• TFIDB EN
  • మిస్టర్
    UATelugu2h 37m
    చెయ్ అనే యువకుడు మీరాను ఇష్టపడుతాడు. కానీ ఆమె మరొక వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు తెలుసుకుంటాడు. చెయ్, మీరా కోసం ఇండియా వెళ్లినప్పుడు అక్కడ అతను చంద్రముఖి అనే పల్లెటూరి అమ్మాయితో ప్రేమలో పడుతాడు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Zee5ఫ్రమ్‌
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌Aha
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    వరుణ్ తేజ్
    పిచ్చయ్య నాయుడు జూనియర్
    లావణ్య త్రిపాఠి
    చంద్రముఖి
    హెబ్బా పటేల్
    మీరా
    ప్రిన్స్ సెసిల్
    సిద్ధార్థ్
    హరీష్ ఉత్తమన్
    మీరా బ్రదర్
    రవి ప్రకాష్
    సత్యం రాజేష్
    రాజేష్
    నాసర్
    చై తాత
    చంద్ర మోహన్
    పిచ్చయ్య నాయుడు సోదరుడు
    ఆనంద్
    చై తండ్రి
    ఈశ్వరి రావు
    చాయ్ సవతి తల్లి
    పృధ్వీ రాజ్
    సినిమా డైరెక్టర్ లక్ష్మీ తులసి
    తనికెళ్ల భరణి
    గుండప్ప నాయుడు
    తేజస్వి మదివాడ
    వోడ్కా ప్రసాద్ PA
    రఘు బాబు
    వోడ్కా ప్రసాద్
    నాగినీడు
    హజరప్ప
    షఫీ
    సదాశివ రాయలు
    మాస్టర్ భరత్
    చంద్రముఖి సోదరుడు మరియు సదాశివ రాయలు కుమారుడు
    సత్య కృష్ణ
    బుక్కరాయలు తల్లి
    బెనర్జీ
    సిద్ధార్థ్ తండ్రి
    సురేఖ వాణిముత్తప్ప భార్య
    ఫిష్ వెంకటయ్య
    ముత్తప్ప అనుచరుడు
    బ్రహ్మాజీ
    స్పెషల్ పోలీస్
    ప్రియదర్శి పులికొండ
    డాక్టర్
    సత్య అక్కల
    డాక్టర్
    షకలక శంకర్
    సత్యాగ్రహి
    షేకింగ్ శేషులక్ష్మి తులసి అసిస్టెంట్
    శత్రు
    ముత్తప్ప అనుచరుడు
    సిబ్బంది
    శ్రీను వైట్ల
    దర్శకుడు
    నల్లమలుపు బుజ్జి
    నిర్మాత
    Tagore B. Madhuనిర్మాత
    మిక్కీ J. మేయర్
    సంగీతకారుడు
    KV గుహన్
    సినిమాటోగ్రాఫర్
    కథనాలు
    Mr.Pregnent Review: మిస్టర్ ప్రెగ్నెంట్ డెలివర్ చేసిన మెసేజ్ ఏంటి?
    Mr.Pregnent Review: మిస్టర్ ప్రెగ్నెంట్ డెలివర్ చేసిన మెసేజ్ ఏంటి?
    నటీనటులు: సొహైల్, రూప కొడవయూర్, సుహాసిని, వైవా హర్ష, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, అభిషేక్.  దర్శకుడు: శ్రీనివాస్ వింజనంపాటి  నిర్మాత: అప్పిరెడ్డి, సజ్జల రవిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి  సంగీతం: శ్రవణ్ భరద్వాజ్   బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. ఎట్టకేలకు ఈ సినిమా శుక్రవారం(Aug 18) థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, సంగీతం ఆకట్టుకున్నాయి. ప్రమోషన్లు కూడా గట్టిగానే చేశారు. ఇటీవల 200 మంది గర్భిణులకు ప్రత్యేకంగా సినిమా స్క్రీనింగ్ చేయించడంతో ప్రేక్షకుల చూపు మూవీపై పడింది. మరి, ఈ సినిమా ఎలా ఉంది? థియేటర్లలో ప్రేక్షకుడు ఎలా ఫీలయ్యాడు? అనేది రివ్యూలో చూద్దాం.  కథ గౌతమ్ (సొహైల్) అనాథ. అతడికి పిల్లలంటే ఇష్టముండదు. సిటీలో టాటూ ఆర్టిస్ట్‌గా పనిచేస్తుంటాడు. వృత్తి పరంగా ఉన్నత స్థానంలో ఉంటాడు గౌతమ్. మంచి డిమాండ్ ఉన్న టాటూ ఆర్టిస్ట్. తన స్నేహితులందరూ కుళ్లుకునేంత టాలెంట్ & ఫేమ్ ఉన్న గౌతమ్‌ను మహి (రూప కొడవయూర్) గాడంగా ప్రేమిస్తుంది. మొదట్లో ఆమె ప్రేమను నిరాకరించిన గౌతమ్.. ఆమె ప్రేమలోని నిజాయితీని అర్ధం చేసుకొని ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కానీ, పిల్లలు వద్దని చెబుతాడు. ఈ క్రమంలో మహి గర్భం దాల్చిన విషయం తెలుస్తుంది. అయితే, బిడ్డ తన కడుపులో పెరగాలని డిసైడ్ అయ్యి గర్భాన్ని తనకు మార్పిడి చేసుకుంటాడు గౌతమ్. మరి, ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? ఆ తర్వాత ఏమైందనేది మిగతా కథ. https://twitter.com/RyanSohel/status/1691410954377220096?s=20 ఎలా ఉందంటే? పురుషుడు గర్భం దాల్చవచ్చా? దాలిస్తే ఎలా ఉంటుందన్న కథాంశం ఆసక్తిని రేపింది. ఈ పాయింట్‌తోనే సినిమా చూడాలనిపిస్తుంది. కాకపోతే, మూవీలో అసలు విషయం దగ్గరికి రావడానికి కాస్త సమయం పడుతుంది. కథానాయకుడి పరిచయ సన్నివేశాలు, లవ్ ట్రాక్, ఇరికించినట్లుగా అనిపించే కామెడీ ఫస్టాఫ్‌ని బోర్ కొట్టిస్తాయి. కానీ, సొహైల్ నిర్ణయం తర్వాత సినిమా ఆసక్తికరంగా మారింది. సెకండాఫ్‌లో ఎమోషన్ సీన్స్ బాగా పండాయి. గర్భం దాల్చాక ఒకరి పరిస్థితి ఎలా ఉంటుందనేది ఎమోషనల్ కనెక్టివిటీతో చూపించడం ప్రేక్షకుడికి నచ్చుతుంది. గర్భం చుట్టూ జరిగే కామెడీ నవ్వు పుట్టిస్తుంది. చివరికి ఇచ్చిన మెసేజ్ ఆకట్టుకుంటుంది. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు బాగా మరీ నాటకీయంగా అనిపిస్తాయి. అయితే, మహిళలకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది.  ఎవరెలా చేశారు? నటనకు ఎంతో స్కోప్ ఉన్న పాత్రను ఎంచుకున్నాడు సొహైల్. గర్భం దాల్చాక ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా నటించాడు. ద్వితీయార్థంలో సొహైల్ చేసిన యాక్టింగ్ నచ్చుతుంది. చక్కగా భావాలు పలికించాడు. ఇక, రూప తన పాత్ర పరిధి మేరకు నటించింది. ఇంకొంచెం బాగా చేసే అవకాశం కూడా ఉంది. చాన్నాళ్ల తర్వాత సుహాసిని మణిరత్నంకి మంచి పాత్ర దొరికింది. డాక్టర్‌గా ఆమె బాగా నటించారు. కీలక సన్నివేశాల్లో తను ఆకట్టుకుంది. ఇక, బ్రహ్మాజీ, వైవా హర్ష కామెడీతో అలరించారు. చిన్న పాత్రే అయినా రాజా రవీంద్ర మెప్పించాడు. టెక్నికల్‌గా దర్శకుడు శ్రీనివాస్ క్లిష్టమైన సబ్జెక్ట్‌ని ఎంచుకుని చక్కగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. మగాళ్లు గర్భం దాల్చొచ్చనే అంశంపై బాగా రీసెర్చ్ చేసినట్లు అనిపించింది. స్క్రీన్ ప్లే చక్కగా రాసుకున్నాడు. కాకపోతే, పాత్రల ఎలివేషన్ కోసం సమయం తీసుకున్నాడు. క్లైమాక్స్ పార్ట్ బాగా వర్కౌట్ చేశాడు. ఇక, సినిమాకు శ్రవణ్ భరద్వాజ్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదనపు బలం. నిజార్ షఫీ కెమెరా పనితనం ఓకే.  https://twitter.com/RyanSohel/status/1691722567441412475?s=20 ప్లస్ పాయింట్స్ సొహైల్ నటన సెకండాఫ్, క్లైమాక్స్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మైనస్ పాయింట్స్ ఇరికించిన కామెడీ సీన్లు ఫస్టాఫ్ కాస్ట్యూమ్స్ ఫైనల్‌గా.. మిస్టర్ ప్రెగ్నెంట్ కథ తెలుసుకోవాలంటే మొదటి 45 నిమిషాలు ఓపిక పట్టాల్సిందే.   రేటింగ్: 2/5 https://www.youtube.com/watch?v=MDUVa03xbIs
    ఆగస్టు 18 , 2023
    <strong>Mr Bachchan Movie Trolls: ‘మిస్టర్‌ బచ్చన్‌’పై మళ్లీ మెుదలైన ట్రోల్స్‌.. ఓటీటీలోనూ భారీగా ఎదురుదెబ్బ!</strong>
    Mr Bachchan Movie Trolls: ‘మిస్టర్‌ బచ్చన్‌’పై మళ్లీ మెుదలైన ట్రోల్స్‌.. ఓటీటీలోనూ భారీగా ఎదురుదెబ్బ!
    రవితేజ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన 'మిస్టర్‌ బచ్చన్‌' చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌ మరీ దారుణంగా ఉందంటూ కామెంట్స్‌ వినిపించాయి. ఈ సినిమాపై పెద్ద ఎత్తున నెగిటివ్‌ రివ్యూలు రావడంతో బాక్సాఫీస్‌ వద్ద ‘మిస్టర్‌ బచ్చన్‌’కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఓటీటీ ప్రేక్షకులనైనా అలరించాలన్న ఉద్దేశ్యంతో తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఈ సినిమాను వీక్షించిన ఓటీటీ ప్రేక్షకులు సైతం ఈ సినిమాపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా పెద్ద ఎత్తున మళ్లీ ట్రోల్స్‌ మెుదలు పెట్టారు.&nbsp; ఓటీటీలోనూ వెక్కిరింపే! మాస్ మాహారాజ రవితేజ బోలెడు ఆశలు పెట్టుకున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా చతికిలపడింది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే సెప్టెంబర్‌ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. అయితే ఓటీటీలోనూ ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించడం లేదు. నెట్‌ఫ్లిక్స్‌ టాప్‌ 10 ట్రెండింగ్‌ లిస్ట్‌లో కనీసం చోటు కూడా దక్కపోవడం గమనార్హం. రవితేజ లాంటి స్టార్‌ హీరో చేసిన చిత్రం అయినప్పటికీ ‘మిస్టర్‌ బచ్చన్‌’కు కనీస వ్యూస్‌ రాకపోవడంపై నెట్‌ఫ్లిక్స్‌ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఓటీటీలో ఈ సినిమాను చూసిన కొద్దిమంది కూడా నెట్టింట ట్రోల్స్‌ చేస్తుండంతో చూడాలని అనుకుంటున్నవారు కూడా వెనక్కి తగ్గుతున్నట్లు సమాచారం.&nbsp; దారుణంగా ట్రోల్స్‌ మిస్టర్‌ బచ్చన్‌ సినిమాలోని కొన్ని సీన్లు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. డైరెక్టర్‌ హరీష్‌ శంకర్ ఇలా ఎలా ఆ సన్నివేశాలను తీశారంటూ మండిపడుతున్నారు. ముఖ్యంగా ఓ ఫైట్‌ సీన్‌లో రవితేజను చూసి ‘మెుదటిసారి మగాడిగా పుట్టినందుకు బాధేస్తోంది బావా.. అదే ఆడదాన్ని అయ్యుంటే’ అంటూ ఓ నటుడు చెప్పే డైలాగ్‌ విపరీతంగా ట్రోలింగ్‌కు గురవుతోంది. అలాగే సాంగ్స్‌లో భాగ్యశ్రీ బోర్సేతో రవితేజ వేసిన స్టెప్స్‌ చూడటానికి ఆడల్ట్‌ కంటెంట్‌ను తలపిస్తోందని పోస్టులు పెడుతున్నారు. సాంగ్స్‌ కూడా అసందర్భంగా ఉన్నాయని సీన్లకు మధ్యలో వాటిని బలవంతంగా ఇరిక్కించినట్లు ఉన్నాయని మండిపడుతున్నారు. హిందీలో వచ్చిన ‘రైడ్‌’ మక్కీకి మక్కీ దించేసిన కూడా హిట్‌ అయ్యేది కదా అంటూ డైరెక్టర్ హరీష్‌ శంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిస్టర్‌ బచ్చన్‌ ఒక గంట కూడా చూడలేకపోయానని, అరగంటకే ఆపేసా అంటూ ఓ నెటిజన్‌ పోస్టు పెట్టాడు.&nbsp; https://twitter.com/nenuneneh/status/1834511822277234953 https://twitter.com/BalaRTCultFan/status/1834481953619542526 https://twitter.com/koppalapn/status/1834462816470007925 https://twitter.com/IamanMCA/status/1834453046287630562 https://twitter.com/Dynamic_boy_7/status/1834439289717096574 https://twitter.com/BunnyJashu3/status/1834299241700757520 కథేంటి ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మిస్టర్ బచ్చన్ (రవితేజ) నిజాయితీ పరుడు. ఓ అవినీతి పరుడైన పొగాకు వ్యాపారిపై రైడ్ చేయడంతో అధికారుల ఆగ్రహానికి గురవుతాడు. దానివల్ల సస్పెండ్ కూడా అవుతాడు. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ సొంతూరు కోటిపల్లికి వెళ్లి అక్కడ జిక్కీ (భాగ్య శ్రీ)ని చూసి ప్రేమలో పడతాడు. పెళ్లికి రెడీ అవుతున్న క్రమంలో తిరిగి ఉద్యోగంలో చేరాలని బచ్చన్‌కు పిలుపు వస్తుంది. తదుపరి రైడ్‌ ఎంపీ ముత్యం జగ్గయ్య (జగపతి బాబు) ఇంట్లో చేయాల్సి వస్తుంది. అధికారులను సైతం భయపట్టే జగ్గయ్య ఇంట్లో బచ్చన్‌ ఎలా రైడ్‌ చేశాడు? అక్కడ అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి? బచ్చన్‌ - జిక్కీ ప్రేమ వ్యవహారం ఏమైంది? పెద్దలు పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు? చివరకు మిస్టర్ బచ్చన్ ఏం సాధించాడు? అనేది మిగిలిన కథ.
