformRelease DateApartment 404Series English/KoreanAmazon PrimeFeb 23PoacherMovieTelugu Amazon PrimeFeb 23Will Trent Series EnglishDisney+hotstarFeb 21Malaikottai VaalibanMovie MalayalamDisney+hotstarFeb 23The Buried TruthAvatar the Last AirbenderSeriesEnglish Netflix Feb 23 The Buried TruthSeries HindiNetflix March 17
ఫిబ్రవరి 19 , 2024
Medha Shankar: ‘12th ఫెయిల్’ సంచలనం.. మేధా శంకర్ గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
హిందీలో తెరకెక్కిన '12th ఫెయిల్' (12th Fail) చిత్రం.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. ఇందులో హీరోయిన్గా నటించిన మేధా శంకర్ (Medha Shankar)కు రోజు రోజుకూ నెట్టింట ఫాలోయింగ్ పెరిగిపోతోంది. ఆమె నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో మేధా శంకర్ గురించిన పలు ఆసక్తికర విషయాలు మీకోసం.
నోయిడాలో పుట్టిన ఈ భామ (Medha Shankar).. ఫ్యాషన్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. అనంతరం మోడల్గా కెరీర్ ప్రారంభించింది.
ఎఫ్బీబీ నిర్వహించిన ఫెమినా మిస్ ఇండియా (2016) పోటీల్లో పాల్గొని మేధా అందరి దృష్టిని ఆకర్షించింది. పోటీల్లో రాణించి అందరి ప్రశంసలు అందుకుంది.
మోడలింగ్లోనే కాకుండా సంగీతంపైనా మేధా (Medha Shankar)కు పట్టు ఉంది. సితార్, హార్మోనియం, కీబోర్డు ప్లే వంటి వాటిల్లో ఆమె శిక్షణ కూడా తీసుకుంది.
నటనపై మక్కువతో నోయిడా నుంచి ముంబయికి మకాం మార్చిన మేధా.. 'విత్ యు ఫర్ యు ఆల్వేజ్' అనే షార్ట్ ఫిల్మ్తో నటిగా మారింది.
ఆ తర్వాత హిందీ వెబ్సిరీస్లలో నటించే ఆవకాశాన్ని దక్కించుకుంది. బీకమ్ హౌజ్ (2019), దిల్ బేకరార్ (2021) సిరీస్లలో కీలక పాత్రలు పోషించి బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది.
ఆ తర్వాత 'శాదీస్తాన్' (2021) సినిమాతో మేధా బాలీవుడ్లోకి రంగ ప్రవేశం చేసింది. సంగీతం ఇతివృత్తంగా రూపొందిన ఈ చిత్రంలో అర్షి మోదీ పాత్రలో ఆమె ఆకట్టుకుంది.
2022లో వచ్చిన 'మ్యాక్స్, మిన్ అండ్ మ్యూజికీ'లో భాయ్ఫ్రెండ్ను త్యాగం చేసే అమ్మాయిగా యువతను మెప్పించింది.
ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శితం కావడంతో మేధా శంకర్ పేరు ప్రముఖంగా బాలీవుడ్లో వినిపించింది.
మూడో సినిమా '12th ఫెయిల్'తో శ్రద్ధా జోషిగా ఒదిగిపోయి విశేష క్రేజ్ సంపాదించుకుంది మేధా. అందులోని 'బోలో నా' పాటను స్వయంగా ఆమె పాడటం విశేషం.
‘12th ఫెయిల్’ విడుదలకు ముందు 16వేల మంది ఫాలోవర్స్ను కలిగి ఉన్న ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రస్తుతం 20 లక్షలకు చేరుకుంది.
సోషల్మీడియా మేధా క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో చెప్పడానికి దీనికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రస్తుతం షేర్ చేస్తున్న ఫొటోలకు లక్షల్లో లైక్స్, వేలల్లో కామెంట్లు వస్తున్నాయి.
ఇక '12th ఫెయిల్' సినిమాకు వస్తే.. ఐపీఎస్ అధికారి మనోజ్కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ రూపొందింది. విక్రాంత్ మస్సే ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో మేధా ఆయన సతీమణిగా నటించింది.
ఈ స్ఫూర్తిదాయక చిత్రం ప్రస్తుతం డిస్నీ+హాట్స్టార్లో అత్యధిక వీక్షణలతో దూసుకువెళ్తోంది. ఈ సినిమాను చూసిన పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తూ సోషల్మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
కెరీర్ తొలినాళ్లలో ఎన్నోసార్లు తిరస్కరణకు గురైన మేధా శంకర్ ఓ ఇంటర్యూలో చెప్పింది. ఆత్మ విశ్వాసం, పట్టుదల ఉంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుగోగలమని ఓ సందర్భంలో పేర్కొంది.
సవాళ్లు విసిరే పాత్రలనే సినిమాల్లో ఎంచుకుంటానని మేధా చెబుతోంది. నటన జీవితంలో ఓ భాగమేగానీ అదే జీవితం కాదన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేసింది.
జనవరి 20 , 2024
#90’s Web Series Review: మధ్యతరగతి ఫ్యామిలీలకు ప్రతీరూపం #90’s.. సిరీస్ ఎలా ఉందంటే?
