ఇంగ్లీష్లో చదవండి
మూవీ & ఓటీటీ అప్డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Primeఫ్రమ్
Watch
స్ట్రీమింగ్ ఆన్Youtube
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
అట్టకత్తి దినేష్
మియా జార్జ్
నివేదా పేతురాజ్
దేవ్ రామ్నాథ్
రిత్విక
లింగేష్
కరుణాకరన్
రమేష్ తిలక్
బాల శరవణన్
నాగినీడు
చార్లీ
ఉషా ఎలిజబెత్
విశాలిని
మునిష్కాంత్
స్వామినాథన్
ఇ. రాందాస్
ప్రదీప్ కె విజయన్
సిబ్బంది
నెల్సన్ వెంకటేశన్
దర్శకుడుజె. సెల్వకుమార్నిర్మాత
జస్టిన్ ప్రభాకరన్
సంగీతకారుడువి జె సాబు జోసెఫ్
ఎడిటర్ర్కథనాలు
HBD Ram Charan: ‘రామ్చరణ్’కు బాల్యంలో చిరు ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాడో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్చరణ్ (Ram Charan).. టాలీవుడ్ (Tollywood)లో తనకంటూ ప్రత్యేక స్టార్డమ్ను సంపాదించుకున్నాడు. చిరుత (Chirutha)తో తెరంగేట్రం చేసిన చరణ్.. రెండో సినిమా 'మగధీర' (Magadheera) ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. రంగస్థలం (Rangasthalam)తో నటుడిగా తనకు తిరుగులేదని నిరూపించిన అతడు.. 'ఆర్ఆర్ఆర్' (RRR) గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. ఇవాళ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన బాల్యానికి సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
రామ్చరణ్కు చిన్నప్పుడు సిగ్గు చాలా ఎక్కువట. ఇంట్లో నిర్వహించే వేడుకల్లో అసలు పాల్గొనేవాడే కాదట. అల్లు అర్జున్ (Allu Arjun), శిరీష్ (Allu Sirish) డ్యాన్స్ వేస్తుంటే చూస్తూ కేరింతలు కొడుతూ ఉండేవట.
ప్రస్తుతం రామ్చరణ్ ఈ స్థాయిలో డ్యాన్స్ వేయడానికి చిరు నుంచి వచ్చిన నైపుణ్యమే కారణమట. చరణ్ ఇప్పటివరకూ ఎలాంటి డ్యాన్స్ కోచింగ్ తీసుకోలేదట. చెర్రీ నటనలో మాత్రమే శిక్షణ తీసుకున్నారు. శిక్షణ అవసరం లేకుండానే అతడు డ్యాన్స్పై పట్టు సాధించడం విశేషం.
రామ్చరణ్కు బాల్యంలో సినిమాలపై ఆసక్తి ఉండేది కాదట. అందుకు మెగాస్టార్ చిరంజీవి ఓ కారణంగా చెప్పవ్చచు. ఎందుకంటే చరణ్పై సినిమాల ప్రభావం పడకుండా చిరు జాగ్రత్తపడే వారట.
చరణ్కు చదువుపై శ్రద్ధ పెరిగేందుకు సినిమా పోస్టర్లు కూడా ఇంట్లో ఉండనిచ్చేవారు కాదట . పదో తరగతి పూర్తయ్యాకే.. కొడుక్కి కొంచెం ‘సినీ ఫ్రీడమ్’ ఇచ్చారు చిరు.
చరణ్ చదువు విషయానికొస్తే.. అతడు యావరేజ్ స్టూడెంట్. ఏ స్కూల్లో చేరినా రెండేళ్లకంటే ఎక్కువ ఉండేవారు కాదట.
రామ్చరణ్ తన బాల్యం నుంచి టీనేజ్ వరకూ తరచూ స్కూల్స్ కాలేజీలు మారాల్సి వచ్చిందట. ఇప్పటివరకూ చెర్రీ.. 8 స్కూల్స్, 3 కాలేజీలు మారినట్లు సమాచారం. అయితే చదువు కంటే ఆటలంటేనే చెర్రీకి బాగా ఇష్టమట.
నాలుగో తరగతి చదివే సమయంలోనే గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. హార్స్ రైడింగ్లో ఆయనకు ఎంత ప్రావీణ్యం ఉందో ‘మగధీర’లోని సన్నివేశాలే తెలియజేస్తాయి.
సినిమాల విషయంలో చిరు ఎంత స్ట్రిక్ట్గా ఉండేవారో బైక్ విషయంలోనూ అంతేనట. అందుకే చరణ్ బైక్ రైడింగ్ చేస్తానంటే చిరు ఎంకరేజ్ చేసేవారు కాదట.