    సెప్టెంబర్ 13 , 2024
    <strong>Bhagyashri Borse: పాన్ ఇండియా ఆఫర్‌ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే.. ఫ్లాప్‌ వచ్చిన తగ్గని క్రేజ్‌!</strong>
    Bhagyashri Borse: పాన్ ఇండియా ఆఫర్‌ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే.. ఫ్లాప్‌ వచ్చిన తగ్గని క్రేజ్‌!
    టాలీవుడ్‌ రైజింగ్‌ బ్యూటీగా పేరు తెచ్చుకున్న భాగ్యశ్రీ బోర్సేకు తొలి చిత్రంతోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలుగులో ఆమె చేసిన ఫస్ట్‌ ఫిల్మ్‌ మిస్టర్ బచ్చన్‌ బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైంది. అయితే ఈ అమ్మడి నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. ఈ భామకు మంచి ఫ్యూచర్‌ ఉంటుందంటూ కితాబు ఇచ్చారు. ఈ క్రమంలోనే భాగ్యశ్రీకి మరో బంపరాఫర్‌ దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించి అందరి దృష్టిని ఆకర్షించింది. భాగ్యశ్రీ అప్‌కమింగ్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; దుల్కర్‌కి జోడీగా భాగ్యశ్రీ మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) హీరోగా తెరకెక్కుతోన్న చిత్రాల్లో ‘కాంత’ (Kaantha) ఒకటి. ‘నీలా’ ఫేమ్‌ సెల్వమణి సెల్వరాజ్‌ (Selvamani Selvaraj) దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. దుల్కర్‌ పుట్టినరోజు పురస్కరించుకుని ఇటీవల ఈ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేయగా సినీ లవర్స్‌ నుంచి విశేష ఆదరణ లభించింది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సేను ఎంపిక చేశారు. అంతేకాదు పూజా కార్యక్రమాలను సైతం నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె మంచి ఛాన్స్‌ కొట్టేశారంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. వేఫరెర్ ఫిలిమ్స్‌, స్పిరిట్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్వరలోనే దీని రెగ్యులర్‌ షూట్‌ ప్రారంభం కానుంది. ఇందులో రానా దగ్గుబాటి ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.&nbsp; https://twitter.com/DQsWayfarerFilm/status/1833013939837276196 1950 నేపథ్యంలో.. కాంత మూవీ పూజా కార్యక్రమాలను హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు. ఈ మూవీకి టాలీవుడ్‌ స్టార్‌ హీరో వెంకటేష్‌ ఫస్ట్‌ క్లాప్‌ కొట్టారు. కాగా, ఈ చిత్రాన్ని 1950 మద్రాసు నేపథ్యంలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో దుల్కర్ పాత్ర ఇప్పటివరకూ చేసిన చిత్రాల కంటే పూర్తి భిన్నంగా ఉంటుందని సమాచారం. భాగ్యశ్రీకి కూడా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రనే దక్కిందని అంటున్నారు. వీరి మధ్య కెమెస్ట్రీ అదిరిపోతుందని అంటున్నారు. ఈ మూవీ షూటింగ్‌ త్వరలోనే మెుదలవుతుందని ఫిల్మ్‌ వర్గాలు తెలియజేశాయి.&nbsp; ఏమాత్రం తగ్గని క్రేజ్‌! ‘మిస్టర్ బచ్చన్’ సినిమా టైంలో భాగ్యశ్రీ బోర్సే పేరు ఎంతగా ట్రెండ్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైన దగ్గర్నుంచి ఆమె సోషల్ మీడియా దృష్టినీ ఆకర్షిస్తూనే వచ్చింది. సినిమా నుంచి తొలి పాటను అనౌన్స్ చేసినపుడు కొన్ని విజువల్స్‌ చూసి కుర్రాళ్లకు మతిపోయింది. అయితే ఊహించని విధంగా ‘మిస్టర్‌ బచ్చన్‌’ డిజాస్టర్‌ కావడంతో భాగ్యశ్రీ అంచనాలన్నీ తలకిందులు అయ్యాయి. తొలి చిత్రమే దారుణ పరాజయాన్ని మిగిల్చడంతో ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో తన దూకుడు కాస్త తగ్గించింది. తాజాగా 'కాంత' సినిమాలో హీరోయిన్‌గా ఎంపికై తన క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. సరైన హిట్‌ లభిస్తే ఈ అమ్మడు స్టార్‌ హీరోయిన్‌గా మారిపోవడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; విజయ్‌ దేవరకొండ మూవీలోనూ.. విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కాంబోలో రూపొందుతున్న 'VD12' చిత్రంలోనూ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ అమ్మడు షూటింగ్‌లోనూ పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ సినిమాలో విజయ్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఓ సాధారణ పోలీసు కానిస్టేబుల్‌ అయిన హీరో, మాఫియా లీడర్‌గా ఎలా ఎదిగాడన్న కాన్సెప్ట్‌తో 'VD12' రాబోతున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు.
    సెప్టెంబర్ 09 , 2024
    <strong>Mr. Bachchan Vs Double Ismart: డే 1 కలెక్షన్స్‌లో విన్నర్‌ ఎవరంటే?</strong>
    Mr. Bachchan Vs Double Ismart: డే 1 కలెక్షన్స్‌లో విన్నర్‌ ఎవరంటే?
    స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రామ్‌ - పూరి కాంబోలోని 'డబుల్ ఇస్మార్ట్‌', రవితేజ - హరిష్‌ శంకర్‌ కలయికలో తెరకెక్కిన 'మిస్టర్‌ బచ్చన్‌' చిత్రాలు ప్రేక్షకులను పలకరించాయి. అలాగే తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ చేసిన 'తంగలాన్‌', ఎన్టీఆర్‌ బావమరిది నటించిన 'ఆయ్‌' థియేటర్లలో సందడి చేశాయి. వీటిలో రవితేజ, రామ్‌ చిత్రాలు మిశ్రమ స్పందన తెచ్చుకోగా, విక్రమ్‌, నార్నే నితిన్‌ చిత్రాలు పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకున్నాయి. మరి తొలి రోజున ఏ చిత్రం కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయి? ఏ చిత్రం అత్యధిక వసూళ్లు రాబట్టింది? ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; డబుల్ ఇస్మార్ట్‌ వసూళ్లు ఎంతంటే! రామ్‌ పోతినేని (Ram Pothineni) హీరోగా పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్‌’ (Double Ismart) చిత్రం తొలి రోజు డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయినప్పటికీ మంచి వసూళ్లను సాధించి పర్వాలేదనిపించింది. ఈ చిత్రం తొలిరోజున వరల్డ్‌ వైడ్‌గా రూ.12.45 కోట్లు (GROSS) రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.8.35 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా, ఓవర్సీస్‌ కలిపి మరో రూ. 4 కోట్ల రాబడి వచ్చినట్లు తెలిపాయి. లాంగ్‌ వీకెండ్‌ కావడంతో ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డాయి. మిస్టర్‌ బచ్చన్ పరిస్థితి ఏంటంటే! మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), క్రియేటివ్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం ‘మిస్టర్ బచ్చన్‌’ (Mr. Bachchan)పై రిలీజ్‌కు ముందు వరకూ భారీగా అంచనాలే ఉన్నాయి. అయితే గురువారం (ఆగస్టు 15) రిలీజైన ఈ మూవీ మిక్స్డ్‌ టాక్‌ తెచ్చుకుంది. కాగా, వరల్డ్‌ వైడ్‌గా రూ. 5.3 కోట్లు (GROSS) రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. ఆగస్టు 14న వేసిన ప్రీమియర్ల ద్వారా రూ.1.8 కోట్లు వసూలైనట్లు పేర్కొన్నాయి. తొలి ఆట నుంచి పెద్ద ఎత్తున ట్రోలింగ్స్‌ రావడం మిస్టర్‌ బచ్చన్‌ వసూళ్లపై ప్రభావం చూపినట్లు అభిప్రాయపడ్డాయి. అయితే లాంగ్‌ వీకెండ్‌ ఉండటంతో ఈ మూవీ పుంజుకునే అవకాశం లేకపోలేదని చెప్పుకొచ్చాయి. కాగా, ఇందులో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీ ద్వారానే తొలిసారి తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది.&nbsp; తంగలాన్‌ టాప్‌! తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ నటించిన ‘తంగలాన్‌’ చిత్రం తొలి రోజున భారీ వసూళ్లను రాబట్టింది. రిలీజైన చిత్రాల్లో కెల్లా అత్యధిక వసూళ్లను సాధించింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.26.44 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. నార్త్‌లో రిలీజ్‌ కాకుండానే ఈ స్థాయి వసూళ్లు సాధించడం పట్ల సర్వత్ర ప్రశంసలు వ్యక్తమవుతోంది. ఇక నార్త్‌లో ఈ నెల 30న తంగలాన్‌ రిలీజ్‌ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో మంచి మౌత్‌ టాక్‌తో దూసుకెళ్తున్న తంగలాన్‌ ఈ వీకెండ్‌ పూర్తయ్యే సరికి భారీగానే వసూళ్లు సాధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులో విక్రమ్‌ నటనపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి.&nbsp; ‘ఆయ్‌’కి మంచి వసూళ్లు! 'మ్యాడ్‌' చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఎన్టీఆర్‌ బామ మరిది నార్నె నితిన్‌ తన రెండో చిత్రం 'ఆయ్‌' మరోమారు ప్రేక్షకులను పలకరించాడు. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం తొలి రోజు పాటిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇక డే 1 కలెక్షన్ల విషయానికి వస్తే ఈ మూవీ రూ.2 కోట్లు (GROSS) రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ.8 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ తొలి రోజే ఆకర్షణీయమైన వసూళ్లు సాధించడంతో చిత్ర యూనిట్‌ సంతోషంగా ఉంది. ఈ వీకెండ్‌ నాటికి ఈజీగానే లాభాల్లోకి వెళ్లిపోతుందని అభిప్రాయపడుతోంది.
    ఆగస్టు 16 , 2024
    నిధి అగర్వాల్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    నిధి అగర్వాల్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    నిధి అగర్వాల్ తెలుగులో చేసినవి చాలా తక్కువ సినిమాలే అయినా.. యూత్‌ మంతి క్రేజ్ సంపాదించుకుంది. టాలీవుడ్‌లో మిస్టర్ మజ్ను చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాలో తన గ్లామర్ షోతో ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటే ఈ బ్యూటీకి మోడలింగ్ అంటే చాలా ఇష్టం. మరి నిధి అగర్వాల్‌కు(Some Lesser Known Facts about Nidhhi Agerwal)&nbsp; ఇంకా ఏమేమి ఇష్టమో ఈ కథనంలో చూద్దాం. నిధి అగర్వాల్ ముద్దు పేరు? నిధి నిధి అగర్వాల్ ఎప్పుడు పుట్టింది? 1993, ఆగస్టు 17న జన్మించింది నిధి అగర్వాల్ తొలి సినిమా? మున్నా మైఖెల్(2017) నిధి అగర్వాల్ తెలుగులో నటించిన తొలి సినిమా? మిస్టర్ మజ్ను(2018) నిధి అగర్వాల్&nbsp; ఎత్తు ఎంత? 5 అడుగుల 7 అంగుళాలు&nbsp; నిధి అగర్వాల్ ఎక్కడ పుట్టింది? హైదరాబాద్ నిధి అగర్వాల్&nbsp; ఏం చదివింది? BBA, క్రిష్ట్ యూనివర్సిటీ ( బెంగుళూరు) నిధి అగర్వాల్&nbsp; అభిరుచులు? షాపింగ్, ట్రావెలింగ్ నిధి అగర్వాల్‌కు ఇష్టమైన ఆహారం? నాన్‌వెజ్ నిధి అగర్వాల్‌కు అఫైర్స్ ఉన్నాయా? బాలీవుడ్ నటుడు హర్షవర్ధన్ కపూర్‌తో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ ఉన్నయి. నిధి అగర్వాల్‌కు&nbsp; ఇష్టమైన కలర్ ? వైట్, బ్లాక్ నిధి అగర్వాల్‌కు ఇష్టమైన హీరో? హృతిక్ రోషన్ నిధి అగర్వాల్ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ. కోటి వరకు ఛార్జ్ చేస్తోంది. నిధి అగర్వాల్&nbsp; ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/nidhhiagerwal/?hl=en నిధి అగర్వాల్‌కు గుడి ఎక్కడ కట్టారు? చెన్నైలో కొంతమంది కాలేజీ విద్యార్థులు ఆమెకు గుడి కట్టారు.
