UATelugu2h 18m
ప్రేమ్ (విశ్వక్ సేన్) కనిపించిన ప్రతీ అమ్మాయికీ ఐలవ్యూ చెబుతుంటాడు. కొందరు రిజెక్ట్ చేస్తే మరికొందరు డబ్బు కోసం అతడ్ని వాడుకొని వదిలేస్తుంటారు. ఇలా పలుమార్లు లవ్లో ఫెయిలైన ప్రేమ్ ఫైనల్గా పొలిటిషియన్ రాజీ (మురళిశర్మ)ని ప్రేమిస్తాడు. పురుషుడైన రాజీని హీరో ఎందుకు ప్రేమించాడు? నివేతా పేతురాజ్ ప్రేమ్ లైఫ్లోకి ఎలా వచ్చింది? అన్నది కథ.
ఇంగ్లీష్లో చదవండి
మూవీ & ఓటీటీ అప్డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Primeఫ్రమ్
Watch
స్ట్రీమింగ్ ఆన్Aha
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
విశ్వక్ సేన్
ప్రేమ్నివేదా పేతురాజ్
తీరాభూమికా చావ్లా
ప్రేమ్ తల్లి (అతి పాత్ర)మురళీ శర్మ
ఎమ్మెల్యే రాజా రెడ్డి రాజిసిమ్రాన్ చౌదరి
సోఫీమేఘ లేఖరాధ
రాహుల్ రామకృష్ణ
రాహుల్ రామకృష్ణ$యువ నాయకుడుమహేష్ ఆచంటమహేష్
ఇంద్రజ శంకర్బేబీ
ఆటో రామ్ ప్రసాద్
సిబ్బంది
నరేష్ కుప్పిలిదర్శకుడు
బెక్కం వేణుగోపాల్
నిర్మాతదిల్ రాజు
నిర్మాతలియోన్ జేమ్స్
సంగీతకారుడురాధన్
సంగీతకారుడుగ్యారీ BH
ఎడిటర్కథనాలు
Nivetha Pethuraj: సీఎం కొడుకుతో ఎఫైర్ అంటూ ప్రచారం.. నటి నివేత పేతురాజ్ సంచలన పోస్ట్!
కోలీవుడ్ నటి నివేతా పేతురాజ్ (Nivetha Pethuraj) తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. మొదట్లో డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టున్న ఈ భామ ఆ తర్వాత ‘చిత్రలహరి’, ‘పాగల్’, ‘అల వైకుంఠపురములో’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ‘బ్రోచేవారెవరురా’, ‘రెడ్’, ‘దాస్ కా ధమ్కీ’ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే ఇటీవల నివేతా గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. నివేతా పేతురాజ్ కోసం ఓ ప్రముఖుడు విచ్చలవిడిగా డబ్బుల ఖర్చు చేస్తున్నారంటూ తమిళ మీడియాలో ఆమెపై నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు. తాజాగా వాటిపై నివేత స్పందిస్తూ ఎక్స్లో సంచలన పోస్టు పెట్టింది.
ట్విటర్ వేదికగా ఆగ్రహం
తమిళనాడులో తనను లక్ష్యంగా చేసుకొని వస్తున్న వార్తలపై నటి నివేతా పేతురాజ్ ఎక్స్ వేదికగా మండిపడింది. ‘నా కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని ఇటీవల నాపై తప్పుడు వార్తలు రాశారు. ఈ తప్పుడు వార్తల వల్ల కొన్ని రోజులుగా నేను, నా కుటుంబం తీవ్ర ఒత్తిడికి లోనయ్యాం. ఇలాంటి వార్తలు రాసేముందు ఒకసారి ఆలోచించండి. నేను ఓ గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చాను. నాకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను సంపాదించడం మొదలుపెట్టాను. నేను డబ్బు కోసం అత్యాశపడే వ్యక్తిని కాదు. నా కోసం ఎవరో డబ్బు ఖర్చు చేస్తున్నారనంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. అవి నిరాధారమైనవి. ఆ వార్తలు రాసేవాళ్లు ఒకసారి ఆలోచించండి. మీలో మానవత్వం ఉందనే అనుకుంటున్నా. మరోసారి నా ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా తప్పుడు వార్తలు సృష్టించరని భావిస్తూ లీగల్ యాక్షన్ తీసుకోకుండ వదిలేస్తున్నా. ఈ విషయంలో నాకు సపోర్ట్ చేసినవారందరికి థ్యాంక్యూ’ అంటూ నివేతా తన పోస్ట్లో రాసుకొచ్చింది. ప్రస్తుతం నివేతా పేతురాజ్ ట్వీట్ ఇండస్ట్రీలో హాట్టాపిక్గా నిలిచింది.
https://twitter.com/Nivetha_Tweets/status/1764949757116735550
అసలేం జరిగింది?
గత కొన్నిరోజులుగా నివేతా పేతురాజ్, తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin)కు మధ్య ఏదో నడుస్తుందని వార్తలు గుప్పుమన్నాయి. ఆమె కోసం ఉదయనిధి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నాడని, ఆమె కోసమే కోట్లు ఖర్చుపెట్టి కారు రేసింగ్ను ఏర్పాటు చేశాడని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా రూ.50 కోట్ల విలువైన ఇంటిని గిఫ్ట్గా ఇచ్చాడని, ఇంకా ఏది చేయడానికి అయినా ఉదయనిధి సిద్ధంగా ఉన్నాడని తమిళ మీడియాలో పుకార్లు.. షికార్లు చేసాయి. కొద్దిరోజులుగా జరుగుతున్న ఈ ప్రచారాన్ని భరిస్తూ వచ్చిన నివేతా.. దీనికి ఫుల్స్టాప్ పడుతుందని భావించింది. రోజు రోజుకు ఈ ప్రచారం మరింత విస్తృతం కావడంతో తాజాగా దానిపై స్పందించింది. తప్పుడు వార్తలన్నింటికీ ఓ పోస్టు ద్వారా చెక్ పెట్టింది.
మార్చి 05 , 2024
ఉగాది స్పెషల్(మార్చి 22): ఈ వారం థియేటర్లు / ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు
తెలుగు కొత్త సంవత్సరం ఉగాది పురస్కరించుకొని వివిధ సినిమాలు సందడి చేయనున్నాయి. థియేటర్లు / ఓటీటీల్లో విడుదలకు సిద్ధమయ్యాయి. దర్శకుడిగా విశ్వక్ సేన్, పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ మళ్లీ అలరించేందుకు రెఢీ అయ్యారు.
దాస్ కా ధమ్కీ
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మళ్లీ మెగా ఫోన్ పట్టుకున్నాడు. దాస్ కా ధమ్కీ చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించనున్నాడు. మార్చి 22న ఉగాది రోజున సినిమాను విడుదల చేస్తున్నారు. పాగల్ తర్వాత విశ్వక్ సేన్, నివేదా పెతురాజ్ మరోసారి జంటగా నటించారు. యాక్షన్, కామెడీ తరహాలో సినిమా రూపుదిద్దుకుంది.
రంగ మార్తాండ
కుటుంబ కథా చిత్రాల దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కించిన చిత్రం రంగ మార్తాండ, రంగస్థల కళాకారుల జీవితాన్ని తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరాఠీ చిత్రం నట సామ్రాట్ చిత్రానికి రీమేక్గా వస్తుంది. ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్య కృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కూడా ఉగాదికి విడుదలవుతుంది.
ఘోస్టీ
వివాహం తర్వాత భర్త, కుమారుడికి సమయాన్ని కేటాయించిన కాజల్ అగర్వాల్ అభిమానుల కోసం మళ్లీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె నటించిన ఘోస్టీ తెలుగులో కోస్టీ పేరుతో సినిమాను విడుదల చేస్తున్నారు. హార్ర్ర్ కామెడీ తరహాలో తెరకెక్కిన చిత్రం ఉగాదికి థియేటర్లలో సందడి చేయనుంది.
గీత సాక్షిగా
ఆదర్శ్, చిత్రా శుక్లా జంటగా నటించిన ఈ సినిమా కూడా మార్చి 22న రిలీజ్ అవుతుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా గీత సాక్షిగా చిత్రాన్ని ఆంటోని మట్టపల్లి తెరకెక్కించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. చిత్రాన్ని తెలుగు, హిందీలోనూ విడుదల చేస్తున్నారు మేకర్స్. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ చూస్తే సస్పెన్స్ జోనరల్ సాగే చిత్రమని అర్థమవుతుంది.
ఓటీటీ సినిమాలు
Title CategoryLanguagePlatformRelease DatePanchatantram Movie Telugu ETV WinMarch 22Vinaro bhagyamu vishnu kathaMovie Telugu Aha March 22American apokalipseMovieEnglishNetflixMarch 22Jhony Movie EnglishNetflixMarch 23
మార్చి 20 , 2023
Kriti Kharbanda Hot : జాకెట్ తీసేసి.. కృతి కర్బందా హాట్ ఫోటో షూట్!
ప్రముఖ నటి కృతి కర్బంద.. స్టన్నింగ్ హాట్ ఫొటో షూట్తో అభిమానులకు షాకిచ్చింది. జాకెట్ లేకుండా కెమెరాకు ఫోజులిచ్చి ఆశ్చర్యపరిచింది.
సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తైన సందర్భంగా కృతి కర్బంద ఈ గ్లామర్ ఫోటోలను షేర్ చేసింది. బటన్స్ లేని నైట్ డ్రెస్లో ఎద అందాలను ప్రదర్శించింది.
ఈ భామ కొంటెగా చూస్తూ వయ్యారాలు ఒలకబోసిన ఫొటోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. కృతి కర్భంద గ్లామర్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
దిల్లీలో పుట్టి పెరిగిన కృతి కర్బందా (Kriti Kharbanda).. 2009లో 'బోణీ' (Boni Movie) అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టింది.