నటీనటులు: శివాజీ, వాసుకి, మౌళి, వాసంతిక, రోహన్ రాయ్, స్నేహల్ తదితరులు
రచనం, దర్శకుడు: ఆదిత్య హాసన్
సంగీతం: సురేష్ బొబ్బలి
సినిమాటోగ్రఫీ: అజాజ్ మహ్మద్
ఎడిటింగ్: శ్రీధర్ సోంపల్లి
నిర్మాత: రాజశేఖర్ మేడారం
శివాజీ, వాసుకి జంటగా నటించిన లెేటెస్ట్ వెబ్సిరీస్ ‘#90's. ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనేది ట్యాగ్లైన్. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో వచ్చిన ఈ వినోదాత్మక సిరీస్ను రాజశేఖర్ మేడారం నిర్మించారు. మధ్యతరగతి కుటుంబ భావోద్వేగాలతో నవ్వులు పూయిస్తూ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సిరీస్ను రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. కాగా ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో ఈ సిరీస్ ప్రసారంలోకి వచ్చింది. మరి దీని కథేంటి? లెక్కల మాస్టార్గా శివాజీ ఎలా నటించారు? ఇప్పుడు చూద్దాం.
కథ
చంద్రశేఖర్ (శివాజీ) ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టర్. భార్య రాణి (వాసుకీ), పిల్లలు రఘు (ప్రశాంత్), దివ్య (వాసంతిక), ఆదిత్య (రోహన్)తో కలిసి జీవిస్తుంటాడు. ప్రభుత్వ టీచర్ అయినప్పటికీ పిల్లల్ని ప్రైవేటు స్కూల్లో జాయిన్ చేస్తాడు. వారి చదువుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంటాడు. 10th చదువుతున్న రఘు జిల్లా ఫస్ట్ వస్తాడని చంద్రశేఖర్ ఆశిస్తాడు. మరి వచ్చిందా? క్లాస్మేట్ సుచిత్ర (స్నేహాల్ కామత్), రఘు మధ్య ఏం జరిగింది? చంద్రశేఖర్ ఇంట్లో ఉప్మా కథేంటి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పిల్లలు, పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.
ఎవరెలా చేశారంటే
చంద్రశేఖర్ పాత్రలో శివాజీ ఒదిగిపోయారు. మిడిల్ క్లాస్ తండ్రులందరికీ ప్రతినిధిగా ఆయన కనిపించారు. మధ్య తరగతి గృహిణి రాణిగా వాసుకీని చూస్తే 90లలో పిల్లలకు తమ తల్లి గుర్తుకు వస్తుంది. భర్తతో ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇంట్లో పరిస్థితి గురించి చెప్పే సన్నివేశంలో ఆమె అద్భుత నటన కనబరిచారు. రఘు పాత్రలో మౌళి నటన సహజంగా ఉంది. అతడు చక్కగా చేశాడు. వాసంతి, స్నేహాల్ కామత్ అందంగా నటించారు. చిన్నోడు రోహన్ అయితే పక్కా నవ్విస్తాడు. చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల అతిథి పాత్రలో మెప్పిస్తారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
90లలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాతావరణాన్ని దర్శకుడు ఆదిత్య హాసన్ చక్కగా తెరపై ఆవిష్కరించారు. కథ రొటిన్గా అనిపించినప్పటికీ క్యూట్ & లిటిల్ మూమెంట్స్తో దర్శకుడు ఆకట్టుకున్నాడు. ఆరు ఎపిసోడ్స్ కలిగిన ఈ సిరీస్తో ప్రేక్షకులను 90ల నాటి రోజుల్లోకి తీసుకెళ్లి ఆ స్మృతులను ఆదిత్య గుర్తుచేశారు. కుటుంబ విలువలను సిరీస్లో చక్కగా చూపించారు. చిన్న చిన్న విషయాల్లో సంతోషం వెతుక్కునే '90స్' మధ్యతరగతి కుటుంబాన్ని కళ్లకు కట్టారు. ముఖ్యంగా మనం 90ల నాటి పిల్లలమైతే ఈ సిరీస్కు కనెక్ట్ అవుతాం. దర్శకుడు ఆదిత్య హాసన్ ప్రతి ఒక్కరికీ అందమైన జ్ఞాపకాలను అందించారు.
టెక్నికల్గా
సాంకేతికంగా #90’s సిరీస్ బాగుంది. సంగీతం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అన్నీ చక్కగా కుదిరాయి. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం సన్నివేశాలు ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయ్యేలా చేసింది. అప్పటి పరిస్థితులను ఆవిష్కరించడానికి యూనిట్ పడిన కష్టం స్క్రీన్పై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
నటీనటులుకథ, దర్శకత్వంసాంకేతిక విభాగం
మైనస్ పాయింట్స్
నెమ్మదిగా సాగే కథనం
రేటింగ్: 3/5
జనవరి 05 , 2024
Telugu Super Hit Songs 2023: ఈ ఏడాది యూట్యూబ్ను షేక్ చేసిన తెలుగు పాటలు ఇవే!
