UTelugu2h 33m
గణేష్ (లారెన్స్) బ్యాంక్ మేనేజర్. ఓ ఎమ్మెల్యేకి చెందిన ఇంట్లో భార్య, తల్లిదండ్రులతో కలిసి అద్దెకు దిగుతాడు. అయితే ఆ ఇంట్లోనే ముని అనే వ్యక్తిని ఎమ్మెల్యే పెట్రోల్ పోసి హత్య చేస్తాడు. దీంతో ఆ ఇంట్లోనే ఉన్న ముని ఆత్మ గణేష్ను ఆవహిస్తుంది. ఇంతకి ముని ఎవరు? అతడ్ని ఎందుకు చంపారు? గణేష్ శరీరం ద్వారా ముని ఎలా పగ తీర్చుకున్నాడు? అన్నది స్టోరీ.
ఇంగ్లీష్లో చదవండి
మూవీ & ఓటీటీ అప్డేట్స్
స్ట్రీమింగ్ సూన్ ఆన్Youtube
Watch
Free
స్ట్రీమింగ్ సూన్ ఆన్EtvApp
Watch
Free
రివ్యూస్
How was the movie?
తారాగణం
రాఘవ లారెన్స్
గణేష్వేదిక
ప్రియా గణేష్ (గణేష్ భార్య)బాలా సింగ్
బియాంకా దేశాయ్
నీలిమా నాయుడుచంద్రముఖి
వడివేలు డేవిడ్మురుగేశన్
కల్లుక్కుల్ ఈరం రామనాథన్
పుదుపేట్టై సురేష్
ఆశా
కావ్య
రంగమ్మాళ్
కవితన్ రాజమోహన్
నాసర్
ఒక హిందూ పూజారిరాహుల్ దేవ్
మస్తాన్ భాయ్కోవై సరళ
గణేష్ తల్లిమీరా కృష్ణన్
ప్రియ తల్లిసిసోర్ మనోహర్
హౌస్ బ్రోకర్ఢిల్లీ గణేష్
ప్రియ తండ్రిసిబ్బంది
రాఘవ లారెన్స్
దర్శకుడుశరన్
నిర్మాతరమేష్ ఖన్నా
రచయితKV గుహన్
సినిమాటోగ్రాఫర్సురేష్ అర్స్
ఎడిటర్ర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Rudrudu Review: రుద్రుడిగా లారెన్స్ రివేంజ్ తీర్చుకున్నాడా.. సినిమా ఎలా ఉందంటే?
నటినటులు: రాఘవ లారెన్స్, ప్రియా భవాని, నాజర్, పూర్ణిమ భాగ్యరాజ్
దర్శకత్వం: కదిరేసన్
సినిమాటోగ్రఫీ: R.D. రాజశేఖర్
సంగీతం: G.V. ప్రకాష్
ఎడిటర్ : ఆంటోని
నేపథ్య సంగీతం: శామ్ C.S
రాఘవ లారెన్స్ అంటే తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. డ్యాన్సర్గా కెరీర్ ప్రారంభించిన లారెన్స్ ఆ తర్వాత డైరెక్టర్గా మారి పలు హిట్ సినిమాలు తీశాడు. ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తూప్రేక్షకులను అలరిస్తున్నాడు. లారెన్స్ హీరోగా, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ముని, కాంచన, కాంచన 2, కాంచన 3 సినిమాలు బాక్సాఫీసు వద్ద భారీ హిట్ అందుకున్నాయి. దీంతో లారెన్స్ మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన రుద్రుడు సినిమా ఇవాళ (ఏప్రిల్ 14) రిలీజ్ అయింది. మరి ఈ సినిమా విజయం సాధించిందా? లారెన్స్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడా? అసలు సినిమా కథ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
కథ:
రుద్రుడు (లారెన్స్), అనన్య (ప్రియా భవానీ శంకర్) భార్య భర్తలు. ఒక సాధారణ ఉద్యోగం చేసుకునే రుద్రుడు తన భార్యతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. ఆనందంగా సాగిపోతున్న రుద్రుడు జీవితంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంటుంది. ఎంతగానో ప్రేమించిన భార్యను గుర్తుతెలియని దుండగులు అతి దారుణంగా హత్య చేస్తారు. దీంతో రుద్రుడి జీవితం ఒక్కసారిగా తలకిందులు అవుతుంది. తన భార్యను హతమార్చిన వారిని వదిలిపెట్టకూడదని రుద్రుడు నిర్ణయించుకుంటాడు. వారిని ఎలాగైన పట్టుకొని చంపేయాలని వేట మెుదలెడతాడు. అసలు అనన్యను ఎందుకు చంపారు? దుండుగల వెనక ఎవరు ఉన్నారు? విలన్లపై రుద్రుడు ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు? అనేది అసలు కథ.
ఎవరెలా చేశారంటే:
రుద్రుడు పాత్రలో రాఘవ లారెన్స్ చాలా బాగా నటించాడు. యాక్షన్, సెంటిమెంట్ సీన్లలో తనదైన నటనతో లారెన్స్ మెప్పిస్తాడు. ఇక డ్యాన్సుల్లో లారెన్స్కు వంక పెట్టాల్సిన పనిలేదు. ప్రతీకారంతో రగిలిపోయే వ్యక్తిగా లారెన్స్ అద్భుతంగా నటించాడు. యాక్షన్ సీన్స్లో లారెన్స్ పర్ఫార్మెన్స్ సినిమాకే హైలెట్ అని చెప్పాలి. అటు ప్రియా భవాని నటన కూడా పర్వేలేదనిపిస్తుంది. ఉన్న కొద్దిసేపైన లారెన్స్తో పోటీ పడి మరీ ఆమె నటించింది. ఇక విలన్ పాత్రలో శరత్బాబు ఆకట్టుకున్నాడు. ఎప్పటిలాగే తన అనుభవాన్ని ఉపయోగించి పాత్రకు ప్రాణం పోశాడు.
టెక్నికల్గా
డైరెక్టర్ కదిరేసన్ ఒక రొటిన్ స్టోరీతో సినిమాను తెరకెక్కించాడు. నటీనటులు ఎంత బాగా చేసినప్పటికీ సినిమాను ఎప్పుడో చూసిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. హీరో, హీరోయిన్ లవ్ సీన్స్, పెళ్లి చేసుకోవడం అంతా బాగుందనుకునే లోపే ప్రియా భవానీ హత్య జరగడం పెద్ద సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. కానీ, ఆ తర్వాత హీరో రీవెంజ్ తీర్చుకునే సన్నివేశాలన్నీ పేలవంగా అనిపిస్తాయి. ఇకపోతే సినిమాటోగ్రఫీ బాగుంది. G.V ప్రకాష్ సంగీతం ఆకట్టుకోలేదు. పాటల్లో ఒకటిమాత్రమే వినసొంపుగా ఉంది. అయితే శామ్ C.S ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది.
ప్లస్ పాయింట్స్
లారెన్స్ నటననేపథ్య సంగీతంపతాక సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
రొటిన్ స్టోరీసంగీతం
రేటింగ్: 2/5
ఏప్రిల్ 15 , 2023
అల్లు అర్జున్తో జతకట్టేందుకు ఉవ్విళ్లూరుతున్న బాలివుడ్ భామలు
]మౌని రాయ్
పుష్ప రాజ్ అలియాజ్ అల్లు అర్జున్తో పనిచేయాలని నిజంగా కోరుకుంటున్నా
ఫిబ్రవరి 11 , 2023
Mamita Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ మమితా బైజు గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
మలయాళ నటి 'మమితా బైజు' (Mamita Baiju) పేరు ప్రస్తుతం టాలీవుడ్లో మార్మోగుతోంది. ఇటీవల వచ్చిన 'ప్రేమలు' (Premalu) చిత్రంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ రీనూగా కనిపించి యూత్లో మంచి క్రేజ్ సంపాదించింది. దీంతో నెట్టింట ఆమె పేరు తెగ ట్రెండ్ అవుతోంది. ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘మమితా బైజు’ ఎవరు? ఆమె నటించిన చిత్రాలు ఏంటి? ఆమె కుటుంబ నేపథ్యం? వంటి విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
కేరళ కొట్టాయం జిల్లాలోని కిడంగూర్ ప్రాంతం.. మమితా బైజు స్వస్థలం. ఆమె తల్లిదండ్రులు డా.బైజు క్రిష్ణణ్, మిని. మమితా సోదరుడి పేరు మిథున్.
కిడంగూర్లోని మేరి మౌంట్ పబ్లిక్ స్కూల్, ఎన్.ఎస్.ఎస్ హైయర్ సెకండరీ స్కూల్స్లో మమిత పాఠశాల విద్యను అభ్యసించింది. ప్రస్తుతం బీఎస్సీ సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేస్తోంది.
పాఠశాల రోజుల నుంచి మమిత సాంస్కృతి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ఈ సమయంలోనే 'సర్వోపరి పలక్కరన్' (2017) అనే మలయాళ చిత్రంలో ఆమెకు అవకాశం వచ్చింది.
ఆమె రెండో చిత్రం ‘హనీ బీ 2: సెలబ్రేషన్స్’ కూడా అదే ఏడాదిలో విడుదలైంది. ‘డాకినీ’, ‘స్కూల్ డైరీ’, ‘వికృతి’, ‘కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్’, ‘ఆపరేషన్ జావా’ వంటి విభిన్నతరహా చిత్రాల్లో మమిత నటించింది.
2021లో వచ్చిన ‘ఖోఖో’ సినిమాలో టీమ్ కెప్టెన్గా వైవిధ్యం ప్రదర్శించి, ఉత్తమ సహాయ నటిగా ‘కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు’ అందుకుంది.
గతేడాది ‘ప్రణయ విలాసం’, ‘రామచంద్ర బాక్ అండ్ కో’ సినిమాలతో మలయాళ ప్రేక్షకుల్ని అలరించింది.
'ఖోఖో' సినిమాలోని ఆమె నటనకు గాను ఉత్తమ సహాయ నటి విభాగంలో 'కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్' అందుకుంది.
మమిత 16వ చిత్రం 'ప్రేమలు'.. మలయాళంతోపాటు తెలుగులోనూ ఘన విజయం అందుకుంది. ఇందులోని ఆమె అందం, నటన ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఈ సినిమాని తెలుగులో రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్ కార్తికేయ హక్కులు తీసుకొని విడుదల చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా విజయం దిశగా దూసుకుపోతోంది.
ఈ సినిమా విడుదలైన తరువాత దర్శకధీరుడు రాజమౌళి.. మమితపై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ఈ బ్యూటీ గురించి తెలుసుకునేందుకు అందరూ అంతర్జాలంలో వెతుకులాట ప్రారంభించారు.
ప్రస్తుతం ఈ బ్యూటీ 'రెబల్' అనే చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా రూపొందిన ఈ సినిమా మార్చి 22న విడుదల కానుంది.
తెలుగు సినిమాలంటే తనకు చాలా ఇష్టమని మమిత తాజా ఇంటర్యూలో తెలిపింది. తాను చూసిన తొలి తెలుగు చిత్రం ‘మగధీర’ అని పేర్కొంది. ‘మగధీర’ ‘ఈగ’ సినిమాలను ఎన్నోసార్లు చూశానని చెప్పింది.
తెలుగులో ఇష్టమైన నటుడు 'అల్లు అర్జున్' అని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. ఆయనతో నటించే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు ఓ సందర్భంలో తెలిపింది.
మమితకు కూచిపూడి నృత్యంలో ప్రవేశం ఉంది. ఓసారి స్కూల్లో ఇచ్చిన ప్రదర్శనకు సంబంధించిన ఫొటో.. ఆమెకు తొలి చిత్రంలో అవకాశం తెచ్చిపెట్టిందట.
ఆమె తండ్రి బైజు క్రిష్ణన్ వైద్యుడు కావడంతో తనలాగే కుమార్తెనూ డాక్టర్ని చేయాలని ఆయన భావించారట. కానీ, మమితకు అది ఇష్టం లేదట. సినీ రంగంలోనే రాణిస్తానంటోంది.
మార్చి 14 , 2024
Polimera 3: బాలీవుడ్ ప్రేక్షకులను టార్గెట్ చేయనున్న ‘పొలిమేర 3’.. మరో ‘కాంతార’ కానుందా?