రామ్చరణ్కు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. బంధువుల, స్నేహితుల పుట్టిన రోజు, పెళ్లి రోజులకు వాటినే కానుకగా ఇస్తుంటారు.
రామ్చరణ్ ప్రతీ ఏటా ఏదోక మాలధారణలో కనిపిస్తూనే ఉంటారు. దానికి ఓ బలమైన కారణమే ఉంది. ప్రశాంతత లభిస్తుందని, క్రమశిక్షణ అలవడుతుందనే ఉద్దేశంతోనే దీక్ష చేపడుతుంటానని ఓ సందర్భంలో తెలిపారు.
అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలు ఉపాసన (Upasana)తో 2012లో చరణ్ వివాహమైంది. వీరి పాప పేరు క్లీంకార. సేవా కార్యక్రమాల్లోనూ ఈ నటుడు ముందుంటారు.
తన సినిమాలు చూశాక మెగాస్టార్ చిరంజీవి చేసే కామెంట్స్ తనకు ఎంతో ముఖ్యమైనవని చరణ్ తెలిపాడు. డ్యాన్స్ బాగుందనో, ఫైట్లు బాగా చేశాననో చిరు చెప్పేవారట.
ధ్రువ చూసిన తర్వాత కథకు పాత్రకు బాగా న్యాయం చేశావంటూ చిరు మెచ్చుకున్నారట. రంగస్థలం సినిమా చూస్తూ తన తల్లి భావోద్వేగానికి గురైనట్లు రామ్చరణ్ తెలిపారు. ఈ రెండూ తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని క్షణాలు అని చరణ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
రామ్చరణ్ ఇప్పటివరకూ.. ‘చిరుత’, ‘మగధీర’, ‘ఆరెంజ్’, ‘రచ్చ’, ‘గోవిందుడు అందరివాడేలే’, ‘ధృవ’, ‘రంగస్థలం’, ‘ఆర్ఆర్ఆర్’.. ఇలా 14 విభిన్న కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు.
ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)తో బిజీగా ఉన్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో ఓ చిత్రం (#RC16) కూడా రామ్చరణ్ చేయబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇందులో చరణ్కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తోంది.
రామ్చరణ్.. మరో కొత్త సినిమాను కూడా ఇటీవల అధికారికంగా ప్రకటించాడు. డైరెక్టర్ సుకుమార్తో ‘RC17’ చిత్రంలో చరణ్ నటించనున్నాడు. ‘రంగస్థలం’ లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత వీరు మళ్లీ సినిమా చేస్తుండటంతో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
మార్చి 27 , 2024
Naresh Weds Pavithra: పెళ్లి చేసుకున్న నరేశ్, పవిత్ర… హనీమూన్ ఎక్కడ అంటే?
టాలీవుడ్ నటులు నరేశ్, పవిత్ర వివాహబంధంలోకి అడుగుపెట్టారు. కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజులుగా సహజీవనం చేస్తున్న వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని కొద్దిరోజుల తర్వాత స్వయంగా వెల్లడించారు నరేశ్.
ఆశీస్సులు కోరుకుంటూ..
“మా నూతన ప్రయాణానికి ఆశీస్సులు కోరుతున్నా. ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్లు, ఏడడుగులు మీ ఆశీస్సులు కోరుకుంటూ పవిత్రా నరేశ్ ” అని వీడియో పెట్టారు.
https://twitter.com/i/status/1634070240366850049
హనీమూన్ ఎక్కడంటే?
వివాహం జరిగిన వెంటనే దుబాయ్ వెళ్లిందీ ఈ కొత్త జంట. అక్కడ పర్యాటక ప్రదేశాలు సందర్శిస్తూ హనీమూన్ను ఎంజాయ్ చేస్తున్నారు. చెట్టాపట్టాలు వేసుకుని దుబాయి మొత్తం కలియతిరుగుతున్నారు.
శుభాకాంక్షలు
నరేశ్, పవిత్ర జంటకు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కలకాలం ఇలాగే కలిసి ఉండాలని ఫ్యాన్స్ ఆశీర్వదిస్తున్నారు. మరికొందరూ ఈసారైన విడాకులు ఇవ్వకుండా జీవితాంతం పవిత్రతో కలిసి ఉండాలని సూచిస్తున్నారు.
ఆయనకి 3 ఆమెకి 2
ఇప్పటికే నరేశ్కు మూడుసార్లు పెళ్లి అయ్యింది. పవిత్రతో ఆయనకు నాలుగో వివాహం. పవిత్రకి కూడా ఇది రెండో పెళ్లి. పవిత్ర మొదటి భర్త పేరు సుచేంద్ర. ఆయన కన్నడ సీరియళ్లలో నటించాడు.