ఆ తర్వాత టాలీవుడ్లోనే ‘తీన్మార్’ (Teen Maar), ‘అలా మొదలైంది’ (Ala Modalaindi), మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, ఓం త్రీడీ తదితర చిత్రాలు చేసింది.
చివరగా 2015లో వచ్చిన 'బ్రూస్ లీ' (Bruce lee Movie) మూవీలో రామ్ చరణ్ (Ram Charan)కి అక్కగా నటించింది. ఇందులో ఆమెన నటనకు మంచి మార్కులే పడ్డాయి.
ముఖ్యంగా రామ్చరణ్ - కృతి కర్బందా మధ్య (Ram Charan Sister) వచ్చే సీన్లు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. అక్కా-తమ్ముడిగా వీరిద్దరు జీవించారని చెప్పవచ్చు. వీళ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా చాలా సహజసిద్ధంగా అనిపించాయి.
ఇక గ్లామర్ పరంగా సూపర్ ఉన్నప్పటికీ ఈమెకు (Kriti Kharbanda Engagement) తెలుగులో ఎందుకో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో హిందీపై ఆమె పూర్తి ఫోకస్ పెట్టింది.
అలా గత ఆరేళ్ల నుంచి పూర్తిగా హిందీ (Bollywood)లోనే సినిమాలు చేస్తూ కాస్తంత బిజీగా ఉంది. ఈ క్రమంలోనే నటుడు పులకిత్ సామ్రాట్తో ప్రేమలో పడటం గమనార్హం.
హిందీలో 2016-17 మధ్య వరుసగా 'రాజ్: రీబూట్' (Raaz: Reboot), గెస్ట్ ఇన్ లండన్ (Guest iin London), షాది మీన్ జరూర్ ఆనా (Shaadi Mein Zaroor Aana)చిత్రాలు చేసింది.
2018-19లో ‘వీరేకి వెడ్డింగ్’, ‘యమ్లా పగ్లా దీవానా: పిర్ సే’, ‘హౌస్ఫుల్ 4’, ‘పాగల్పంతి’ చిత్రాల్లో మెరిసి.. నార్త్లో మరింత మంది అభిమానులను సంపాదించుకుంది.
ఆ తర్వాత ‘తైష్’, ‘14 ఫిరే’ సినిమాల్లో నటించి బాలీవుడ్లో మంచి నటిగా తన ప్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది. తద్వారా హిందీలో ప్రముఖ హీరోయిన్ల సరసన స్థానం సంపాదించింది.
ప్రస్తుతం ఈ భామ హిందీలో ‘రిస్కీ రోమియో’ అనే చిత్రంలో నటిస్తూ బిజీ బిజీగా ఉంటోంది. అబిర్ సేన్గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోగా సన్నీ సింగ్ (Sunny Singh) నటిస్తున్నాడు. అలాగే మరో అన్ టైటిల్డ్ ప్రాజెక్ట్కు సైతం కృతి ఓకే చెప్పింది.
ఇక కృతి కర్భందా వ్యక్తిగత విషయాలకు వస్తే.. బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్ను ఈ భామ ఈ ఏడాది మార్చిలో వివాహం జరిగింది. వీరి పెళ్లికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు, బంధుమిత్రులు కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
కృతి - పులకిత్ గత నాలుగేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారు. వీరి డేటింగ్పై అప్పట్లో జాతీయ మీడియాలో కథనాలు సైతం వచ్చాయి. వాటికి పెళ్లి బంధంతో ఈ జంట ఫుల్స్టాప్ పెట్టింది.
కృతి.. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ చురుగ్గా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ను అలరిస్తోంది.
జూన్ 12 , 2024
Nivetha Pethuraj: పోలీసులతో గొడవ పెట్టుకున్న హీరోయిన్ నివేదా పేతురాజ్.. వీడియో వైరల్!
టాలీవుడ్లో అతి కొద్ది సినిమాలతోనే మంచి ఫేమ్ తెచుకున్న హీరోయిన్లలో 'నివేదా పేతురాజ్'. మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. ఆ మూవీ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇదిలా ఉంటే నివేతాకు గత కొంతకాలంగా ఏదీ కలిసిరావడం లేదు. ఇటీవల ఆమె ఓ సీఎం కొడుకుతో రిలేషన్లో ఉన్నారంటూ తమిళనాట పెద్ద ఎత్తున దుమారం రేగింది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలు ఏం జరిగిందంటే?
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. కారులో ప్రయాణిస్తున్న నివేదాను పోలీసులు అడ్డగించారు. ఆపై డిక్కీ ఓపెన్ చేయాలని ఆమెను కోరారు. దీనికి అంగీకరించని నివేద.. పోలీసులపై కోపం తెచ్చుకుంది. 'రోడ్డు వరకు వెళ్తున్నాను. నా దగ్గర పేపర్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. కావాలంటే చెక్ చేసుకోండి. డిక్కీలో ఏం లేవు. అర్థం చేసుకోండి. ఇది పరువుకు సంబంధించిన విషయం. ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. నేను డిక్కీ ఓపెన్ చేయలేను' అని కోపంగా చెప్పారు. ఇదంతా ఓ వ్యక్తి తన కెమెరాలో రికార్డు చేస్తుండగా అతడిపైనా నటి మండిపడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
https://twitter.com/Karthikkkk_7/status/1795883722673135776
నివేదా ప్రాంక్ చేసిందా?
నివేదా పేతురాజ్ వైరల్ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. డిక్కీ ఓపెన్ చేస్తే సరిపోయేది కదా ఇలా పోలీసులతో వాగ్వాదం చేయడం ఎందుకు అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు ఈ వీడియోను ఓ ప్రాంక్గా అభిప్రాయపడ్డారు. వీడియో నేచురల్గా లేదని.. స్క్రిప్టెడ్లా కనిపిస్తోందని పోస్టులు పెడుతున్నారు. ఏదైనా ప్రమోషన్స్లో భాగంగా నివేదా ఇలా చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పైగా ఈ వీడియోలో పోలీసులు షూస్కి బదులు చెప్పులు వేసుకొని కనిపించారని అంటున్నారు. కాబట్టి ఇది పక్కా ప్రమోషనల్ వీడియోనేనని నెటిజన్లు తేల్చేస్తున్నారు. ఏది ఏమైనా దీనిపై నివేదా క్లారిటీ ఇచ్చేవరకూ ఈ ప్రశ్నలకు ముగింపు రాదు.
సీఎం కొడుకుతో ఎఫైర్ అంటూ పుకార్లు
కొన్ని నెలల క్రితం తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్ - నివేదా పేతురాజ్కు మధ్య ఏదో నడుస్తోందంటూ ఆ రాష్ట్ర మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఆమె కోసం ఉదయనిధి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని, రూ.50 కోట్లతో ఇంటిని కూడా కొనుగోలు చేశాడని ప్రచారం జరిగింది. దీనిపై నివేదా ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ తప్పుడు వార్తల వల్ల తాను, తన కుటుంబం ఒత్తిడికి లోనయ్యామని పేర్కొంది. మరోమారు తన ఆత్మగౌరవాన్ని కించపరిస్తే చట్టపరమైన చర్యలకు దిగుతానని వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఆ రూమర్లకు చెక్ పడింది.
https://twitter.com/Nivetha_Tweets/status/1764949757116735550
విష్వక్తో హ్యాట్రిక్ చిత్రాలు
తెలుగులో తన తొలి చిత్రం ‘మెంటల్ మదిలో’ తర్వాత నివేదా.. 'చిత్రలహరి'తో మరో హిట్ తన ఖాతాలో వేసుకొంది. ఆ తర్వాత శ్రీవిష్ణుతో చేసిన 'బ్రోచేవారెవరురా' మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘దాస్ కా ధమ్కీ’, ‘పాగల్’, ‘బూ’ అనే మూడు సినిమాల్లో నివేదా నటించింది. ఇవే కాకుండా రానా-సాయి పల్లవిల ‘విరాట పర్వం’ మూవీలోనూ అలరించింది. ఇటీవల ‘బ్లడ్ మేరీ’ అనే సినిమాతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఏ ప్రాజెక్ట్స్ లేవు. దీంతో అందరి దృష్టిని ఆకర్షించేందుకు నివేదా ఇలా ప్రాంక్ చేసి ఉండొచ్చన వాదన కూడా నెట్టింట వినిపిస్తోంది.
మే 30 , 2024
Kriti Kharbanda: సీక్రెట్గా నిశ్చితార్థం చేసుకున్న రామ్ చరణ్ అక్క... అబ్బాయి ఎవరంటే?
‘బ్రూస్లీ’ సినిమాలో రామ్చరణ్ సోదరిగా నటించి అందరి దృష్టిని ఆకర్షించిన కృతి కర్బందా (Kriti Kharbanda) ఫ్యాన్స్కు షాకిచ్చింది. అనూహ్యంగా ఓ బాలీవుడ్ నటుడుతో ఎంగేజ్మెంట్ చేసుకొని వార్తల్లో నిలిచింది.
మెగా హీరోలతో కలిసి సినిమాలు చేసిన ఈ భామ.. గత కొన్నేళ్ల నుంచి టాలీవుడ్కు దూరంగా ఉంటూ వస్తోంది. బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ అక్కడే స్థిరపడిపోయింది.
తాజాగా ఈ భామ ఎంగేజ్మెంట్ ఫొటోలు బయటకు రావడంతో ఒక్కసారిగా కృతి కర్బందా పేరు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
https://twitter.com/Network10Update/status/1752266129991708697
బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్తో (Pulkit Samrat) ఆమె ఎంగేజ్మెంట్ జరిగినట్లు వైరల్ అవుతున్న ఫొటోలను బట్టి తెలుస్తోంది. గత కొంత కాలం నుంచి వీరిద్దరు రిలేషన్లో ఉన్నట్లు సమాచారం.