‘మా ఊరి పొలిమేర’ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆలరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరోనా సమయంలో సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. చేతబడి (బ్లాక్ మ్యాజిక్) నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను ఆడియన్స్ ఎంతగానో ఆదరించారు. దీంతో ఈ మూవీ సీక్వెల్ అయిన ‘పొలిమేర 2’ను మేకర్స్ థియేటర్లో రిలీజ్ చేశారు. అది కూడా అంతే స్థాయిలో విజయం సాధించి ప్రొడ్యూసర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో పొలిమేర డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్ బిగ్ ప్లాన్ వేశారు. మూడో భాగాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
జాతీయ స్థాయిలో..
హారర్ థ్రిల్లర్గా రూపొందిన ‘పొలిమేర’, ‘పొలిమేర 2’ చిత్రాల్లో సత్యం రాజేష్ (Satyam Rajesh), కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla), బాలదిత్య (Baladitya), గెటప్ శీను (Getup Srinu) ప్రధాన పాత్రలు పోషించారు. ‘పొలిమేర 2’ గతేడాది థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లు సాధించింది. తొలి రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి ఘన విజయం అందుకుంది. ఈ క్రమంలోనే 'పొలిమేర 3' (Polimera 3) రూపొందించబోతున్నట్లు మూవీ టీమ్ తాజాగా ప్రకటన చేసింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ను సైతం మేకర్స్ రిలీజ్ చేశారు. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీని ప్రకారం తెలుగు, హిందీతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో ‘పొలిమేర 3’ రిలీజయ్యే ఛాన్స్ ఉంది. డిస్ట్రిబ్యూటర్ వంశి నందిపాటి ఈ 'పొలిమేర 3' తో నిర్మాతగా మారుతున్నారు. 'పొలిమేర' సినిమాకి నిర్మాతగా వున్న భోగేంద్ర గుప్త ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా ఉంటారని తెలిసింది.
https://twitter.com/i/status/1810894418091692096
త్వరలోనే షూటింగ్
'పొలిమేర 3' చిత్రానికి సంబంధించి డైరెక్టర్ డా. అనీల్ విశ్వనాథ్ స్క్రిప్ట్ వర్క్ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా చురుగ్గా జరుగుతున్నట్లు సమాచారం. వేగంగా ఆ పనులు కూడా ఫినిష్ చేసుకొని త్వరలోనే షూటింగ్ మెుదలు పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. తొలి రెండు భాగాలతో పోలిస్తే ‘పార్ట్ 3’ ఇంకా అదిరిపోతుందని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. గత చిత్రాలకు మించిన ట్విస్టులు, ఇంట్రస్టింగ్ స్టోరీతో ‘పొలిమేర 3’ రానున్నట్లు పేర్కొంటున్నాయి.
ఆ పజిల్స్కు ‘పొలిమేర 3’లో ఆన్సర్లు!
దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ‘పొలిమేర 3’ కోసం ఎన్నో చిక్కుముడులను పార్ట్ 2లోనే వదిలి వెళ్లారు. ‘పొలిమేర 2’ క్లైమాక్స్ను పార్ట్-3కి ముడి పెడుతూ కొన్ని పజిల్స్ ఇచ్చారు. జాస్తిపల్లిలోని గుడి నేలమాళిగలో ఉన్న సంపదను క్షుద్రపూజ చేసి కొమురయ్య (సత్యం రాజేష్) కనుగొనడం క్లైమాక్స్లో చూపించారు. కట్ చేస్తే భార్యను కలవడానికి వెళ్లిన కొమురయ్యకు లక్ష్మీ ( కామాక్షి భాస్కర్ల) విషం పెడుతుంది. అతడు స్పృహా కోల్పోగానే అనూహ్యంగా నటుడు పృథ్వీ వచ్చి లక్ష్మీ నుదుటిపై కాల్చి చంపేస్తాడు. పృథ్వీ అలా ఎందుకు చేశాడు? నేలమాళిగలోని సంపదను కొమురయ్య ఏం చేశాడు? కొమురయ్య తమ్ముడు జంగయ్య (బాలాదిత్య) అసలు దేనిని వెతుక్కుంటూ వెళ్లాడు? అన్నది మూడో భాగంలో చూపించనున్నారు.
https://twitter.com/telugufilmnagar/status/1810936077869371440
మరో ‘కాంతారా’ కానుందా?
కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘కాంతార’ (Kantara) చిత్రం దేశవ్యాప్తంగా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ‘కాంతార’ కూడా పొలిమేర తరహాలోనే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో రూపొందింది. ఈ రెండు సినిమాల కథలు డిఫరెంట్ అయినప్పటికీ నేపథ్యం మాత్రం ఒకటే. కంటికి కనిపించని శక్తులతో ఈ రెండు చిత్రాలు రూపొందాయి. కాంతార దేవ శక్తి బ్యాక్డ్రాప్లో వస్తే పొలిమేర మాత్రం బ్లాక్ మ్యాజిక్తో తెరకెక్కింది. ప్రస్తుతం డిఫరెంట్ కంటెంట్తో వచ్చిన చిత్రాలకు నార్త్లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ‘పొలిమేర 3’ కూడా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పొలిమేర చిత్రం వారికి కొత్త అనుభూతిని పంచుతుందని పేర్కొంటున్నారు. కాబట్టి ‘పొలిమేర 3’ పాన్ ఇండియా స్థాయిలో తనదైన ముద్ర వేసే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
జూలై 10 , 2024
EXCLUSIVE: ఇంటర్వెల్కు ముందే కుర్చీలో నుంచి లేచి వచ్చేసే చిత్రాలు.. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్!
టాలీవుడ్లో ఇప్పటివరకూ కొన్ని వందల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ప్రతీ చిత్రం సూపర్ హిట్ కావాలన్న రూల్ ఏమి లేదు. కొన్నింటికి ప్రేక్షకుల ఆదరణ లభిస్తే మరికొన్నింటికి అసలే దక్కదు. దీనిని బట్టే ఆయా సినిమాలను హిట్స్, ఫ్లాప్స్గా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. అయితే ఫ్లాప్ అయిన చిత్రాలు కూడా కొన్ని సందర్భాల్లో ఓటీటీలో మంచి ఆదరణ పొందడం ఈ రోజుల్లో చూస్తున్నాం. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే చిత్రాలకు పరమ డిజాస్టర్లుగా పేరుంది. అప్పట్లో ఆ సినిమాల ప్రదర్శన సందర్భంగా ఆడియన్స్ మూవీ మధ్యలో నుంచే బయటకు వచ్చేశారని టాక్ ఉంది. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? వాటిపై నెటిజన్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.
ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ (Extra Ordinary Man)
నితీన్ (Nithiin) - శ్రీలీల (Sreeleela) జంటగా చేసిన రీసెంట్ చిత్రం ‘ఎక్స్ట్రా ఆర్డినరి మ్యాన్’. ఈ సినిమా రిలీజైన తొలి రోజు నుంచే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. సినిమా ఇంటర్వెల్ వరకూ కూడా చూడలేకపోయామని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అసలు విలన్ చెప్పినట్లు హీరో ఆడటం ఏంటని కొందరు ప్రేక్షకులు మండిపడ్డారు. నితీన్ కేరీర్లో ఎక్కువగా ట్రోల్స్ గురైన చిత్రంగా ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ నిలిచింది.
శాకుంతలం (Shakunthalam)
సమంత (Samantha) లీడ్ రోల్లో నటించిన ‘శాకుంతలం’ చిత్రంపై రిలీజ్కు ముందు భారీగానే అంచనాలు ఉండేవి. సమంత చేసిన తొలి పౌరాణిక సినిమా కావడం, ప్రచార చిత్రాలు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెంచేలా ఉండటంతో తెలుగు ఆడియన్స్ ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూశారు. అయితే సినిమా రిలీజ్ తర్వాత సీన్ అంతా రివర్స్ అయ్యింది. శకుంతల పాత్రకు సమంత పెద్దగా నప్పలేదని, డబ్బింగ్ కూడా సెట్ కాలేదని విమర్శలు వచ్చాయి. ఫస్టాఫ్ వరకూ సినిమాను చూడటమే కష్టంగా అనిపించిందని అప్పట్లో నెటిజన్లు కామెంట్స్ చేశారు.
రాధే శ్యామ్ (Radhe Shyam)
ప్రభాస్ (Prabhas), పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా నటించిన ‘రాధే శ్యామ్’ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇందులో ప్రభాస్ వింటేజ్ లుక్తో స్మార్ట్గా ఉండటంతో ఫ్యాన్స్లో పెద్ద ఎత్తున అంచనాలు మెుదలయ్యాయి. కానీ రిలీజయ్యాక ప్రభాస్ను హస్తముద్రికా నిపుణుడిగా చూసి షాకయ్యారు. జ్యోతిష్యాన్ని ప్రేమను ముడి పెట్టిన విధానం చాలా మంది ఫ్యాన్స్కు ఎక్కలేదు. సినిమా మెుదలైన గంటకే విసుగు వచ్చిందని, ఇంటర్వెల్కు బయటకు వచ్చేశామని అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి.
వరల్డ్ ఫేమస్ లవర్ (World Famous Lover)
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా... రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజబెల్లే హీరోయిన్లుగా చేసిన చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'. హీరో విజయ్పై ఈ సినిమా నుంచే ట్రోల్స్ మెుదలయ్యాయి. ఈ సినిమాలో రొమాన్స్ తప్ప కథ లేదని ట్రోల్స్ వచ్చాయి. విజయ్ పో** చిత్రాలు చేసుకుంటే బెటర్ అని కొందరు నెటిజన్లు ఘాటుగా కామెంట్స్ చేశారు. ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు బయటకు వెళ్లిపోదామా? అని ఎదురు చూసినట్లు పోస్టులు పెట్టారు.
బ్రహ్మోత్సవం (Brahmotsavam)
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కెరీర్లోనే పీడకల లాంటి చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ చిత్రం మహేష్కు మాయని మచ్చలా మిగిలిపోయిందని ఫ్యాన్స్ అంటుంటారు. కాజల్ (Kajal Aggarwal), సమంత (Samantha), ప్రణీత (Pranitha) వంటి కథానాయికలతో పాటు సత్యరాజ్, జయసుధ, రేవతి, తులసి, రావు రమేష్, షియాజీ షిండే, తనికెళ్ల భరణి వంటి హేమాహేమీలు ఉన్నా ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా తొలి రోజు తొలి ఆట నుంచే సినిమాపై ట్రోల్స్ మెుదలయ్యాయి. సినిమా చూడకుండా మధ్యలోనే వచ్చేశామంటూ స్వయంగా మహేష్ ఫ్యాన్సే కామెంట్స్ చేశారు.
సన్ ఆఫ్ ఇండియా (Son Of India)
దిగ్గజ నటుడు మంచు మోహన్బాబు (Manchu Mohan Babu) హీరోగా చేసిన ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాపై విడుదలకు ముందు నుంచే నెగిటివ్ మెుదలైంది. ఈ సినిమా తొలి రోజు మెుదటి ఆట కోసం ఓ థియేటర్లో రెండే టికెట్లు బుక్ కావడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంతేకాదు.. ఆ టికెట్లు బుక్ చేసుకుంది మంచు ఫ్యామిలీనే అంటూ కామెంట్లు కూడా వచ్చాయి. చూసిన వారు కూడా ఈ సినిమా గురించి నెగిటివ్ రివ్యూ ఇవ్వడంతో కొద్ది రోజులకే ఈ సినిమాను థియేటర్ల నుంచి తీసివేశారు. మోహన్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా ‘సన్ ఆఫ్ ఇండియా’ నిలిచింది.
వినయ విధేయ రామా (Vinaya Vidheya Rama)
రామ్చరణ్, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన వినయ విధేయ రామాపై తొలి ఆట నుంచి నెగిటివ్ స్ప్రెడ్ అయ్యింది. ఈ చిత్రం పరమ రాడ్ అంటూ చూసిన వారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఎప్పుడెప్పుడు బయటకు వెళ్లిపోదామా అని అనిపించిందని కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ట్రైన్పై నిలబడి బిహార్కు వెళ్లడం.. హీరో విలన్ అనుచరుల తలకాయలు నరికితే వాటిని గద్దలు ఎత్తుకెళ్లడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు.