కొద్దిరోజులుగా సహజీవనం
భార్యతో విడిపోయిన తర్వాత నుంచి నరేశ్, పవిత్ర మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి కొద్దిరోజులుగా కలిసే ఉంటున్నారు.
ముద్దుతో ప్రకటన
కొత్త సంవత్సరం రోజున పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించారు ఈ జంట. అదర చుంబనంతో వీడియో విడుదల చేసి అందరికి షాకిచ్చారు.
https://twitter.com/i/status/1609067421507407873
మా ఎన్నికలే సాక్ష్యం
మా అసోసియేషన్ ఎన్నికల వేళ నరేశ్కు మద్దతుగా ప్రచారం చేసింది పవిత్ర. విజయం తర్వాత ఆయన ఐ లవ్యూ పవిత్ర అంటూ కృతజ్ఞతలు తెలిపారు.
కలిసి నటించిన సినిమాలు
వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. లక్ష్మి రావే మా ఇంటికి, మిడిల్ క్లాస్ అబ్బాయ్, సమ్మోహనం, హ్యపీ వెడ్డింగ్, ఎంత మంచివాడవురా, అంటే సుందరానికిలో నటనతో మెప్పించారు.
రమ్య రఘుపతి
నరేశ్, పవిత్రలు ఒకే హోటల్లో ఉన్నప్పుడు రమ్య అక్కడ రచ్చరచ్చ చేసింది. వారిద్దరికి పెళ్లి జరగనివ్వకుండా అడ్డుకుంటానని విమర్శలు చేసింది రమ్య.
ఫిర్యాదుల వెల్లువ
నరేశ్, రమ్యల వివాదం పోలీస్ స్టేష్కు చేరింది. తనని చంపేందుకు కుట్ర పన్నారంటూ ఆమెపై ఫిర్యాదు చేశాడు నరేశ్.
మార్చి 10 , 2023
Sasimadhanam Review: పేరెంట్స్ లేరని లవర్ ఇంటికెళ్లి ఇరుక్కుపోతే.. ఆ తర్వాత ఏం జరిగింది?
నటీనటులు: పవన్ సిద్ధు, సోనియా సింగ్, రూపలక్ష్మి, ప్రదీప్ రాపర్తి, కృతిక, అశోక్ చంద్ర
దర్శకులు: వినోద్ గాలి
సంగీత దర్శకుడు: సింజిత్ యెర్రమిల్లి
సినిమాటోగ్రఫీ: రెహాన్ షేక్
ఎడిటర్ : అనిల్ కుమార్ పి
నిర్మాతలు : హరీష్ కోహిర్కర్
విడుదల తేదీ : జులై 4, 2024
ఓటీటీ వేదిక : ఈటీవీ విన్
రొమాంటిక్ లవ్ డ్రామాగా రూపొందిన తెలుగు లేటెస్ట్ వెబ్సిరీస్ ‘శశి మథనం’ (Sasimadhanam Web Series). ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్ (ETV Win) వేదికగా జులై 4 నుంచి స్ట్రీమింగ్లోకి వచ్చింది. ఇందులో పవన్ సిద్ధు, సోనియా ప్రధాన పాత్రలు పోషించారు. వీరిద్దరు ఇప్పటికే పలు షార్ట్ ఫిల్మ్స్లో జంటగా చేసి పాపులర్ అయ్యారు. ఇద్దరూ రిలేషన్లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చిన 'శశిమథనం' సిరీస్ ఎలా ఉంది? వీరి కెమెస్ట్రీ ఏ మేరకు ఆకట్టుకుంది? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
వరంగల్కు చెందిన మదన్ (సిద్ధూ పవన్).. అన్నయ్య ఫ్యామిలీతో ఉంటూ.. ఈజీ మనీ కోసం బెట్టింగ్స్ వేస్తుంటాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్కు చెందిన శశి (సోనియా సింగ్)తో ప్రేమలో పడతాడు. బెట్టింగ్లో పెద్ద మెుత్తంలో డబ్బు పోగొట్టుకోవడంతో మదన్ చిక్కుల్లో పడతాడు. మరోవైపు శశి ఇంట్లో వారంతా పది రోజులు పెళ్లి కోసం వెళ్తున్నారని తెలిసి.. ఆమె ఇంటికి వెళ్తాడు. శశి ఇంటికి మదన్ వెళ్లిన రాత్రే పెళ్లి క్యాన్సిల్ అయిందని ఆమె ఇంట్లో వాళ్లు తిరిగివస్తారు. అప్పటినుంచి శశి ఫ్యామిలీకి కనబడకుండా మదన్ ఎలా మ్యానేజ్ చేశాడు? ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? శశికి పెళ్లి చూపులు జరిగితే ఎలా చెడగొట్టాడు? శశి-మదన్ పెళ్లికి ఆమె ఇంట్లో వారు ఒప్పుకున్నారా? లేదా? అన్నది ఈ సిరీస్ కథ.