కృతి-పులకిత్ జంట (Pulkit Samrat and Kriti Kharbanda) నిశ్చితార్థం కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.
ఈ జంట ఫొటోలను చూసిన నెటిజన్లు.. ఈ జోడీ (Kriti Kharbanda Engagement) బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లిరోజు ఎప్పుడో చెప్పాలంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా, వచ్చే నెలలో వీరి పెళ్లి ఉండవచ్చని సమాచారం.
అయితే కృతి - పులకిత్ రిలేషన్షిప్ గురించి నాలుగేళ్ల క్రితమే వార్తలు వచ్చాయి. వారు చాలా దగ్గరైనట్లు డేటింగ్ కూడా చేస్తున్నట్లు అప్పట్లో కథనాలు వచ్చాయి. ఆ రూమర్లకు నిశ్చితార్థంతో ఈ జంట ఫుల్స్టాప్ పెట్టింది.
దిల్లీలో పుట్టి పెరిగిన కృతి కర్బందా (Pulkit Samrat and Kriti Kharbanda).. 'బోణీ' (Boni Movie) అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టింది.
ఆ తర్వాత టాలీవుడ్లోనే ‘తీన్మార్’ (Teenmar), ‘అలా మొదలైంది’ (Ala Modalaindi), మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, ఓం త్రీడీ తదితర చిత్రాలు చేసింది.
చివరగా 2015లో వచ్చిన 'బ్రూస్ లీ' (Bruce lee) మూవీలో రామ్ చరణ్ (Ram Charan)కి అక్కగా నటించింది. ఇందులో ఆమెన నటనకు మంచి మార్కులే పడ్డాయి.
ముఖ్యంగా రామ్చరణ్ - కృతి కర్బందా మధ్య (Ram Charan Sister) వచ్చే సీన్లు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. అక్కా-తమ్ముడిగా వీరిద్దరు జీవించారని చెప్పవచ్చు. వీళ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా చాలా సహజసిద్ధంగా అనిపించాయి.
https://twitter.com/i/status/1052216173801168896
ఇక గ్లామర్ పరంగా సూపర్ ఉన్నప్పటికీ ఈమెకు (Kriti Kharbanda Engagement) తెలుగులో ఎందుకో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో హిందీపై ఆమె పూర్తి ఫోకస్ పెట్టింది.
అలా గత ఆరేళ్ల నుంచి పూర్తిగా హిందీ (Bollywood)లోనే సినిమాలు చేస్తూ కాస్తంత బిజీగా ఉంది. ఈ క్రమంలోనే నటుడు పులకిత్ సామ్రాట్తో ప్రేమలో పడటం గమనార్హం.
హిందీలో 2016-17 సంవత్సరాల్లో వరుసగా 'రాజ్: రీబూట్' (Raaz: Reboot), గెస్ట్ ఇన్ లండన్ (Guest iin London), షాది మీన్ జరూర్ ఆనా (Shaadi Mein Zaroor Aana)చిత్రాలు చేసింది.
2018-19లో ‘వీరేకి వెడ్డింగ్’, ‘యమ్లా పగ్లా దీవానా: పిర్ సే’, ‘హౌస్ఫుల్ 4’, ‘పాగల్పంతి’ చిత్రాల్లో మెరిసింది.
ఆ తర్వాత ‘తైష్’, ‘14 ఫిరే’ సినిమాల్లో నటించి బాలీవుడ్లో మంచి నటిగా (Kriti Kharbanda Engagement) తన ప్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది. తద్వారా హిందీలో ప్రముఖ హీరోయిన్ల సరసన స్థానం సంపాదించింది.
ప్రస్తుతం ఈ భామ హిందీలో ‘రిస్కీ రోమియో’ అనే చిత్రంలో నటిస్తూ బిజీ బిజీగా ఉంటోంది. అబిర్ సేన్గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోగా సన్నీ సింగ్ (Sunny Singh) నటిస్తున్నాడు. అతడు ఆదిపురుష్ చిత్రంలో లక్ష్మణుడి పాత్ర పోషించడం గమనార్హం.
జనవరి 30 , 2024
పాయల్ రాజ్పుత్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
పాయల్ రాజ్పుత్ 2017లో పంజాబీ చిత్రం "చన్నా మెరేయా"తో వెండితెరకు పరిచయమైంది. తెలుగులో "RX 100" చిత్రం ద్వారా విస్తృత గుర్తింపు పొందింది. ఈ రెండు చిత్రాలు ఆమెకు మంచి విజయాలను అందించాయి. పాయల్ రాజ్పుత్ చాలా తక్కువ వ్యవధిలో అనేక విజయవంతమైన ప్రాజెక్ట్లలో భాగం అయ్యింది. "RX 100", "వెంకీ మామ," "RDX లవ్, "మంగళవారం", "తమిళ చిత్రం "ఏంజెల్" వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. శృంగార తారగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిను పాయల్ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.
పాయల్ రాజ్పుత్ ముద్దు పేరు?
టింకీ
పాయల్ రాజ్పుత్ ఎప్పుడు పుట్టింది?
1990, డిసెంబర్ 6న జన్మించింది
పాయల్ రాజ్పుత్ తొలి సినిమా?
చన్నా మేరేయా (2017)
పాయల్ రాజ్పుత్కు తెలుగులో తొలి సినిమా?
RX 100(2018)
పాయల్ రాజ్పుత్ ఎత్తు ఎంత?
5 అడుగుల 7అంగుళాలు
పాయల్ రాజ్పుత్ ఎక్కడ పుట్టింది?
ఢిల్లీ
పాయల్ రాజ్పుత్ ఏం చదివింది?
యాక్టింగ్లో డిప్లోమా చేసింది
పాయల్ రాజ్పుత్ అభిరుచులు?
మోడలింగ్, ట్రావెలింగ్
పాయల్ రాజ్పుత్కు ఇష్టమైన ఆహారం?
బిర్యాని
పాయల్ రాజ్పుత్కి ఇష్టమైన కలర్ ?
బ్లాక్, వైట్
పాయర్ రాజ్పుత్ తల్లిదండ్రుల పేర్లు?
విమల్ కుమార్ రాజ్పుత్( అకౌంట్ టీచర్), నిర్మల రాజ్పుత్
పాయల్ రాజ్పుత్కి ఇష్టమైన హీరో?
సల్మాన్ ఖాన్
పాయల్ రాజ్పుత్కి ఇష్టమైన హీరోయిన్?
దీపికా పదుకునే
పాయల్ రాజ్పుత్ పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ.60లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది
పాయల్ రాజ్పుత్ ఇన్స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/rajputpaayal/
పాయల్ రాజ్పుత్ బాయ్ ఫ్రెండ్?
పాయల్ రాజ్పుత్ ముంబైకి చెందిన మోడల్ సౌరబ్ డింగ్రాతో డేటింగ్లో ఉంది.
పాయల్కు వచ్చిన అవార్డులు?
తెలుగులో "RX 100"చిత్రానికి గాను ఉత్తమ తొలిచిత్ర నటిగా సైమా అవార్డును పొందింది.
పాయల్ రాజ్పుత్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
పాయల్ రాజ్పుత్ సినిమాల్లోకి రాకముందు టీవీ సీరియళ్లలో నటించింది. మహాకుంభ్, సప్నోంసే భరె నైనా అనే సీరియళ్లలో పాయల్ నటించింది.
https://www.youtube.com/watch?v=jPSBXjYO9uU
ఏప్రిల్ 08 , 2024
Mangalavaaram Review: ‘మంగళవారం’లో పాయల్ కెరీర్ బెస్ట్ నటన.. మరి సినిమా హిట్టా? ఫట్టా?
నటీనటులు: పాయల్ రాజ్పూత్, నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్ అమిర్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ తదితరులు
దర్శకత్వం: అజయ్ భూపతి
సంగీతం: అజనీష్ లోకనాథ్
ఎడిటింగ్: మాధవ్ కుమార్ గుళ్లపల్లి
సినిమాటోగ్రఫీ: శివేంద్ర దాశరథి
నిర్మాత: స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్ వర్మ
విడుదల: 17-11-2023
‘RX 100’ సినిమాతో సినీప్రియుల్ని మెప్పించిన దర్శకుడు అజయ్ భూపతి. ఆ సినిమాతోనే నటి పాయల్ రాజ్పూత్ కూడా తెలుగు వారికి దగ్గరైంది. తిరిగి వారి కాంబోలోనే తేరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మంగళవారం’. డార్క్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఇటీవల రిలీజైన టీజర్, ట్రైలర్లు ఈ ఆసక్తిని మరింత పెంచింది. అల్లు అర్జున్ వంటి స్టార్ ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి ఈ మంగళవారం కథేంటి? తెరపై ఎలాంటి వినోదాన్ని పంచింది? పాయల్- అజయ్లకు విజయాన్ని అందించిందా? ఈ కథనంలో చూద్దాం.
కథ
మహాలక్ష్మీపురంలోని ఓ జంట మధ్య అక్రమ సంబంధం ఉందని ఊరి గోడలపై రాతలు కనిపిస్తాయి. ఆ జంట అనూహ్య పరిస్థితుల్లో చనిపోతుంది. మరో జంటకి కూడా అదే పరిస్థితి ఎదురై చనిపోవడంతో ఊరి ప్రజల్లో భయం మొదలవుతుంది. మంగళవారం రోజునే ఈ మరణాలు చోటుచేసుకోవడంతో గ్రామదేవత మాలచ్చమ్మ జాతర జరిపించకపోవడమే ఇందుకు కారణమని ఊరి ప్రజలు భావిస్తారు. అయితే ఈ మిస్టరీ మర్డర్స్ వెనుక ఏదో కుట్ర ఉందని ఎస్ఐ (నందితాశ్వేత) భావిస్తుంది. కానీ, ఊరి జమీందారు ప్రకాశం (చైతన్య కృష్ణ) మాటలకు కట్టుబడి ఇమె ఇన్వేస్టిగేషన్కు ఎవరూ సరిగా సహకరించరు. మరి ఆ హత్యలకు వెనుక ఉన్న మర్మం ఏమిటి? దెయ్యం రూపంలో శైలు (పాయల్ రాజ్పుత్) తిరుగుతోందని ఊరి ప్రజలు ఎందుకు భ్రమపడ్డారు? ఈ హత్యలకు శైలుకు సంబంధం ఉందా? మహాలక్ష్మీపురం నుంచి ఆమె వెలివేయబడటానికి కారణం ఏమిటి? అన్నదే మంగళవారం సినిమా కథ.