లైగర్ (Liger)
విజయ్ దేవరకొండ కెరీర్లో డిజాస్టర్గా నిలిచిన మరో చిత్రం ‘లైగర్’. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. తొలి గంటకే సినిమాపై ఆసక్తి సన్నగిల్లిందని అప్పట్లో నెట్టింట పోస్టులు వెల్లువెత్తాయి. అంత బాడీ పెట్టుకొని విజయ్ పాత్రకు నత్తి పెట్టడం ఏంటన్న విమర్శలు వచ్చాయి.
శక్తి (Shakthi)
తెలుగులో డిజాస్టర్ అని అనగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ‘శక్తి’. ఈ మూవీ దర్శకుడు మేహర్ రమేష్ను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పటికీ ఓ ఆట ఆడుకుంటున్నారు. శక్తి మెుదటి ఆట చూసి తారక్ కథను ఎలా ఓకే చేశారని ప్రశ్నించారు. ఒక గంట కూడా సినిమాను వీక్షించలేకపోయామని చెప్పారు. ముఖ్యంగా ఫ్లాష్బ్యాక్లో తారక్ లుక్ అసలు సూట్ కాలేదన్న విమర్శలు సైతం వచ్చాయి. ఇదే డైరెక్టర్ వెంకటేష్తో ‘షాడో’ తీయగా ఆ మూవీ కూడా డిజాస్టర్గా నిలిచింది. మేహర్ రమేష్ రీసెంట్ చిత్రం ‘భోళా శంకర్’ సమయంలోనూ శక్తి సినిమా ప్రస్తావనకు రావడం గమనార్హం.
సలీం (Saleem)
మంచు విష్ణు (Manchu Vishnu), ఇలియానా (Ileana D'Cruz) జంటగా చేసిన ‘సలీం’.. తెలుగులో వచ్చిన బారీ డిజాస్టర్లలో ఒకటిగా మిగిలిపోయింది. ఈ సినిమా కోసం మంచు విష్ణు భారీగా వెయిట్ తగ్గాడు. నాలుగైదు సినిమా కథలను మిక్సీలో వేసి సలీం చిత్రాన్ని రూపొందించారని అప్పట్లో విమర్శలు సైతం వచ్చాయి. తొలి అర్ధభాగానికే సినిమా బోర్ కొట్టేసిందని కామెంట్స్ వినిపించాయి.
మే 04 , 2024
Celebrities in Summer: వేసవిలో చిల్ అవుతున్న అందాల భామలు.. ఎలాగో మీరే చూడండి?
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దీంతో భానుడి భగభగల నుంచి తప్పించుకునేందుకు అందాల భామలు సముద్ర తీరాలు, స్విమ్మింగ్ పూల్స్ వద్ద వాలిపోతున్నారు. వాటర్ బేబీలుగా మారి రచ్చ రచ్చ చేస్తున్నారు. తమ అందాలతో ఈ వేసవిని మరింత హీట్ చేస్తున్నారు. ఆ ముద్దుగుమ్మలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
బాలీవుడ్ బ్యూటీ వాని కపూర్.. ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు స్విమ్మింగ్ పూల్ను ఆశ్రయిస్తోంది. చల్లటి నీటిలో హాయిగా గడుపుతూ ఫొటోకు ఫోజు ఇస్తోంది.
దంగల్ బ్యూటీ సన్యా మల్హోత్రా.. బికినీతో స్విమ్మింగ్ చేసి అహ్లాదంగా గడిపింది. రెడ్ డ్రెస్ బికినీలో ఈ భామ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
చిరుత బ్యూటీ నేహా శర్మ.. ఈ వేసవి నుంచి తప్పించుకునేందుకు చల్ల చల్లగా ఐస్క్రీమ్ తింటోంది. ఇందుకు సంబంధించిన ఫోటోను నేహా స్వయంగా పంచుకుంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా అలీఖాన్.. వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు గోవా బీచ్కు వెళ్లింది. అక్కడ సన్ సెట్ సమయంలో దిగిన ఫొటోను ఫ్యాన్స్తో పంచుకుంది.
బాలీవుడ్ భామ.. సనయ ఇరానీ ప్రస్తుతం గ్రీసులో పర్యటిస్తోంది. అక్కడ ఓ తీరంలో సన్సెట్ సందర్బంగా దిగిన ఫొటోను ఈ బ్యూటీ పంచుకుంది.
మరో బ్యూటీ బార్ఖా సేన్ గుప్తా.. ఈ లేజీ సమ్మర్ డేస్ను కాఫీ తాగి గడుపుతున్నట్లు చెప్పింది. ఇందుకు సంబంధించిన ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది.
బాలీవుడ్ స్టార్ నటి మౌని రాయ్.. ఈ వేసవిని చాలా అహ్లాదకరంగా గడుపుతోంది. ఖాళీ సమయాన్ని స్విమ్మింగ్ పూల్ వద్ద గడుపుతూ చిల్ అవుతోంది.
యంగ్ బ్యూటీ శాన్వీ శ్రీవాస్తవ.. ఈ సమ్మర్లో ఎక్కువ సమయాన్ని గార్డెనింగ్లో గడుపుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆమె ఫ్యాన్స్తో పంచుకుంది.
ఏప్రిల్ 16 , 2024
Guntur Kaaram Review: డ్యాన్స్, మాస్ యాక్షన్తో ఇరగదీసిన మహేష్.. ‘గుంటూరు కారం’ ఎలా ఉందంటే!
నటీనటులు: మహేశ్బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతిబాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్రాజ్, జయరాం, రావు రమేశ్, ఈశ్వరిరావు, మురళీశర్మ, సునీల్ తదితరులు
రచన, దర్శకత్వం: త్రివిక్రమ్
సంగీతం: థమన్
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాత: ఎస్.రాధాకృష్ణ
ప్రొడక్షన్ కంపెనీ: హారిక & హాసిని క్రియేషన్స్
విడుదల తేదీ: 12-01-2024
మహేష్ బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా చిత్రం 'గుంటూరు కారం' (Guntur Karam). శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలై టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. త్రివిక్రమ్-మహేష్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. మరి గుంటూరు కారం ఎలా ఉంది? మహేశ్ మాస్ అవతార్ మెప్పించిందా? శ్రీలీల అందాలతో అలరించిందా? ఇప్పుడు చూద్దాం.
కథ
జనదళం పార్టీ అధినేత వైరా సూర్య నారాయణ (ప్రకాశ్ రాజ్) కూతురు వసుంధర (రమ్యకృష్ణ) మూడోసారి ఎమ్మెల్యేగా గెలుస్తుంది. వసుంధరను మంత్రిని చేయాలని సూర్యనారాయణ భావిస్తాడు. ఎమ్మెల్యే కాటా మధు (రవిశంకర్) ఇందుకు అడ్డుతగులుతాడు. ఆ పదవి తనకు ఇవ్వకపోతే వసుంధరకు రెండో పెళ్లి అయిన విషయంతో పాటు మెుదటి భర్త సంతానం రమణ (మహేష్ బాబు) గురించి బయటపెడతానని బెదిరిస్తాడు. దీంతో సూర్యనారాయణ ముందు చూపుగా రమణను పిలిపించి వసుంధరతో ఎలాంటి సంబంధం లేదని బాండ్ పేపర్స్పై సంతకం చేయమంటాడు. కానీ రమణ నిరాకరిస్తాడు.(Guntur kaaram Review) తండ్రి రాయల్ సత్యం (జయరామ్) చెప్పినా వినకుండా గుంటూరులోనే ఉంటూ మిర్చియార్డ్ నడుపుతుంటాడు. అసలు వసుంధర తన మెుదటి భర్తకు ఎందుకు విడాకులు ఇచ్చింది? రమణను చూడటానికి కూడా ఎందుకు ఇష్టపడలేదు? అమ్ము (శ్రీలీల) రమణల లవ్ ట్రాక్ ఏంటి? మరదలు రాజి (మీనాక్షి చౌదరి) పాత్ర ఏంటి? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
మహేశ్బాబు (Mahesh babu) పాత్ర ఆయన నటనే ఈ సినిమాకి హైలైట్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా డ్యాన్స్తో మహేష్(Mahesh babu) ఇరగదీశాడు. భావోద్వేగాల్నీ తనదైన శైలీలో అద్భుతంగా పండించాడు. శ్రీలీల మరోసారి స్టెప్పులకే పరిమితమైంది. కుర్చీ మడతపెట్టి పాటలో ఆమె, మహేష్ కలిసి చేసిన హంగామా కల్ట్ మాస్ అనాల్సిందే. మీనాక్షి చౌదరి పాత్ర కూడా సినిమాలో పరిమితమే. రమ్యకృష్ణ పాత్ర, ఆమె నటన హుందాగా అనిపిస్తుంది. ప్రకాశ్రాజ్, వెన్నెల కిశోర్ పాత్రల్లో కొత్తదనం లేదు. జగపతిబాబు, రావు రమేశ్, మురళీశర్మ, సునీల్ ఇలా చాలా మంది నటులు ఉన్నా ఏ పాత్రలోనూ బలం కనిపించదు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
బలమైన భావోద్వేగాలు, పదునైన మాటలతో త్రివిక్రమ్ (Trivikram) తన చిత్రాల్లో మ్యాజిక్ చేస్తుంటారు. కానీ గుంటూరు కారం (Guntur Kaaram Review) విషయంలో ఆ మేజిక్ మిస్ అయ్యింది. పాతికేళ్లు తల్లికి దూరంగా పెరిగినా కొడుకు.. సంతకం చేస్తే తెగిపోయే బంధంతో కథ ముడి పడి ఉంటుంది. ఈ విషయం తొలి సన్నివేశాల్లోనే చెప్పేసిన త్రివిక్రమ్.. ఆ తర్వాత సినిమాను కాలక్షేప సీన్లతో నడిపించేసినట్టే అనిపిస్తుంది. కథతో సంబంధం లేకుండా పాత్రలను రాసుకున్నట్లు కనిపిస్తుంది. అవి త్రివిక్రమ్ స్థాయికి తగ్గ పాత్రలు, సన్నివేశాలు ఏమాత్రం కావు. ఓవరాల్గా మాస్ పాత్రలో మహేశ్బాబు చేసే హంగామా, ఆయన ఎనర్జీ, పాటలు, విరామ సన్నివేశాలు, పతాక సన్నివేశాల్లో కాసిన్ని భావోద్వేగాలు ఇవే ఈ సినిమాకు బలం.
టెక్నికల్గా
ఇక సాంకేతిక విషయాలకొస్తే.. తమన్ సంగీతం బాగుంది. పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతాన్ని అందించాడు. మనోజ్ పరమహంస అందించిన సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
మహేష్ నటనశ్రీలీల డ్యాన్సులుసంగీతం
మైనస్ పాయింట్స్
కథ, కథనంకొరవడిన భావోద్వేగాలుకనబపడని త్రివిక్రమ్ మార్క్
రేటింగ్ : 3/5
జనవరి 12 , 2024
Samantha: పింక్ గౌనులో ఎంత అమాయకంగా చూస్తుందో!… సామ్ రేర్ ఫొటోలు వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. విభిన్న సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. కెరీర్లో, జీవితంలో ఒడిదొడుకులు ఎదురైన ప్రతీ సారి బలంగా పుంజుకుంటోందీ బ్యూటీ. గ్లామర్ పాత్రల్లోనే కాకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తోంది.
సమంత ఫిట్నెస్ ఫ్రీక్. నేచర్ లవర్. తనకు సంబంధించిన ప్రతి అప్డేట్ని సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పంచుకుంటుంది. సెట్స్ ఫొటోలు, జిమ్లో వర్కౌట్ చేస్తున్న దృశ్యాలను పంచుకుంటూ ఫ్యాన్స్కి అప్డేట్స్ ఇస్తుంటుంది. సమంత ఇప్పుడెలా ఉందో మనందరికీ తెలుసు. కానీ, చిన్నప్పుడు ఈ ముద్దుగుమ్మ ఎలా ఉండేదో ఊహించారా? సామ్ చిన్ననాటి ఫొటోల్లో కొన్నింటిపై ఓ లుక్కేద్దాం.