ఈ ఏడాది టాలీవుడ్లో పదుల సంఖ్యలో సినిమాలు, వందల సంఖ్యలో పాటలు విడుదలై తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా కొన్ని తెలుగు పాటలు జాతీయస్థాయిలో ట్రెండింగ్లో నిలిచాయి. యూట్యూబ్ను షేక్ చేస్తూ అత్యధిక ఆదరణను సంపాదించాయి. 2023లో శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్న పాటలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
మా బావ మనోభావాలు..
ఈ ఏడాది తెలుగు ఆడియన్స్ను విపరీతంగా ఆకర్షించిన ఐటెం సాంగ్.. 'మా బావ మనోభావాలు..'. వీరసింహారెడ్డి సినిమాలోని ఈ పాట తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. ఈ సాంగ్లో బాలయ్య ఇద్దరు హీరోయిన్లతో స్టెప్పులేసి అదరగొట్టారు. సాహితి, యామిని, రేణు కుమార్ ఆలపించిన ఈ పాటను రామ జోగయ్యశాస్త్రి రాశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.
https://www.youtube.com/watch?v=DCrO12C5oho
ఓ రెండు ప్రేమ మేఘాలిలా
'బేబీ' చిత్రం ఈ ఏడాది ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఆ సినిమాలోని 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా' పాట గుండెల్ని పిండేస్తుంది. యూత్ను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సాంగ్.. యూట్యూబ్లో అత్యధిక వీక్షణలను పొందింది.
https://www.youtube.com/watch?v=wz5BIbhqhTI
మాస్టారు మాస్టారు
ధనుష్ హీరోగా రూపొందిన 'సార్' చిత్రం.. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలోని 'మాస్టారు మాస్టారు' సాంగ్ సంగీత ప్రియులను కట్టిపడేసింది. ఈ పాటను ప్రముఖ కన్నడ గాయని శ్వేతా మోహన్ ఆలపించారు.
https://www.youtube.com/watch?v=AXSm49NGkg8
పొట్టిపిల్ల
జబర్దస్త్ వేణు డైరెక్ట్ చేసిన ‘బలగం’ సినిమాలోని ‘పొట్టిపిల్ల’ సాంగ్ ఈ ఏడాది బాగా వినిపించింది. చాలా ఫంక్షన్లు, యూత్ ఈవెంట్లలో మారుమోగింది. ముఖ్యంగా యువత ఈ పాటపై రీల్స్ చేసుకొని షేర్ చేసుకున్నారు. పొట్టిపిల్ల పాటను సింగర్ రామ్ మిరియాల ఆలపించారు.
https://www.youtube.com/watch?v=CDNb6zyybDg
చంకీల అంగీలేసి
హీరో నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం 'దసరా'. ఈ సినిమాలోని 'చంకీల అంగిలేసి' అప్పట్లో విపరీతంగా ట్రెండింగ్ అయ్యింది. ప్రతి ఒక్కరు ఈ పాటకు పెద్ద ఎత్తున రీల్స్ చేసి సందడి చేశారు. ముఖ్యంగా సెలబ్రిటీలు సైతం ఈ పాటపై అద్భుత రీల్స్ చేసి అలరించారు.
https://www.youtube.com/watch?v=9O-mBYAqM1c
నచ్చావులే నచ్చావులే
సాయిధరమ్ తేజ్, సంయుక్త జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'విరూపాక్ష'. ఈ సినిమాతో పాటే ఇందులోని 'నచ్చావులే నచ్చావులే' సాంగ్ మంచి ఆదరణను సంపాదించింది. కృష్ణకాంత్ రాసిన ఈ పాటను కార్తిక్ ఆలపించగా.. అజనీశ్ లోక్నాథ్ స్వరపరిచారు.
https://www.youtube.com/watch?v=TUGfWIO_fFI
ఆరాథ్య
విజయ్ దేవరకొండ, సమంత జంటగా చేసిన చిత్రం ‘ఖుషీ’. ఈ సినిమాలోని అన్ని పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘ఆరాథ్య’ సాంగ్ యూత్కు మరింత బాగా కనెక్ట్ అయ్యింది. చాలా మందికి ఫేవరేట్ సాంగ్గా మారిపోయింది. యూట్యూబ్లోనూ అధిక వీక్షణలు పొందింది.
https://www.youtube.com/watch?v=wlC_eFbxwDo
సమ్మోహనుడా..