ఎలా సాగిందంటే?
సినిమాలో తొలి 15 నిమిషాలు శైలు చిన్నతనం, రవితో ఆమె ప్రేమకథ, అతడి కుటుంబ నేపథ్యం చుట్టూ సాగుతుంది. ఆ తర్వాత కథ వర్తమానంలోకి వస్తుంది. జంటల పేర్లు ఎవరో అజ్ఞాత వ్యక్తి ఊరి గోడలపై రాయడం.. వారంతా గ్రామ దేవతకు ఇష్టమైన మంగళవారం రోజునే చనిపోవడం తొలి భాగంలో చూపిస్తారు. ముఖ్యంగా విరామ సన్నివేశాలు తొలి భాగంలో థ్రిల్ ఇస్తాయి. ద్వితీయార్ధం మళ్లీ శైలు గతంతోనే మొదలవుతుంది. శైలుకు జరిగిన అన్యాయం, ఆమెకున్న మానసిక రుగ్మత, దానివల్ల తను పడే యాతన రెండో పార్ట్లో చూపించారు. పతాక సన్నివేశాలు మంచి ట్విస్ట్లతో ఆసక్తికరంగా ఉంటాయి.
ఎవరెలా చేశారంటే?
శైలు పాత్రలో పాయల్ చక్కగా ఒదిగిపోయింది. గ్లామర్తో పాటు నటనలోనూ అదరగొట్టింది. భావోద్వేగభరిత సన్నివేశాల్లో చక్కగా జీవించింది. ఎస్సై పాత్రలో నందితా శ్వేత ఆద్యంతం సీరియస్ లుక్లో కనిపించింది. నటన పరంగా ఆమెకు పెద్దగా స్కోప్ లేదు. అజయ్ ఘోష్ - లక్ష్మణ్ మధ్య వచ్చే కామెడీ ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. జమిందారుగా చైతన్య కృష్ణ పాత్రను మంచిగా డిజైన్ చేశారు. శ్రీతేజ్, శ్రవణ్ రెడ్డి, రవీంద్ర విజయ్ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
దర్శకుడు అజయ్ ఈ సినిమాను మిస్టీక్ థ్రిల్లర్లా మెుదలుపెట్టి మధ్యలో హారర్ టచ్ ఇచ్చి ఆఖర్లో ఓ సందేశంతో ముగించారు. అక్రమ సంబంధాల వ్యవహారం, డబల్ మీనింగ్ డైలాగ్స్, ఫ్యామిలీ ఆడియన్స్కు ఎబ్బెట్టుగా అనిపించేలా ఉన్నాయి. ఈ విషయంలో అజయ్ కాస్త జాగ్రత్త పడాల్సింది. మరోవైపు ప్రథమార్థంలో కథే కనిపించకపోవడం, ద్వితియాతార్థంలో పాత్రలకు సరైన ముగింపు ఇవ్వకపోవడం అతడి డైరెక్షన్లో మైనస్లుగా కనిపిస్తున్నాయి. పతాక సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ డైరెక్టర్ సినిమాని ముగించిన తీరు ఆడియన్స్కు అసంతృప్తిగా అనిపిస్తుంది. ఓవరాల్గా అజయ్ రాసుకున్న కథ కుటుంబ ప్రేక్షకులకు రుచించకపోవచ్చు. కానీ థ్రిల్లింగ్ సినిమాలు ఇష్టపడేవారికి నచ్చుతుంది.
టెక్నికల్గా
టెక్నికల్గా ఈ సినిమా ఉన్నత స్థాయిలో కనిపిస్తుంది. అజనీష్ నేపథ్య సంగీతం సినిమాకి ఓ కొత్త లుక్ను తీసుకొచ్చింది. జాతర పాటను స్వరపరిచిన తీరు.. దాన్ని తెరపై చిత్రీకరించిన విధానం ఆకట్టుకుంటాయి. అలాగే శివేంద్ర ఛాయాగ్రహణం మరో ఆకర్షణగా నిలిచింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
పాయల్ నటన, గ్లామర్అజనీష్ సంగీతంట్విస్ట్లు
మైనస్ పాయింట్స్
నెమ్మదిగా సాగే కథనం ముగింపు
రేటింగ్ : 3/5
నవంబర్ 17 , 2023
Kajal Aggarwal: కాజల్ Vs పాయల్ రాజ్పుత్.. ఈ ముద్దుగుమ్మల పోరులో గెలుపెవరిది!
గత కొన్ని వారాలుగా చిన్న సినిమాలే థియేటర్లలో విడుదలై సందడి చేస్తూ వచ్చాయి. ఇందులో కొన్ని హిట్ టాక్ తెచ్చుకుంటే మరికొన్ని ఫ్లాప్గా నిలిచి.. నెల అయినా గడవక ముందే ఓటీటీలోకి వచ్చేశాయి. అయితే ఈ వారం కూడా స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలోకి రాకపోవడం ఆడియన్స్ కాస్త నిరాశకు గురి చేస్తోంది. అయితే ఈ వారం రిలీజ్కు సిద్ధంగా ఉన్న రెండు చిత్రాలు మాత్రం అందరిలో ఆసక్తి పెంచుతున్నాయి. ప్రముఖ హీరోయిన్స్ కాజల్ అగర్వాల్ నటించిన ‘సత్యభామ’, పాయల్ రాజ్పుత్ లీడ్ రోల్లో చేసిన ‘రక్షణ’ సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారోనని ప్రేక్షకుల్లో ఆసక్తిగా మారింది.
తొలిసారి ఖాకీ డ్రెసుల్లో..
కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ప్రధాన పాత్రలో సుమన్ చిక్కాల తెరకెక్కించిన చిత్రం 'సత్యభామ' (Satyabhama). బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పోలీసు అధికారిణిగా కనిపించనుంది. ఆమె పోలీసు ఆఫీసర్గా చేయడం కెరీర్లో ఇదే తొలిసారి. ఈ సినిమా జూన్ 7న థియేటర్లలోకి రానుంది. అటు పాయల్ రాజ్పుత్ (Payal Rajput) చేసిన లేడీ ఓరియెంటేడ్ చిత్రం 'రక్షణ' (Rakshana) కూడా జూన్ 7వ తేదీనే థియేటర్లలోకి రాబోతున్నాయి. ఇందులోనూ పాయల్ కూడా తొలిసారి ఖాకీ దుస్తుల్లో ప్రేక్షకులను అలరించనుంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు ఒకే రోజు రిలీజ్ కానుండటంతో కాజల్, పాయల్ మధ్య కోల్డ్ వార్ మెుదలైనట్లు కనిపిస్తోంది.
యాక్షన్తో రాణించేనా!
కాజల్ అగర్వాల్, పాయల్ రాజ్పుత్ గత చిత్రాలను పరిశీలిస్తే.. వీరు గ్లామర్తోనే ఆడియన్స్ను ఎక్కువగా అలరించారు. అటువంటిది తొలిసారి వీరిద్దరు ఫుల్ లెంగ్త్ యాక్షన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అది కూడా ఎంతో పవర్ఫుల్ అయినా పోలీసు అధికారిణి పాత్రల్లో థియేటర్లలోకి వస్తున్నారు. మరి వీరు యాక్షన్ సీక్వెన్స్లో ఏ మేరకు రాణిస్తారో చూడాల్సి ఉంది. అయితే ఇప్పటికే విడుదలైన ‘సత్యభామ’, ‘రక్షణ’ ట్రైలర్స్ రెండూ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. కాజల్, పాయల్ రాజ్పుత్ ఇద్దరూ తమ యాక్షన్తో దుమ్మురేపినట్లే కనిపిస్తోంది. కాజల్, పాయల్ మధ్య ప్రస్తుతం నెలకొన్న థగ్ ఆఫ్ వార్లో విజయం ఎవరిదో ఈ శుక్రవారం (జూన్ 7) తేలిపోనుంది.
ఇతర చిత్రాలు
ఈ శుక్రవారం సత్యభామ, రక్షణ చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. నవదీప్ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో రూపొందిన 'లవ్ మౌళి' (Love Mouli) చిత్రం.. అనేక వాయిదాల తర్వాత ఈ వారమే థియేటర్లలోకి రాబోతుంది. ఇందులో పంఖురి గిద్వానీ, భావన సాగి హీరోయిన్లుగా చేశారు. అలాగే శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మనమే’ (Maname) కూడా ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ మూవీకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. మరోవైపు సత్యరాజ్, వసంత్ రవి ప్రధాన పాత్రలో నటించిన 'వెపన్' (Weapon) చితరం కూడా ఈ శుక్రవారం మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతోంది. వార్నర్ బ్రదర్స్, మార్వెల్ తరహాలో సూపర్ హ్యూమన్ కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు
ఈ వారం ఓటీటీలోనూ ఆసక్తికరమైన చిత్రాలు, సిరీస్లు రిలీజ్ కాబోతున్నాయి. అవేంటో తెలుసుకునేందుకు ఈ కింద ఉన్న లింక్పై క్లిక్ చేయండి.
https://telugu.yousay.tv/this-week-movies-these-are-the-films-series-that-will-double-your-happiness-this-week.html
జూన్ 04 , 2024
Payal Rajput: ఇండస్ట్రీలో పాయల్ రాజ్పుత్కు వేధింపులు.. నటి సెన్సేషనల్ పోస్టు!