ఫ్యామిలీ ఫొటో..
సామ్కి ఇద్దరు సోదరులు. చిన్ననాటి ఫొటోను షేర్ చేసుకుంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. మేమెక్కడున్నా ఇంకా ఒక్కటిగానే ఉన్నామంటూ చెప్పుకొచ్చింది. స్కై బ్లూ కలర్లో ఫ్రాక్ వేసుకుని క్యూట్గా ఉంది.
కెరీర్ బిగినింగ్లో..
కెరీర్ తొలినాళ్లలో సామ్ ఎలా ఉండేదో ఈ ఫొటో చూస్తే తెలిసిపోతుంది. 2010లో ‘ఏ మాయ చేసావే’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందీ బ్యూటీ.
క్యూట్నెస్ ఓవర్లోడెడ్..
చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉండేది. చెంపలకు, నుదుట గుండ్రటి కాటుక పెట్టుకుని ఫొటోకు పోజులిచ్చింది. కొప్పు నిండా జాస్మిన్ పూలను పెట్టుకుని ఫొటో దిగింది.
పింగ్ గౌను వేసుకుని..
పింక్ గౌను వేసుకుని ఎంత అమాయకంగా చూస్తుందో..! కుర్చీలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్నట్లుగా అనిపిస్తోంది కదూ.
అమ్మ చెంతన..
తన తల్లి గురించి కొన్ని ఇంటర్వ్యూల్లో సామ్ చెప్పింది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని షేర్ చేసుకునేది. ఇదే పింక్ గౌనులో తల్లి ఎత్తుకున్న ఫొటో ఇది. అమ్మ ఎత్తుకుంటే ఆ సంతోషమే వేరు అన్నట్టుగా ముసి ముసిగా నవ్వుతోంది.
కరాటే కోసం..
సామ్ కొన్నాళ్లపాటు కరాటే కూడా నేర్చుకుంది. ఓ చేతిలో కర్ర పట్టుకుని మరొక చేతితో సమరానికి సిద్ధమంటూ పోజు పెట్టింది. వైట్ డ్రెస్ వేసుకుని రెండు జడలతో ఇలా కనిపించింది.
కాలేజీ రోజుల్లో..
కాలేజీ రోజుల్లో స్నేహితులతో ఇలా దిగిన ఫొటో ఇది. పింక్ సారీ వేసుకుని సామ్ కనిపించింది.
మయోసైటిస్ నుంచి కోలుకున్న సమంత వరుసగా షూటింగులకు హాజరవుతోంది. శివనిర్వాణ, విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న ‘ఖుషి’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటోంది. ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. మరోవైపు, సిటాడెల్ వెబ్సిరీస్ ఇండియన్ వెర్షన్ కోసం కాల్ షీట్స్ కేటాయించింది.
మే 01 , 2023
FAMILY MOVIES: ఈ మధ్యకాలంలో కుటుంబ విలువలు చాటి చెప్పిన టాప్ 5 తెలుగు సినిమాలు
సినిమాల ప్రభావం జనాలపై ఎంతో కొంత కచ్చితంగా ఉంటుంది. చిత్రంలో వచ్చే సన్నివేశాలు కొన్ని సందర్భాల్లో కదిలిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల వచ్చిన కొన్ని చిత్రాలు కుటుంబాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. థియేటర్లు, ఓటీటీ అనే తేడా లేకుండా ఆదరించారు ప్రేక్షకులు. కుటుంబాలపై ప్రభావం చూపించిన టాప్ 5 చిత్రాలు ఇవే !
బలగం
ఈ ఏడాది విడుదలైన కుటుంబ కథా చిత్రాల్లో మెుదటిది బలగం. చిన్న చిన్న కారణాల వల్ల విడిపోయిన కుటుం మళ్లీ ఎలా కలుస్తుందనే కథను అద్భుతంగా తెరకెక్కించడంతో బ్లాక్ బస్టర్గా నిలిచింది. ప్రతి ఒక్కర్ని కంటతడి పెట్టించిన ఈ చిత్రం కారణంగా ఎన్నో విడిపోయిన కుటుంబాలు మళ్లీ కలుసుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
రంగ మార్తాండ
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన తల్లిదండ్రులు, ఇప్పటి జనరేషన్ పిల్లల మధ్య జరిగిన సంఘర్షణలే రంగ మార్తాండ. కుటుంబ కథా చిత్రాల దర్శకుడు కృష్ణవంశీ నుంచి వచ్చింది ఈ సినిమా. ఈ చిత్రం నేటితరం యువతకు మంచి పాఠంగా నిలుస్తుంది. తల్లిదండ్రులు మనకు ఏం చేశారో తెలుసుకొని వారిని ఎలా గౌరవించాలో తెలుసునేందుకు ఉపయోగపడుతుంది రంగ మార్తాండ.
రైటర్ పద్మభూషణ్
యంగ్ హీరో సుహాస్ లీడ్ రోల్ చేసిన సినిమా రైటర్ పద్మభూషణ్. సినిమా మెుత్తం ఓ యువకుడు కెరీర్లో నిలదొక్కుకోవటానికి పడే కష్టాల గురించి వివరించినా… అతడికి తల్లిదండ్రులు ఎలా మద్దతుగా నిలబడ్డారనేది అసలు అంశం. కలల్ని వదిలి వంటింటికే పరిమితమైన తల్లి కుమారుడి కోసం రచనలు చేయడం ప్రారంభించడం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. అంతేకాదు, మహిళల కలల్ని అర్థం చేసుకొని వారి ఆలోచనల్ని గౌరవించాలనే విషయాన్ని చాలామందికి చెబుతుంది ఈ సినిమా.
మట్టి కుస్తీ
భార్య, భర్తల మధ్య సమస్యలను ఓ చిన్న కథతో ముడి పెట్టి తీశారు. భర్త ఆధిపత్యమే కొనసాగాలనే వ్యక్తికి.. మగవాళ్లకు మేము ఏం తక్కువ కాదనే భార్య. కానీ, ఒకరికొకరు అర్థం చేసుకుంటేనే జీవితం ముందుకు సాగుతుందని కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమా చాలామందిలో మార్పు తీసుకువచ్చింది. ఇల్లాలికి తగిన గౌరవం ఇస్తామని చెప్పినవారు కూడా ఉన్నారు.
ది గ్రేట్ ఇండియన్ కిచెన్
సంప్రదాయాలు, కట్టుబాట్ల పేరుతో మహిళలను ఇంటి పనులకే పరిమితం చేస్తున్నారనేది సింపుల్ కథ. ఓ మహిళకు కొత్తగా పెళ్లై అత్తారింటికి వెళ్తుంది. మగవాళ్ల ఆధిపత్యం ఉన్న ఇంట్లో ఆమె ఇమడలేకపోతుంది. ఇళ్లు, వంటపని మెుత్తం చేస్తూ విసిగిపోయి శివమెత్తుతుంది. పురుషాధిక్యాన్ని ఎదురించి స్వతంత్రంగా తన లక్ష్యం వైపు సాగుతుంది. పురుషాధిక్య సమాజంలో మహిళలు ఇంకా ఎదుర్కొంటున్న అంశాలను సినిమాలో చక్కగా ప్రస్తావించారు. కొందరికి కళ్లు తెరిపిస్తే.. మరికొందరికి సమస్యగా మారింది ఈ చిత్రం. అన్ని పనులు షేర్ చేసుకోవాలంటూ ఆఫీసుల నుంచి వచ్చిన భర్తల్ని భార్యలు ఆటపట్టిస్తున్నారంట ఈ సినిమా చూసి…!
జయ జయ జయ జయ జయహే
ఈ సినిమా కూడా భార్య భర్తల మధ్య వచ్చే ఇగో ప్రాబ్లమ్స్తో తెరకెక్కించారు. అన్ని తను అనుకున్నట్లుగా సాగాలనుకునే భర్త.. అనుకోని సందర్భంలో భార్యపై చేయిచేసుకుంటాడు. ఎవరికి చెప్పినా పట్టించుకోకపోవటంతో తానే అన్ని చూసుకోవాలని ఆమె తైక్వాండో నేర్చుకుంటుంది. ఈ క్రమంలో ఇబ్బందులు రావటం, వాళ్లు విడిపోవడం జరుగుతుంది. అబ్బాయిపై ఆధారపడకుండా కూడా అమ్మాయిలు జీవిస్తారు. కానీ, అలా మగవారు ఉండలేరని చూపించారు. ఇది కూడా చాలామంది కపుల్స్పై ప్రభావం చూపించింది. ఇందులో భర్తను తైక్వాండోతో ఆటాడుకునే రీల్ తెగ వైరల్ అయ్యింది. ఆ పరిస్థితుల్లో మీరుంటే ఒక్కసారి ఊహించుకోండి.
ఏప్రిల్ 27 , 2023
మానస రాధాకృష్ణన్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
మానస రాధాకృష్ణన్ భారతీయ నటి, ఆమె ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటిస్తుంది. 2022లో వచ్చిన మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ చలనచిత్రం హైవే (2022)తో ఆమె తెలుగుతెరకు పరిచయం అయింది. ఆమెను తిరిగి రామ్ గోపాల్ వర్మ.. వ్యూహం చిత్రంలో వైఎస్ భారతి పాత్రలో అవకాశం ఇచ్చాడు. ఈ పాత్ర ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
మానస రాధాకృష్ణన్ పుట్టిన తేదీ?
సెప్టెంబర్ 29, 1998
మానస రాధాకృష్ణన్ ఎక్కడ పుట్టింది?
ఎర్నాకుళం, కేరళ
మానస రాధాకృష్ణన్ తెలుగులో నటించిన తొలి సినిమా?
హైవే(2022)
మానస రాధకృష్ణన్కు గుర్తింపు తెచ్చిన సినిమా?
వ్యూహం(2024). ఈ చిత్రంలో వైఎస్ భారతి క్యారెక్టర్లో నటించింది.
మానస రాధాకృష్ణన్ ఎత్తు ఎంత?
5 అడుగుల 5అంగుళాలు
మానస రాధాకృష్ణన్ తల్లిదండ్రుల పేర్లు?
శ్రీకళ రాధాకృష్ణన్, VK రాధకృష్ణనన్
మానస రాధాకృష్ణన్ అభిరుచులు?
క్లాసికల్ డ్యాన్సింగ్, కుకింగ్, గీటార్ వాయించడం
మానస రాధాకృష్ణన్కు ఇష్టమైన ఆహారం?
నాన్వెజ్
మానస రాధాకృష్ణన్కు ఇష్టమైన కలర్?
వైట్, బ్లాక్
మానస రాధాకృష్ణన్ ఏం చదివింది?
కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్
మానస రాధాకృష్ణన్ పారితోషికం ఎంత తీసుకుంటుంది?
ఒక్కొ సినిమాకు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.
మానస రాధాకృష్ణన్ ఇన్స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/me.radhakrishnan/?hl=
https://www.youtube.com/watch?v=KlyWpYN2XrY
ఏప్రిల్ 29 , 2024
మానస చౌదరి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
తెలుగు కుర్ర హీరోయిన్ మానన చౌదరి.. రీసెంట్గా 'బబుల్గమ్' సినిమాతో తెరంగేట్రం చేసింది. రాజీవ్ - సుమ తనయుడు రోషన్.. హీరోగా నటించిన ఈ మూవీలో తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ తనలో మంచి స్కిల్స్ ఉన్నాయన్న సందేశాన్ని.. టాలీవుడ్ దర్శక నిర్మాతలకు పంపింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ కుర్రాళ్లను కవ్వించే మానస చౌదరి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు(Some Lesser Known Facts about Manasa Chowdary) ఓసారి చూద్దాం.
మానస చౌదరి ఎప్పుడు పుట్టింది?
August 2, 2000
మానస చౌదరి ముద్దు పేరు?
మానస
మానస చౌదరి హీరోయిన్గా నటించిన తొలి సినిమా?
బబూల్గమ్(2023)
మానస చౌదరి ఎత్తు ఎంత?
5 అడుగుల 5అంగుళాలు
మానస చౌదరి రాశి ఏది?
సింహ రాశి
మానస చౌదరి ఎక్కడ పుట్టింది?