రూల్స్ రంజన్ సినిమాలోని ‘సమ్మోహనుడా’ సాంగ్ ఈ ఏడాది సోషల్ మీడియాను షేక్ చేసింది. అమ్రిష్ ఇచ్చిన ట్యూన్.. శ్రీయా గోషల్ వాయిస్ అందర్నీ కట్టిపడేసింది. యూట్యూబ్లో ట్రెండింగ్గానూ నిలిచింది. సాంగ్ రిలీజ్ అనంతరం ట్రెండ్ అయిన పది రీల్స్లో ఐదు ఈ పాటకు సంబంధించినవే కావడం విశేషం.
https://www.youtube.com/watch?v=aJQcn34K_S8
నిజమే నే చెబుతున్నా
ఊరి పేరు భైరవకోన సినిమాలోని 'నిజమే నే చెబుతున్నా' సాంగ్ యూట్యూబ్లో అత్యధిక వీక్షణలతో దూసుకెళ్తోంది. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ పాటకు శ్రీమణి సాహిత్యాన్ని సమకూర్చారు.
https://www.youtube.com/watch?v=2pgx-tajxwE
జమల్ జమాలో
యానిమల్ సినిమాలోని ‘జమల్ జమాలో’ పాట యూట్యూబ్ను షేక్ చేస్తోంది. రిలీజైన పదిహేను గంటల్లోనే ఏడు మిలియన్లకుపైగా వ్యూస్ను సొంతం చేసుకుంది. జమల్ జమాలో పాట నిజానికి ఒక ఇరాన్ సాంగ్. ఈ పాటను ఇరానియన్ కవి బిజాన్ సమాందర్ రాశారు. 1958లో ఈ పాట వెలుగులోకి వచ్చింది. అప్పటినుంచి ఇరాన్లో పెళ్లి వేడుకలతో పాటు ఇతర పంక్షన్స్లో ఈ పాట తప్పకుండా ఉండటం ఆనవాయితీగా వస్తోంది.
https://www.youtube.com/watch?v=PmdyY38g6Rg
డిసెంబర్ 28 , 2023
TIGER 3 Review in Telugu: సల్మాన్ ఖాన్ యాక్షన్తో అదరగొట్టాడు.. కానీ!
నటీనటులు: సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, రేవతి, ఇమ్రాన్ హష్మీ, సిమ్రాన్, రద్ధీ డోంగ్రా, అనీష్ కురువిల్లా, కుముద్ మిశ్రా, మాస్టర్ విశాల్ జేత్వా, రణ్వీర్ షోరే.
డైరెక్టర్: ఆదిత్య చోప్రా
ప్రొడ్యూసర్: ఆదిత్య చోప్రా
మ్యూజిక్: తనూజ్ టికు
ఎడిటర్: రామేశ్వర్ S. భగత్
స్క్రీన్ ప్లే: శ్రీధర్ రాఘవన్
సినిమాటోగ్రఫీ: అనయ్ గోస్వామి
విడుదల తేదీ: 12/11/2023 (దీపావళి రోజున)
సల్మాన్ ఖాన్(TIGER 3 Review in Telugu) లెటెస్ట్ స్పై యాక్షన్ డ్రామా 'టైగర్ 3' దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఏక్థా టైగర్, టైగర్ జిందాహై సినిమాకు ఇది సీక్వెల్. మొదట వచ్చిన ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ కావడంతో టైగర్ 3పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్, టీజర్లో సల్మాన్ మాస్ యాక్షన్, కత్రినా కైఫ్ బ్యూటీ సినిమాపై అంచనాలను పెంచాయి. మరి టైగర్ 3 ఇంతకు ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? లేదా అనే విషయాలను ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
అవినాష్ అలియాస్ టైగర్(సల్మాన్ ఖాన్) భారత దేశం తరఫున 'రా' ఏజెంట్గా పనిచేస్తుంటాడు. ఆయన భార్య జోయా(కత్రినా కైఫ్) పాకిస్థాన్కు చెందిన మాజీ ISI ఏజెంట్. అయితే టైగర్ పాకిస్థాన్లో రా ఏజెంట్ గోపీ( రణ్వీర్ షోరే)ని ఉగ్రవాదుల నుంచి కాపాడుతాడు. అయితే గోపీ చనిపోయే ముందు జోయా గురించి ఓ నమ్మలేని నిజాన్ని చెబుతాడు. తన భార్య ఐస్ఐ ఏజెంట్ అని తెలుసుకున్న టైగర్ ఏం చేశాడు? అసలు జోయా తన భర్తను ఎందుకు మోసం చేసింది. భారత్- పాకిస్థాన్ ప్రభుత్వాలు వీరిద్దరి కోసం ఎందుకు వెతుకుతాయి అనేది మిగిలిన కథ
ఎలా ఉందంటే?
టైగర్ 3 సినిమా.. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై రేంజ్లో మాత్రం లేదు. భారీ యాక్షన్ విజువల్స్తో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడక్కడ ఆకట్టుకుంటుంది. సినిమాలో శత్రుదేశాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు 'భార్య భర్తలు' అయితే అనే పాయింట్ బాగున్నప్పటికీ.. దానికి తగ్గట్టుగా కథనం లేకపోవడం మైనస్ అని చెప్పాలి. సినిమా ఫస్టాఫ్, ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు మైనస్. ఎందుకంటే ఈ పార్ట్లో కథనం బలహీనంగా ఉంది. అయితే సెకండాఫ్లో(TIGER 3 Review in Telugu) వచ్చే యాక్షన్ సీక్వెన్స్ , క్లైమాక్స్ సీన్లు కొద్దిమేరకు మెప్పిస్తాయి. సులువుగా ప్రేక్షకుడు గెస్ చేసే స్క్రీప్ట్ను శ్రీధర్ రాఘవన్ రాసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకాస్త దీనిపై వర్క్ చేస్తే బాగుండేది. స్పై సినిమాలు అంటే ఆద్యంతం ఉత్కంఠ, ప్రతి సీన్లో ట్విస్ట్ను ప్రేక్షకుడు ఊహిస్తాడు. కానీ టైగర్ 3 సినిమాలో అవేమి కనిపించలేదు. ప్రేక్షకున్ని సినిమాలో ఎంగేజ్ చేయకుండా కథ సాగిందని చెప్పవచ్చు. సినిమా చివర్లో సల్మాన్ ఖాన్ను రక్షించేందుకు షారుఖ్ ఖాన్ రావడం, క్లైమాక్స్ సీన్లో హృతిక్ ఎంట్రీ సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయి.