    ఏప్రిల్ 06 , 2024
    నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    స్వయంకృషితో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్ పొలిశెట్టి. చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ అంచెలంచెలుగా హీరో స్థాయికి ఎదిగాడు. హీరోగా తొలి సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయతో విమర్శకుల ప్రశంసలు పొందాడు. జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి విజయాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. టాలీవుడ్‌లో కామెడీ స్టార్‌గా ఎదిగిన నవీన్ పొలిశెట్టి గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. నవీన్ పొలిశెట్టి హీరోగా తొలి సినిమా? ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ నవీన్ పొలిశెట్టి ఎత్తు ఎంత? 5 అడుగుల 10 అంగుళాలు నవీన్ పొలిశెట్టి&nbsp; ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్ నవీన్ పొలిశెట్టి పుట్టిన తేదీ ఎప్పుడు? 1990, డిసెంబర్ 26 నవీన్ పొలిశెట్టికి వివాహం అయిందా? ఇంకా జరగలేదు. నవీన్ పొలిశెట్టి&nbsp; ఫెవరెట్ హీరో? మహేష్ బాబు, అనిల్ కపూర్ నవీన్ పొలిశెట్టి&nbsp; తొలి హిట్ సినిమా? ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ నవీన్ పొలిశెట్టి గుర్తింపునిచ్చిన చిత్రం? జాతి రత్నాలు నవీన్ పొలిశెట్టి ఇష్టమైన కలర్? &nbsp;బ్లాక్ నవీన్ పొలిశెట్టి&nbsp; తల్లిదండ్రుల పేరు? మంజుల(బ్యాంక్ ఉద్యోగి), రాజ్‌కుమార్( ఫార్మస్యూటిక్ బిజినెస్) నవీన్ పొలిశెట్టి ఇష్టమైన ప్రదేశం? అమెరికా నవీన్ పొలిశెట్టికి ఇష్టమైన సినిమాలు? షోలే నవీన్ పొలిశెట్టి ఏం చదివాడు? సివిల్ ఇంజనీరింగ్(NIT భోపాల్) నవీన్ పొలిశెట్టి అభిరుచులు? &nbsp;ట్రావలింగ్, డ్యాన్స్ చేయడం, రీడింగ్ బుక్స్ నవీన్ పొలిశెట్టి ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 7 సినిమాల్లో నటించాడు.&nbsp; నవీన్ పొలిశెట్టి సినిమాకి ఎంత తీసుకుంటాడు? ఒక్కో సినిమాకు రూ.2కోట్లు తీసుకుంటున్నాడు. https://www.youtube.com/watch?v=6SPYe3HkBVo
    మార్చి 21 , 2024
    <strong>Janhvi Kapoor : తొలి చిత్రంతో ఊహించని దెబ్బ.. జాన్వీ, భాగ్యశ్రీ కోలుకునేనా!</strong>
    Janhvi Kapoor : తొలి చిత్రంతో ఊహించని దెబ్బ.. జాన్వీ, భాగ్యశ్రీ కోలుకునేనా!
    టాలీవుడ్‌ ఫ్యూచర్‌ హీరోయిన్స్‌గా బాలీవుడ్‌ బ్యూటీలు భాగ్యశ్రీ బోర్సో, జాన్వీ కపూర్‌లు గత కొంతకాలం నుంచి కీర్తింపబడుతూ వస్తున్నారు. సాలిడ్ హిట్‌ లభిస్తే ఈ భామలకు వరుస అవకాశాలు రావడం ఖాయమంటూ పెద్ద ఎత్తున వార్తలు సైతం వచ్చాయి. అయితే ఊహించని విధంగా తొలి చిత్రాలతో ఈ ఇద్దరు భామలు ఆకట్టుకోలేకపోయారు. ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr.Bachchan) సినిమా ద్వారా భాగ్యశ్రీ (Bhagyashri Borse) ఫ్లాప్‌ను మూటగట్టుకుంది. అటు జాన్వీ (Janhvi Kapoor)కి సైతం ‘దేవర’తో మంచి సక్సెస్‌ వచ్చినప్పటికీ ఆమె పాత్ర నిడివి చాలా తక్కువగా ఉండటంతో పెద్దగా హైలెట్‌ కాలేదు. దీంతో ఈ ఇద్దరు ముద్దుగమ్మలు తమ తర్వాతి చిత్రాలపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు.&nbsp; భారమంతా చరణ్‌పైనే! శ్రీదేవి కూతురైన జాన్వీ కపూర్‌ తారక్ వంటి బిగ్‌ స్టార్‌ నటించిన ‘దేవర’తో తెలుగులో అడుగుపెట్టింది. రిలీజ్‌కు ముందు వరకూ ఈ అమ్మడిపై పెద్ద ఎత్తున బజ్‌ ఏర్పడింది. ప్రమోషన్స్‌లోనూ జాన్వీ చురుగ్గా పాల్గొంటూ అందరి దృష్టిని ఆకర్షించింది. తీరా సినిమా రిలీజయ్యాక జాన్వీ పాత్ర అందరినీ ఊసురుమనిపించింది. ఆమె చేసిన తంగం పాత్ర గెస్ట్‌రోల్‌ను తలపించింది. దీంతో ఆమె ఫ్యాన్స్‌ తీవ్రంగా నిరాశపడ్డారు. దీంతో జాన్వీ ఆశలన్నీ రామ్‌ చరణ్- బుచ్చి బాబు కాంబోలో రానున్న ‘RC 16’ ప్రాజెక్ట్‌పైకి మళ్లాయి. అయితే ఈ సినిమాలోనైనా జాన్వీకి మంచి పాత్ర దొరుకుతుందా? లేదా? అన్న సందేహాం ప్రస్తుతం ఆమె ఫ్యాన్స్‌లో ఉంది. నటిగా ఇప్పటికే నిరూపించుకున్న జాన్వీ మంచి పాత్ర దొరికితే తెలుగులోనూ పాపులర్ కావడం ఖాయమని చెప్పవచ్చు. RC 16తో ఈ భామ ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.&nbsp; బ్రైట్‌గా భాగ్యశ్రీ బోర్సె ఫ్యూచర్! ‘మిస్టర్‌ బచ్చన్’ రిలీజ్‌కు ముందు వరకూ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) పేరు టాలీవుడ్‌లో మారుమోగిపోయింది. ఫ్యూచర్‌ క్వీన్‌ అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్‌ వినిపించాయి. అయితే ఊహించని విధంగా ‘మిస్టర్‌ బచ్చన్‌’ డిజాస్టర్‌గా నిలవడంతో ఆమె పెట్టుకున్న నమ్మకాలన్నీ ఆవిరి అయ్యాయి. అయితే నటిగా ఆమెకు మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆమె విజయ్‌ దేవరకొండ సరసన ‘VD12’లో నటిస్తున్నట్లు సమాచారం. అలాగే రీసెంట్‌గా దుల్కర్‌ సల్మాన్‌తో ఓ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించింది. ‘కాంత’ అనే పేరుతో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. మరోవైపు పలువురు కుర్ర హీరోలు సైతం భాగ్యశ్రీతో వర్క్‌ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. దీంతో మిస్టర్‌ బచ్చన్‌ ఫ్లాప్‌ అయినా ఈ అమ్మడి ఫేమ్‌కు ఎలాంటి ఢోకా లేదని చెప్పవచ్చు. సరైన హిట్‌ లభిస్తే భాగ్యశ్రీ తెలుగులో టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా మారిపోవడం పక్కా అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.&nbsp; శ్రీదేవి కూతురి నుంచి స్టార్‌ హీరోయిన్ వరకూ! శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ. మరాఠీ చిత్రం ‘సైరాత్’కు రీమేక్‌గా వచ్చిన ‘ధడక్‌’లో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత ‘గుంజన్ సక్సేనా’ చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో జాన్వీ తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెప్పించింది. నటనపరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత ‘గుడ్‌లక్‌ జెర్రీ’, ‘మిలి’, ‘బవాల్‌’ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు పెద్దగా సక్సెస్‌ రాలేదు. ఈ క్రమంలోనే 'రాఖీ ఔర్‌ రానీకి ప్రేమ్‌ కహానీ' చిత్రంలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో కనిపించి జాన్వీ అందరి దృష్టిని ఆకర్షించింది. రీసెంట్‌గా బాలీవుడ్‌లో ‘మిస్టర్ అండ్ మిస్ మహీ’, ‘ఉలాజ్‌’ చిత్రాల్లో ఫీమేల్‌ లీడ్‌గా చేసి నటనపరంగా ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం హిందీలో 'సన్నీ శాన్‌స్క్రీట్‌ కి తుల్సీ కుమారి' అనే చిత్రంలో జాన్వీ నటిస్తోంది.&nbsp; భాగ్యశ్రీ నేపథ్యం ఇదే.. భాగ్యశ్రీ బోర్సేది మహారాష్ట్రలోని పుణే. హిందీ చిత్రం 'యారియాన్ 2'తో ఆమె వెండితెరకి పరిచయమైంది. అంతకుముందు చాలా యాడ్స్‌లో మోడల్‌గా పని చేసింది. ఈమె చేసిన యాడ్స్‌లో క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ బాగా ఫేమ్ తెచ్చి పెట్టింది. ఇక ‘యారియాన్ 2’లో ఈ బ్యూటీ యాక్టింగ్‌కి ఫిదా అయిన డైరెక్టర్ హరీశ్ శంకర్.. ‘మిస్టర్ బచ్చన్‌’లో ఛాన్స్ ఇచ్చారు. అలా టాలీవుడ్‌లో బజ్‌ క్రియేట్‌ చేసిన ఈ అమ్మడు మరిన్ని ఆఫర్లను దక్కించుకుంది. చూడటానికి చాలా క్యూట్‌గా ఉండే భాగ్యశ్రీ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా వ్యవహరిస్తుంటుంది. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు గ్లామర్ ట్రీట్ ఇస్తూ సినిమాలకు అతీతంగా తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.&nbsp;
    అక్టోబర్ 03 , 2024
    <strong>Janhvi Kapoor: ‘దేవర’ బ్యూటీ జాన్వీ కపూర్‌ను ఇంత హాట్‌గా ఎప్పుడైనా చూశారా? చూస్తే మతిపోవాల్సిందే!</strong>
    Janhvi Kapoor: ‘దేవర’ బ్యూటీ జాన్వీ కపూర్‌ను ఇంత హాట్‌గా ఎప్పుడైనా చూశారా? చూస్తే మతిపోవాల్సిందే!
    బాలీవుడ్‌లో శ్రీదేవి ముద్దుల తనయగా అడుగుపెట్టిన జాన్వీ కపూర్.. ఆనతి కాలంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా తారక్‌ సరసన ‘దేవర’లో నటించి మరోమారు అందరి దృష్టిని ఆకర్షించింది. జాన్వీ నటిస్తున్న ఫస్ట్ తెలుగు ఫిల్మ్‌ ఇదే కావడంతో ఈ అమ్మడి గురించి తెలుగు ఆడియన్స్ తెగ సెర్చ్‌ చేస్తున్నారు.&nbsp; ఈ నేపథ్యంలో ఈ అమ్మడి గురించి తెలుసుకుంటూనే ఇప్పటివరకూ చూడని బోల్డ్‌ ఫొటోలను చూసేయండి. ‘ధడ్‌’ చిత్రం ద్వారా జాన్వీ బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అయితే ఆ చిత్రం యావరేజ్‌ టాక్ తెచ్చుకోవడంతో జాన్వీకి పెద్దగా పేరు రాలేదు. నటనపరంగా జాన్వీకి గుర్తింపు తెచ్చిన సినిమా ‘గుంజన్ సక్సేనా’. నిజ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రంలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ‘గుడ్‌లక్‌ జెర్రీ’, ‘మిలి’, ‘బవాల్‌’ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు పెద్దగా సక్సెస్‌ రాలేదు. ఈ క్రమంలోనే 'రాఖీ ఔర్‌ రానీకి ప్రేమ్‌ కహానీ' చిత్రంలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో కనిపించి జాన్వీ అందరి దృష్టిని ఆకర్షించింది.&nbsp; రీసెంట్‌గా బాలీవుడ్‌లో ‘మిస్టర్ అండ్ మిస్ మహీ’, ‘ఉలాజ్‌’ చిత్రాల్లో ఫీమేల్‌ లీడ్‌గా చేసిన నటనపరంగా మంచి మార్కులు కొట్టేసింది.&nbsp; జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ తెలుగు పరిశ్రమపై భారీ ఆశలు పెట్టుకుంది. తల్లి శ్రీదేవిలా తెలుగు పరిశ్రమపై చెరగని ముద్ర వేయాలనుకుంటోంది.&nbsp; దేవరతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు కూడా జాన్వీ ఎంపికైంది. రామ్‌చరణ్‌-బుచ్చిబాబు కాంబోలో రానున్న చిత్రంలో జాన్వీ హీరోయిన్‌గా నటించనుంది. ప్రస్తుతం హిందీలో 'సన్నీ శాన్‌స్క్రీట్‌ కి తుల్సీ కుమారి' అనే చిత్రంలో జాన్వీ నటిస్తోంది. ఇందులో లీడ్‌ రోల్‌లో ఆమె కనిపించనుంది.&nbsp; ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూనే జాన్వీ సోషల్‌ మీడిాయాలో చాలా చురుగ్గా ఉంటోంది. తన హాట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఆకట్టుకుంటోంది.&nbsp; ప్రస్తుతం ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 25.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
    సెప్టెంబర్ 25 , 2024
    <strong>Tollywood Directors: హీరోయిన్‌ను ఎలా చూపించాలో వీళ్లకి మాత్రమే తెలుసా?</strong>
    Tollywood Directors: హీరోయిన్‌ను ఎలా చూపించాలో వీళ్లకి మాత్రమే తెలుసా?