పుత్తూరు, ఏపీ
మానస చౌదరి అభిరుచులు?
సినిమాలు చూడటం
మానస చౌదరికు ఇష్టమైన ఆహారం?
బిర్యాని
మానస చౌదరికి ఇష్టమైన కలర్?
వైట్
మానస చౌదరికి ఇష్టమైన హీరో?
అల్లు అర్జున్, మహేష్ బాబు
మానస చౌదరి ఏం చదివింది?
డిగ్రీ
మానస చౌదరి పారితోషికం ఎంత తీసుకుంటుంది?
ఒక్కో సినిమాకు రూ.10 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.
మానస చౌదరి సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
మానస చౌదరి ఎమోజీ అనే వెబ్ సిరీస్ ద్వారా ఫేమస్ అయింది
మానస చౌదరికి ఎఫైర్స్ ఉన్నాయా?
అలాంటివి ఏమి లేవు
మానస చౌదరి ప్రస్తుతం ఎక్కడ ఉంటుంది?
హైదరాబాద్
మానస చౌదరి ఇన్స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/maanasa.choudhary1/?hl=en
ఏప్రిల్ 05 , 2024
Prabhas: మంచి మనసు చాటుకున్న ప్రభాస్.. ఆహ్వానానికి వెళ్తే భారీ విరాళం!
దేశం మెచ్చిన నటుల్లో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఒకరు. ఈ హీరో పేరు చెబితే బాక్సాఫీస్ రికార్డులు, పాన్ ఇండియా స్థాయి చిత్రాలే గుర్తుకువస్తాయి. అయితే ప్రభాస్కు మంచి మనసున్న వ్యక్తిగానూ గుర్తింపు ఉంది. ప్రభాస్ ఇప్పటివరకూ ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఎన్నడూ కాంట్రవర్సీల జోలికి పోలేదు. ఏ స్టేజీ మీద వివాదస్పద వ్యాఖ్యలు చేయలేదు. పైగా తన వద్దకు వచ్చిన వారికి పసందైన భోజనాన్ని పెట్టి వారి మన్ననలు పొందుతుంటాడు. అంతే కాకుండా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ మరోమారు తన మంచి మనసును చాటుకున్నాడు.
డైరెక్టర్స్కు భారీ విరాళం
లెజండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు (Dasari Narayana Rao Birthday) పుట్టిన రోజును పురస్కరించుకొని ఏటా మే 4న ‘డైరెక్టర్స్ డే’ (Directors Day)ను జరుపుకుంటున్నారు. ఈసారి వేడుకలను హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించాలని ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి అహ్వానించేందుకు అసోసియేషన్ సభ్యులు తాజాగా ప్రభాస్ను కలిశారు. ఈ సందర్భంగా వేడుకలు గ్రాండ్ చేయాలంటూ ప్రభాస్ వారికి రూ.35 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ విషయాన్ని అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వయంగా వెల్లడించారు. దీంతో హీరో ప్రభాస్పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఫుల్ స్వింగ్లో ప్రభాస్!
ప్రస్తుతం దేశంలో ఏ స్టార్ హీరో చేతిలో లేనన్ని పాన్ ఇండియా చిత్రాలు ప్రభాస్ లిస్ట్లో ఉన్నాయి. ప్రభాస్ ఏ డైరెక్టర్కైనా ఓకే చెప్తే ఆ ప్రాజెక్ట్ మెుదలయ్యేది 2026 తర్వాతనే. ప్రభాస్ ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ప్రస్తుతం అతడు 'కల్కీ 2898 ఏడీ' సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. దీంతో పాటు మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ (Raja Saab) చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తర్వాత సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి స్పిరిట్ (Spirit) అనే టైటిల్ ఖరారు చేశారు. వీటితో పాటు ‘సలార్ సీక్వెల్’ ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’లోనూ ప్రభాస్ శివుడి పాత్ర పోషించనున్నాడు. అలాగే హను రాఘవపూడితో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాలన్నీ పూర్తవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది.
ఏప్రిల్ 23 , 2024
REVIEW: “ముఖ చిత్రం” సినిమాకు విశ్వక్ మైనస్ ?
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్లోడ్ చేసుకోండి.Download Our App
ఫిబ్రవరి 13 , 2023
Jr NTR: ఎన్టీఆర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చూస్తే మతి పోవాల్సిందే.. రెండేళ్లలో 4 భారీ చిత్రాలు!
బాక్సాఫీస్కు వణుకుపుట్టించే అతికొద్ది మంది హీరోల్లో జూ.ఎన్టీఆర్ ఒకరు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే అప్పటివరకూ ఉన్న రికార్డ్స్ అన్ని సైడ్ అవ్వాల్సిందే. ఎన్టీఆర్ బిగ్ స్క్రీన్పై కనిపిస్తే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోవాల్సిందే. అటువంటి తారక్ నుంచి రెండున్నరేళ్లుగా ఒక్క సినిమా కూడా రాలేదు. ‘ఆర్ఆర్ఆర్’ (2022) తర్వాత ప్రేక్షకులను పలకరించలేదు. దీంతో ఎన్టీఆర్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అటు తారక్ సైతం సెప్టెంబర్ 27న ‘దేవర’తో రాబోతున్నాడు. అంతేకాదు నిరాశలో ఉన్న ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్ పెట్టేందుకు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేయబోతున్నాడు. అభిమానుల దాహార్తిని తీర్చేందుకు వచ్చే రెండేళ్లలో ఏకంగా నాలుగు భారీ బడ్జెట్ సినిమాలను రిలీజ్ చేయబోతున్నాడు. ఎన్టీఆర్ లైనప్లోని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే.
ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్!
2018 నుంచి 2024 ఆగస్టు మధ్య ఎన్టీఆర్ నుంచి కేవలం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మాత్రమే వచ్చింది. అయితే ఆ మూవీ భారీ సక్సెస్ గ్యాప్ను మర్చిపోయేలా చేసింది. లేటెస్ట్గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవర’ చిత్రంతో తారక్ రాబోతున్నాడు. ఇక మీదట తారక్ నుంచి వరుసగా చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వచ్చే రెండేళ్లలో ఏకంగా 4 పాన్ ఇండియా చిత్రాలతో తారక్ బిగ్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. తొలుత దేవరతో సందడి చేయనున్న తారక్ ఆ తర్వాత బాలీవుడ్ చిత్రం 'వార్ 2'తో ఫ్యాన్స్ను ఎంటర్టైన్ చేయనున్నాడు. అందులో స్టార్ హీరో హృతిక్ రోషన్తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. అలాగే 'దేవర 2' సీక్వెల్ కూడా తారక్ లైనప్లో ఉంది. తాజాగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో 'NTR 31' ప్రారంభమైంది. 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. అలాగే దీంతో పాటు 'హాయ్ నాన్న' డైరెక్టర్ శౌర్యువ్తోనూ ఎన్టీఆర్ మూవీ ఉండనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. ఇదీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. మెుత్తంగా రెండేళ్లలో కనీసం నాలుగు చిత్రాలు రిలీజ్ అయ్యేలా ఎన్టీఆర్ ప్లాన్ చేసుకున్నట్లు కనిపిస్తోంది.
‘NTR 31’ స్టోరీ ఇదేనా!
ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ శుక్రవారం (ఆగస్టు 9) పూజా కార్యక్రమంతో మెుదలైంది. NTR31 కొత్త పోస్టర్ గమనిస్తే ఈ సినిమా చైనా, ఇండియాకు మధ్య సాగే కథాంశం అని ప్రచారం జరుగుతోంది. 1969 నాటి ఓపియం మాఫియాకి రిలేటేడ్గా రానున్నట్లు సమాచారం. ఈ మాఫియాలో ఎన్టీఆర్ను డ్రగ్ లార్డ్గా చూపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 1969 రోజుల్లో కలకత్తా పోర్ట్ గోల్డెన్ ట్రయాంగిల్కి దగ్గరగా ఉండటంతో ఓపియం స్మగ్లింగ్కి అది అడ్డాగా మారింది. దాంతో ఆ పోర్టు నుంచే స్మగ్లింగ్ ఎక్కువగా జరిగేది. చైనా డ్రగ్స్ మాఫీయా కోల్కాత్తాలో యాక్టివ్గా ఉండటం అక్కడి లోకల్స్ గ్యాంగ్స్కి, వీరికి తరచూ గోడవలు జరిగేవట. ఈ లింకులు సౌత్ ఈస్ట్ ఆసియాకే కాకుండా యూరప్ వరకు విస్తరించాయని అంటారు. ఇప్పుడు ఇదే పాయింట్తో ప్రశాంత్ NTR31 ప్రాజెక్ట్ని రూపొందిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
తారక్ ద్విపాత్రాభినయం!
తారక్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రానున్న ‘NTR 31’ ప్రాజెక్ట్కు సంబంధించి ఓ క్రేజీ వార్త ఇటీవల హల్చల్ చేసింది. ఆ బజ్ ప్రకారం ఇందులో తారక్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. అందులో ఒకటి కెరీర్లో ఎప్పుడు చేయని 75 ఏళ్ల వృద్ధుడి పాత్ర అని జోరుగా ప్రచారం జరిగింది. ఇంకో పాత్రలో మాఫియా డాన్గా తారక్ కనిపిస్తారని టాక్ వినిపించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం సెప్టెంబర్లో సెట్స్పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ఫిల్మ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నట్లు సమాచారం.
ఆ టైటిల్ ఖరారు!
NTR 31 చిత్రానికి ‘డ్రాగన్’ అనే ఆసక్తికరమైన టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ టైటిల్నే దాదాపుగా ఖరారు చేసే అవకాశం కూడా ఉందట. డ్రాగన్ అంటే యూరోపియన్ భాషలో చెడుకి గుర్తు అని అర్థం. అలాగే డ్రాగన్ అంటే అలజడికి సంకేతం, నిప్పును పీల్చే గుణం కూడా దానికి ఉంటుందని అంటారు. ఇంత పవర్ఫుల్ పేరు అయినందువల్లే డ్రాగన్ టైటిల్ను ప్రశాంత్ నీల్ పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. పైగా తారక్ ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్లో ఎంతో పవర్ఫుల్గా కనిపించనున్న నేపథ్యంలో ఈ టైటిల్ అయితేనే సరిగ్గా మ్యాచ్ అవుతుందని ఆయన భావిస్తున్నారట. టైటిల్ ఖరారుపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని సమాచారం.
ఆగస్టు 10 , 2024
Heroines Tattoo: మన హీరోయిన్లు ఏ పార్ట్స్ మీద టాటూస్ వేసుకున్నారో తెలుసా?
పచ్చబొట్టు (Tattoos) వేసుకోవడం నేడు ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్గా మారింది. ముఖ్యంగా సెలబ్రెటీలు వేసుకునే టాటూస్పై అభిమానులతో పాటు మీడియా కూడా ఆసక్తిగా గమనిస్తుంటుంది. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా టాటూస్లో చాలా మార్పులు వచ్చాయి. ప్రత్యేకించి టాటూస్ కోసం ఆర్టిస్టులు పుట్టుకొచ్చారు. ఆకర్షణీయమైన రంగుల్లో, కోరుకున్న ఆకృతులను వారు శరీరంపై వేస్తుంటారు. ఈ టాటూస్ వ్యక్తిత్వానికి ప్రతిబింబాలుగా కనిపించడంతో పాటు వారి అందాన్ని మరింత పెంచుతోందనడంలో సందేహం లేదు. మరి మన హీరోయిన్లు ఎలాంటి టాటూస్ ఏ శరీర భాగలపై వేయించుకున్నారో ఓసారి చూద్దాం.
Eesha Rebba
తెలుగింటి అందం ఈషా రెబ్బ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. మోడల్ గా కేరిర్ ప్రారంభించిన ఈ భామ ‘అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రంతో 2013లో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత బందిపోటు, అమీ తుమి, సవ్యసాచి, అరవింద సమేత వీర రాఘవ, పిట్టకథలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ లాంటి మూవీల్లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలోనూ నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ నుంచి కొన్ని ఫ్యాషన్ టిప్స్ నేర్చుకోవచ్చు. ఈ ముద్దుగుమ్మ కుడి చేతి మణి కట్టు మీద నెమలి పించం టాటూను వేయించుకుంది. ఈ టాటూ ఆమె అందాన్ని మరింత పెంచిందనడంలో సందేహం లేదు.