ఆర్ఎక్స్ 100 (RX100) చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన నటి 'పాయల్ రాజ్పుత్' (Payal Rajput). ఆ మూవీ తర్వాత పలు చిత్రాల్లో చేసినప్పటికీ ఈ అమ్మడికి ఆ స్థాయి సక్సెస్ రాలేదు. ఇటీవల ‘RX100’ డైరెక్టర్తో చేసిన 'మంగళవారం' సినిమాతో పాయల్ తెలుగు ఆడియన్స్ను మరోమారు పలకరించింది. ఇందులో పాయల్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇదిలా ఉంటే ఇదిలా ఉంటే తాజాగా ఇండస్ట్రీలో తనకు వేధింపులు ఎదురవుతున్నాయంటూ ఆమె చేసిన ఓ పోస్టు.. అందరినీ షాక్కు గురిచేసింది. ప్రస్తుతం ఈ విషయం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది.
అసలు ఏ జరిగిందంటే!
2020లో 'రక్షణ' అనే చిత్రంలో పాయల్ రాజ్పుత్ నటించింది. అయితే ఈ సినిమా ఇప్పటివరకూ విడుదల కాలేదు. కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ప్రదీప్ ఠాకూర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని జూన్ 7న విడుదల చేయనున్నట్లు లేటెస్ట్గా మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ మూవీకి సంబంధించిన పారితోషికం ఇంతరవకూ తనకు చెల్లించలేదని పైగా ప్రమోషన్స్లో పాల్గొనాలని మేకర్స్ వేధింపులకు గురిచేస్తున్నారంటూ పాయల్ సంచలన ఆరోపణలు చేసింది.
‘చట్టపరమైన చర్యలు తీసుకుంటా’
‘రక్షణ’ మేకర్స్ వేధింపులపై నటి పాయల్ తన ఇన్స్టాగ్రామ్లో సుదీర్ఘమైన పోస్టు పెట్టింది. దీని ప్రకారం.. ‘చిత్రబృందం ఇప్పటివరకు నాకు పారితోషికం ఇవ్వలేదు. ఇటీవల నా సినిమాలు సక్సెస్ కావడంతో దానిని ఉపయోగించుకోవాలని మూవీ టీమ్ భావిస్తోంది. ఎలాంటి బకాయిలు చెల్లించకుండా ప్రమోషన్లకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. రాలేనని నా టీమ్ చెప్పినా వినడం లేదు. నన్ను తెలుగు సినిమా నుంచి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు. నా ప్రతిష్ఠకు భంగం కలిగేలా నా పేరును వాడుకుంటున్నారు. ఇటీవల జరిగిన కొన్ని మీటింగ్స్లో నాపై అభ్యంతరకరంగా మాట్లాడారు. పారితోషికం విషయం తేల్చకుండా.. నా అనుమతి లేకుండా సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. అందుకే నా టీమ్ ఆ చిత్రబృందంపై న్యాయపరమైన చర్చలు తీసుకునేందుకు సిద్ధమైంది’ అని పాయల్ తెలిపింది.
View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal)
పాయల్ బిజీ బిజీ
'మంగళవారం' మూవీ సక్సెస్తో పాయల్ ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేస్తోంది. తమిళంలో 'గోల్మాల్', 'ఏంజెల్' చిత్రాల్లో పాయల్ నటిస్తోంది. తెలుగులో 'కిరాతక' సినిమాలో చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. కాగా, విడుదల సిద్ధంగా ఉన్న ‘రక్షణ’ మూవీలో పాయల్ పోలీసు అధికారిణిగా కనిపించనుంది.
మే 20 , 2024
Mangalavaaram Teaser: బోల్డ్ సీన్లలో పాయల్ రాజ్పుత్ అరుపులు... ఈసారి గట్టిగానే ఉంటదంట!
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్లోడ్ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
జూలై 04 , 2023
Vijayapriya Nithyananda: ఐరాసలో నిత్యానంద తరఫున పాల్గొన్న ఈమె ఎవరో తెలుసా?
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్లోడ్ చేసుకోండి.Download Our App
మార్చి 02 , 2023
Payal Rajput: ఒంటిపై నూలు పోగు లేకుండా పాయల్ రాజ్పుత్… ‘మంగళవారం’ సినిమా కోసం అందాల తెగింపు
RX 100 కాంబో మళ్లీ రిపీట్ కాబోతుంది. ఈ సారి మరింత డోసు పెంచారు. “మంగళవారం” అనే టైటిల్ పెట్టి పాయల్ రాజ్పుత్ టాప్ లెస్ ఫోటోను విడుదల చేశారు. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో సినిమా రూపుదిద్దుకుంటుంది.
పాయల్ రాజ్పుత్ మెుదటి సినిమా నుంచే అందాల ఆరబోతతో హద్దుల్లేకుండా చెలరేగిపోతుంది. RX 100లో కార్తీకేయతో రొమాన్స్ చేసి యువతను ఆకర్షించింది ఈ అమ్మడు.
ఆ సినిమా తర్వాత RDX లవ్, అనగనగా ఓ అతిథి చిత్రాల్లో బోల్డ్ క్యారెక్టర్లో నటించింది పాయల్. అందచందాలు ప్రదర్శించి ఆకట్టుకోవాలని చూసింది.
సామాజిక మాధ్యమాల్లోనూ హాట్ఫొటోస్తో చెలరేగుతుంది పంజాబీ సుందరి. బాత్రూమ్లో కేవలం టవల్పై ఉన్న ఫొటోలను పోస్ట్ చేసి షేక్ చేసింది.
ఇటీవల ఆమె బాయ్ఫ్రెండ్తో కలిసి ఉన్న హాట్ పిక్స్ వైరల్ అయ్యాయి. ఇందులోనూ టాప్లెస్గా కనిపించింది పాయల్ రాజ్పుత్.
సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ కలిసి అలాంటి ఫోజులు ఇవ్వటంపై ట్రోల్స్ ఎదుర్కొంది ఈ హీరోయిన్.
జిన్నా సినిమాలోనూ అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గలేదు. వీలైనంత వరకు న్యాయం చేసేందుకు ప్రయత్నించింది.
మంగళవారం సినిమాలో మరోసారి బోల్డ్ క్యారెక్టర్లో నటిస్తుంది ఈ భామ. శైలజ అనే పాత్రలో టాప్లెస్గా చేతి వద్ద సీతాకోక చిలుక ఉన్నట్లు కనిపించే ఫస్ట్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
RX 100 తర్వాత పాయల్ రాజ్పుత్కు తెలుగులో మంచి హిట్ లేదు. అందాల విందు చేసినా ఆఫర్లు మాత్రం పెద్దగా రావటం లేదు.
ఆఫర్లు లేని కారణంగానే బోల్డ్ పాత్రల్లోనూ నటించేందుకు పాయల్ రాజ్పుత్ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
RX 100, మహా సముద్రం చిత్రాలు తీసిన దర్శకుడు అజయ్ భూపతి మంగళవారం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
మంగళవారం సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలం భాషల్లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
ఈ చిత్రానికి కాంతార, విరూపాక్ష సంగీత దర్శకుడు అజనీష్ లోక్నాథ్ స్వరాలు సమకూరుస్తున్నాడు.
అజయ్ భూపతి రిలీజ్ చేసిన ఈ లుక్పై ఆసక్తి నెలకొంది. వర్మ కాంపౌండ్ నుంచి వచ్చిన ఈ దర్శకుడు మెుదట్నుంచే విభిన్నమైన సినిమాలు తీస్తున్నాడు.
ఏప్రిల్ 25 , 2023
Salaar 2: ‘గేమ్స్ ఆఫ్ థ్రోన్స్’ను తలదన్నేలా ‘సలార్ 2’.. ప్రభాస్ షూట్లో పాల్గొనేది అప్పుడే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బాస్టర్ చిత్రం సలార్ పార్ట్ -1; సీజ్ ఫైర్' (Salaar: Part 1 Ceasefire). గతేడాది క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. నిర్మాతలపై కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీకి సీక్వెల్గా ‘సలార్ 2: శౌర్యంగ పర్వం’ (Salaar 2- Shouryanga Parvam) కూడా రానుందని తొలి పార్ట్ క్రైమాక్స్లోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్పష్టం చేశారు. దీంతో రెండో భాగంపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మెుదలవుతుందా అని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సలార్ 2’కి సంబంధించి ఒకేసారి రెండు అప్డేట్స్ బయటకు వచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
వరదరాజ మన్నార్ స్పెషల్ ఎపిసోడ్
'సలార్ 2' సినిమా షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతుందని నటుడు బాబీ సింహా ఇటీవల ఓ ఇంటర్యూలో ప్రకటించాడు. తాజాగా కేరళ నటుడు పృథ్వీరాజ్ సుకుమాన్ (Prithviraj Sukumaran) కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘటించాడు. సలార్లో ప్రభాస్ స్నేహితుడిగా వరద రాజమన్నార్ పాత్రలో పృథ్వీరాజ్ అదరగొట్టాడు. తాజాగా 'ది గోట్ లైఫ్' (The Goat Life) మూవీ ప్రమోషన్స్లో పాల్గొన్న పృథ్వీరాజ్ త్వరలోనే 'సలార్ 2' షూట్ మెుదలవుతుందని చెప్పాడు. ముందుగా వరదరాజమన్నార్ పాత్రకు సంబంధించి యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తారని స్పష్టం చేశాడు. అయితే ఈ స్పెషల్ ఎపిసోడ్లోనే వరదరాజ మన్నార్ గ్రాఫ్ చూపిస్తారని అంటున్నారు.
సెట్లోకి ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడంటే!