    సినిమాకు హీరో, హీరోయిన్‌ రెండు కళ్లు లాంటి వారు. గతంతో పోలిస్తే ఇప్పుడు హీరోయిన్లకు నటన పరంగా పెద్ద స్కోప్‌ దొరకడం లేదు. సినిమా మెుత్తం హీరో చుట్టూనే సాగేలా కొందరు దర్శకులు సినిమాలు తీస్తున్నారు. పాటల కోసం, అందచందాలను ఆరబోయటం కోసం మాత్రమే హీరోయిన్లు అన్నట్లు చూపిస్తున్నారు. ఇటీవల వచ్చిన ‘లైగర్‌’, ‘మిస్టర్‌ బచ్చన్‌’, ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రాలను గమనిస్తే హీరోయిన్ నటన కంటే వారి ఎక్స్‌పోజింగ్‌పైనే దర్శకులు ఎక్కువగా దృష్టిపెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. అయితే టాలీవుడ్‌లోని కొందరు యువ డైరెక్టర్లు మాత్రం హీరోయిన్లను ఒకప్పటిలా డిగ్నిటీగా చూపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ విషయంలో శేఖర్ కమ్ములాను ఫాలో అవుతూ సినీ లవర్స్ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్లు ఎవరు? వారు చేసిన చిత్రాలేంటి? అందులో హీరోయిన్స్‌ను ఎలా చూపించారు? వంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula) టాలీవుడ్‌లో సెన్సిబుల్‌ దర్శకుడు అనగానే ముందుగా శేఖర్‌ కమ్ముల గుర్తుకు వస్తారు. అందమైన ప్రేమ కథలను, ఆకట్టుకునే కుటుంబ కథలను తెరకెక్కించడంలో ఆయన దిట్ట. ఆయా సినిమాల కోసం ఎంచుకునే హీరోయిన్స్‌, వారిని ఆయన చూపించే విధానం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆనంద్‌, గోదావరి చిత్రాల్లో నటి కమలిని ముఖర్జీని ఎంత బాగా చూపించారో అందరికీ తెలిసిందే. పక్కింటి అమ్మాయి అనిపించేతలా ఆ పాత్రను తీర్చిదిద్దారు. అలాగే ‘లీడర్‌’లో రీచా గంగోపాధ్యాయ, ‘లైఫ్‌ ఈజ్‌బ్యూటీఫుల్‌’లో షగున్‌ కౌర్‌ పాత్రలు ఇప్పటికీ గుర్తుంటాయి. ఇక ‘ఫిదా’, ‘లవ్‌ స్టోరీ’ చిత్రాల్లో సాయి పల్లవి పాత్రను మనసుకు హత్తుకునేలా ఎలా తీర్చిదిద్దారో అందరికీ తెలిసిందే. పెద్దగా ఎక్స్‌పోజింగ్‌ చేయనప్పటికీ ప్రస్తుతం ఆమె స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుందంటే అందులో శేఖర్‌ కమ్ములకు ఎంతో కొంత క్రెడిట్ ఇవ్వాల్సిందే. హీరోయిన్లను డిగ్నిటీగా ఎలా చూపించాలో, వారి నుంచి నటన ఏవిధంగా రాబట్టాలో తెలిసిన దర్శకుడు కావడంతో శేఖర్‌ కమ్ములతో కనీసం ఒక సినిమా అయిన చేయాలని కథానాయికలు ఆశ పడుతుంటారు.&nbsp; హను రాఘవపూడి (Hanu Raghavapudi) శేఖర్‌ కమ్ముల తరహాలోనే దర్శకుడు హను రాఘవపూడి కథానాయికల విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తారు. ఆయన దర్శత్వంలో వచ్చిన ‘అందాల రాక్షసి’, ‘క్రిష్ణ గాడి వీర ప్రేమ గాధ’, ‘పడి పడి లేచె మనసు’, ‘సీతారామం చిత్రాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన దర్శకత్వంలో పని చేసిన లావణ్య త్రిపాఠి, మెహరిన్‌, సాయిపల్లవి, మృణాల్‌ ఠాకూర్‌ ఎంత మంచి పేరు సంపాదించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ‘సీతారామం’ వంటి అద్భుతమైన ప్రేమ కావ్యంలో మృణాల్‌ను చాలా బాగా చూపించారు. ఆ సినిమాతో ఆమె తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ సంపాదించుకుంది. ఆ సినిమాలోని సీత పాత్ర తనకు ఎప్పటికీ ప్రత్యేకమేనని మృణాల్‌ పలు సందర్భాల్లో చెప్పడం విశేషం. హను రాఘవపడి ప్రభాస్‌తో ఓ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేశాడు. ఈ చిత్రం ద్వారా కొత్త అమ్మాయి ఇమాన్ ఇస్మాయిల్ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఇప్పటికే ఆమె లుక్స్‌ విపరీతంగా ఆకర్షించగా డైరెక్టర్‌ హను ఇంకెంత బాగా చూపిస్తారోనని సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.&nbsp; వివేక్‌ ఆత్రేయ (Vivek Athreya) యంగ్‌ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సైతం హీరోయిన్ల విషయంలో శేఖర్ కమ్ములానే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. రీసెంట్‌గా నానితో చేసిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) చిత్రంలో తమిళ నటి ప్రియాంక అరుళ్‌ మోహన్‌ను ఎంత బాగా చూపించారో అందరికీ తెలిసిందే. ఎక్కడా గ్లామర్‌షోకు చోటు ఇవ్వకుండా ఆమె ద్వారా అద్భుత నటనను రాబట్టి ప్రశంసలు అందుకున్నారు. అందుకు ముందు డైరెక్ట్‌ చేసిన ‘మెంటల్‌ మదిలో’ (Mental Madhilo), ‘బ్రోచెవారెవరురా’ (Brochevarevarura), ‘అంటే సుందరానికి’ (Ante Sundaraniki) చిత్రాల్లోనూ హీరోయిన్ల స్కిన్‌ షో కంటే డిగ్నిటీ లుక్‌కే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. ఆయా చిత్రాల్లో నటించిన నివేదా పేతురాజ్‌, నివేదా థామస్‌, నజ్రియా నజిమ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. శౌర్యువ్ (Shouryuv) దర్శకుడు శౌర్యువ్‌ ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna) చిత్రం ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. మనసుకు హత్తుకునేలా ఈ చిత్రాన్ని మలిచి ప్రశంసలు అందుకున్నారు. ఇందులో నాని హీరోగా నటించగా మృణాల్‌ ఠాకూర్‌ అతడికి జోడీగా చేసింది. బాలీవుడ్‌లో అప్పటికే హాట్‌ బాంబ్‌గా గుర్తింపు తెచ్చుకున్న మృణాల్‌ను ఇందులో మళ్లీ అచ్చ తెలుగు అమ్మాయిగా చూపించారు. సాంగ్స్‌లో స్కిన్‌ షోకు అవకాశం ఉన్నప్పటికీ శౌర్యువ్‌ ఆ పని చేయలేదు. ఆమె పోషిస్తున్న డిగ్నిటీ పాత్రపై ప్రభావం చూపకుండా ఆద్యంతం మృణాల్‌ను అందంగా చూపించారు. హీరోయిన్‌ పాత్ర ఎలా ఉండాలి? ఎలా చూపించాలి? అని శౌర్యువ్‌కు ఉన్న స్పష్టతను చూసి సినీ విమర్శకులు సైతం ఆశ్చర్యపోయారు. తన తర్వాతి సినిమాల్లోనూ ఇదే రీతిన కొనసాగాలని ఆశిస్తున్నారు.&nbsp; తరుణ్‌ భాస్కర్‌ (Tharun Bhascker) యంగ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ యూత్‌ఫుల్‌ చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయారు. యువత మెచ్చే కంటెంట్‌తో వరుసగా సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించాడు. అయితే కుర్రకారును ఆకట్టుకువాలన్న తాపత్రయంలో అతడు ఎక్కడా గ్లామర్‌ షోకు ఆస్కారం ఇవ్వడం లేదు. తొలి చిత్రం ‘పెళ్లి చూపులు’ నుంచి గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో విజయ్‌ దేవరకొండకు జోడీగా రీతు వర్మ నటించింది. అసభ్యతకు, అనవసర స్కిన్‌షోకు చోటు లేకుండా ఆమెతో మంచి నటన రాబట్టాడు తరుణ్‌ భాస్కర్‌. ఈ సినిమాతో రీతు వర్మ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత నటుడిగా మారి పలు సినిమాల్లో నటించిన తరుణ్‌ బాస్కర్‌ ‘కీడా కోలా’తో మళ్లీ డైరెక్టర్‌గా మారారు.
    సెప్టెంబర్ 14 , 2024
    <strong>Mr. Bachchan Movie Review: రవితేజ - హరీష్‌ శంకర్‌ కాంబో మళ్లీ మ్యాజిక్‌ చేసిందా?</strong>
    Mr. Bachchan Movie Review: రవితేజ - హరీష్‌ శంకర్‌ కాంబో మళ్లీ మ్యాజిక్‌ చేసిందా?
    నటీనటులు : రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, సచిన్‌ ఖేడ్కర్‌, శుభలేక సుధాకర్‌, కిషోర్‌ రాజు వశిష్ట, సత్య, చమ్మక్‌ చంద్ర తదితరులు దర్శకత్వం : హరీష్‌ శంకర్‌ సంగీతం : మిక్కీ. జె. మేయర్‌ సినిమాటోగ్రఫీ : అయనంక బోస్‌ ఎడిటర్‌ : ఉజ్వల్‌ కులకర్ణి నిర్మాతలు : టీజీ విశ్వప్రసాద్‌, భూషణ్‌ కుమార్‌, కృష్ణన్‌ కుమార్‌, అభిషేక్‌&nbsp; మాస్‌ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా హరీష్‌ శంకర్‌ (Harish Shankar) డైరెక్షన్‌లో రూపొందిన తాజా చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr. Bachchan Movie Review). బాలీవుడ్‌ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) హీరోయిన్‌గా నటించింది. ‘మిరపకాయ్‌’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత రవితేజ-హరీష్‌ శంకర్‌ కాంబోలో రూపొందిన చిత్రం కావడంతో ‘మిస్టర్‌ బచ్చన్‌’పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్‌, టీజర్‌, ప్రమోషన్ చిత్రాలు సైతం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. కాగా, ఈ మూవీ స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? రవితేజ ఖాతాలో మరో హిట్‌ పడినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మిస్టర్ బచ్చన్ (రవితేజ) నిజాయితీ పరుడు. ఓ అవినీతి పరుడైన పొగాకు వ్యాపారిపై రైడ్ చేయడంతో అధికారుల ఆగ్రహానికి గురవుతాడు. దానివల్ల సస్పెండ్ కూడా అవుతాడు. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ సొంతూరు కోటిపల్లికి వెళ్లి అక్కడ జిక్కీ (భాగ్య శ్రీ)ని చూసి ప్రేమలో పడతాడు. పెళ్లికి రెడీ అవుతున్న క్రమంలో తిరిగి ఉద్యోగంలో చేరాలని బచ్చన్‌కు పిలుపు వస్తుంది. తదుపరి రైడ్‌ ఎంపీ ముత్యం జగ్గయ్య (జగపతి బాబు) ఇంట్లో చేయాల్సి వస్తుంది. అధికారులను సైతం భయపట్టే జగ్గయ్య ఇంట్లో బచ్చన్‌ ఎలా రైడ్‌ చేశాడు? అక్కడ అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి? బచ్చన్‌ - జిక్కీ ప్రేమ వ్యవహారం ఏమైంది? పెద్దలు పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు? చివరకు మిస్టర్ బచ్చన్ ఏం సాధించాడు? అనేది మిగిలిన కథ. ఎవరెలా చేశారంటే మిస్టర్ బచ్చన్‌గా రవితేజ చాలా పవర్ ఫుల్‌గా కనిపించాడు. తనదైన కామెడీ శైలితో అదరగొట్టాడు. మునుపటి రవితేజను గుర్తుచేశాడు. అటు యాక్షన్ సీక్వెన్స్‌, భావోద్వేగ సన్నివేశాల్లోనూ తన మార్క్‌ చూపించాడు. ముఖ్యంగా పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ రవితేజ నటించిన విధానం మెప్పిస్తుంది. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే తన గ్లామర్‌తో అలరించింది. ముఖ్యంగా సాంగ్స్‌లో భాగ్యశ్రీ బోర్సే లుక్స్, స్టెప్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. విలన్‌గా జగపతి బాబు తన పాత్రకు పూర్తి నాయ్యం చేశారు. కమెడియన్ స‌త్య తన కామెడీతో నవ్వించాడు. ఫస్ట్ హాఫ్‌లో స‌త్య సీన్స్ దాదాపు వర్కౌట్ అయ్యాయి. ఇతర కీలక పాత్రల్లో నటించిన సచిన్ ఖేడేకర్, తనికెళ్ళ భరణి, గౌతమి, ప్రవీణ్ తమ పాత్రలో ఒదిగిపోయారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారి నిజాయతీగా పనిచేస్తే సమాజానికి ఎంత మేలు జరుగుతుందో దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఈ చిత్రం ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. మిస్టర్‌ బచ్చన్‌ పాత్రను, దాని తాలుకా సన్నివేశాలను దర్శకుడు బాగా రాసుకున్నారు. రవితేజ, భాగ్యశ్రీ బోర్సే మధ్య వచ్చే లవ్‌ ట్రాక్‌ ఈ మూవీకి ప్రధాన బలంగా చెప్పవచ్చు. ప్ర‌థమార్ధాన్ని నిల‌బెట్ట‌డంలో,&nbsp; ప్రేక్ష‌కుల‌కు కావాల్సినంత కాలక్షేపాన్నివ్వ‌డంలో ఈ ట్రాకే ముఖ్య భూమిక పోషించింది. దీనికి తోడు మ‌ధ్య‌లో దొర‌బాబుగా స‌త్య చేసే అల్ల‌రి ప్రేక్ష‌కుల‌కు కావాల్సినంత వినోదాన్ని పంచింది. విరామానికి ముందు ముత్యం జ‌గ్గ‌య్య ఇంటిపై రైడ్‌కు వెళ్ల‌డం, ఆ త‌ర్వాత అక్క‌డ బ‌చ్చ‌న్ చేసే యాక్ష‌న్ హంగామా క‌థ‌ను ర‌స‌వ‌త్త‌రంగా మార్చారు డైరెక్టర్‌. అయితే ప్ర‌థమార్ధంలో క‌నిపించిన హ‌రీష్ మార్కు మ్యాజిక్ ద్వితీయార్ధంలో సన్నగిల్లింది. ఒక్క ఐటీ రైడ్ నేప‌థ్యంగానే ద్వితీయార్ధ‌మంతా నడపడంతో ఆసక్తి సన్నగిల్లింది. హీరో - విలన్ మధ్య మైండ్ గేమ్‌ని ఇంకా ఇంట్రెస్ట్‌గా బిల్డ్ చేసి ఉంటే బాగుండేది. సెకండాఫ్ స్క్రీన్ ప్లేతో పాటు విలన్ పాత్రను ఇంకా బలంగా రాసుకుని ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది.&nbsp; టెక్నికల్‌గా సాంకేతికంగా ఈ చిత్రానికి తొలి హీరో మిక్కీ జే మేయర్. ఈ క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా మంచి క్యాచీ టూన్స్ ఇచ్చారు. రెప్పల్ డప్పుల్, జిక్కీ, సితార్, నల్లంచు తెల్ల చీర పాటలు ఓవైపు వీనులవిందును, మ‌రోవైపు క‌నుల విందును అందించాయి. అయానంక బోస్ కెమెరాపనితనం ఆక‌ట్టుకుంటుంది. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ రవితేజ నటనలవ్‌ ట్రాక్కామెడీ, డైలాగ్స్‌ మైనస్‌ పాయింట్స్‌ ద్వితియార్థంకొన్ని బోరింగ్‌ సీన్స్ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;&nbsp;
    ఆగస్టు 16 , 2024
    <strong>Kavya Thapar VS </strong><strong>Bhagyashri Borse</strong><strong>: వీరిద్దరిలో టాలీవుడ్‌ను ఏలేది ఎవరంటే?</strong>
    Kavya Thapar VS Bhagyashri Borse: వీరిద్దరిలో టాలీవుడ్‌ను ఏలేది ఎవరంటే?