ఎవరెలా చేశారంటే
సల్మాన్ ఖాన్ వన్ మ్యాన్ ఆర్మీ షో చేశాడు. టైగర్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. తన పాత్రలో జీవించాడు. తన యాక్షన్ స్టైల్తో ఇరగదీశాడు. ఆయనపై వచ్చిన కొన్ని ఎలివేషన్ సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఎమోషనల్ సీన్లలోనూ సల్మాన్ అద్భుతంగా నటించాడు. ఇక సల్మాన్- కత్రినా జంట కూడా స్క్రీన్పై ఆకట్టుకుంది. కత్రినా కాస్త ఓల్డ్ లుక్లో కనిపించినప్పటికీ యాక్టింగ్ బాగా చేసింది. తన బోల్డ్ లుక్స్తో ప్రేక్షకులకు కనువిందు చేసింది. ముఖ్యంగా టవల్ ఫైట్ సీన్లో ఆమె అందం యువ ప్రేక్షకులను రంజింపజేస్తుంది. ఇక విలన్గా నటించిన ఇమ్రాన్ హష్మీ తన పాత్ర పరిధిమేరకు నటించాడు. రా చీఫ్గా రేవతి, పాక్ ప్రైమ్ మినిస్టర్గా సిమ్రాన్ మెప్పించింది. క్లైమాక్స్లో పఠాన్గా వచ్చిన షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ సీన్లు సినిమాకే హైలెట్.
టెక్నికల్ పరంగా
సాంకేతికంగా టైగర్ 3 సినిమా ఉన్నతంగా ఉంది. అనయ్ గోస్వామి సినిమాటోగ్రఫీ సినిమాకే బాగా ప్లస్ అయింది. యాక్షన్ సీక్వెన్స్లో ఆయన పడిన కష్టం తెలుస్తుంది. ఇక తనూజ్ టీకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అలరిస్తుంది. యాక్షన్ సీన్లను(TIGER 3 Review) ఎలివేట్ చేసిందని చెప్పవచ్చు. డైరెక్టర్ ఆదిత్య చోప్రా ఇంకా బలమైన కథ రాసుకున్నప్పటికీ... అందుకు తగిన సీన్లు, కథనం పెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. ఉత్కంఠ భరితంగా సాగాల్సి కథనాన్ని ప్రేక్షకుడు ఊహించే విధంగా సాగింది.
బలాలు
సల్మాన్ ఖాన్ యాక్షన్ సీన్లు, కత్రినా కైఫ్ బోల్డ్ లుక్స్షారుఖ్ ఖాన్ కెమియో రోల్
బలహీనతలు
స్క్రీన్ ప్లేసహజత్వం లేని కొన్ని సీన్లుప్రేక్షకుడు ఊహించదగిన కథనం
చివరగా:
హై వోల్టేజ్ యాక్షన్ స్పై మూవీగా వచ్చిన టైగర్ 3లో.. సల్మాన్ ఖాన్ యాక్షన్ సీన్లు, కత్రినా కైఫ్ బోల్డ్ లుక్స్, షారుఖ్ ఎంట్రీ ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఈ సినిమా సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్తో పాటు ఇతర యాక్షన్ సీక్వెన్స్ ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మిగతా సగటు ప్రేక్షకులకు సినిమా నచ్చకపోవచ్చు.
రేటింగ్: 2.5/5
నవంబర్ 12 , 2023
Malavika Mohanan: తడి అందాలతో సోకుల విందు చేస్తున్న మలయాళి తెగింపు !
తమిళ్ స్టార్ నటి మాళవిక మోహన్ మరోసారి సోకుల విందు చేసింది. నదిలో జలకాలాడుతూ తడిసిన అందాలతో ఫోటో షూట్ చేసింది.
ట్సాన్సపరెంట్ వైట్ శారీలో పాల మీగడ లాంటి అందాలను కుర్రకారుకు విందు చేసింది. తడి అచ్ఛాదనతో అమ్మడి అందం ద్విగుణీకృతమైంది.
ఓవైపు తడిసిన ఎద అందాలు, వయ్యారపు నడుమందాలు మరోవైపు.. నాభి అందాల మేళవింపుతో కైఫెక్కిస్తోంది.
ఈ కుర్రదాని మత్తిక్కించే చూపులు తడిసిన దేహంతో ఉన్న అందాన్ని ఇంకాస్తా దొంతర్లు ఎక్కిస్తోంది
దక్షిణాది చిన్నదే అయినా గ్లామర్ను వడ్డించడంలో నార్త్ ముద్దు గుమ్మలకు ఏమాత్రం తీసిపోదు.