ఎవరెలా చేశారంటే
సోనియా సింగ్, సిద్ధూ పవన్ నటన.. ఈ సిరీస్కు అతిపెద్ద ప్లస్గా మారింది. నిజ జీవితంలోనూ ప్రేమ జంట కావడంతో ఈ సిరీస్లో వీరి కెమెస్ట్రీ అద్భుతంగా పండింది. ఇద్దరూ క్యూట్గా నటించి మెప్పించారు. శశి తండ్రిగా నటించిన ప్రదీప్ తన కామెడీ టైమింగ్తో అదరగొట్టారు.. తాత పాత్రలో నటించిన అశోక్ చంద్ర కూడా నవ్విస్తూనే ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చారు. సిద్ధూ అన్నయ్య పాత్రలో కేశవ్ దీపక్ మెప్పించాడు. రంగమ్మత్త పాత్రలో సీనియర్ నటి రూప లక్ష్మి అదరగొట్టారు. అవంతి దీపక్, శ్రీలలిత, వెంకటేష్, కృతిక రాయ్, కిరీటి.. మిగిలిన నటీనటులు తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే..
బోల్డ్, సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్సిరీస్లకు భిన్నంగా ఓ క్యూట్ లవ్స్టోరీ సిరీస్ తెరకెక్కించడంలో దర్శకుడు వినోద్ గాలి సక్సెస్ అయ్యారు. రొటీన్ స్టోరీనే కథాంశంగా ఎంచుకున్నప్పటికీ ఎక్కడా బోర్ కొట్టకుండా జాగ్రత్తపడ్డారు. హీరోయిన్ ఇంట్లో హీరో ఇరుక్కుపోవడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందా? అన్న క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో రగిలించాడు. ఇంట్లో వాళ్ల కంట పడకుండా మదన్ పడే కష్టాలు, అతడికి సాయం చేసే క్రమంలో శశి పడే టెన్షన్ నవ్వులు పూయిస్తాయి. అయితే కొన్ని సీన్స్ ఎక్కడో చూసిన భావన కలగడం మైనస్గా చెప్పవచ్చు. పైగా సిరీస్ మెుత్తం ఒకే ఇంట్లో తిరగడం వల్ల విజువల్ పరంగా రిఫ్రెష్మెంట్ ఫీల్ కలగదు. స్క్రీన్ప్లే ఇంకాస్త మెరుగ్గా ఉండుంటే బాగుండేది. కథలో రెండో లవ్ ట్రాక్కు సంబంధించిన అంశం బాగున్నప్పటికీ.. అది మెయిన్ కథకు చాలా వరకు డ్యామేజ్ చేసింది. డైలాగ్స్ విషయంలోనూ దర్శకుడు కాస్త జాగ్రత్త పడి ఉండాల్సింది.
సాంకేతికంగా..
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. సింజిత్ యెర్రమిల్లి అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా సిరీస్లోని రెండు పాటలు ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. లవ్ స్టోరీకి తగ్గట్టు విజువల్స్ ఫ్రెష్గా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
సిద్ధూ, సోనియా నటనకన్ఫ్యూజన్ కామెడీసంగీతం
మైనస్ పాయింట్స్
రొటీన్ స్టోరీసెకండ్ లవ్ ట్రాక్కొన్ని బోరింగ్ సీన్స్
Telugu.yousay.tv Rating : 2.5/5
జూలై 04 , 2024
Shanmukh Jaswanth: ‘షణ్ముఖ్’ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన ఫ్రెండ్స్.. ఎలాంటి వాడంటే?
యూట్యూబర్, బిగ్బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి తీసుకుంటూ గురువారం పోలీసులకు పట్టబడ్డ విషయం తెలిసిందే. షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ తనను మోసం చేశాడంటూ డాక్టర్ మౌనిక అనే యువతి పెట్టిన కేసును విచారించేందుకు వెళ్లిన పోలీసులకు ఫ్లాటులో షన్ను కనిపించాడు. అతడు గంజాయి తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో సోదరుడు సంపత్తో పాటు షణ్ముఖ్ను పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. అతడికి వైద్య పరీక్షలు చేయించగా బాడీలో గంజాయి ఆనవాళ్లు గుర్తించినట్లు ఫోరెన్సిక్ వైద్యులు సైతం నివేదిక ఇచ్చారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి షణ్ముఖ్ స్నేహితులు సంచలన విషయాలు బయటపెట్టారు. షణ్ముఖ్, అతడి సోదరుడు ఎలాంటి వారో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు.