    టాలీవుడ్‌కు హీరోయిన్స్‌ కొత్త కాదు. సినిమా సినిమాకు కొత్త భామలు పరిచయమవుతూనే ఉంటారు. అందం, అభినయంతో మెప్పించిన వారు ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్స్‌గా ఎదిగితే మరికొందరు మాత్రం సత్తా చాటలేక కనుమరుగవుతుంటారు. ఈ క్రమంలోనే ఆగస్టు 15 సందర్భంగా ఇద్దరు హీరోయిన్స్‌ తెలుగు తెరపై సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ‘మిస్టర్‌ బచ్చన్‌’ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse), ‘డబుల్ ఇస్మార్ట్‌’ మూవీతో కావ్యా థాపర్‌ (Kavya Thapar) తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యారు. కావ్య థాపర్‌ ఇప్పటికే తెలుగులో నాలుగు సినిమాలు చేయగా భాగ్యశ్రీ బోర్సేకు మాత్రం ఇదే ఫస్ట్‌ ఫిల్మ్‌. దీంతో వీరిద్దరి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఈ పోరులో ఎవరి విజయవకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; భాగ్యశ్రీ బోర్సే అందానికి కేరాఫ్‌గా భాగ్యశ్రీ! ‘మిస్టర్‌ బచ్చన్‌’ సినిమా ప్రమోషన్స్‌ ఈవెంట్స్‌లో ఎంతో చురుగ్గా పాల్గొంటూ మీడియాలో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. ఒక్కో ఈవెంట్‌లో ఒక్కోరకమైన లుక్‌తో కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తోంది.&nbsp;ఒక ఈవెంట్‌లో చీర కట్టులో ట్రెడిషనల్‌గా కనిపించి, మరో ఈవెంట్‌లో మోడ్రన్‌ డ్రెస్‌లో కళ్లు చెదిరే గ్లామరస్‌గా కనిపిస్తోంది. అటు ‘మిస్టర్‌ బచ్చన్‌’ టీమ్‌ కూడా ఈ బ్యూటీని హైలెట్‌ చేస్తోంది. ప్రతీ ప్రమోషన్స్‌లో ఈ అమ్మడిని పాల్గొనేలా చేస్తూ సినిమాపై యూత్‌లో అంచనాలు పెంచేస్తోంది. ఈ హాట్‌ బ్యూటీ కూడా దొరికిందే ఛాన్స్ అని తన క్యూట్‌ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రమోషన్స్‌కు సరికొత్త అందాలు తీసుకొస్తోంది. ఇదే బెస్ట్ ఛాన్స్‌గా భావిస్తూ దూసుకెళ్తోంది.&nbsp; హరీష్ శంకర్‌ మార్క్‌! ‘మిస్టర్‌ బచ్చన్‌’ ట్రైలర్‌, టీజర్‌, ప్రమోషన్ పోస్టర్స్‌ గమనిస్తే భాగ్యశ్రీ ఇందులో గ్రామరస్‌ ట్రీట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మాస్‌ మహారాజా రవితేజ సరసన ఈ అమ్మడు అదిరిపోయే ప్రదర్శన చేసినట్లు తెలుస్తోంది. పైగా హీరోయిన్స్‌ను చూపించడంలో డైరెక్టర్ హరీష్ శంకర్‌కు మంచి పేరుంది. రవితేజ, హరీష్ శంకర్‌ కాంబోలో వచ్చిన ‘మిరపకాయ్‌’లో ఇద్దరు హీరోయిన్స్‌తో ఏ స్థాయిలో ఎంటర్‌టైన్‌ చేశారో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘మిస్టర్‌ బచ్చన్‌’లో భాగ్యశ్రీ నుంచి భారీ ఎత్తున అందాల ఆరబోత ఉండే అవకాశముంది. ఈ చిత్రం ద్వారా భాగ్యశ్రీకి సరైన స్టార్ట్‌ లభిస్తే ఇండస్ట్రీలో ఈ అమ్మడికి తిరుగుండదని చెప్పవచ్చు. పైగా తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకోవడం భాగ్యశ్రీకి కలిసిరానుంది.&nbsp;&nbsp; చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్‌ ఒక్క మూవీ రిలీజ్‌ కానప్పటికీ భాగ్యశ్రీ బోర్సేతో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు తెగ పోటీ పడుతున్నారు. 'మిస్టర్ బచ్చన్‌' షూటింగ్‌ దశలో ఉండగానే అదిరిపోయే ఆఫర్లు భాగ్యశ్రీ దక్కాయి. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) - గౌతం తిన్ననూరి (Gowtam Tinnanuri) కాంబోలో వస్తోన్న చిత్రంలో ఈ అమ్మడికి అవకాశం దక్కింది. ఈ మూవీ షూటింగ్‌లో కూడా భాగ్యశ్రీ పాల్గొంటున్నట్లు సమాచారం. ఇక నేచురల్‌ స్టార్‌ నాని (Hero Nani) హీరోగా సుజీత్‌ (Sujeeth) దర్శకత్వంలో రానున్న మూవీలోనూ హీరోయిన్‌గా భాగ్యశ్రీ పేరును పరిశీలిస్తున్నట్లు టాక్‌ ఉంది. అన్నీ కుదిరితే త్వరలోనే నాని - భాగ్యశ్రీ కాంబోపై అధికారిక ప్రకటన సైతం రానుంది. ఇలా డెబ్యూ రిలీజ్‌ కాకుండానే టాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ ఈ బ్యూటీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వరుసగా రెండు బ్లాక్‌ బాస్టర్లు వస్తే టాలీవుడ్‌లో భాగ్యశ్రీ టాప్‌ హీరోయిన్‌గా మారడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=CS7Wm46EXAA భాగ్యశ్రీ నేపథ్యం ఇదే.. భాగ్యశ్రీ బోర్సేది మహారాష్ట్రలోని పుణే. హిందీ చిత్రం 'యారియాన్ 2'తో ఆమె వెండితెరకి పరిచయమైంది. అంతకుముందు చాలా యాడ్స్‌లో మోడల్‌గా పని చేసింది. ఈమె చేసిన యాడ్స్‌లో క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ బాగా ఫేమ్ తెచ్చి పెట్టింది. ఇక ‘యారియాన్ 2’లో ఈ బ్యూటీ యాక్టింగ్‌కి ఫిదా అయిన డైరెక్టర్ హరీశ్ శంకర్.. ‘మిస్టర్ బచ్చన్‌’లో ఛాన్స్ ఇచ్చారు. అలా టాలీవుడ్‌లో బజ్‌ క్రియేట్‌ చేసిన ఈ అమ్మడు మరిన్ని ఆఫర్లను దక్కించుకుంది. చూడటానికి చాలా క్యూట్‌గా ఉండే భాగ్యశ్రీ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా వ్యవహరిస్తుంటుంది. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు గ్లామర్ ట్రీట్ ఇస్తూ సినిమాలకు అతీతంగా తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.&nbsp; కావ్య థాపర్‌ కావ్య థాపర్‌ హల్‌చల్‌! రామ్‌ పోతినేని, పూరి జగన్నాథ్‌ కాంబోలో రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్‌’ మూవీలో కావ్యథాపర్‌ హీరోయిన్‌గా నటించింది. తెలుగులో ‘ఈ మాయ పేరేమిటో’, ‘ఏక్‌ మినీ కథ’, ‘ఊరు పేరు భైరవకోన’ వంటి చిత్రాలు చేసినప్పటికీ ఈ అమ్మడికి బ్రేక్‌ రాలేదు. దీంతో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సక్సెస్‌పై కావ్య ఎన్నో ఆశలు పెట్టుకుంది. అంతేకాదు అందాల ప్రదర్శనకు సైతం ఏమాత్రం వెనకాడలేదు. ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ ట్రైలర్‌, లిరికల్‌ సాంగ్‌ వీడియోలు, ప్రమోషన్ పోస్టర్స్‌ చూస్తే కావ్య థాపర్‌ ఎంతో హాట్‌గా కనిపించింది. గ్లామరస్‌ లుక్‌, కళ్లు చెదిరే హాట్ స్టెప్పులతో యూత్‌ను కట్టిపడేసింది. అంతకాదు లిప్‌లాక్‌ సీన్‌లోనూ నటించి అందర్నీ ఆశ్యర్యపరిచింది. అన్ని అనుకున్నట్లు జరిగి డబుల్‌ ఇస్మార్ట్‌ సక్సెస్‌ అయితే కావ్య థాపర్‌ స్టార్‌ హీరోయిన్‌గా మారడం పక్కా అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.&nbsp; శ్రీను వైట్ల డైరెక్షన్‌లో.. గోపిచంద్‌ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న 'విశ్వం' చిత్రంలో కావ్య థాపర్‌గా హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. హై యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్‌ చాలావరకూ ఇటలీలో నిర్వహించారు. షూటింగ్‌ కూడా చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై కూడా కావ్య ఎన్నో ఆశలు పెట్టుకుంది. లేటెస్ట్ బజ్‌ ప్రకారం ‘పుష్ప 2'లో ఓ స్పెషల్‌ సాంగ్‌లో కావ్య థాపర్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. యూత్‌లో ఈ భామ అందాలకు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా ఐటెం సాంగ్‌ను కావ్య చేయిస్తే ఎలా ఉంటుందని డైరెక్టర్‌ సుకుమార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన సైతం వచ్చే ఛాన్స్ ఉందట. వీటితో పాటు మరిన్ని అవకాశాలు కావ్య కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.&nbsp; https://www.youtube.com/watch?v=-Kba0qmTtZE కావ్య థాపర్‌ నేపథ్యం ఇదే! మహారాష్ట్రకు చెందిన కావ్య థాపర్‌ 2013లో ‘తత్కాల్‌’ అనే షార్ట్‌ఫిల్మ్‌ ద్వారా కెరీర్ ప్రారంభించింది. తెలుగులో వచ్చిన ‘ఈ మాయ పేరేమిటో’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ‘ఏక్‌ మినీ కథా’ మూవీలోనూ అమృతగా కనిపించి కావ్య మెప్పించింది. ఆ తర్వాత క్యాట్‌ (పంజాబీ), ఫర్జీ (హిందీ) వెబ్‌సిరీస్‌లలో నటించి అలరించింది. ‘ఈగల్‌’, ‘ఊరి పేరు భైరవకోన’ చిత్రాలతో ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించింది. కాగా, సినిమాలతో పాటు సోషల్‌మీడియాలోనూ కావ్య బిజీ బిజీగా ఉంటోంది.తన గ్లామర్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తూ నెటిజన్లకు హాట్‌ ట్రీట్ ఇస్తోంది.ఈ ముద్దుగుమ్మ ఫొటోలను చూసిన నెటిజన్లు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.
    ఆగస్టు 13 , 2024
    <strong>This Week Movies:&nbsp; ఆగస్టు 15 సందర్భంగా ఓటీటీలోకి మోస్ట్ వాంటెడ్ చిత్రాలు</strong>
    This Week Movies:&nbsp; ఆగస్టు 15 సందర్భంగా ఓటీటీలోకి మోస్ట్ వాంటెడ్ చిత్రాలు
    పంద్రాగస్టు సందర్భంగా ఈ వారం థియేటర్లలో పెద్ద ఎత్తున సందడి నెలకొననుంది. భారీ చిత్రాలతో థియేటర్స్‌ కళకళలాడేందుకు సిద్ధమవుతున్నాయి. రవితేజ, రామ్‌ పోతినేని, విక్రమ్‌ వంటి స్టార్‌ హీరోల చిత్రాలు ఈ వారం విడుదల కాబోతున్నాయి. అటు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం. థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు మిస్టర్‌ బచ్చన్‌ (Mr. Bachchan) మాస్‌ మహారాజా రవితేజ హీరోగా హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో రూపొందిన తాజా చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. బాలీవుడ్‌ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 15న (Mr. Bachchan Release Date) థియేటర్స్‌లో సందడి చేయనుంది. రవితేజ ఇందులో ఐటీ అధికారిగా కనిపించనున్నారు. ఆయన ఎనర్జీ యాక్టింగ్‌, భాగ్యశ్రీ అందాలు, హరీశ్‌ శంకర్‌ టేకింగ్‌ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని చిత్ర బృందం తెలిపింది.  డబుల్‌ ఇస్మార్ట్‌ (Double iSmart)&nbsp; హీరో రామ్‌ పోతినేని, డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబోలో రూపొందిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రం ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు సీక్వెల్‌గా దీన్ని నిర్మించారు. కావ్య థాపర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్‌ దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు 15న (Double Ismart Release Date) థియేటర్స్‌లో సందడి చేయడానికి ఈ మూవీ సిద్ధమైంది. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. తంగలాన్‌ (Thangalaan) తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ (Vikram) నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘తంగలాన్‌’ కూడా ఈ వారమే గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. పా. రంజిత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జ్ఞానవేల్‌రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈనెల 15న విడుదల కానుంది. స్వాతంత్య్రానికి పూర్వం కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌లో జరిగిన వాస్తవ సంఘటనల్ని ఆధారం చేసుకుని ఈ సినిమాను రూపొందించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది.  ఆయ్‌ (Aay) ఎన్టీఆర్‌ బావ మరిది నార్నే నితిన్‌ నటించిన రెండో చిత్రం ‘ఆయ్‌’. మ్యాడ్‌ చిత్రంతో సాలిడ్‌ విజయాన్ని అందుకు ఈ యంగ్‌ హీరో తన సెకండ్‌ హిట్‌ కోసం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంజి కె.మణిపుత్ర దర్శకత్వం ‘ఆయ్‌’ మూవీ ఆగస్టు 15న రిలీజ్‌ కాబోతోంది. గోదావరి విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. నార్నే నితిన్‌కు జోడీగా నయన్‌ సారిక నటించింది. ఈ మూవీ తప్పకుండా ఎంటర్‌టైన్‌ చేస్తుందని చిత్ర బృందం తెలిపింది.  వేదా (Vedaa) జాన్‌ అబ్రహం (John Abraham), శార్వరీ వాఘ్‌, తమన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వేదా’ (Vedaa). నిఖిల్‌ అడ్వాణీ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 15న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. యాక్షన్‌ డ్రామాగా రూపొందిన ‘వేదా’ను వాస్తవ సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది తెరకెక్కించారు. నేటి సమాజంలో పరిస్థితులను ప్రతిబింబిస్తుందని చిత్ర బృందం తెలిపింది. ఖేల్‌ ఖేల్‌ మే (Khel Khel Mein) ఏకంగా 26సార్లు రీమేక్ అయి గిన్నిస్‌ బుక్ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించుకున్న పర్‌ఫెక్ట్‌ స్ట్రేంజర్స్‌ (Perfetti Sconosciuti) ఇప్పుడు హిందీలో ‘ఖేల్‌ ఖేల్‌ మే’ (khel khel mein)గా రాబోతోంది.  అగ్రకథానాయకుడు అక్షయ్‌ కుమార్‌,  తాప్సి, అమ్మీ వ్రిక్‌, వాణీకపూర్‌, ఫర్దీన్‌ఖాన్‌, ఆదిత్య సీల్‌, ప్రజ్ఞా జైశ్వాల్‌లు  ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ముదస్సర్‌ అజీజ్‌ తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు&nbsp; డార్లింగ్‌ ప్రియదర్శి, నభా నటేష్ నటించిన 'డార్లింగ్' (Darling) ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. థియేటర్లలోకి వచ్చి నెల రోజులు కాకముందే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఆగస్టు 13 నుంచి హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. మ‌ల్టీపుల్ ప‌ర్స‌నాలిటీ డిజార్డ‌ర్ అనే స‌మ‌స్య‌కు వినోదాన్ని జోడించి దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించారు. జులై 19న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ పెద్దగా సక్సెస్ కాలేదు. వీరాంజనేయులు విహార యాత్ర (Veeranjaneyulu Vihara Yatra) ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌ ఈ వారం మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాబోతోంది. 'వీరాంజనేయులు విహార యాత్ర' పేరుతో ఆగస్టు 14 నుంచి కొత్త మూవీని స్ట్రీమింగ్‌ చేయబోతోంది. సీనియర్‌ నటుడు నరేశ్‌, శ్రీలక్ష్మీ, యువ నటులు రాగ్‌ మయూర్‌, ప్రియా వడ్లమాని ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషించారు. టైటిల్‌ని బట్టి విహార యాత్ర నేపథ్యంలో ఈ మూవీని రూపొందించినట్లు తెలుస్తోంది.  మనోరథంగల్‌ (Manorathangal) కమల్‌హాసన్, మోహన్‌లాల్, మమ్ముట్టి, ఫహాద్‌ ఫాజిల్‌ వంటి ప్రముఖ సౌత్‌ ఇండియన్‌ స్టార్స్‌ నటించిన లేటెస్ట్‌ సిరీస్‌ ‘మనోరథంగల్‌’.  తొమ్మిది కథలతో, ఎనిమిది మంది దర్శకులు తీర్చిదిద్దిన ఈ సిరీస్‌ను ఆగస్టు 15న ఓటీటీలో విడుదల చేస్తున్నారు. జీ 5 వేదికగా తెలుగు, హిందీతో పాటు పలు దక్షిణాది భాషల్లో ఈ సిరీస్‌ అందుబాటులోకి రానుంది. ప్రముఖ రచయిత, దర్శకుడు ఎమ్‌.టి వాసుదేవన్‌ రాసిన కథల ఆధారంగా ఈ ఆంథాలజీ సిరీస్‌ను రూపొందించారు.  మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateDaughtersMovieEnglishNetflixAugust 14Worst Ex EverSeriesEnglishNetflixAugust 14Emily In ParisSeriesEnglishNetflixAugust 14The UnionMovieEnglishNetflixAugust 16Love Nexts DoorMovieKorean/EnglishNetflixAugust 17DarlingMovieTeluguHotstarAugust 13The TyrantMovieKorean/EnglishHotstarAugust 14Nam Namak NishanMovieHindiAmazon&nbsp;August 14JackpotMovieEnglishAmazon&nbsp;August 15ChanakSeriesHindiSonyLIVAugust 16ManorathangalSeriesTelugu DubZee 5August 15Sekhar HomeMovieHindiJio CinemaAugust 14
    ఆగస్టు 12 , 2024
    <strong>Double Ismart: రామ్‌తో కోల్డ్‌ వార్‌? అందుకే ట్రైలర్‌ లాంచ్‌కు పూరీ రాలేదా!</strong>
    Double Ismart: రామ్‌తో కోల్డ్‌ వార్‌? అందుకే ట్రైలర్‌ లాంచ్‌కు పూరీ రాలేదా!