Tatoo images
యుక్తిత రేజా
రంగబలి హీరోయిన్ యుక్తిత రేజా తన నడుము మడతలకు పై భాగంలో కమలం పువ్వు గర్తును టాటూగా వేయించుకుంది. అసలె సెక్సీగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఈ టాటూ మరింత హాట్గా తయారైంది.
నిహారిక కొణిదెల
మెగా డాటర్ నిహారిక కొణిదెలకు సైతం టాటూస్ అంటే పిచ్చి. ట్రెండీ టాటూస్ వేయించుకుంటూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఆమె కుడి కాలు మడిమపైనా వర్షించే మేఘం చిత్రాన్ని టాటూగా వేయించుకున్నారు. ఇది చాలా ట్రెండిగా ఉంటుంది. కొత్తగా టాటూస్ వెయించుకోవాలనుకునే వారికి ఇదొక మంచి ఐడియాగా చెప్పవచ్చు.
https://youtu.be/FQVYHolKhR0?si=0WfytTlwJwEcd9Lh
గతంలో నిహారిక తన వీపు వెనుక భాగంలో ఓ పిట్ట బొమ్మను టాటూగా వేయించుకుంది. ఇది కూడా మంచి లుక్ను అందిస్తుంది.
సంయుక్త మీనన్
మలయాళి ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ నుంచి కూడా ట్రెండీ టాటూ ఐడియాలను ఫాలో అవ్వొచ్చు. ఆమె వీపు వెనుక భాగంలో మలయాళం అక్షరాల్లో సంచారి అని రాసి ఉంటుంది. ఆ అక్షరాలపైన ఎగిరే పక్షి గుర్తు టాటూగా కనిపిస్తుంది.
అలాగే తన ఎడమ చేతి మణికట్టుపై మహా యంత్రం గుర్తును టాటూగా వేయించుకుంది. ఇది కూడా అమ్మాయిలకు మంచి అందాన్ని ఇస్తుంది.
https://www.youtube.com/watch?v=f-3OJFK1IZs
తృప్తి డిమ్రి టాటూస్
న్యూ నేషనల్ క్రష్ తృప్తి డిమ్రి కుడి భుజం పై భాగంలో సూర్యుడు- నెలవంక గుర్తుతో టాటూ వేయించుకుంది. ఇది కూడా టాటూ లవర్స్కు మంచి ఐడియా అని చెప్పవచ్చు.
సమంత టాటూస్
సమంత మొత్తం మూడు టాటూలను తన శరీరంపై వేయించుకుంది. మొదటిది.. తన వీపు వెనుక భాగంలో YMC అని ఉంటుంది. అంటే ఆమె నటించిన మొదటి చిత్రం ఏ మాయ చేశావే సినిమాకు గుర్తుగా ఈ టాటూ వేయించుకుంది.
మరొక టాటూ తన మాజీ భర్త నాగచైతన్య పేరును 'చై' అని నడుముకు పై భాగంలో వేయించుకుంది. మూడో టాటూను తన మణికట్టు పై భాగంలో రోమన్ సింబల్స్(డబుల్ యారోస్) రూపంలో వేయించుకుంది. వీటి అర్థం సొంతంగా నువ్వే ఏదైనా సృష్టించు అని.
View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)
శృతి హాసన్ టాటూస్
అందాల తారా శృతి హాసన్ తన వీపు వెనుక భాగంలో తన పేరును తమిళంలో స్టైలీష్ గా టాటూ వేయించుకుంది. అలాగే తన కుడి చేతి మణికట్టు మీద రోజ్ ప్లవర్ను టాటూగా వేయించుకుంది. ఈ టాటూల విషయాన్ని శృతి హాసన్ స్వయంగా ఓ వీడియో ద్వారా చెప్పింది.
https://youtu.be/p9n950dfSyU?si=3YYtZPTgh4ICnxrh
రాశి ఖన్నా టాటూస్
గ్లామర్ డాల్ రాశి ఖన్నా తన రైట్ లెగ్ మడిమపైనా టిన్ని క్యాట్ చిత్రాన్ని టాటూగా వేయించుకుంది. ఈ తరహా టాటూలు కూడా సింప్లీ సూపర్బ్గా ఉంటాయి.
అనసూయ భరద్వాజ్ టాటూస్
అనసూయ ఒంటి మీద మొత్తం రెండు టాటూలు ఉన్నాయి. మొదటిది తన భర్త ముద్దు పేరును 'నిక్' అని ఇంగ్లీష్ తన చెస్ట్ మీద వేయించుకుంది. మరో టాటూను తన ఎడమ చేతి మణికట్టుపై కేలాన్ అని వేయించుకుంది. గ్రీకు భాషలో కేలాన్ అంటే బ్యూటిఫుల్ క్యారెక్టర్ అని అర్థం.
ఫరియా అబ్దుల్లా టాటూస్
పాత బస్తీ పిల్ల ఫరియా అబ్దుల్లా అందంతో పాటు ట్రెండీగాను ఉంటుంది. తన ఎడమ కాలిపై ఎర్రటి వేర్ల గీతలు, నీలి రంగులో వృత్తం ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే.. ప్రతి ఒక్కరి జీవితంలో పైకి ఎదగాలంటే పునాది అనేది చాలా అవసరం. ఈ అర్ధాన్ని వేర్లు చూపిస్తాయి. మన రూట్స్ ఎంత బలంగా ఉంటే అంత ఎత్తుకు ఎదగగలం అనేది ఈ టాటూ ఉద్దేశం.
View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah)
అనన్య నాగళ్ల టాటూ
గ్లామరస్ డాల్ అనన్య నాగళ్ల తన ఎడమ చేతి మణికట్టుపై క్రేజీ లైన్ను టాటూగా వేయించుకుంది. బిలైవ్, స్మైలీ అనే పదాలతో పాటు రెండు ఎగిరే పక్షులను టాటూగా వేయించుకుంది.
View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla)
మమతా మోహన్ దాస్ టాటూ
ఒకప్పుడూ టాలీవుడ్ గ్లామర్ డాల్గా గుర్తింపు పొందిన మమతా మోహన్ దాస్ తన ఎడమ చేతి భుజంపై వినాయకుడి ప్రతిమను టాటూగా వేయించుకుంది. టాటూ కింద శ్రీ ఓం గణేశా అని ఉంటుంది.
నేహా శర్మ టాటూస్
అందాల భామ నేహా శర్మ తన మణికట్టుపై Excelsior అనే పదాన్ని టాటూగా వేయించుకుంది. ఇది ‘అద్భుతమైది, “ఉన్నతం” అనే పదాలను సూచిస్తుంది.
శోభిత దూళిపాళ
శోభిత దూళిపాళ తన ఎడమ చేతిపై హార్ట్ బీట్ గుర్తును టాటూగా వేయించుకుంది. ఈ టైప్ టాటూ చాల మందికి ఫేవరెట్ అని చెప్పొచ్చు.
షిర్లి షెటియా
అందాల భామ షిర్లి షెటియా తన కుడి చేతి మణికట్టుపై డబుల్ యారోస్ను టాటూగా వేయించుకుంది. ఈ టాటూ అర్థం నువ్వు ఏదైనా సాధించగలవు అనే స్ఫూర్తి వ్యాఖ్యం గురించి చెబుతుంది.
View this post on Instagram A post shared by Vaidehi [ I Am Hip Hop Kid ] (@vaidehi_theperformer)
రుహాని శర్మ
రుహాని శర్మ తన ఎడమ చేతి మీద అర్ధ చంద్రకారాన్ని టాటూగా వేయించుకుంది. అలాగే మెడ వంపులపై టిన్ని బర్డ్స్ను టాటూగా వేసుకుంది.
మే 14 , 2024
Market Mahalakshmi Review: మంచి సందేశంతో వచ్చిన ‘మార్కెట్ మహాలక్ష్మీ’.. సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు : పార్వతీశం, ప్రణీకాన్వికా, హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్ తదితరులు
దర్శకత్వం : వియస్ ముఖేష్
సంగీతం: జో ఎన్మవ్
నేపథ్య సంగీతం: సృజన శశాంక
సినిమాటోగ్రఫీ: సురేంద్ర చిలుముల
ఎడిటర్: విశ్వనాధ్ కూచనపల్లి
నిర్మాత: అఖిలేష్ కలారు
విడుదల తేది: ఏప్రిల్ 19, 2024
‘కేరింత’ ఫేమ్ పార్వతీశం నటింటిన లేటెస్ట్ చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మీ’ (Market Mahalakshmi). వీఎస్ ముఖేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీతో ప్రణీకాన్వికా హీరోయిన్గా పరిచయం అయ్యింది. అఖిలేష్ కలారు నిర్మాత. ఈ చిత్రంలో హర్షవర్ధన్, మహబూబ్ భాషా, ముక్కు అవినాష్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. కాగా, శుక్రవారం (ఏప్రిల్ 19) విడులైన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? ఇప్పుడు చూద్దాం.
కథేంటి
ప్రభుత్వ ఆఫీసులో గుమస్తాగా పని చేసే కేదార్ శంకర్ కొడుకును (పార్వతీశం) కష్టపడి సాఫ్ట్వేర్ ఇంజీనీర్ చేస్తాడు. లక్షల్లో జీతం వస్తున్న కుమారుడికి రూ.కోటి కట్నం ఇచ్చే యువతితో పెళ్లి చేసేందుకు యత్నిస్తాడు. అయితే పార్వతీశం మాత్రం మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే మహాలక్ష్మీని ప్రేమిస్తాడు. కానీ ఆమె అతడి ప్రేమను తిరస్కరిస్తుంది. దీంతో మహాలక్ష్మీ ప్రేమను పొందేందుకు పార్వతీశం మార్కెట్లోనే తిష్టవేస్తాడు. మరి మహాలక్ష్మీ పెళ్లికి ఒప్పుకుందా? ఆమె కుటుంబ నేపథ్యం ఏంటి? సాఫ్ట్వేర్ అయిన పార్వతీశం.. మహాలక్ష్మీనే ఎందుకు ప్రేమించాడు? కొడుకు ప్రేమ వ్యవహారం తెలిసి కేదార్ శంకర్ ఏం చేశాడు? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రలో పార్వతీశం చక్కగా నటించాడు. గత చిత్రాలతో పోలిస్తే నటన పరంగా చాలా ఇంప్రూవ్ అయ్యాడు. అటు మార్కెట్ మహాలక్ష్మీ పాత్రలో ప్రణికాన్విక ఒదిగిపోయింది. తొలి చిత్రమే అయినప్పటికీ ఎక్కడా తడబడలేదు. అటు పార్వతీశం ఫ్రెండ్ పాత్రలో ముక్కు అవినాష్ నవ్వించే ప్రయత్నం చేశాడు. మద్యానికి బానిసైన వ్యక్తిలా మహబూబ్ బాషా నవ్వులు పూయించాడు. హీరోయిన్ సోదరుడిగా అతడు ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు. జయ, పద్మ, కేదార్ శంకర్, హర్షవర్దన్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటింటి ఆకట్టుకున్నారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు వీఎస్ ముఖేష్ కొత్త తరహా ప్రేమ కథను ఈ చిత్రం ద్వారా పరిచయం చేశాడు. ఓ ఇండిపెండెంట్ అమ్మాయి, సాఫ్ట్వేర్ అబ్బాయి మధ్య లవ్ మెుదలైతే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్తో కథను నడిపించాడు. మహిళా సాధికారత ఎంత అవసరమో ఈ చిత్రం ద్వారా చెప్పే ప్రయత్నం చేయడం ప్రశంసనీయం. అయితే మహాలక్ష్మీ ప్రేమను పొందడం కోసం హీరో చేసే పనులు రొటీన్గా అనిపిస్తాయి. అక్కడ మరింత కామెడీ పండించే అవకాశమున్నా దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. సెకండాఫ్ను బలమైన సన్నివేశాలతో నడిపించడం సినిమాకు ప్లస్ అయ్యింది. కొన్ని డైలాగ్స్ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. క్లైమాక్స్లో ఇచ్చిన సందేశం ఆకట్టుకుంటుంది.