‘గంజాయి తీసుకుంది నిజమే’
యాంకర్ ధనుష్.. షణ్ముఖ్ జస్వంత్ అరెస్టు వెనుక అసలు నిజాలను అతడి ఫ్రెండ్స్ను అడిగి తెలుసుకున్నట్లు చెప్పాడు. బిగ్బాస్ ఫేమ్ గలాటా గీతు యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆ విషయాలను అతడు పంచుకున్నాడు. షన్ను గంజాయి తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన మాట వాస్తవమేనని అతడి ఫ్రెండ్స్ కూడా ఒప్పుకున్నట్లు ధనుష్ చెప్పాడు. అయితే వార్తల్లో వస్తున్నట్లుగా డ్రగ్స్, కొకైన్, ఇతర డ్రగ్ పిల్స్ కానీ అతడి వద్ద లభించలేదని స్పష్టం చేశాడు. 16 గ్రాములు గంజాయి మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం కేసు కొనసాగుతున్నందున మరిన్ని విషయాలు పంచుకునేందుకు షన్ను స్నేహితులు వెనకాడినట్లు ధనుష్ చెప్పుకొచ్చాడు.
ఆ వార్తలు అవాస్తవం : గీతూ
అదే యూట్యూబ్ వీడియోలో గీతూ రాయల్ మాట్లాడారు. షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ మరొకర్ని పెళ్లి చేసుకున్నాడని, లివింగ్ రిలేషన్లో ఉన్నాడని వస్తోన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. వాస్తవానికి 2021లోనే వినయ్కు.. అతడిపై ఫిర్యాదు చేసిన మౌనికకు ఎంగేజ్మెంట్ జరిగినట్లు గీతూ చెప్పారు. అప్పట్లోనే పెళ్లి అంటూ మౌనిక తనతో చెప్పిందని పేర్కొన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల సంపత్ - మౌనికల పెళ్లికి గ్యాప్ వచ్చిందని.. ఈ నెల 28న పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారని వివరించారు. ఈ క్రమంలోనే మౌనిక.. వినయ్ స్నేహితుల్లో ఒకరికి ఫోన్ చేసిందని తెలిపారు. వినయ్ ఇంకో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు స్నేహితుడు చెప్పడంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిందని గీతూ వెల్లడించారు.
‘అలా చేయడం సరికాదు’
ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకుని.. ఇప్పుడు మరో పెళ్లి ఆలోచన చేయడం ఏంటో తనకు అర్థం కావడం లేదని గీతూ రాయల్ అన్నారు. సమస్య ఉంటే ఇద్దరు మాట్లాడుకుని విడిపోవాలి కానీ ఇలా చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. తనకు మౌనిక కొన్ని సంవత్సరాలుగా తెలుసని ఆమె చాలా సున్నిత మనస్కురాలని గీతు చెప్పుకొచ్చారు. వినయ్కు పెళ్లి అయితే కాలేదని, కానీ లివింగ్ రిలేషన్ షిప్లో ఉన్నట్లు అనిపిస్తోందని గీతూ పేర్కొన్నారు. ఇది ఏమైనా ఈ సమస్యను ఇద్దరూ సామరస్యంగా పరిష్కరించుకొని ఉంటే బాగుండేదని గీతూ అభిప్రాయపడ్డారు.
మౌనిక చేసిన ఆరోపణలు ఇవే!
బాధిత యువతి మౌనిక(Mounika).. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అన్న సంపంత్తో పాటు షణ్ముఖ్పైనా సంచలన ఆరోపణలు చేసింది. యూట్యూబ్లో అవకాశం ఇస్తానని చెప్పి షణ్ముఖ్ తనను మోసం చేశాడని తెలిపింది. మరోవైపు సంపత్ తనను హోటల్స్, విల్లాలకు తీసుకెళ్లి లైంగిక దాడి చేసినట్లు ఆరోపించింది. ఈ క్రమంలో తాను గర్భవతిని కాగా, సంపత్ భయపెట్టి అబార్షన్ కూడా చేయించాడని పేర్కొంది. తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ఓ రింగ్ తొడిగి నిశ్చితార్థం అయిపోయిందని చెప్పాడని వివరించింది. అటు షణ్ముఖ్ దగ్గర గంజాయి, డ్రగ్స్ పిల్స్ ఉన్నాయని మౌనిక ఆరోపించింది. తన దగ్గర వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పింది. ఓ కానిస్టేబుల్ షణ్ముఖ్కు సాయపడాలని చూశాడని ఆమె ఆరోపించింది. తనకు ప్రాణ భయం ఉందని.. రక్షణ కల్పించాలంటూ మౌనిక పోలీసులను వేడుకుంది.