    రామ్‌ పోతినేని (Ram Pothineni) హీరోగా, పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్‌ చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double Ismart). ఆగస్టు 15న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా రిలీజ్‌ డేట్ అనౌన్స్‌ చేసినప్పటికీ నుంచి మూవీ టీమ్‌కు ఏదోక సమస్య వస్తూనే ఉంది. రవితేజ ‘మిస్టర్‌ బచ్చన్‌’ పంద్రాగస్టు బరిలో నిలవడం, ‘లైగర్‌’ డిస్ట్రిబ్యూటర్లు తమ నష్టాలను సెటిల్‌ చేయాలని డిమాండ్‌ చేయడం చిత్ర బృందానికి తలనొప్పిగా మారింది.ఈ క్రమంలోనే తాజాగా హీరో రామ్‌, డైరెక్టర్‌ పూరికి మధ్య మనస్పర్థలు (Ram Pothineni vs Puri Jagannadh) తలెత్తినట్లు ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ కోల్డ్‌ వార్‌కు కారణమేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; రామ్‌ అసంతృప్తి! హీరో రామ్‌, డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబోలో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ (Ismart Shankar) బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్‌’ (Double Ismart)ను రూపొందించారు. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్‌ రెడీ కాగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై హీరో రామ్‌ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 'లైగర్‌' వివాదం కారణంగా తన చిత్రానికి చిక్కులు రావడంపై రామ్‌ గుర్రుగా ఉన్నారని ఫిల్మ్‌ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్న తరుణంలో ఇప్పటికీ నైజాం పంపిణీ వ్యవహారం కొలిక్కిరాకపోవడం, నిర్మాత ఛార్మీ ప్రమోషన్స్‌ షురూ చేయకపోవడంపై&nbsp; రామ్‌ ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడిపోతున్నారట. ఆదివారం ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌ జరగ్గా డైరెక్టర్ పూరి రాకపోవడం వెనుక రామ్‌తో తలెత్తిన వివాదాలే కారణమని ఫిల్మ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ట్రైలర్‌ ఈవెంట్‌లో ఏకాకిగా రామ్‌ తన సినిమాను ప్రమోట్‌ చేసుకోవడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.&nbsp; పూరి వివరణ! 'డబుల్‌ ఇస్మార్ట్‌' ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌కు రాకపోవడంపై డైరెక్టర్‌ పూరి ఓ వీడియో బైట్‌ను రిలీజ్ చేశారు. సెన్సార్‌ కోసం ముంబయిలో ఫైనల్‌ మిక్సింగ్‌ ఉండి ఈవెంట్‌కి రాలేకపోయినట్లు తెలిపారు. ఈవెంట్‌కు రాలేకపోయినందుకు చాలా బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఇవేమి నమ్మశక్యంగా లేవని పేర్కొంటున్నారు. ఒక దర్శకుడు లేకుండా ట్రైలర్‌ లాంచ్‌ జరగడమేంటని ప్రశ్నిస్తున్నారు. రామ్‌తో గ్యాప్‌ వల్లే ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌కు పూరి రాలేదని ఆరోపిస్తున్నారు. డబుల్‌ ఇస్మార్ట్‌ సూపర్‌ హిట్‌ సాధిస్తే ఆటోమేటిక్‌గా వీరి మధ్య గ్యాప్‌ తొలగిపోతుందని కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. రామ్‌, పూరి మధ్య విభేదాలకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ చిత్ర యూనిట్‌ దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.&nbsp; https://twitter.com/i/status/1820365775439552575 ట్రైలర్ ఎలా ఉందంటే? ఆదివారం రిలీజైన 'డబుల్‌ ఇస్మార్ట్‌' ట్రైలర్‌ ఊహించిన విధంగానే మాస్ యాక్షన్‍తో, నాటు డైలాగ్‍లతో నిండిపోయింది. అటు తన మార్క్ ఎనర్జిటిక్ యాక్షన్, మాస్ డైలాగ్‍లు, డ్యాన్స్‌తో రామ్ ట్రైలర్‌లో దుమ్మురేపారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ (Sanjay Dutt) ఇందులో విలన్‍గా బిగ్‍బుల్ పాత్రను చేశారు. బిగ్‍బుల్ బ్రెయిన్‍లోని మెమొరీని శంకర్ (రామ్ పోతినేని) మెదడులో పంపించడం ఈ ట్రైలర్‌లో ముఖ్యమైన అంశంగా కనిపిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చిప్‍ను తలలో పెడితే ఈ డబుల్ ఇస్మార్ట్ మూవీలో ఏకంగా బ్రెయిన్ మెమొరీ ట్రాన్స్‌ఫర్ కాన్సెప్ట్ తీసుకున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. డబుల్ ఇస్మార్ట్‌ ట్రైలర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.&nbsp; https://www.youtube.com/watch?v=ym0upoayqJg మిస్టర్‌ బచ్చన్‌ దూకుడు! డబుల్‌ ఇస్మార్ట్‌ టీమ్‌తో పోలిస్తే ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr. Bachchan) టీమ్‌ ప్రమోషన్స్‌ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. వరుసగా ప్రెస్‌ మీట్‌లు నిర్వహిస్తూ తమ సినిమాను ఆడియన్స్‌లోకి తీసుకెళ్తోంది. సాధారణంగా ప్రమోషన్స్‌ అనేవి సినిమా ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపుతాయి. అటువంటి కీలకమైన ప్రమోషన్స్‌ను ‘డబుల్‌ ఇస్మార్ట్’ సరిగా మెుదలు పెట్టకపోవడంపై సినీ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మిస్టర్‌ బచ్చన్‌ ఆగస్టు 15 రేసులోకి రావడంతో పూరి ఢీలా పడిపోయారా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ సక్సెస్‌ ఏంతో కీలకమైన నేపథ్యంలో రిజల్ట్‌పై పూరి ఆందోళనతో ఉన్నారా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.&nbsp; కోరినా.. వెనక్కి తగ్గలేదా? పంద్రాగస్టు రోజున ‘మిస్టర్‌ బచ్చన్‌’ రిలీజ్‌ కాకుండా ఉండేందుకు ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ టీమ్‌ అన్ని ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. సినిమాను వాయిదా వేసుకోవాలని బచ్చన్‌ టీమ్‌ను వారు అడిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనికి బచ్చన్‌ టీమ్‌ ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే డబుల్‌ ఇస్మార్ట్‌ నిర్మాత ఛార్మీ ఇటీవల రవితేజతో పాటు దర్శకుడు హరీశ్‌ శంకర్‌ను సోషల్‌ మీడియాలో బ్లాక్‌ చేసినట్లు కథనాలు వచ్చాయి.&nbsp;
    ఆగస్టు 05 , 2024
    <strong>Double Ismart Vs Mr. Bachchan: పూరి జగన్నాథ్ భయపడ్డారా? అందుకే డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్ చేయడం లేదా?</strong>
    Double Ismart Vs Mr. Bachchan: పూరి జగన్నాథ్ భయపడ్డారా? అందుకే డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్ చేయడం లేదా?
    ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం ఆగస్టు 15 నుంచి తప్పుకోవడంతో ఆ డేట్‌లో మహా యుద్ధమే మెుదలైంది. రామ్‌ పోతినేని (Ram Pothineni) హీరోగా పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double Ismart) చిత్రాన్ని ఆ రోజున రిలీజ్‌ చేస్తామని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. అప్పటికీ ఏ చిత్రం ఆ డేట్‌కు లాక్‌ కాకపోవడంతో ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సోలోగా విడుదలవుతుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆగస్టు 15 రేసులోకి రవితేజ - హరీష్‌ శంకర్‌ కాంబోలోని ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr. Bachchan) వచ్చి చేరింది. దీంతో బాక్సాఫీస్‌ వద్ద బిగ్‌ ఫైట్‌కు తెరలేచింది. అయితే ఈ మధ్య ఇండస్ట్రీలో జరుగుతున్న వరుస పరిణామాలను చూస్తుంటే ఈ పోరులో డైరెక్టర్‌ పూరి వెనకపడ్డారా? అన్న సందేహం కలుగుతోంది. ఆయన భయపడ్డారన్న వాదనలు సైతం సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కారణాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; ఓ వైపు ప్రమోషన్స్‌.. మరోవైపు డిప్రెషన్‌! ఆగస్టు 15కు సమయం దగ్గర పడుతుండటంతో ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr. Bachchan) టీమ్‌ ప్రమోషన్స్‌తో దూసుకుపోతోంది. వరుసగా ప్రెస్‌ మీట్‌లు నిర్వహిస్తూ తమ సినిమాను ఆడియన్స్‌లోకి తీసుకెళ్తోంది. అయితే ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. పూరి జగన్నాథ్‌ &amp; కో ఇప్పటివరకూ ఒక్క ప్రెస్‌ మీట్‌ కూడా నిర్వహించలేదు. తమ సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రమోషన్స్‌ను షురూ చేయలేదు. సాధారణంగా ప్రమోషన్స్‌ అనేవి సినిమా ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపుతాయి. అటువంటి కీలకమైన ప్రమోషన్స్‌ను ‘డబుల్‌ ఇస్మార్ట్’ ఇంకా మెుదలే పెట్టకపోవడంపై సినీ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మిస్టర్‌ బచ్చన్‌ ఆగస్టు 15 రేసులోకి రావడంతో పూరి ఢీలా పడిపోయారా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. హీరో రామ్‌తో పాటు తనకూ ఈ మూవీ సక్సెస్‌ ఏంతో కీలకమైన నేపథ్యంలో రిజల్ట్‌పై పూరి ఆందోళనతో ఉన్నారా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.&nbsp; వెనక్కి తగ్గని బచ్చన్‌ టీమ్‌! పంద్రాగస్టు రోజున ‘మిస్టర్‌ బచ్చన్‌’ రిలీజ్‌ కాకుండా ఉండేందుకు ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ టీమ్‌ అన్ని ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. సినిమాను వాయిదా వేసుకోవాలని బచ్చన్‌ టీమ్‌ను వారు అడిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనికి బచ్చన్‌ టీమ్‌ ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే డబుల్‌ ఇస్మార్ట్‌ నిర్మాత ఛార్మీ తాజాగా రవితేజతో పాటు దర్శకుడు హరీశ్‌ శంకర్‌ను సోషల్‌ మీడియాలో బ్లాక్‌ చేసినట్లు కూడా కథనాలు వచ్చాయి. మరోవైపు ‘లైగర్‌’ మూవీ డిస్ట్రిబ్యూటర్ల నుంచి సైతం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’కు సమస్యలు ఎదురుకానున్నట్లు తెలుస్తోంది. లైగర్‌ నష్టాలను సెటిల్‌ చేయకుండా పూరి మరో ఫిల్మ్‌ను రిలీజ్‌ చేసేందుకు సిద్ధం కావడంపై డిస్ట్రిబ్యూటర్ల కోపం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ టీమ్‌ ఎలా ప్రతిస్పందిస్తుందో చూడాలి.&nbsp; వ్యూహామా లేదా గందరగోళమా? పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కాబోతున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రానికి ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్‌ లేకపోవడం వెనక ఓ వ్యూహాం ఉన్నట్లు టాక్‌ వినిపిస్తోంది. డైరెక్టర్‌ పూరి కూడా ‘కల్కి 2898 ఏడీ’ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ను అనుసరిస్తున్నట్లు చెప్పారు. కేవలం కంటెంట్‌ (ట్రైలర్‌, టీజర్‌, లిరికల్‌ సాంగ్స్‌, ప్రమోషన్‌ పోస్టర్లు) ద్వారానే తమ సినిమాను ప్రమోట్‌ చేయాలని ఇస్మార్ట్‌ టీమ్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు&nbsp; తెలుస్తోంది. గతంలో ‘లైగర్‌’ చిత్రానికి పెద్ద ఎత్తున ప్రమోషన్స్‌ ఇచ్చి చేతులు కాల్చుకున్న ‌నేపథ్యంలో మరోమారు ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. అయితే ఇండస్ట్రీలో మరికొందరి వాదన ఇంకోలా ఉంది. డిస్ట్రిబ్యూటర్ల గొడవ, మిస్టర్‌ బచ్చన్‌ టీమ్‌తో సంప్రదింపులు నేపథ్యంలో ప్రస్తుతం ఇస్మార్ట్‌ టీమ్‌ ప్రమోషన్స్‌పై ఫోకస్‌ పెట్టలేకపోతోందని అంటున్నారు. టీమ్‌ అంతా గందరగోళంలో ఉన్నందువల్ల ఇంకా ప్రమోషన్స్‌ షురూ కాలేదని చెబుతున్నారు.&nbsp; ఆ ఇష్యూ వల్లే రిలీజ్‌ చేస్తున్నాం: హరీశ్‌ శంకర్‌ రీసెంట్‌గా మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ ప్రమోష‌న్స్‌లో పాల్గొన్న డైరెక్టర్‌ హ‌రీశ్ శంక‌ర్ ఇస్మార్ట్ టీంతో ఉన్న వివాదంపై స్పందించారు. పూరి జ‌గ‌న్నాథ్ సినిమాతో పాటు మీ సినిమా ఒకేసారి విడుద‌ల కాబోతుంది దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని రిపోర్ట‌ర్ అడుగ‌గా హరీశ్‌ శంకర్‌ సమాధానం ఇచ్చారు. 'పూరితో నేను పోల్చుకోలేను. ఆయ‌న ఒక దిగ్గజం. ఆయ‌న‌తో నా సినిమా వ‌స్తుండ‌టం నా అదృష్టం. నిజానికి రెండు సినిమాలు ఒకే డేట్‌కి రావ‌డం వెనుక ముఖ్య కార‌ణం ఓటీటీ ఇష్యూ ఉండ‌డం. అందుకే ముందుగా రిలీజ్ చేస్తున్నా. అంతేకాని నాకు పూరి స‌ర్‌కి ఎలాంటి గొడ‌వ‌లు లేవు’ అంటూ హరీశ్ శంక‌ర్ చెప్పుకొచ్చారు.