చీరకట్టినా, మోడ్రన్ డ్రెస్ వేసినా... అందాలను తనదైన శైలీలో వడ్డించడంలో ఈ మలయాళి తెగింపు దిట్ట
కనీసం వారానికో హాట్ ఫొటో షూట్ అయినా చేస్తూ కుర్రాళ్ల అందాల దాహం తీరుస్తుంటుంది
సూపర్ స్టార్ రజినీకాంత్ 'పేట' మూవీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ సోగసుల కోవకు పెద్దగా సక్సెస్ మాత్రం దక్కలేదు.
ఆ మధ్య లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో వచ్చిన మాస్టర్ చిత్రంలో నటించి మెప్పించింది. అయితే అవకాశాలు మాత్రం ఈ తడి అందానికి అంతగా రావడం లేదు.
అయితేనేం.. సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ను మాత్రం సంపాదించింది.
స్టన్నింగ్ ఫిగర్తో హాట్ ఫొటో షూట్ చేస్తూ... ఎప్పటికప్పుడూ వార్తల్లో నిలుస్తోంది.
మాళవిక మోహన్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మోహన్ కుమార్తే. ఆమె కుటుంబం కేరళకు చెందినది అయినా పుట్టి పెరిగింది మాత్రం ముంబైలోనే.
అలా సినీ నేపథ్యం ఉన్నా మలయాళి కుట్టి ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మలయాళంలో ఆమె నటించిన గ్రేట్ ఫాదర్ సినిమా మంచి విజయం సాధించింది.
ప్రస్తుతం తమిళ్లో తంగాళన్, హిందీలో యుద్ర మూవీల్లో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్స్ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది.
అక్టోబర్ 26 , 2023
Guntur Kaaram: త్రివిక్రమ్తో ఆ విషయంలో కుదరకే పూజా హెగ్డే బయటకొచ్చిందా? సంయుక్త మీనన్ ఎంట్రీ!
మహేష్ బాబు, త్రివిక్రమ్(Mahesh Babu-Trivikram) కాంబినేషన్లో గుంటూరు కారం సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ మూవీ గురించి ఏదొక వివాదం చర్చలకు మూల కేంద్రంగా మారుతునే ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తప్పుకున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) కూడా తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మార్పులే మార్పులు
ఇప్పటికే స్టోరీ మహేష్బాబుకు తగ్గట్టు లేదని ఓసారి మార్చివేశారు. కొన్ని కారణాల వల్ల ఫైట్ మాస్టర్స్ను తొలగించారు. రెండు షెడ్యూల్స్లో జరిగిన షూటింగ్ను కంప్లీట్గా పక్కకు పెట్టారు. ఇప్పుడు పూజా హెగ్డే సైతం బయటకు వెళ్లిపోయినట్లు తెలిసింది.
ఫలితంగా ఈ చిత్రం కాస్టింగ్లో భారీగా మార్పులు రానున్నాయి. పూజా హెగ్డే స్థానంలో మరొక స్టార్ హీరోయిన్ను తీసుకోవాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సంయుక్త మీనన్ లేదా త్రిషను సినిమాలోకి తీసుకోవాలని భావిస్తున్నారట.
అదే అసలు సమస్య
డేట్ సమస్యల కారణంగా పూజా హెగ్డే సినిమా నుంచి బయటకు వచ్చినట్లు తెలిసింది. జూన్- ఆగస్టు టైమ్ఫ్రేమ్లో పూజా హెగ్డే ఇతర సినిమాలు చేయాల్సి ఉంది. ఈ టైమ్లో గుంటూరు కారం సినిమా వల్ల ఇతర చిత్రాల షెడ్యూల్కు ఆటంకం కలుగుతుందని ఆమె భావించిందని సమాచారం. షెడ్యూల్స్ సరైన టైమ్కి పూర్తికాకపోవడం, కొన్ని సీన్లు రీషూట్ చేయడం, అనుకున్న సమయానికి షెడ్యూల్స్ పూర్తికాకపోయినా.. కొత్త షెడ్యూల్స్ ప్రకటించడం, కొన్ని షెడ్యూల్స్లో జరిగిన సన్నివేశాలను రీ షూట్ చేయడం వంటి వాటి పట్ల పూజా హెగ్డే తీవ్ర అసంతృప్తికి గురైనట్లు సమాచారం. ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడేందుకే.. గుంటూరు కారం ప్రాజెక్ట్ నుంచి పూజా హెగ్డే వైదొలిగినట్లు తెలిసింది.
తమన్ తప్పుకున్నట్లు ప్రచారం..