షణ్ముఖ్కు ఇది తొలిసారి కాదు!
షణ్ముఖ్ అరెస్టు కావడం ఇది మొదటి సారి కాదు. గతంలో హిట్ అండ్ రన్ కేసులో షణ్ముఖ్ను పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు మద్యం సేవించి లేకపోవడంతో ఆ కేసు నుండి షణ్ముఖ్ త్వరగానే బయపడగలిగాడు. అయితే తనపై పడ్డ మచ్చను తుడిపేసుకోవాలన్న లక్ష్యంతో షణ్ముఖ్ బిగ్బాస్ సీజన్-5లో అడుగుపెట్టాడు. కానీ అక్కడ అక్కడ తోటి హౌస్మేట్ సిరి హనుమంత్తో హద్దులు మీరడంతో విన్నర్ కావాల్సిన షణ్ముఖ్ రన్నర్ కావాల్సి వచ్చింది. ఆ సీజన్ విజేతగా సన్నీ నిలిచాడు.
బిగ్బాస్ ఎఫెక్ట్తో బ్రేకప్!
బిగ్బాస్ వెళ్లడానికి ముందు వరకూ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ దీప్తి సునైనాతో షణ్ముఖ్ డీప్ లవ్లో ఉండేవాడు. అప్పట్లో ఎక్కడ చూసిన ఈ జంటే కనిపించింది. సోషల్ మీడియాలోనూ వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు చక్కర్లు కొట్టేవి. అయితే బిగ్బాస్ ఇంట్లో సిరితో చేసిన సిల్లీ పనుల వల్ల వారి ప్రేమకు బ్రేకప్ పడింది. అయితే బ్రేకప్ బాధలో ఉన్న తమ్ముడికి ఆ సమయంలో అన్న సంపత్ ప్రేమ పాఠాలు చెప్పి కళ్లు తెరిపించాడు. ప్రేమలో ఓడి పోయావని దిగులు చెందవద్దని ముందు ముందు దేశం మెుత్తం నిన్ను ప్రేమిస్తుందని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. అయితే అప్పుడు తమ్ముడికి ప్రేమ సూక్తులు, జీవిత పాఠాల గురించి చెప్పి ఇప్పుడు ప్రేయసి మోసం చేసిన కేసులో సంపత్ అరెస్టు కావడం విడ్డూరంగా ఉంది.
షణ్ముఖ్తో క్లోజ్.. వైష్ణవి లవ్ బ్రేకప్!
బేబీ (Baby Movie)సినిమాతో బాగా పాపులర్ అయిన హీరోయిన్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya).. ఆ చిత్రానికి ముందు యూట్యూబ్ సిరీస్లలో నటించేది. ముఖ్యంగా షణ్ముఖ్ జస్వంత్తో చేసిన ‘సాఫ్ట్వేర్ డెవలపర్’ సిరీస్ ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇందులో షన్ను, వైష్ణవి జోడీ సూపర్గా ఉందంటూ కామెంట్స్ వినిపించాయి. వీటికి తోడు అప్పట్లో ఈ జంట కలిసి చేసి డ్యూయెట్ రీల్స్ కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. అయితే ‘సాఫ్ట్వేర్ డెవలపర్’ సిరీస్కు ముందు వైష్ణవి.. బిగ్బాస్ ఫేమ్ మెహబూబ్ దిల్సేతో చాలా క్లోజ్గా ఉండేదట. వారిద్దరూ రిలేషన్లో ఉన్నట్లు సోషల్ మీడియా గుసగుసలు వినిపించాయి. అయితే షన్నుతో సాఫ్ట్వేర్ డెవలపర్ చేసినప్పటి నుంచి వారి మధ్య దూరం పెరిగిందట. షన్నుతో వైష్ణవి క్లోజ్గా ఉండటంతో మెహబూబ్ దూరంగా వెళ్లిపోయినట్లు గాసిప్స్ వచ్చాయి.
షణ్మఖ్ను ఫేమస్ చేసిన సిరీస్లు ఇవే!
2018లో వచ్చిన 'నన్ను దోచుకుందువటే' చిత్రంలో ఓ చిన్న పాత్ర ద్వారా షణ్ముఖ్ తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో యూట్యూబ్పై తన ఫోకస్ పెట్టాడు. 2020లో అతడు చేసిన ‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’ (The Software Developer) అతడి కెరీర్ను మలుపు తిప్పింది. యూత్లో ఎనలేని క్రేజ్ను తీసుకువచ్చింది. ఆ తర్వాత వరుసగా ‘సూర్య’, ‘స్టూడెంట్’ వంటి యూట్యూబ్ సిరీస్లలో నటించి షణ్ముఖ్ తన క్రేజ్ను మరింత పెంచుకున్నాడు. రుక్మిణి, మలుపు, Shanmukh Anthem, జాను, అయ్యయ్యో వంటి మ్యూజిక్ ఆల్బమ్స్తోనూ షణ్మఖ్ మంచి పేరు సంపాదించాడు.