    ఆగస్టు 01 , 2024
    <strong>Bhagyashri Borse: టాలీవుడ్‌లో శ్రీలీలను రీప్లేస్ చేయనున్న భాగ్యశ్రీ బోర్సే?</strong>
    Bhagyashri Borse: టాలీవుడ్‌లో శ్రీలీలను రీప్లేస్ చేయనున్న భాగ్యశ్రీ బోర్సే?
    టాలీవుడ్‌లో మరొ కొత్త హీరోయిన్ పేరు మార్మోగుతోంది. ఆ ముద్దుగుమ్మే భాగ్యశ్రీ బోర్సే. ఈ మధ్య కాలంలో శ్రీలీల తర్వాత అంతటి క్రేజ్ ఈ యంగ్ హీరోయిన్ సంపాదించింది. ఇంకా తాను నటించిన సినిమా విడుదల కాకముందే.. ఏకంగా స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించింది. ఈ అమ్మడిని వెతుక్కుంటూ అవకాశాలు వచ్చి పడుతున్నాయి.&nbsp; తాజాగా ఆమె నటించిన మిస్టర్ బచ్చన్ (Mr Bachchan) సినిమా ఆగస్ట్ 15న విడుదలకానుంది. ప్రమోషన్‌ ఈవెంట్లలో చురుకుగా పాల్గొంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చూస్టుంటేనే కళ్లు తిప్పుకోలేనంత అందంగా ఉన్న ఈ బాలీవుడ్ సుందరి.. టాలీవుడ్‌లో జెండా పాతేందుకు సిద్ధమైంది View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) గతంలో ఇదే హైప్‌తో వచ్చిన కన్నడ సోయగం శ్రీలీలక ఇండస్ట్రీలో గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అయింది.&nbsp; పెళ్లిసందD చిత్రం తర్వాత శ్రీలీల (Sreeleela) ఎలాగైతే తన గ్లామర్‌తో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు చెక్‌ పెట్టిందో అదే విధంగా మిస్టర్ బచ్చన్‌తో ఢీకొట్టేందుకు సిద్ధమైంది. ఇక మిస్టర్ బచ్చన్ చిత్రం హిట్ కొడితే మాత్రం భాగ్యశ్రీ స్టార్ హీరోయిన్‌గా మారడం ఖాయమని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ సినిమా హిందీ హిట్ చిత్రం రైడ్‌కు రిమేక్ కావడంతో... తెలుగులోను హిట్‌ అవుతుందని మూవీ మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ చిత్రం జయపజయాలతో సంబంధం లేకుండా ఆమె గ్లామర్ టాలీవుడ్‌లో రాణించేందుకు దోహద పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మిస్టర్ బచ్చన్ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్‌లో ఈ అమ్మడి అందాల ప్రదర్శన టాక్‌ అఫ్‌ ది టౌన్‌గా మారింది. కుర్రకారులో మంచి జోష్‌తో పాటు మంచి క్రేజ్ సంపాదించింది. ఇప్పటికే రవితేజ, విజయ్‌దేవరకొండ వంటి స్టార్‌ హీరోల సరసన నటించే ఛాన్స్‌ దక్కించుకున్న ఈ బాలీవుడ్‌ బ్యూటీ.. ఇప్పుడు టాలీవుడ్‌లో మరో సినిమాకు ఓకే చెప్పింది.&nbsp; మలయాళ స్టార్&nbsp; హీరో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) తెలుగులో నేరుగా చేయబోయే చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. &nbsp;గతంలో దర్శకుడు పరుశురామ్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన రవి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) మరోవైపు నెచురల్ స్టార్ నాని, డైరెక్టర్ సుజిత్ కాంబోలో వస్తున్న సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మకు అవకాశం దక్కినట్లు వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.&nbsp;&nbsp; ఇక భాగ్యశ్రీ బోర్సే నేపథ్యం పరిశీలిస్తే.. ఈ ముద్దుగుమ్మ పుణేలో జన్మించింది. హిందీ చిత్రం 'యారియాన్ 2'తో భాగ్యశ్రీ బోర్సే తెరంగేట్రం చేసింది. అంతకుముందు చాలా యాడ్స్‌లో మోడల్‌గా పని చేసింది.&nbsp; ఈమె చేసిన యాడ్స్‌లో క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ బాగా ఫేమ్ తెచ్చి పెట్టింది.&nbsp; ‘యారియాన్ 2’లో ఈ బ్యూటీ యాక్టింగ్‌కి ఫిదా అయిన డైరెక్టర్ హరీశ్ శంకర్.. ‘మిస్టర్ బచ్చన్‌’లో ఛాన్స్ ఇచ్చారు.&nbsp; భాగ్యశ్రీ బోర్సే గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    జూలై 29 , 2024
    <strong>Kannappa: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న మంచు విష్ణు, రవితేజ.. ఎలాగంటే?</strong>
    Kannappa: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న మంచు విష్ణు, రవితేజ.. ఎలాగంటే?
    టాలీవుడ్‌లో కొత్త సినిమాలకు సంబంధించిన ట్రైలర్‌, టీజర్లు సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుంటాయి. ముఖ్యంగా యూట్యూబ్‌లో లక్షల్లో వ్యూస్‌&nbsp; సాధించి అదరగొడుతుంటాయి. ఈ క్రమంలో ఇటీవల వచ్చిన ‘కన్నప్ప’ (Kannappa), ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr Bachchan) టీజర్లు.. యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్నాయి. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచాయి. తద్వారా సినిమాపై ఇప్పటి నుంచే భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.&nbsp; కన్నప్ప దూకుడు..! మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా అతడి స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం 'కన్నప్ప' (Kannappa Movie). విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్టుగా పేరొందిన ఈ చిత్రాన్ని.. మహాభారతం సీరియల్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. గ్రాండ్ విజువల్స్‌తో టీజర్‌ ఎంతో రిచ్‌గా సాగింది. దీంతో కన్నప్ప టీజర్‌కు యూట్యూబ్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ టీజర్‌.. ఇప్పటివరకూ 17 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించినట్లు చిత్ర యూనిట్‌ ఓ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. ఇందులో ముంచు విష్ణు యాక్షన్‌ లుక్‌లో కనిపించాడు.&nbsp; రిలీజ్ ఎప్పుడంటే ప్రస్తుతం కన్నప్ప షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఇందులో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas), అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar), మోహన్‌లాల్‌ (Mohan Lal), శివరాజ్‌ కుమార్‌ (Siva Raj Kumar), మోహన్‌ బాబు (Mohan Babu), శరత్‌ కుమార్‌ (Sarath Kumar) వంటి దిగ్గజ నటులు నటించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ (Mani Sharma), స్టీఫెన్‌ దేవసి సంగీతం అందిస్తున్నారు. కాగా, కన్నప్పను డిసెంబర్‌లో రిలీజ్‌ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=KCx1bBTM9XE మిస్టర్ బచ్చన్‌ ‘షో రీల్‌’.. అదరహో! రవితేజ (Ravi Teja) హీరోగా మాస్‌ డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) రూపొందిస్తున్న లేటెస్ట్‌ చిత్రం.. ‘మిస్టర్‌ బచ్చన్‌’. భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) ఇందులో కథానాయికగా చేస్తోంది. జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు. ప్రచారంలో భాగంగా చిత్రయూనిట్‌.. 'షో రీల్స్‌'ను సోమవారం (జూన్‌ 17) విడుదల చేసింది. ఒక్క డైలాగ్‌ లేకుండా యాక్షన్‌ సన్నివేశాలతో తీర్చిదిద్దిన ఈ గ్లింప్స్‌ వీడియో ఎంతో ఆసక్తిగా సాగింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో మిలియన్‌ వ్యూస్‌ దిశగా దూసుకెళ్తోంది. విడుదలైన 22 గంటల్లో 7.4 లక్షల వ్యూస్‌ సాధించి అదరగొడుతోంది.&nbsp; https://www.youtube.com/watch?v=FgVYeHnc0Ak దేవిశ్రీ ప్రసాద్‌ ప్రశంసలు మిస్టర్‌ బచ్చన్‌ నుంచి విడుదలైన మాస్‌ గ్లింప్స్‌.. ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులను సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌.. మిస్టర్‌ బచ్చన్‌ గ్లింప్స్‌పై ఎక్స్‌ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వావ్‌ హరీష్‌ శంకర్‌ సార్‌.. పంచ్‌ డైలాగ్‌ లేకుండానే పంచ్‌ క్రియేట్‌ చేశారు. మాస్‌ మహారాజా అద్భుతంగా ఉన్నారు. బ్లాక్‌ బాస్టర్‌ లోడ్‌ అవుతోంది. థియేటర్‌లో చూడటానికి ఆగలేకపోతున్నా. మిస్టర్‌ బచ్చన్‌ చిత్ర యూనిట్‌కు నా శుభాకాంక్షలు' అంటూ స్పెషల్‌ పోస్టు పెట్టారు. కాగా, మిస్టర్‌ బచ్చన్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. https://twitter.com/ThisIsDSP/status/1802716299455570180
    జూన్ 18 , 2024
    Kriti Kharbanda Hot : జాకెట్‌ తీసేసి.. కృతి కర్బందా హాట్‌ ఫోటో షూట్‌!
    Kriti Kharbanda Hot : జాకెట్‌ తీసేసి.. కృతి కర్బందా హాట్‌ ఫోటో షూట్‌!