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సైతం ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. తమన్కు బదులు అనిరుధ్ను మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నట్లు బజ్ నడిచింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తమన్ క్లారిటీ ఇచ్చారు. కావాలని కొంత మంది కడుపు మంటతో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. అలాంటి ప్రచారాలను నమ్మొద్దని ఫ్యాన్స్కు విజ్ఞప్తి చేశారు. కడుపుమంట ఉన్నవాళ్లు తన ఆఫీస్ వద్దకు రావాలని సూచించారు. ఆఫీస్ ముందు మజ్జిగ స్టాల్ ఏర్పాటు చేశానని అక్కడ ఫ్రీగా మజ్జిగ తాగి కడుపు మంట తగ్గించుకోవాలని సూచించారు. ఈసారి తాను అందించే మ్యూజిక్తో బాక్స్లు బద్దలు అవుతాయని చెప్పుకొచ్చారు.
https://twitter.com/MusicThaman/status/1670846867650002946?s=20
పూజా హెగ్డే స్థానంలో సంయుక్త మీనన్?
పూజా హెగ్డే స్థానంలో మరో హీరోయిన్ కోసం చిత్ర బృందం అన్వేషణ మొదలు పెట్టిందని సమాచారం. మహేష్ సరసన సంయుక్త మీనన్(Samyuktha Menon)ను హీరోయిన్గా తీసుకోవాలని యోచిస్తున్నట్లు టాక్. సంయుక్త మీనన్ కాకపోతే.. త్రిష(Trisha)ను కూడా సంప్రదించాలని భావిస్తున్నారట. మరి పూజా స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎవర్నీ తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.
https://twitter.com/SSMB28_29/status/1671043502451609601?s=20
పూజా ఓవర్ యాటిట్యూడ్
అయితే కొంత మంది అభిమానులు పూజా హెగ్డేపై సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ ప్రొడ్యూసర్లు పూజా హెగ్డేను ఎంకరేజ్ చేయడం ఆపాలని సూచిస్తున్నారు. ఆమెకు తెలుగు సినిమాలంటే గౌరవం లేదని ఆరోపిస్తున్నారు. గతంలో ప్రభాస్తో తీసిన సినిమాలోనూ ఇదే జరిగిందని కామెంట్ చేస్తున్నారు. ప్రమోషన్స్ విషయంలో హిందీ, తమిళ్ సినిమాలకు ఇచ్చే ప్రాధాన్యం తెలుగు సినిమాలకు ఇవ్వదని ఏకిపారేస్తున్నారు.
https://twitter.com/898SAG/status/1671025365240942595?s=20
పూజా హెగ్డే స్థానంలో కియరా అద్వానిని మహేష్కు జోడీగా తీసుకొస్తే బాగుంటుందని మరికొంత మంది ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
మూవీ బృందం క్లారిటీ
గుంటూరు కారం మూవీలో జరుగుతున్న మార్పులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటంతో తాజాగా చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. పూజా హెగ్డేని హీరోయిన్గా మూవీ నుంచి తీసివేసే నిర్ణయం ఇంకా తీసుకోలేదు. ఆమెతో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికీ ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడు. సినిమా షూటింగ్ 24 జూన్ 2023 నుంచి ప్రారంభమవుతుంది అని స్పష్టం చేసినట్లు తెలిసింది.
https://twitter.com/TheAakashavaani/status/1671040847054528512?s=20
అల్లు అర్జున్తో మళ్లీ...
మరోవైపు ఐకాన్స్టార్ అల్లు అర్జున్తో సినిమా తీసేందుకు త్రివిక్రమ్ ఆసక్తిగా ఉన్నాడని సమాచారం. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనుండగా... నాగవంశీ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా ఇంతకుముందు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురంలో’ సినిమాలు వచ్చాయి.
జూన్ 20 , 2023
Vimanam Movie Review: తండ్రి, కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామా.. ప్రేక్షకుడిని కదిలించే ‘విమానం’
నటీనటులు : సముద్రఖని, ధృవన్ వర్మ, మీరా జాస్మిన్, అనసూయ భరద్వాజ్, రాహుల్ రామకృష్ణ,ధన్ రాజ్ తదితరులు..
దర్శకత్వం: శివప్రసాద్ యానాల
సినిమాటోగ్రఫీ: వివేక్ కలేపు
సంగీతం: చరణ్ అర్జున్
నిర్మాత : జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి
నటుడిగా, దర్శకుడిగా చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సముద్రఖని. తెలుగు సినిమాల్లో విలన్గా మెప్పిస్తూనే మెగా ఫోన్ పట్టుకుని ఏకంగా పవన్ కళ్యాణ్తో సినిమా తీస్తున్నాడు. ఈ క్రమంలో పాజిటివ్ రోల్లో సముద్రఖని ప్రధానపాత్ర దారుగా వచ్చిన చిత్రం ‘విమానం’. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. మరి, ఈ ‘విమానం’ థియేటర్లో ప్రేక్షకుడిని ఆకాశానికి తీసుకెళ్లిందా? టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకు సన్నివేశాలు మెప్పించాయా? అనే విషయాలను రివ్యూలో చూద్దాం.
కథేంటి?