ఫిబ్రవరి 23 , 2024
Shanmukh Jaswanth: భయపెట్టి అబార్షన్ చేయించాడు.. మౌనిక సంచలన కామెంట్స్!
ప్రముఖ యూట్యూబర్, బిగ్బాస్ ఫేం షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth) గంజాయితో పోలీసులకు పట్టుపడ్డాడు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ని అదుపులోకి తీసుకునేందుకు అతడి ప్లాట్కి వెళ్లిన పోలీసులకు.. అక్కడ షణ్ముఖ్ గంజాయి తీసుకుంటూ కనిపించాడు. దీంతో సంపత్ వినయ్తో పాటు షణ్ముఖ్ను హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షణ్ముఖ్ ఫ్లాట్లో 16 గ్రాముల గంజాయి పోలీసులకు లభించినట్లు తెలుస్తోంది.
షణ్ముఖ్ ఫ్లాట్లో ఏం జరిగిందంటే!
షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ (Sampath Vinay) ఆంధ్రప్రదేశ్కి చెందిన మౌనిక అనే యువతితో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. మూడేళ్ల క్రితం వారికి నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే యువతి తల్లి అనారోగ్యం బారిన పడటంతో చికిత్స ఇప్పించే క్రమంలో వీరి పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది. మరో ఆరు రోజుల్లో వీరి పెళ్లి ఉందనగా.. సంపత్ మరో యువతిని పెళ్లి చేసుకొని మౌనికకు షాకిచ్చాడు. దీంతో ఆమె సంపత్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిని తీసుకొని సంపత్, షణ్ముఖ్ ఉంటున్న ఫ్లాటుకు వెళ్లింది. అక్కడ షణ్ముఖ్ డ్రగ్ తీసుకుంటూ కనిపించినట్లు వార్తలు వస్తున్నాయి. షణ్ముఖ్, సంపత్లను మౌనిక వీడియో తీస్తుండగా.. డ్రగ్స్ మత్తులో ఉన్న యూట్యూబర్ (షణ్ముఖ్ జస్వంత్) వీడియో తీయోద్దంటూ గొడవ చేసినట్లు సమాచారం. దాంతో అన్నా, తమ్ముడు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇద్దర్ని అరెస్టు చేసి.. షణ్ముఖ్పై డ్రగ్స్ కేసు, సంపత్పై చీటింగ్ కేసు పెట్టినట్లు సమాచారం.
https://twitter.com/InformedAlerts/status/1760553942201852102
మౌనిక సంచలన ఆరోపణలు!
బాధిత యువతి మౌనిక(Mounika).. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అన్న సంపంత్తో పాటు షణ్ముఖ్పైనా సంచలన ఆరోపణలు చేసింది. యూట్యూబ్లో అవకాశం ఇస్తానని చెప్పి షణ్ముఖ్ తనను మోసం చేశాడని మౌనిక తెలిపింది. మరోవైపు సంపత్ తనపై లైంగిక దాడి చేశాడని చెప్పింది. హోటల్స్, విల్లాలకు తీసుకెళ్లి బెదిరించి లైంగికంగా వేధించినట్లు ఆరోపించింది. ఈ క్రమంలో తాను గర్భవతిని కాగా, సంపత్ భయపెట్టి అబార్షన్ కూడా చేయించాడని పేర్కొంది. తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ఓ రింగ్ తొడిగి మనకు నిశ్చితార్థం అయిపోయిందని సంపత్ చెప్పాడని పేర్కొంది. సంపత్ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చింది. అటు షణ్ముఖ్ దగ్గర గంజాయి, డ్రగ్స్ పిల్స్ ఉన్నాయని మౌనిక ఆరోపించింది. తన దగ్గర వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పింది. ఓ కానిస్టేబుల్ షణ్ముఖ్కు సాయపడాలని చూశాడని ఆమె ఆరోపించింది. తనకు ప్రాణ భయం ఉందని.. రక్షణ కల్పించాలంటూ మౌనిక పోలీసులను వేడుకుంది.
షణ్ముఖ్కు ఇది తొలిసారి కాదు!