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)తో వరదరాజ మన్నార్ ఎపిసోడ్ పూర్తయ్యాక.. నటుడు బాబీ సింహా (Bobby Simha), శ్రియా రెడ్డి (Sriya Reddy), జగపతిబాబు (Jagapathi Babu)లపై కీలక సీన్స్ షూట్ చేస్తారని తెలుస్తోంది. ఈ రెండు షెడ్యూల్స్ పూర్తైన తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) సెట్లోకి అడుగుపెడతారని సమాచారం. ఈ మూవీ మూడో షెడ్యూల్ నుంచి ప్రభాస్ రెగ్యులర్ షూటింగ్లో పాల్గొంటారని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ 'సలార్ 2' స్క్రిప్ట్పై కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
గేమ్ ఆఫ్ థ్రోన్స్లా ‘సలార్ 2’..!
తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న ‘సలార్ 2’ నిర్మాత విజయ్ కిరగందూర్ సినిమాకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ తర్వాత నుంచి ఈ సినిమా పార్ట్-2 షూటింగ్ ప్రారంభించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 2025లో సినిమా రిలీజ్ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రముఖ హాలీవుడ్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లా సలార్ పార్ట్ 2 ఉండనుందని ఆయన తెలిపారు. నిర్మాత వ్యాఖ్యలతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ‘సలార్ 2’.. తొలి భాగానికి మించి విజయం సాధిస్తుందని ఆకాంక్షిస్తున్నారు.
ఫ్యూచర్ ప్రాజెక్ట్స్తో ప్రభాస్ బిజీ బిజీ..
ప్రస్తుతం ప్రభాస్.. ‘కల్కి’ (Kalki 2898 AD), ‘రాజా సాబ్’ (Raja Saab) చిత్రాల షూటింగ్తో తీరిక లేకుండా గడుపుతున్నాడు. మరోవైపు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ‘స్పిరిట్’ (Spirit)ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఇంత బిజీలో ప్రభాస్ ‘సలార్-2’కు ఎలా డేట్లు కేటాయించి వచ్చే ఏడాది సినిమా రిలీజయ్యేలా చూస్తాడో చూడాలి మరి.
మార్చి 12 , 2024
Prasanna Vadanam Review: నటుడిగా మరో మెట్టు ఎక్కేసిన సుహాస్.. ‘ప్రసన్న వదనం’ ఎలా ఉందంటే?
నటీనటులు: సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశీసింగ్, నందు, వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని తదితరులు
రచన, దర్శకత్వం: అర్జున్ వైకే
సంగీతం: విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫీ: ఎస్.చంద్రశేఖరన్
ఎడిటింగ్: కార్తిక్ శ్రీనివాస్ ఆర్
నిర్మాత: మణికంఠ జేఎస్, ప్రసాద్రెడ్డి టీఆర్
విడుదల తేదీ: 03-05-2024
సుహాస్ (Suhas) హీరోగా నటించిన లేటెస్ట్ థ్రిల్లింగ్ చిత్రం ‘ప్రసన్న వదనం’ (Prasanna Vadanam). అర్జున్ వై.కె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. జె.ఎస్ మణికంఠ, టి.ఆర్.ప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఫేస్ బ్లైండ్నెస్తో బాధపడే యువకుడిగా సుహాస్ ఇందులో నటించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. శుక్రవారం (మే 3) రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? సుహాస్కు మరో విజయాన్ని అందించిందా? ఈ రివ్యూ తెలుసుకుందాం.
కథేంటి
రేడియో జాకీగా పనిచేస్తున్న సూర్య (సుహాస్) జీవితాన్ని ఓ ప్రమాదం తలకిందులు చేస్తుంది. ఈ ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయి ఫేస్ బ్లైండ్నెస్ అనే సమస్య బారిన సూర్య పడతాడు. ముఖాలను, గొంతులను గుర్తుపట్టలేకపోతుంటాడు. అయితే ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడుతుంటాడు. ఒక రోజు సూర్య కళ్లెదుట ఓ యువతి హత్య జరుగుతుంది. అది ఎవరు చేశారో స్పష్టంగా చూడలేకపోయినా పోలీసులకు తెలియజేయాలని అనుకుంటాడు. ఏసీపీ వైదేహీ (రాశి సింగ్) వద్దకు వెళ్లి జరిగిందంతా చెబుతాడు. ఈ క్రమంలో సూర్యపై దాడి జరుగుతుంది. అనూహ్యంగా సూర్యనే ఈ హత్య కేసులో ఇరుక్కోవాల్సి వస్తుంది. ఇంతకీ ఆ హత్య ఎవరు చేశారు? ఆ కేసులో సూర్యని ఇరికించింది ఎవరు? సూర్య కేసు నుంచి బయటపడ్డాడా లేదా? పాయల్తో హీరో లవ్ స్టోరీ ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
హీరో సుహాస్ ఎప్పటిలాగే తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఫేస్ బ్లైండ్నెస్ ఉన్న వ్యక్తి పాత్రలో ఒదిగిపోయాడు. గత చిత్రాలతో పోలిస్తే నటన పరంగా సుహాస్ ఇంకాస్త మెరుగయ్యాడని చెప్పవచ్చు. పాత్రకు అవసరమైన చోట హాస్యాన్నీ, భావోద్వేగాల్ని పలికించి మెప్పించాడు. ఇక సుహాస్కు జోడీగా పాయల్ ఓకే అనిపించింది. వారి మధ్య వచ్చే సన్నివేశాలు సరదా సరదాగా సాగుతాయి. పోలీసు ఆఫీసర్గా రాశి సింగ్కు మంచి పాత్రే దక్కింది. ఆ రోల్కు ఆమె పూర్తిగా న్యాయం చేసింది. వైవాహర్ష స్నేహితుడిగా అలవాటైన పాత్రలో సందడి చేశాడు. నందు, సాయి శ్వేత పాత్రల పరిధి మేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
డిజార్డర్ ఉన్న హీరో పాత్రలను గతంలో చాలా సినిమాల్లో చూసినప్పటికీ దర్శకుడు అర్జున్ వైకే ఫేస్ బ్లైండ్నెస్ను కథాంశంగా తీసుకోవడం కొత్తగా అనిపించింది. మంచి మలుపులతో ప్రేక్షకులకు థ్రిల్ని పంచడంలోనూ దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కథానాయకుడి పాత్ర, దానికున్న సమస్యపై ప్రారంభంలోనే ప్రేక్షకులకు ఓ అవగాహన తీసుకొచ్చి తదుపరి సన్నివేశాలపై ఆసక్తి రగిలించాడు. హీరోకు స్నేహితుడి మధ్య వచ్చే సన్నివేశాలతో ఫస్టాఫ్ సరదాగా సాగిపోతుంది. విరామానికి ముందు వచ్చే అనూహ్య మలుపుతో కథ రసవత్తరంగా మారుతుంది. సెకండాఫ్ కీలక సమయాల్లో చోటు చేసుకునే మలుపులు, పతాక సన్నివేశాలతో సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చాడు దర్శకుడు. అయితే అక్కడక్కడ కథనం కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్లో డెప్త్ లేకపోవడం మైనస్గా చెప్పవచ్చు. అలాగే దర్శకుడు కథని నడిపించిన విధానం ఓ టెంప్లేట్లా అనిపిస్తుంది.
సాంకేతికంగా..
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు మెరుగైన పనితీరు కనబరిచాయి. ముఖ్యంగా చంద్రశేఖరన్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. విజయ్ బుల్గానిన్ అందించిన పాటలు కన్నా నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. కొన్ని సన్నివేశాలను BGM బాగా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. ఎక్కడ రాజీపడినట్లు కనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
సుహాస్ నటనమలుపులుసెకండాఫ్
మైనస్ పాయింట్స్
ప్రారంభ సీన్స్నెమ్మదిగా సాగే కథనం
Telugu.yousay.tv Rating : 3/5
మే 03 , 2024
బాలివుడ్ డైరెక్టర్పై రేప్ ఆరోపణలు..సౌత్ దర్శకులు,యాక్టర్లపై ప్రశంసలు కురిపించిన హీరోయిన్
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను రేప్ చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ పాయల్ ఘోష్. ఈ క్రమంలో దక్షిణాది చిత్ర పరిశ్రమపై ప్రేమను కురిపించింది. సౌత్లో అవార్డులు గెలుచుకున్న ఇద్దరు దర్శకులతో పనిచేసినప్పటకీ కనీసం వాళ్లు టచ్ కూడా చేయలేదంటూ వెల్లడించింది. జూనియర్ ఎన్టీఆర్తో నటించానని… ఒక్కరోజు కూడా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని.. అందుకే సౌత్ ఇండస్ట్రీ అంటే తనకిష్టమంటూ పేర్కొంది ఈ సుందరి. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
మూడో మీటింగ్లోనే
అనురాగ్ కశ్యప్ను టార్గెట్ చేసుకొని మీటూ వేదికగా విమర్శలు గుప్పించింది ఈ బెంగాల్ భామ. “ అసలు అతడితో కలిసి పనిచేయలేదు. కానీ, అతడు నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మూడో మీటింగ్లోనే ఇలా జరిగింది. ఇలాంటి వాళ్లకు ఇంకా బాలీవుడ్లో పని దొరుకుతుండటం బాధాకరం” అన్నారు. ఒక్కసారిగా సంచలన వ్యాఖ్యలతో ట్రెండింగ్లోకి వచ్చిన పాయల్ ఘోష్ ఎవరనే విషయాన్ని వెతుకుతున్నారు చాలామంది. తారక్తో ఏ సినిమాలో నటించిందని ఆలోచిస్తున్నారు.
ఎవరీ పాయల్
17 సంవత్సరాల వయసులోనే నటనలోకి అడుగుపెట్టింది పాయలో ఘోష్. షార్ప్స్ పెరిల్ అనే బీబీసీ టెలిఫిల్మ్లో నటించి మెప్పించింది. తర్వాత కెనడియన్ చిత్రంలోనూ చేసింది. సినిమాల్లోకి వెళ్లడం ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకపోవటంతో కళాశాలలో చదువుతున్నప్పుడే పారిపోయి ముంబయి వచ్చింది పాయల్. నమిత్ కిషోర్ అకాడమీలో నటనపై మెళుకువలు నేర్చుకుంది.