    ప్రముఖ నటి కృతి కర్బంద.. స్టన్నింగ్‌ హాట్‌ ఫొటో షూట్‌తో అభిమానులకు షాకిచ్చింది. జాకెట్‌ లేకుండా కెమెరాకు ఫోజులిచ్చి ఆశ్చర్యపరిచింది.&nbsp; సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తైన సందర్భంగా కృతి కర్బంద ఈ గ్లామర్‌ ఫోటోలను షేర్‌ చేసింది. బటన్స్‌ లేని నైట్‌ డ్రెస్‌లో ఎద అందాలను ప్రదర్శించింది.&nbsp; ఈ భామ కొంటెగా చూస్తూ వయ్యారాలు ఒలకబోసిన ఫొటోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. కృతి కర్భంద గ్లామర్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.&nbsp; దిల్లీలో పుట్టి పెరిగిన కృతి కర్బందా (Kriti Kharbanda).. 2009లో 'బోణీ' (Boni Movie) అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టింది.&nbsp; ఆ తర్వాత టాలీవుడ్‌లోనే ‘తీన్‌మార్’ (Teen Maar), ‘అలా మొదలైంది’ (Ala Modalaindi), మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, ఓం త్రీడీ తదితర చిత్రాలు చేసింది.&nbsp; చివరగా 2015లో వచ్చిన 'బ్రూస్ లీ' (Bruce lee Movie) మూవీలో రామ్ చరణ్‌ (Ram Charan)కి అక్కగా నటించింది. ఇందులో ఆమెన నటనకు మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా రామ్‌చరణ్‌ - కృతి కర్బందా మధ్య (Ram Charan Sister) వచ్చే సీన్లు ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యాయి. అక్కా-తమ్ముడిగా వీరిద్దరు జీవించారని చెప్పవచ్చు. వీళ్ల మధ్య వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ కూడా చాలా సహజసిద్ధంగా అనిపించాయి. ఇక గ్లామర్ పరంగా సూపర్ ఉన్నప్పటికీ ఈమెకు (Kriti Kharbanda Engagement) తెలుగులో ఎందుకో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో హిందీపై ఆమె పూర్తి ఫోకస్ పెట్టింది. అలా గత ఆరేళ్ల నుంచి పూర్తిగా హిందీ (Bollywood)లోనే సినిమాలు చేస్తూ కాస్తంత బిజీగా ఉంది. ఈ క్రమంలోనే నటుడు పులకిత్‌ సామ్రాట్‌తో ప్రేమలో పడటం గమనార్హం. హిందీలో 2016-17 మధ్య వరుసగా 'రాజ్‌: రీబూట్‌' (Raaz: Reboot), గెస్ట్‌ ఇన్‌ లండన్‌ (Guest iin London), షాది మీన్‌ జరూర్‌ ఆనా (Shaadi Mein Zaroor Aana)చిత్రాలు చేసింది.&nbsp; 2018-19లో ‘వీరేకి వెడ్డింగ్‌’, ‘యమ్లా పగ్లా దీవానా: పిర్‌ సే’, ‘హౌస్‌ఫుల్‌ 4’, ‘పాగల్‌పంతి’ చిత్రాల్లో మెరిసి.. నార్త్‌లో మరింత మంది అభిమానులను సంపాదించుకుంది.&nbsp;&nbsp; ఆ తర్వాత ‘తైష్‌’, ‘14 ఫిరే’ సినిమాల్లో నటించి బాలీవుడ్‌లో మంచి నటిగా తన ప్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది. తద్వారా హిందీలో ప్రముఖ హీరోయిన్ల సరసన స్థానం సంపాదించింది.&nbsp; ప్రస్తుతం ఈ భామ హిందీలో ‘రిస్కీ రోమియో’ అనే చిత్రంలో నటిస్తూ బిజీ బిజీగా ఉంటోంది. అబిర్‌ సేన్‌గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోగా సన్నీ సింగ్‌ (Sunny Singh) నటిస్తున్నాడు. అలాగే మరో అన్‌ టైటిల్డ్‌ ప్రాజెక్ట్‌కు సైతం కృతి ఓకే చెప్పింది.&nbsp; ఇక కృతి కర్భందా వ్యక్తిగత విషయాలకు వస్తే..&nbsp; బాలీవుడ్‌ నటుడు పులకిత్‌ సామ్రాట్‌ను ఈ భామ ఈ ఏడాది మార్చిలో వివాహం జరిగింది. వీరి పెళ్లికి పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు, బంధుమిత్రులు కుటుంబ సభ్యులు హాజరయ్యారు.&nbsp; కృతి - పులకిత్‌ గత నాలుగేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. వీరి డేటింగ్‌పై అప్పట్లో జాతీయ మీడియాలో కథనాలు సైతం వచ్చాయి. వాటికి పెళ్లి బంధంతో ఈ జంట ఫుల్‌స్టాప్‌ పెట్టింది.&nbsp; కృతి.. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంటూనే సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు హాట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.&nbsp;
    జూన్ 12 , 2024
    కాజల్ అగర్వాల్ గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?
    కాజల్ అగర్వాల్ గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?
    కాజల్ అగర్వాల్ దశాబ్దకాలం పాటు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. తెలుగులో లక్ష్మీ కళ్యాణం(2007) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ ముంబై అందం... రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన మగధీర చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఈ సినిమా ఆమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆర్య2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మాన్, ఖైదీ 150, నేనేరాజు నేనే మంత్రి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఈమె నటించింది. పెళ్లి చేసుకుని కొద్దికాలం సినిమాలకు విరామం ఇచ్చి తిరిగి మళ్లీ భగవంత్ కేసరి చిత్రం ద్వారా కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఆమె సహజ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ గురించి కొన్ని(Some Lesser Known Facts About Kajal Aggarwal) ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం కాజల్ అగర్వాల్ ఎవరు? కాజల్ అగర్వాల్ భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. కాజల్ అగర్వాల్ దేనికి ఫేమస్? కాజల్ అగర్వాల్ మగధీర, ఖైదీ150, బిజినెస్‌మ్యాన్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి గుర్తింపు పొందింది. కాజల్ అగర్వాల్&nbsp; వయస్సు ఎంత? కాజల్ అగర్వాల్&nbsp; 1985 జూన్ 19న జన్మించింది. ఆమె వయస్సు&nbsp; 38 సంవత్సరాలు&nbsp; కాజల్ అగర్వాల్&nbsp; మందన్న ముద్దు పేరు? కాజు కాజల్ అగర్వాల్&nbsp; మందన్న ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు&nbsp; కాజల్ అగర్వాల్&nbsp; ఎక్కడ పుట్టింది? ముంబాయి కాజల్ అగర్వాల్‌కు వివాహం అయిందా? 2020 అక్టోబర్ 30న గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది కాజల్ అగర్వాల్‌కు ఎంతమంది పిల్లలు? కాజల్ అగర్వాల్- గౌతమ్ కిచ్లూ ఒక మగ బిడ్డను కన్నారు. అబ్బాయి పేరు నేయిల్ కిచ్లూ కాజల్ అగర్వాల్‌కు ఇష్టమైన రంగు? వైట్, రెడ్, బ్లూ కాజల్ అగర్వాల్‌ అభిరుచులు? డ్యాన్సింగ్, ట్రావెలింగ్ కాజల్ అగర్వాల్‌కు ఇష్టమైన ఆహారం? ఎగ్స్, తియ్యని పండ్లు కాజల్ అగర్వాల్‌ అభిమాన నటుడు? జూ.ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ కాజల్ అగర్వాల్‌ తొలి సినిమా? లక్ష్మి కళ్యాణం(2007) కాజల్ అగర్వాల్‌కు గుర్తింపు తెచ్చిన సినిమాలు? మగధీర, బృందావనం, డార్లింగ్ కాజల్ అగర్వాల్‌ ఏం చదివింది? మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చేసింది కాజల్ అగర్వాల్‌ పారితోషికం ఎంత? కాజల్ ఒక్కొ సినిమాకు రూ.కోటి- రూ.2కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. కాజల్ అగర్వాల్‌ తల్లిదండ్రుల పేర్లు? వినయ్ అగర్వాల్, సుమన్ అగర్వాల్ కాజల్ అగర్వాల్‌ ఎన్ని అవార్డులు గెలుచుకుంది? కాజల్ అగర్వాల్ తెలుగులో నేనే రాజు నేనే మంత్రి చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా అవార్డును గెలుచుకుంది. అలాగే బృందావనం చిత్రానికి గాను ఉత్తమ నటిగా సిని'మా' అవార్డును పొందింది. కాజల్ అగర్వాల్‌ మోడ్రన్ డ్రెస్సులు వేస్తుందా? కాజల్ అగర్వాల్‌ అన్నిరకాల డ్రెస్సులు వేస్తుంది.&nbsp; కాజల్ అగర్వాల్‌కు సిస్టర్ పేరు? నిషా అగర్వాల్, ఆమె కూడా హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించింది. కాజల్ అగర్వాల్‌ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/kajalaggarwalofficial/?hl=en కాజల్ అగర్వాల్‌ ఎంత మంది హీరోలతో లిప్ లాక్ సీన్లలో నటించింది? కాజల్ అగర్వాల్‌ తొలుత బిజినెస్ మ్యాన్ చిత్రంలో మహేష్ బాబుతో లిప్ లాక్ సీన్‌లో నటించింది. కాజల్ అగర్వాల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? రామ్ చరణ్, తమన్నా భాటియా https://www.youtube.com/watch?v=zh3DbdY0w40
    ఏప్రిల్ 27 , 2024
    Bhagyashri Borse : టాలీవుడ్‌ రైజింగ్‌ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
    Bhagyashri Borse : టాలీవుడ్‌ రైజింగ్‌ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
    సాధారణంగా హీరోయిన్లకు తమ మెుదటి చిత్రంతో ఇండస్ట్రీలో పేరు వస్తుంది. కానీ, నటి భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి మాత్రం తెలుగులో ఒక్క సినిమా చేయనప్పటికీ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయింది. ముగ్గురు స్టార్‌ హీరోలతో నటించే అవకాశాన్ని ఈ అమ్మడు దక్కించుకోవడమే ఇందుకు కారణం. రవితేజ ‘మిస్టర్‌ బచ్చన్‌’, విజయ్‌ దేవరకొండ ‘VD 12’, నాని - సుజీత్‌ కాంబోలో రానున్న చిత్రాలకు భాగ్యశ్రీ లాక్‌ అయ్యింది. దీంతో టాలీవుడ్‌కు మరో కొత్త స్టార్‌ హీరోయిన్‌ దొరికేసిందంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ భామకు గురించి తెలుసుకునేందుకు తెలుగు ఆడియన్స్‌ను ఆసక్తికనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగ్యశ్రీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.. భాగ్యశ్రీ బోర్సే ఎవరు? బాలీవుడ్‌కు చెందిన యువ నటి. భాగ్యశ్రీ బోర్సే ఎక్కడ పుట్టింది? మహారాష్ట్ర ఔరంగబాద్‌లో భాగ్యశ్రీ జన్మించింది. భాగ్యశ్రీ బోర్సే పుట్టిన తేది? ఈ భామ తన పుట్టిన రోజును ఎక్కడ పంచుకోలేదు. &nbsp; భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం ఎక్కడ ఉంటోంది? మహారాష్ట్ర పుణేలో ఈ భామ నివసిస్తోంది. భాగ్యశ్రీ బోర్సే తల్లిదండ్రులు ఎవరు? తన కుటుంబ సభ్యుల వివరాలను భాగ్యశ్రీ ఎక్కడా వెల్లడించలేదు. ఈ విషయంలో ఆమె గోప్యత పాటిస్తోంది.&nbsp;&nbsp; భాగ్యశ్రీ బోర్సేకు తోబుట్టువులు ఉన్నారా? ఈ బ్యూటీకి ఓ సోదరి ఉన్నట్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టును బట్టి తెలిసింది.&nbsp; భాగ్యశ్రీ బోర్సే ఎత్తు ఎంత? 178 సెం.మీ (5 అడుగుల 8 అంగుళాలు) భాగ్యశ్రీ బోర్సే ఎక్కడ చదువుకుంది? నైజీరియాలోని లాగోస్‌లో ఈ భామ చదువుకుంది.&nbsp; భాగ్యశ్రీ బోర్సే విద్యార్హత ఏంటి? ఈ భామ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేసింది.&nbsp; భాగ్యశ్రీ బోర్సే ఏ మతానికి చెందిన నటి? హిందూ భాగ్యశ్రీ బోర్సే తన కెరీర్‌ను ఎలా ప్రారంభించింది? సినిమాల్లోకి రాకముందు ఈ భామ మోడల్‌గా చేసింది. ఒక మోడలింగ్‌ ఏజెన్సీతో కలిసి పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిచింది.&nbsp; భాగ్యశ్రీ బోర్సేకు ఎలా పాపులర్‌ అయ్యింది? క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్‌ ద్వారా ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. దీని ద్వారానే ఆమెకు తొలి చిత్ర ఆఫర్‌ వచ్చింది.&nbsp; భాగ్యశ్రీ బోర్సే తెరంగేట్ర సినిమా ఏది? 2023 అక్టోబర్‌లో వచ్చిన బాలీవుడ్‌ చిత్రం 'యారియన్‌ 2' ద్వారా ఈ భామ వెండితెరకు పరిచయమైంది. భాగ్యశ్రీ బోర్సే పోషించిన తొలి సినిమా పాత్ర పేరు? రాజ్యలక్ష్మీ భాగ్యశ్రీ బోర్సే అప్‌కమింగ్‌ తెలుగు చిత్రాలు? ‘మిస్టర్‌ బచ్చన్‌’, ‘VD 12’, ‘Nani 32’ భాగ్యశ్రీ బోర్సే ఫేవరేట్‌ ఫుడ్‌? తన ఆహార అభిరుచుల గురించి ఈ భామ ఎక్కడా పంచుకోలేదు.&nbsp; భాగ్యశ్రీ బోర్సేకు ఇష్టమైన నటీనటులు? ఫేవరేట్‌ యాక్టర్స్‌ గురించి భాగ్యశ్రీ ఏ ఇంటర్యూలోనూ రివీల్‌ చేయలేదు.&nbsp; భాగ్యశ్రీ బోర్సే అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా లింక్‌ ఏది? https://www.instagram.com/bhagyashriiborse/?hl=en
    ఏప్రిల్ 12 , 2024
    హెబ్బా పటేల్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    హెబ్బా పటేల్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    హెబ్బా పటేల్ తెలుగు సినీ నటి. తమిళ్, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. తెలుగులో అలా ఎలా? ద్వారా పరిచయమైంది. కుమారి 21F సినిమాతో గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ఈడోరకం ఆడోరకం, మిస్టర్, 24 కిస్సెస్, ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రెడ్ చిత్రంలో రామ్‌ పొత్తినేని సరసన ఓ ఐటెం సాంగ్‌లో కూడా నటించింది. ప్రస్తుతం వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్(Some Lesser Known Facts about Hebba Patel) గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు హెబ్బా పటేల్ ఎప్పుడు పుట్టింది? 1989,&nbsp; జనవరి 6న జన్మించింది హెబ్బా పటేల్ తెలుగులో నటించిన తొలి సినిమా? అలా ఎలా(2014) తెలుగులో గుర్తింపునిచ్చిన సినిమా కుమారి 21F(2015) హెబ్బా పటేల్ ఎత్తు ఎంత? 5 అడుగుల 5అంగుళాలు&nbsp; హెబ్బా పటేల్ ఎక్కడ పుట్టింది? ముంబై హెబ్బా పటేల్ అభిరుచులు? డ్యాన్సింగ్, స్విమ్మింగ్ హెబ్బా పటేల్‌కు ఇష్టమైన ఆహారం? నాన్‌వెజ్ హెబ్బా పటేల్‌కు&nbsp; ఇష్టమైన కలర్ ? వైట్ హెబ్బా పటేల్‌కు ఇష్టమైన హీరో? సల్మాన్ ఖాన్, మహేష్ బాబు హెబ్బా పటేల్ పారితోషికం తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ.50 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. హెబ్బా పటేల్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మోడలింగ్ చేసేది హెబ్బా పటేల్ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/ihebahp/?hl=en https://www.youtube.com/watch?v=kSipyGA5qC0
    ఏప్రిల్ 02 , 2024

    @2021 KTree