టెక్నికల్గా
ఇక టెక్నికల్ అంశాల విషయానికి.. జో ఎన్మవ్ అందించిన పాటలు పర్వాలేదు. నేపథ్య సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. సన్నివేశాలను చక్కగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా స్థాయికి తగ్గట్టుగా సరిపోయింది. మార్కెట్లోని సన్నివేశాలు మాంటేజ్ షాట్లు సినిమాకు అదనపు అందాన్ని తీసుకొచ్చాయి. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
హీరో, హీరోయిన్ నటనసందేశండైలాగ్స్
మైనస్ పాయింట్స్
రొటీన్ లవ్ ట్రాక్సాగదీత సన్నివేశాలు
Telugu.yousay.tv Rating : 2.5/5
ఏప్రిల్ 19 , 2024
Sarath Babu: శరత్ బాబుకు మంచి గుర్తింపు తెచ్చిన టాప్-10 చిత్రాలు ఇవే..!
టాలీవుడ్లోని అతి తక్కువ మంది విలక్షణ నటుల్లో శరత్బాబు ఒకరు. ప్రియుడిగా, భర్తగా, అన్నగా, తమ్ముడిగా, మోసకారిగా, విలన్గా ఇలా ఎన్నో పాత్రల్లో కనిపించి తిరుగులేని నటుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకు చెందిన శరత్బాబు 1973లో వచ్చిన రామరాజ్యం సినిమాతో తెరంగేట్రం చేశారు. 300లకు పైగా సినిమాల్లో నటించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శరత్బాబు (71).. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయన చివరిగా నరేష్- పవిత్ర జంటగా చేసిన ‘మళ్లీ పెళ్లి’ సినిమాలో నటించారు. శరత్బాబు మరణం నేపథ్యంలో ఆయనకు నటుడిగా మంచి పేరు తీసుకొచ్చిన టాప్-10 చిత్రాలు మీకోసం..
1. సీతాకోక చిలుక
1981లో వచ్చిన ‘సీతాకోక చిలుక’ సినిమా నటుడిగా శరత్ బాబుకు గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టింది. ఇందులో హీరోయిన్ కరుణకు అన్నగా శరత్ బాబు అద్భుతంగా నటించారు. జాలి, దయ, ప్రేమ, కరుణ లేని డేవిడ్ పాత్రలో శరత్బాబు ఆకట్టుకున్నారు. ఇందులో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సినిమా విజయంలోనూ శరత్బాబు కీలక పాత్ర పోషించారు. అప్పట్లో సీతాకోక చిలుక చిత్రం ఒక ప్రభంజనమే సృష్టించింది.
https://www.youtube.com/watch?v=lPf-cPdYjq0
2. అన్వేషణ
1985లో వచ్చిన ‘అన్వేషణ’ చిత్రం అప్పట్లో సూపర్హిట్గా నిలిచింది. సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ సినిమాలో జేమ్స్ అనే ఫారెస్టు రేంజ్ అధికారి పాత్రను శరత్ బాబు పోషించారు. తన అద్బుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమా తర్వాత నుంచి శరత్ బాబుకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి.
3. సితార
1980వ దశకంలో వచ్చిన ‘సితార’ చిత్రం శరత్ బాబు నటనా పాఠవాలను తెలియజేసింది. ఇందులో హీరోయిన్కు అన్నగా శరత్ బాబు నటించారు. చందర్ పాత్రలో ఒదిగిపోయాడు. చెల్లిని అమితంగా ఇష్టపడే అన్నగా.. కోర్టు గొడవలతో సతమతమయ్యే వ్యక్తిగా శరత్బాబు ఎంతో వైవిధ్యంతో నటించారు.
https://www.youtube.com/watch?v=ZK4qaJMWwoc
4. సంసారం చదరంగం
‘సంసారం చదరంగం’ సినిమా కూడా శరత్బాబుకి మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులో అప్పల నరసయ్య కుమారుడి పాత్రలో శరత్ కుమార్ నటించారు. డబ్బు విషయంలో కచ్చితంగా ఉండే ప్రకాష్ పాత్రలో ఆయన అలరించాడు. ముఖ్యంగా తండ్రి కొడుకు మధ్య వచ్చే సన్నివేశాల్లో శరత్ బాబు అద్భుతమే చేశాడు. తన నటన ఎంత లోతైనదో చూపించాడు.
https://www.youtube.com/watch?v=esucI1zKcM4
5. సాగర సంగమం
కె. విశ్వనాథ్ డైరెక్షన్లో వచ్చిన ‘సాగర సంగమం’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమల్ హసన్ కెరీర్లో మరుపురాని చిత్రంగా ఇది మిగిలిపోయింది. ఇందులో రఘుపతి పాత్ర పోషించిన శరత్బాబుకు కూడా ఈ సినిమా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. కమల్కు స్నేహితుడిగా ఇందులో శరత్బాబు నటించారు.
https://www.youtube.com/watch?v=CtBi8524GAc
6. స్వాతి ముత్యం
కమల్ హాసన్ కథానాయకుడిగా చేసిన ‘స్వాతి ముత్యం’ సినిమాలోనూ శరత్బాబు నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్ సోదరుడు చలపతి పాత్రలో శరత్బాబు అత్యుత్తమ నటన కనబరిచాడు. ఇందులో ఆయన నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు కురిశాయి.
7. ముత్తు
రజనీకాంత్ కెరీర్లో సూపర్ హిట్గా నిలిచిన చిత్రాల్లో ‘ముత్తు’ ఒకటి. ఇందులో జమీందారైన రాజా పాత్రలో శరత్బాబు ఆకట్టుకున్నాడు. రజనీకాంత్తో పోటీ పడి మరీ నటించాడు. రజనీ - శరత్బాబు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శరత్బాబు అత్యుత్తమ నటన కనబరిచిన సినిమాల్లో ముత్తు కచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు.
https://www.youtube.com/watch?v=0h6qh6ABmdk
8. అన్నయ్య
చిరంజీవి, సౌందర్య జంటగా నటించిన అన్నయ్య సినిమాలో శరత్బాబు విలన్ పాత్ర పోషించారు.
సోదరులను అడ్డుపెట్టుకొని చిరంజీవిపై పగ తీర్చుకునే రంగారావు పాత్రలో శరత్బాబు మంచి నటన కనబరిచాడు.
https://www.youtube.com/watch?v=Deoo7_CQFdg
9. మగధీర
రామ్చరణ్ - రాజమౌళి కాంబో వచ్చిన మగధీర చిత్రంలోనూ శరత్ కుమార్ నటించారు. కాజల్కు తండ్రిగా, విక్రమ్ సింగ్ మహారాజ్గా మెప్పించాడు.
https://www.youtube.com/watch?v=G7haVu5g-Qw
10. వకీల్సాబ్
పవన్ కల్యాణ్ రీసెంట్ మూవీ వకీల్సాబ్ సినిమాలోనూ శరత్కుమార్ కనిపించారు. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్గా ఆయన నటించారు. పవన్ను ఉద్దేశిస్తూ ‘ఇప్పుడు జనాలకు నీ అవసరం ఉంది’ అని శరత్ బాబు చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయింది.
మే 22 , 2023
పీరియాడిక్ రోల్స్లో తళుక్కుమన్న 10 మంది అందాల తారలు
సాధారణంగా హీరోయిన్స్ అంటే గ్లామర్ పాత్రలు, నటనకు ఆస్కారం లేని క్యారెక్టర్లే గుర్తుకు వస్తాయి. కథానాయికలు కేవలం కొన్ని సీన్లకు, పాటలకు మాత్రమే పరిమితమైన చిత్రాలు ఇటీవల కాలంలో కోకొల్లలుగా వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొందరు హీరోయిన్లు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పిరియాడిక్ పాత్రల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదిస్తున్నారు. ఓ వైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే నటనకు ఆస్కారముండే పాత్రలూ చకా చకా చేసేస్తున్నారు. అలాంటి ఓ 10 మంది తారలను ఇప్పుడు చూద్దాం.
సమంత:
సమంత ఇప్పటివరకు అందం, అభినయం కలగలిపిన పాత్రల్లో చేశారు. కొన్ని సినిమాల్లో ప్రేయసి క్యారెక్టర్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఇందుకు భిన్నంగా తన లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’లో సమంత కనిపించబోతున్నారు. కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలము’ నాటకం ఆధారంగా డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాను రూపొందించారు. ఇందులో సామ్ శాకుంతల పాత్ర పోషిస్తున్నారు. సమంత ఇలా పౌరణిక పాత్రలో కనిపించడం ఇదే తొలిసారి. ఈ సినిమా తన కెరీర్లోనే అత్యుత్తమంగా నిలిచిపోతుందని సమంత అంటున్నారు. ఏప్రిల్ 14న శాంకుతులం రిలీజ్ కానుండగా ఫ్యాన్స్ను సమంత ఏమేరకు మెప్పిస్తారో చూడాలి.
కృతి సనన్:
ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’ను రామాయణం కథ ఆధారంగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా ‘కృతి సనన్’ సీత పాత్ర చేస్తున్నారు. ఇప్పటివరకూ గ్లామర్ పాత్రల్లో మాత్రమే నటించిన కృతి.. సీత క్యారెక్టర్ చేస్తుండటం ఆసక్తిరేపుతోంది. సీత పాత్రను పోషించి అందరి మన్ననలు పొందడమంటే సాధారణ విషయం కాదు. సీత మృధుస్వభావి, మిత భాషి. అంతేగాక సీత పాత్ర ఎంతో సుకుమారమైంది. ఎన్నో సవాళ్లతో కూడిన సీత పాత్రను కృతి చేస్తుండటం గొప్ప విషయమనే చెప్పాలి. తన నటనతో ప్రేక్షకులను కృతి మెప్పించినట్లయితే ఆమె క్రేజ్ అమాంతం పెరుగుతుందనడంలో సందేహం లేదు.
అలియా భట్:
బాలీవుడ్ బ్యూటీ అలియభట్ వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉన్నారు. తాజాగా ఆమె హిస్టారికల్ మూవీలో నటిస్తున్నారు. మెుగల్ కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ‘టక్త్’ చిత్రంలో బాను భేగంగా ఆలియా నటిస్తున్నారు. ఈ పాత్రలో ఆలియా నటన సినిమాకే హైలెట్గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. నటన పరంగా ఆలియా మరో మెట్టు ఎక్కుతుందని చెబుతున్నారు. కరణ్ జోహర్ నిర్మిస్తున్న టక్త్ చిత్రంలో త్వరలోనే విడుదల కానుంది.
త్రిష:
నీ మనసు నాకు తెలుసు చిత్రంతో టాలీవుడ్కు పరిచయమైన త్రిష.. వర్షం మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. త్రిష తన కెరీర్లో ఎక్కువగా ప్రేమికురాలి పాత్రల్లో కనిపించి మెప్పించారు. కానీ ‘పొన్నియన్ సెల్వన్’ పార్ట్ 1, 2 చిత్రాల ద్వారా త్రిష తన రూటు మార్చారు. చోళుల రాజకుమారి కుందువై పాత్రలో కనిపించి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు. యువరాణిలా ఎంతో హుందాగా నటించడంతో పాటు రాజనీతిజ్ఞత కలిగిన మహిళగా త్రిష తన హావభావాలను చక్కగా పలికించారు.
ఐశ్వర్యరాయ్:
బాలీవుడ్ అగ్రకథానాయిక ఐశ్వర్యరాయ్ గ్లామర్ పాత్రలతోపాటు.. నటనకు ఆస్కారమున్న హిస్టారికల్ పాత్రల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదివరకే హృతిక్తో ‘జోదా అక్భర్’ లో నటించిన ఐశ్వర్య.. మహారాణి ‘జోధా బాయి’ పాత్రతో మెప్పించారు. తాజాగా పొన్నియన్ సెల్వన్లో సైతం ఐశ్వర్య ‘నందిని’ పాత్రలో కనిపించారు. చోళ సామ్రాజ్యపు కోశాధికారి అయిన పెరియా పళవెట్టారియార్కు భార్యగా నటించారు.