కశ్యపై కేసు
గతంలోనే అనురాగ్ కశ్యప్పై లైంగిక వేధింపుల కేసు పెట్టింది ఈ హీరోయిన్. 2013లో ముంబయిలోని యారీ రోడ్లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని 2022 సెప్టెంబర్ 23న పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటిి కశ్యప్ కొట్టి పారేశారు. పోలీసుల విచారణకు హాజరైన అతడు… ఆ సమయంలో శ్రీలంకలో షూటింగ్ చేస్తున్నట్లు ఆధారాలు కూడా సమర్పించాడు. కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నట్లు స్పష్టం చేశాడు.
తెలుగులోకి ఎంట్రీ
అకాడమీలో దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి పరిచయం కావటంతో ఆయన తెరకెక్కించిన ప్రయాణం చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. మంచు మనోజ్ ఇందులో హీరోగా నటించాడు. తర్వాత Mr. రాస్కెల్ సినిమాలో చేసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ఊసరవెళ్లి సినిమాలో తమన్నా స్నేహితురాలిగా మెరిసింది ముద్దుగుమ్మ.
రాజకీయ నాయకురాలు
ప్రస్తుత కేంద్రమంత్రి రామ్దాస్ అథవాలే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీలో 2020లో జాయిన్ అయ్యింది పాయల్. అదే రోజున మహిళల విభాగానికి ఉపాధ్యక్షురాలుగా నియమించారు. అప్పట్నుంచి రాజకీయాల్లో చాలా యాక్టీవ్గా ఉంటుంది ఈ అమ్మడు. ఇటీవల కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ ఇచ్చిన స్పీచ్పైన విమర్శలు చేసింది. విదేశాల్లో మన దేశం పరువు తీశాడని ఆరోపించింది.
సినిమాలు
ప్రస్తుతం రెండు సినిమాల్లో పాయల్ ఘోష్ నటిస్తుంది. పటేల్కి పంజాబ్ షాదీ, కోయి జానే నా అనే చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.
మార్చి 19 , 2023
Disha patani: మత్తెక్కించే అందాలతో రచ్చ చేసిన లోఫర్ బ్యూటీ!
బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ మరోమారు అందాల విందు చేసింది. తాజాగా ఎల్లె లిస్ట్ అవార్డు వేడుకల్లో పాల్గొన్న ఆమె మత్తెక్కించే పరువాలతో అందర్నీ కవ్వించింది.
క్లీన్ క్లీవేజ్ అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. అసలైన బోల్డ్నెస్కు తెరలేపి ఫ్యాన్స్ దృష్టిని తనవైపునకు తిప్పుకుంది.
దిశా పెట్టే బోల్డ్ ఫొటోలు ట్రెండింగ్లో నిలవడం గత కొంతకాలంగా కామన్ అయిపోయింది. ఈ భామ నుంచి పోస్టు వచ్చిందంటే ఇక తమకు పండగేనని నెటిజన్లు కేరింతలు కొడుతున్నారు.
మోడల్ అయిన దిశా పటాని ‘లోఫర్’ సినిమా ద్వారా టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో దిశా హోయలు చూసి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
లోఫర్ సినిమా తర్వాత బాలీవుడ్కు చెక్కేసిన ఈ భామ.. అక్కడ పలు హిట్ చిత్రాలు తీసి హిందీ ప్రేక్షకులను అలరించింది.
దిశా నటించిన ఎం.ఎస్ ధోని (M.S. Dhoni), భాగీ 2 (Baaghi 2), బాగీ 3 (Baaghi 3), రాధే వంటి చిత్రాలు మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి.
భాగీ సినిమా షూటింగ్ సమయంలో హీరో టైగర్ ష్రాఫ్తో దిశా ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. వారి ఇరువురి డేటింగ్ అంశం బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
అయితే టైగర్, దిశా రిలేషన్ ఎక్కువ కాలం నిలబడలేదు. ఏదో కారణాల వల్ల వారు బ్రేక్ చెప్పుకున్నట్లు అప్పట్లో బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.
ప్రస్తుతం ఈ భామ చేతిలో పలు భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన ‘యోధ’ చిత్రంలో దిశా హీరోయిన్గా చేసింది. ఈ మూవీ డిసెంబర్ 15న రిలీజ్ కాబోతోంది.
పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంలో దిశా కూడా నటిస్తోంది. అలాగే తమిళ హీరో సూర్య నటిస్తున్న ‘కంగువా’లో కూడా ఈ బ్యూటీ కీలక పాత్ర పోషిస్తోంది.
నవంబర్ 20 , 2023
Raai Laxmi: థండర్ థైస్ అందాలతో పంబ రేపుతున్న రాయ్ లక్ష్మి.. కుర్రకారుకు కనుల విందు!
హీరోయిన్ రాయ్ లక్ష్మి మరోసారి సోగసుల విందు చేసింది. మల్దీవ్స్లో వెకెషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అందాల తెగింపునకు పాల్పడింది.
థండర్ థైస్ అందాలతో కుర్రకారుకు కనువిందు చేసింది. వైట్ డ్రెస్లో అమ్మడి అందాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.
బోట్లో ప్రయాణిస్తూ డ్రింక్ స్విప్ చేస్తున్న రాయ్ లక్ష్మి.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంది.
ఇక రాయ్ లక్ష్మి థండస్ థైస్ అందాలకు పెద్దఎత్తున సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
ఈ హాట్ డాల్ ఎప్పుడు ఫోటోలు పెడుతుందా.. ఎప్పుడూ తమ కామెంట్లకు పనిచెప్పాలా అని ఉబలాటపడుతుంటారు.
3 పదుల వయసులోనూ తరగని అందంతో కుర్రకారు డ్రీమ్ గర్ల్గా మారింది రాయ్ లక్ష్మి. తెలుగులో కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో 15 ఏళ్ల క్రితమే తెరంగేట్రం చేసింది
తొలి చిత్రం నుంచే అందాల దాడి పెంచిన రాయ్ లక్ష్మి ఇండస్ట్రీలో గ్లామర్ డాల్గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత దక్షిణాది భాషల్లో బిజీగా మారి పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది.
సర్దార్ గబ్బర్ సింగ్, బలుపు, ఖైదీ నెంబర్ 150 సినిమాల్లో రాయ్ లక్ష్మి చేసిన ఐటెం సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
ఖైదీ 150 సినిమాలో చిరంజీవి సరసన ఐటెం సాంగ్లో నటించి ప్రేక్షకుల చేత ముద్దుగా రత్తాలుగా పిలిపించుకుంటోంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే రాయ్ లక్ష్మి... అందాల ఆరబోతకు కెరాఫ్ ఆడ్రస్గా నిలుస్తోంది.
ఇక సముద్రయానానికి వెళ్లిందంటే.. రాయ్ లక్ష్మి అందాల దాడిని ఎవరు ఆపలేరు. బికినీ అందాలను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేని రాత్రులను మిగుల్చుతుంది. సింగిల్ పీస్ ధరించి ఇచ్చే ఫోజులకు, ఆమె కళ్లు చెదిరే అందాలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఎప్పటికప్పుడూ తన అందాలకు మెరుగులు అద్దుతూ సరికొత్తగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది రాయ్ లక్ష్మి.
ఇక సినిమా ఈవెంట్లలో అమ్మడు ప్రదర్శించే అందాలకు కొలత కట్టడం అసాధ్యమే. ఆ రీతిలో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ ఎక్స్పోజింగ్.
ప్రస్తుతం రాయ్ లక్ష్మి తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉంటుంది. సోలో రోల్స్తో పాటు గ్లామర్కు అవకాశం ఉండే పాత్రలను సైతం ఇష్టంగా చేస్తోందీ సొగసుల సంచలనం.
అక్టోబర్ 23 , 2023
Mirna Menon: టాలీవుడ్లో మెరిసిన మరో అందాల తార.. మిర్నా మీనన్ హోయలకు ముగ్దులవుతున్న ప్రేక్షకులు..!
అల్లరి నరేష్ తాజాగా నటించిన ‘ఉగ్రం’ మూవీలో ‘మిర్నా మీనన్’ హీరోయిన్గా నటించింది. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ఈ భామ తన అందచందాలతో ఆకట్టుకుంది.
తమిళ చిత్రం ‘సంతానథెవన్’ చిత్రంతో మిర్నా మీనన్ సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అయితే చిన్న సినిమా కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు.
తన తర్వాతి చిత్రంలో ఏకంగా మోహన్ లాల్ పక్కనే ఛాన్స్ కొట్టేసింది ఈ భామ. బిగ్ బ్రదర్ చిత్రంలో ఆర్య శెట్టి పాత్రలో మిర్నా మెరిసింది
ఆది సాయికుమార్ హీరోగా గతేడాది వచ్చిన ‘క్రేజీ ఫెల్లో’ సినిమా ద్వారా మిర్నా మీనన్ టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. రెండో చిత్రం ఉగ్రం ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
ఉగ్రం సినిమాలో తన పాత్ర పూర్తి స్థాయిలో ఉంటుందని మిర్నా మీనన్ ఓ ఇంటర్యూలో చెప్పింది. నరేష్తో పాటే తన పాత్ర సాగుతుందని చెప్పుకొచ్చింది.
ఉగ్రంలో పాత్ర కోసం చాలా హోంవర్క్ చేసినట్లు ఈ ముద్దుగుమ్మ చెప్పింది. కాలేజీ అమ్మాయిగా, భార్యగా, తల్లిగా కనిపించేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపింది.