ప్రచార చిత్రాలతోనే సినిమా కథేంటో తెలిసిపోయింది. ఓ పేదింటి కుర్రాడు రాజు(మాస్టర్ ధ్రువ్)కి విమానం అంటే ఎంతో ఇష్టం. జీవితంలో ఒక్కసారైనా ఎక్కాలని ఆశపడుతుంటాడు. తండ్రి వీరయ్య(సముద్రఖని) వికలాంగుడు. తల్లి లేకున్నా రాజుకి ఏ లోటు రాకుండా పెంచాలని పరితపిస్తుంటాడు. వంశ పారం పర్యంగా వచ్చిన సులభ్ కాంప్లెన్స్ని నడుపుకొంటూ జీవనాన్ని సాగిస్తాడు వీరయ్య. ఎప్పుడు విమానం గురించి అడిగినా చదువుకుంటే విమానం ఎక్కొచ్చని చెబుతూ కొడుకుని వీరయ్య ఎంకరేజ్ చేస్తాడు. ఈ క్రమంలో కొడుక్కి ఓ ప్రాణాంతక వ్యాధి ఉందనే చేదు నిజాన్ని వీరయ్య తెలుసుకుంటాడు. దీంతో ఎలాగైనా సరే పుత్రుడి కోరిక తీర్చాలని వీరయ్య ఒక్కో పైసా పోగు చేస్తాడు. కానీ, ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒక్కో ఘటనతో తన ప్రయత్నానికి వీరయ్య మరింత దూరం అవుతుంటాడు. మరి చివరికి ఎలా విమానం ఎక్కించాడని తెరపై చూడాల్సిందే.
ఎలా ఉంది?
ఇలాంటి సినిమాలకు కథనం, సంభాషణలు, నటీనటుల ప్రదర్శన చాలా ముఖ్యం. ఈ సినిమా వీటిని భర్తీ చేస్తుంది. బస్తీలో ఉండే వాతావరణం, నిరుపేద కుటుంబ పరిస్థితులు కళ్లకు కట్టినట్లు చూపించారు. చూసేటప్పుడు ఇది మన కథే, పక్కింటి వారి కథే అన్న భావన కలుగుతుంది. మొత్తానికి తండ్రీ కొడుకుల మధ్య బంధాన్ని తెరపై చూపిస్తుంది. ఇంటర్వెల్, సెకండాఫ్, క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటాయి.
ఎవరెలా చేశారు?
వికలాంగ తండ్రిగా సముద్రఖని జీవించేశాడు. కొడుకు కలను నెరవేర్చాలన్న తపన ఓ వైపు, కలకాలం తనతో ఉండబోడన్న వేదన మరోవైపు.. ఇలా గుండెను భారంగా చేసుకుని బతుకీడుస్తున్న వ్యక్తిగా సముద్రఖని ప్రేక్షకులను మెప్పించాడు. తనలోని నటుడిని వెలికి తీశాడు. ఇక రాజు పాత్రలో మాస్టర్ ధ్రువన్ ఆకట్టుకున్నాడు. చిన్న పిల్లలకు ఉండే అమాయకత్వం, నిజాయితీ, ఆశలు, కోరికలను చక్కగా చూపించగలిగాడు. వేశ్య అయిన సుమతి పాత్రలో అనసూయ ఫర్వాలేదనిపించింది. తన ప్రేమ కోసం పరితపించే కోటిగా రాహుల్ రామకృష్ణ మెప్పించాడు. వీరిద్దరి ప్రేమాయణం చివరికి కంటతడి పెట్టిస్తుంది. ఎయిర్ హోస్టెస్ పాత్రలో అలనాటి హీరోయిన్ మీరా జాస్మిన్ తళుక్కుమంది. ఆటో డ్రైవర్గా ధన్రాజ్ పరిధి మేరకు నటించాడు.
టెక్నికల్గా
తెలిసిన కథను హృదయాలకు హత్తుకునేలా తీయడంలో డైరెక్టర్ శివప్రసాద్ యానాల సక్సెస్ అయ్యాడు. నిరుపేద కుటుంబంలో ఉండే పరిస్థితులను చక్కగా చూపించాడు. తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని భావోద్వేగంగా చిత్రీకరించి ప్రేక్షకులను మెప్పించాడు. కోటీ, సుమతి మధ్య సన్నివేశాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. అయితే, కథలో పాత్రలను పరిచయం చేయడానికి కాస్త సమయం తీసుకున్నాడు. సెకండాఫ్లో హీరోకి ఎదురయ్యే కష్టాలను కాస్త సినిమాటిక్గా చూపించాడు. ముఖ్యంగా, తెలుగులో డైలాగ్స్ అందించిన హను రావూరి తన కలానికి పనిచెప్పాడు. సందర్భానుసారంగా వచ్చే డైలాగులు ఆకట్టుకుంటాయి. ఇక, చరణ్ అర్జున్ సంగీతం ఆకట్టుకుంటుంది. వివేక్ కెమెరా పనితనం మెప్పిస్తుంది.
ప్లస్ పాయింట్స్
నటీనటులు
భావోద్వేగ సన్నివేశాలు
క్లైమాక్స్ సీన్స్
మైనస్ పాయింట్స్
ఊహకు అందే కథ, కథనం
చివరగా.. ప్రేక్షకుడిని భావోద్వేగాలనే ఎయిర్పోర్టుకి తీసుకెళ్లేదే ‘విమానం’.
రేటింగ్: 3.25/5
జూన్ 09 , 2023