అనుష్క:
టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరైన అనుష్క విభిన్న పాత్రలకు పెట్టింది పేరు. అరుంధతి చిత్రంతో టాప్ హీరోయిన్గా ఎదిగిన ఈ భామ బాహుబలి సినిమాలో దేవసేన పాత్రతో ఆ స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. కాకతీయ సామ్రాజ్యపు వీర వనిత రుద్రమదేవి పాత్రను సైతం అలవోకగా చేసిన అనుష్క ఈ తరం హీరోయిన్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రుద్రమదేవి చిత్రంలో అనుష్క నటన హైలెట్ అనే చెప్పాలి. ధైర్యవంతురాలైన రాణి పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయారు.
కంగనా రనౌత్:
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ మూస ధోరణి పాత్రలంటే ఆమాడ దూరం పాటిస్తారు. సవాలు విసిరే పాత్రల్లో నటించడమంటే ఆసక్తి చూపించే కంగనా ఝాన్సీ లక్ష్మీ బాయి పాత్రలో నటించి అదరగొట్టారు. 2019లో వచ్చిన ‘మణికర్ణిక’ చిత్రంలో కంగనా ఝాన్సీ లక్ష్మీ బాయిగా కనిపించారు. పోరాట సన్నివేశాల్లో అద్భుతంగా నటించి క్రిటిక్స్ సైతం మెచ్చుకునే స్థాయికి ఎదిగారు. ఈ చిత్రంలో ఆమె నటనకు జాతీయ అవార్డు వచ్చింది. 67వ జాతీయ సినీ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందించారు.
కాజల్:
టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరిగా కాజల్ ఎదిగారు. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన మగధీర చిత్రం కాజల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇందులో కాజల్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించారు. ముఖ్యంగా యువరాణి మిత్రవింద పాత్రలో ఆమె అద్భుతంగా నటించారు. తొలిసారి పిరియాడిక్ పాత్ర పోషించినప్పటికీ నటనలో కాజల్ ఎంతో పరివర్తన కనబరిచారు. చరణ్తో పోటీపడి మరీ నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. మగధీర చిత్రంతో కాజల్ కెరీర్ పూర్తిగా మారిపోయింది.
రిచా పనాయ్:
అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన యుముడికి మెుగుడు చిత్రంలో యుముడి కూతురిగా ‘రిచా పనాయ్’ నటించారు. ఈ చిత్రం ద్వారానే తొలిసారి టాలీవుడ్లో అడుగుపెట్టిన రిచా.. యమజ పాత్రలో నటించి అలరించారు. ‘మెుగుడా.. మెుగుడా’ అని అల్లరి నరేష్ను పిలుస్తూ థియేటర్లలో నవ్వులు పూయించారు.
ఈ చిత్రంతో రిచా మంచి గుర్తింపునే సంపాదించినప్పటికీ ఆమెకు సినిమా అవకాశాలు పెద్దగా రాలేదు. ఆ తర్వాత చందమామ కథలు, రక్షక భటుడు వంటి చిత్రాల్లో నటించినా కూడా ఆమె పెద్దగా ఆకట్టులేకపోయింది. అవకాశాలు లేకపోవడంతో రిచా నెమ్మదిగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
రీమా సేన్:
2010లో టాలీవుడ్లో విడుదలైన యుగానికి ఒక్కడు చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. పాండ్య రాజుల కథాంశంతో రూపొందిన ఈ సినిమాతో హీరో కార్తీకి చెరి సమానమైన క్రేజ్ను రీమాసేన్ సంపాదించారు. అనితా పాండియన్ పాత్రలో ఆమె అద్భుత నటన కనబరిచారు. ఓవైపు మోడ్రన్ పాత్రలో అదరగొట్టిన ఆమె పాండ్యుల దేవతగా నటించి మెప్పించారు.
మార్చి 29 , 2023
BTS V అంత పాపులర్ మన విరాట్ అనుష్క శర్మ కన్నా పాపులర్ ఉర్ఫీ జావెద్
]బిగ్బాస్ బ్యూటీ, విచిత్ర వేషధారణతో పాపులర్ అయిన ఉర్ఫీ జావెద్, తమన్నా, కాజోల్, అనుష్క శర్మ, సచిన్, సూర్య, ధనుష్ వంటి బిగ్ స్టార్స్ కంటే ముందుంది. ఆమె కోసం అంతగా వెతికారు మరి.ఉర్ఫీ జావెద్
ఫిబ్రవరి 13 , 2023
Hero's In Middle Class Roles: మన జీవితాలను కళ్లకు కట్టిన స్టార్ హీరోల పాత్రలు.. ఓ లుక్కేయండి!
సాధారణంగా హీరో పాత్రలు ఒక్కో సినిమాలో ఒక్కో రకంగా ఉంటాయి. యాక్షన్ చిత్రాల్లో ఒకలా.. సోషియోఫాంటసీ జానర్స్లో మరోలా ఉంటాయి. చాలా వరకూ సినిమాల్లో హీరో పాత్రను సాధారణ ప్రేక్షకులు ఓన్ చేసుకోలేరు. ఎందుకంటే ఆ చిత్రాల్లో వారు కలర్ఫుల్ డ్రెస్లు వెసుకుంటూ కార్లల్లో తిరుగుతుంటారు. హైఫై జీవితాలను గడుపుతుంటారు. అయితే కొన్ని సినిమాలు అలా కాదు. అవి మధ్యతరగతి కుటుంబాలకు చాలా దగ్గరగా ఉంటాయి. మిడిల్ క్లాస్ జీవితాలను కళ్లకు కడతాయి. ఆ సినిమాల్లో హీరో ఎలాంటి హంగులు లేకుండా కుటుంబం పట్ల చాలా బాధ్యతగా ఉంటాడు. అందుకే సమాజంలోని మెజారిటీ యూత్ ఆ హీరో పాత్రలను ఓన్ చేసుకుంటారు. తమను తాము తెరపై చూసుకుంటున్నట్లు భావిస్తారు. తెలుగులో ఇప్పటివరకూ వచ్చిన టాప్ మిడిల్ క్లాస్ హీరో పాత్రలు ఏవో ఇప్పుడు చూద్దాం.
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
ఈ (Aadavari Matalaku Arthale Verule) సినిమాలో హీరో వెంకటేష్ (Venkatesh) సాధారణ జీవితాన్ని గడుపుతుంటాడు. ఉద్యోగం లేక తండ్రి కోటా శ్రీనివాస్ చేత చివాట్లు తింటూ ఉంటాడు. చివరికీ ఉద్యోగం రావడంతో తండ్రిని బాగా చూసుకోవాలని అనుకుంటాడు. ఓ కారణం చేత తండ్రిని కోల్పోయి అనాథగా మారతాడు. ఇలా ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం మిడిల్ క్లాస్ జీవితాలను గుర్తు చేస్తూనే ఉంటుంది.
రఘువరన్ బీటెక్
ఈ (Raghuvaran Btech) సినిమాలో రఘువరన్ (ధనుష్) కుటుంబం కోసం ఏదోటి కోల్పోతూనే ఉంటాడు. ఓ అవసరం కోసం దాచుకున్న డబ్బును తమ్ముడికి ఇచ్చేస్తాడు. తల్లి చనిపోవడంతో ఇష్టం లేని ఉద్యోగానికి ఇంటర్యూలకు తిరుగుతాడు.
తమ్ముడు
ఈ (Thammudu) సినిమాలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తొలుత ఆకతాయి తనంగా ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటాడు. బాక్సింగ్ పోటీలకు సిద్దమైన అన్నపై అతడి ప్రత్యర్థులు దాడి చేయడంతో పవన్లో మార్పు వస్తుంది. అన్న కోసం జల్సా జీవితాన్ని వదులుకొని ఎంతో కష్టపడి బాక్సింగ్ నేర్చుకుంటాడు. అన్నను ఆస్పత్రిపాలు చేసిన విలన్కు బాక్సింగ్ కోర్టులో బుద్ది చెప్తాడు.
అలా వైకుంఠపురంలో
ఇందులో (Ala Vaikunthapurramuloo) అల్లు అర్జున్ కోటీశ్వరుడు. మురళిశర్మ చేసిన కుట్రతో అతడే తండ్రి అని నమ్మి చిన్నప్పటి నుంచి అతడి ఇంట్లోనే పెరుగుతాడు. అతడి భార్యను తల్లిగా, కూతుర్ని సొంత చెల్లెలని భావిస్తాడు. పెద్దయ్యాక తనెవరో నిజం తెలుస్తోంది. కష్టాల్లో ఉన్న అసలైన తల్లిదండ్రులను కాపాడతాడు. కానీ వారికి నిజం చెప్పడు. మిడిల్ క్లాస్ జీవితాన్నే గడిపేందుకు ఇష్టపడతాడు.
గ్యాంగ్ లీడర్
గ్యాంగ్లీడర్లో (Gang Leader) చిరంజీవి (Chiranjeevi) తొలుత ఖాళీగా తిరుగుతుంటాడు. పెద్దన్న మరణంతో రెండో అన్న చదువు బాధ్యత తనపై వేసుకుంటాడు. డబ్బు కోసం ఓ కేసులో జైలుకు సైతం వెళ్తాడు. అలా తన గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఫ్యామిలీ కోసం ఎన్నో త్యాగాలు చేస్తాడు.
అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి
ఈ (Amma Nanna O Tamila Ammayi) సినిమాలో రవితేజ (Ravi Teja)కు తన తండ్రి ప్రకాష్ రాజ్ అంటే అసలు పడదు. తన తల్లిని వదిలేశాడని కోపంతో ఉంటాడు. అనుకోకుండా తల్లి చనిపోవడంతో ఆమె ఆఖరి కోరిక మేరకు బాక్సింగ్ కోచ్ అయిన తండ్రి దగ్గరకు వెళ్తాడు. విలన్ తన తండ్రిని, సవతి చెల్లిని మోసం చేశాడని తెలుసుకొని బాక్సింగ్ కోర్టులో తలపడి అతడికి బుద్ధి చెప్తాడు.
అ ఆ
ఇందులో (A Aa) నితిన్ (Nithin) పక్కా మిడిల్ క్లాస్ అబ్బాయిలా ఉంటాడు. రావురమేష్కి తన ఫ్యామిలీ అప్పు ఉండటంతో ఇష్టం లేకపోయినా అతడి కూతుర్ని చేసుకునేందుకు సిద్ధపడతాడు. కోటీశ్వరురాలైన అత్త కూతురు సమంత ప్రేమిస్తోందని తెలిసినప్పటికీ క్లైమాక్స్ వరకూ కుటుంబం గురించే ఆలోచిస్తూ ఉంటాడు.
జెర్సీ (Jersey)
క్రికెటర్ అయినా నాని (Nani) అనారోగ్య కారణంతో ఆటకు దూరమవుతాడు. రైల్వే ఉద్యోగం కోల్పోయి భార్య సంపాదనపై ఆధారపడి జీవిస్తుంటాడు. క్రికెటర్గా చూడాలని కొడుకు చెప్పడంతో తిరిగి బ్యాట్ పట్టుకుంటాడు. ఒక మధ్యతరగతి తండ్రి కొడుకును ఎంతగా ప్రేమిస్తాడో ఈ సినిమాలో నాని చూపించాడు.
నేనింతే
ఈ (Neninthe) సినిమాలో రవితేజ (Ravi Teja).. సినిమా డైరెక్టర్ కావాలని కలలు కంటూ ఉంటాడు. అనారోగ్యంతో ఉన్న తల్లికి వైద్యం చేయించలేని స్థితిలో ఉంటాడు. ఓ వైపు లక్ష్యం.. మరోవైపు తల్లి ఆరోగ్యం మధ్య అతడు పడే సంఘర్షణ చాలా మంది జీవితాలను ప్రతిబింబిస్తుంది.
యోగి
ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన యోగి (Yogi) చిత్రం మిడిల్ క్లాస్ యువతకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది. డబ్బుకోసం తల్లిని విడిచి నగరానికి వచ్చిన హీరో ఓ హోటల్లో పనిచేస్తుంటాడు. రూపాయి రూపాయి కూడగట్టి తల్లికి గాజులు చేయిస్తాడు. అయితే ఆ గాజులు వేసుకోకుండానే తల్లి చనిపోవడం చాలా మందికి తమ గతాన్ని గుర్తు చేస్తుంది.
మార్చి 01 , 2024