ఉగ్రం సినిమా షూటింగ్లో 75 రోజులు పాల్గొన్నట్లు నటి చెప్పింది. అయితే అందులో 55 రోజులు నైట్ షూట్లేనని వివరించింది.
కెరీర్ ఆరంభంలో ఇలాంటి పాత్ర చేయడమంటే ఏ నటికైనా సవాలేనని నటి చెప్పింది. ఆ సవాల్ను స్వీకరించి ఎంతో కష్టపడి చేసినట్లు చెప్పుకొచ్చింది.
ఉగ్రంలో నరేష్తో పాటు తాను కూడా రియల్ స్టంట్స్లో పాల్గొన్నట్లు ఈ భామ తెలిపింది. ట్రైలర్లో చూపించిన కారు ప్రమాదం రియల్ స్టంట్లో భాగమేనని స్పష్టం చేసింది.
కారు స్టంట్ చేస్తున్నపుడు నరేష్కు గాయమైందని మిర్నా మీనన్ తెలిపింది. ఆ సమయంలో తాను కూడా కింద పడిపోయినట్లు చెప్పుకొచ్చింది.
మే 03 , 2023
Jr NTR తీరులో మార్పు.. హిందీ స్టార్లతో కలిసి నైట్ డేట్!
యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ (Jr NTR).. ప్రస్తుతం బాలీవుడ్ (Bollywood)లో బిజీ బిజీగా ఉన్నాడు. ముంబయిలో ‘వార్ 2’ చిత్ర షూటింగ్లో పాల్గొంటూ తీరిక లేకుండా గడుపుతున్నాడు. తారక్ పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాలను దర్శకుడు అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ముంబయిలోనే ఉన్న తారక్.. నిన్న రాత్రి బాలీవుడ్ స్టార్ హీరోలతో హల్చల్ చేశాడు. వారితో కలిసి డిన్నర్కు వెళ్లిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ కల్చర్లోకి తారక్!
నైటౌట్లు, డిన్నర్ పార్టీలకు దూరంగా ఉండే తారక్.. ముంబయిలో ఈ నియమానికి చెక్ పెట్టినట్లు ఉన్నాడు. ఆదివారం రాత్రి.. తారక్ పూర్తిగా బాలీవుడ్ కల్చర్లోకి మారిపోయాడు. హిందీ స్టార్లు రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt), వార్-2 హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan), సబా ఆజాద్ (Sabha Ajad), కరణ్ జోహార్ (Karan Johar)లతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ డిన్నర్కు వెళ్లాడు. తారక్తో పాటు అతడి భార్య ప్రణతి కూడా ఈ పార్టీలో పాల్గొంది. స్టార్ హీరోలందర్నీ ఒక్కసారిగా బయట చూసి ముంబయి ఫొటోగ్రాఫర్లు, కెమెరామెన్లు ఎగబడ్డారు. వారిని తమ కెమెరాల్లో బందించేందుకు ప్రయత్నించారు. అటు స్థానికులు సైతం తారక్తో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
https://twitter.com/i/status/1784800640054784018
https://twitter.com/i/status/1784782516681073070
https://twitter.com/i/status/1784737249713619077
https://twitter.com/i/status/1784857172771279114
60 రోజుల కాల్ షీట్స్!
వార్ 2 చిత్రంలో హృతిక్ రోషన్, తారక్ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూట్ కోసం తారక్ 60 రోజులు కేటాయించినట్లు సమాచారం. కాగా, అంతకుముందు వచ్చిన వార్ చిత్రంలో హృతిక్తో పాటు మరో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ నటించాడు. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ఆ సినిమాకు మించి ‘వార్ 2’ ఉండబోతున్నట్లు బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇందులో తారక్ పాత్ర ఎలా ఉండబోతుందన్న దానిపై ఎలాంటి స్పష్టత లేదు. కానీ, తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రా ఏజెంట్ పాత్రలో కనిపిస్తాడని బయట రూమర్లు ఉన్నాయి.
తారక్ సీరియస్
ఇటీవల ముంబయిలోని ఓ హోటల్లో బస చేసేందుకు తారక్ వెళ్తుండగా బాలీవుడ్ ఫొటోగ్రాఫర్లు అతడ్ని చుట్టుముట్టారు. ఎటువంటి అనుమతి లేకుండా కెమెరాల్లో తారక్ను బందించబోయారు. దీంతో తారక్కు కోపం చిర్రెత్తుకొచ్చింది. ‘ఓయ్..’ అంటూ ఒక్కసారిగా ఫొటోగ్రాఫర్లపై కసురుకున్నాడు. ఆ సమయంలో తారక్.. షార్ట్ హెయిర్తో వైట్ షర్ట్ కళ్లద్దాలు ధరించి ఉన్నాడు. అయితే ‘వార్ 2’లో తన లుక్ను రివీల్ చేయకుండా తారక్ జాగ్రత్తపడుతున్నాడు. అయినప్పటికీ ఆయనకు సంబంధించిన ఫొటోలు తరచూ బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తారక్ కెమెరాలకు చిక్కకుండా త్వరగా హోటల్లోకి వెళ్తుండగా వెంటపడి మరి ఫొటోలు తీయడంతో తారక్కు కోపం వచ్చింది.
https://twitter.com/i/status/1783491705049886808
ఏప్రిల్ 29 , 2024
Medha Shankar: హద్దులు చెరిపేసిన ‘12th ఫెయిల్’ భామ.. ఎద అందాలతో దిమ్మతిరిగే ట్రీట్!
బాలీవుడ్ బ్యూటీ మేధా శంకర్ (Medha Shankar).. తన అందచందాలతో సోషల్ మీడియాను అట్రాక్ట్ చేసింది. ఎద సంపదను ప్రదర్శిస్తూ నెటిజన్లను కవ్వించింది.
తాజాగా ‘జీ సినిమా అవార్డ్స్’లో పాల్గొన్న ఈ బ్యూటీ.. సిల్వర్ కలర్ పొట్టి గౌనులో తళుక్కుముంది. అక్కడ ‘12th ఫెయిల్’ చిత్రానికి గానూ ఉత్తమ అరంగేట్ర నటిగా అవార్డు అందుకుంది.
అనంతరం ఆ పొట్టి డ్రెస్లోనే ఫొటో షూట్ నిర్వహించిన మేధా.. అందాల ప్రదర్శనలో హద్దులు చెరిపేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫ్యాన్స్కు హాట్ ట్రీట్ ఇచ్చింది.
గ్లామర్ ఫొటోలను మేధా తన ఇన్స్టా ఖాతాలో స్వయంగా పోస్టు చేయడంతో అవి కాస్త వైరల్గా మారాయి. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ కాగల క్వాలిటీస్ నీలో ఉన్నాయంటూ నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు.
ఇటీవల హిందీలో తెరకెక్కిన '12th ఫెయిల్' (12th Fail) చిత్రంతో మేధా రాత్రికి రాత్రే స్టార్గా మారిపోయింది. రోజు రోజుకూ నెట్టింట ఆమె ఫాలోయింగ్ పెరిగిపోతోంది. ఈ చిత్రంలో ఆమె నటనపై ప్రశంసల వర్షం కురిసింది.
నోయిడాలో పుట్టిన ఈ భామ (Medha Shankar).. ఫ్యాషన్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. అనంతరం మోడల్గా కెరీర్ ప్రారంభించింది.
ఎఫ్బీబీ నిర్వహించిన ఫెమినా మిస్ ఇండియా (2016) పోటీల్లో పాల్గొని మేధా అందరి దృష్టిని ఆకర్షించింది. పోటీల్లో రాణించి అందరి ప్రశంసలు అందుకుంది.
మోడలింగ్లోనే కాకుండా సంగీతంపైనా మేధా (Medha Shankar)కు పట్టు ఉంది. సితార్, హార్మోనియం, కీబోర్డు ప్లే వంటి వాటిల్లో ఆమె శిక్షణ కూడా తీసుకుంది.
నటనపై మక్కువతో నోయిడా నుంచి ముంబయికి మకాం మార్చిన మేధా.. 'విత్ యు ఫర్ యు ఆల్వేజ్' అనే షార్ట్ ఫిల్మ్తో నటిగా మారింది.
ఆ తర్వాత హిందీ వెబ్సిరీస్లలో నటించే ఆవకాశాన్ని దక్కించుకుంది. బీకమ్ హౌజ్ (2019), దిల్ బేకరార్ (2021) సిరీస్లలో కీలక పాత్రలు పోషించి బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది.
ఆ తర్వాత 'శాదీస్తాన్' (2021) సినిమాతో మేధా బాలీవుడ్లోకి రంగ ప్రవేశం చేసింది. సంగీతం ఇతివృత్తంగా రూపొందిన ఈ చిత్రంలో అర్షి మోదీ పాత్రలో ఆమె ఆకట్టుకుంది.
2022లో వచ్చిన 'మ్యాక్స్, మిన్ అండ్ మ్యూజికీ'లో భాయ్ఫ్రెండ్ను త్యాగం చేసే అమ్మాయిగా యువతను మెప్పించింది.
ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శితం కావడంతో మేధా శంకర్ పేరు ప్రముఖంగా బాలీవుడ్లో వినిపించింది.
మూడో సినిమా '12th ఫెయిల్'తో శ్రద్ధా జోషిగా ఒదిగిపోయి విశేష క్రేజ్ సంపాదించుకుంది మేధా. అందులోని 'బోలో నా' పాటను స్వయంగా ఆమె పాడటం విశేషం.
‘12th ఫెయిల్’ విడుదలకు ముందు 16వేల మంది ఫాలోవర్స్ను కలిగి ఉన్న ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రస్తుతం 20 లక్షలకు చేరుకుంది.
సోషల్మీడియా మేధా క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో చెప్పడానికి దీనికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రస్తుతం షేర్ చేస్తున్న ఫొటోలకు లక్షల్లో లైక్స్, వేలల్లో కామెంట్లు వస్తున్నాయి.
మార్చి 13 , 2024