షణ్ముఖ్ అరెస్టు కావడం ఇది మొదటి సారి కాదు. గతంలో హిట్ అండ్ రన్ కేసులో షణ్ముఖ్ను పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు మద్యం సేవించి లేకపోవడంతో ఆ కేసు నుండి షణ్ముఖ్ త్వరగానే బయపడగలిగాడు. అయితే తనపై పడ్డ మచ్చను తుడిపేసుకోవాలన్న లక్ష్యంతో షణ్ముఖ్ బిగ్బాస్ సీజన్-5లో అడుగుపెట్టాడు. కానీ అక్కడ అక్కడ తోటి హౌస్మేట్ సిరి హనుమంత్తో హద్దులు మీరడంతో విన్నర్ కావాల్సిన షణ్ముఖ్ రన్నర్ కావాల్సి వచ్చింది. ఆ సీజన్ విజేతగా సన్నీ నిలిచాడు.
https://twitter.com/i/status/1760553061007937805
బిగ్బాస్ ఎఫెక్ట్తో బ్రేకప్!
బిగ్బాస్ వెళ్లడానికి ముందు వరకూ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ దీప్తి సునైనాతో షణ్ముఖ్ డీప్ లవ్లో ఉండేవాడు. అప్పట్లో ఎక్కడ చూసిన ఈ జంటే కనిపించింది. సోషల్ మీడియాలోనూ వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు చక్కర్లు కొట్టేవి. అయితే బిగ్బాస్ ఇంట్లో సిరితో చేసిన సిల్లీ పనుల వల్ల వారి ప్రేమకు బ్రేకప్ పడింది. అయితే బ్రేకప్ బాధలో ఉన్న తమ్ముడికి ఆ సమయంలో అన్న సంపత్ ప్రేమ పాఠాలు చెప్పి కళ్లు తెరిపించాడు. ప్రేమలో ఓడి పోయావని దిగులు చెందవద్దని ముందు ముందు దేశం మెుత్తం నిన్ను ప్రేమిస్తుందని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. అయితే అప్పుడు తమ్ముడికి ప్రేమ సూక్తులు, జీవిత పాఠాల గురించి చెప్పి ఇప్పుడు ప్రేయసి మోసం చేసిన కేసులో సంపత్ అరెస్టు కావడం విడ్డూరంగా ఉంది.
ఫిబ్రవరి 22 , 2024
Rakul Preet Singh: పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్న రకూల్.. ప్రధాని కోసం మనసు మార్చుకున్న ముద్దుగుమ్మ
తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటిమణుల్లో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఒకరు. అయితే ఆమె త్వరలోనే పెళ్లి (Rakul Preet Singh Wedding) పీటలెక్కబోతోంది. బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ (Jackky Bhagnani)ని వివాహం ఆడనుంది.
ఫిబ్రవరి 21న వీరి వివాహం జరగనుంది. గోవా వేదికగా జరిగే ఈ వేడుకకు కుటుంబసభ్యులు, అతి కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరుకానున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు వైభవంగా వీరి పెళ్లి జరగనుంది.
https://twitter.com/i/status/1755616891970949447
రకుల్-జాకీ (Rakul Preet Singh - Jackky Bhagnani)ల వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిని చూసిన ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
బీటౌన్ నిర్మాత జాకీ భగ్నానీతో తాను రిలేషన్లో ఉన్నానంటూ రకుల్ (Rakul Preet Singh) 2021లోనే ప్రకటించింది. అప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారు. పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు తాజాగా ప్రకటించారు.
https://twitter.com/i/status/1757012094317396389
ఇక రకుల్-జాకీ తమ పెళ్లి బట్టల డిజైనర్లను కూడా సెలెక్ట్ చేసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సబ్యసాచి, తరుణ్ తహిల్యానీ, మనీష్ మల్హోత్రా పెళ్లి దుస్తులు డిజైన్ చేస్తున్నట్లు తెలిసింది.
అయితే ఈ జంట తొలుత తమ వివాహాన్ని (Rakul Preet Singh Wedding) మిడిల్ ఈస్ట్లో ప్లాన్ చేసుకున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి కొన్ని ప్రదేశాలను కూడా సెలెక్ట్ చేసుకున్నారని టాక్.
కానీ, గత ఏడాది డిసెంబరులో ప్రధాని మోదీ (Narendra Modi) ఇచ్చిన పిలుపు మేరకు ఇండియాలోనే రకుల్-జాకీలు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
చివరి నిమిషంలో వేదిక మార్చడం కష్టమే అయినా దేశంపై ఉన్న ప్రేమతో ఈ మార్పును వారు స్వీకరించారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
రకుల్ సినిమా జీవితానికి వస్తే.. ఆమె ‘గిల్లి’ (Gilli Movie) అనే కన్నడ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ‘7G బృందావన్ కాలనీ’ చిత్రానికి రీమేక్గా ఆ సినిమా వచ్చింది.
2013లో వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ సినిమా ద్వారా రకుల్ (Rakul Preet Singh Wedding) తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో రకుల్ను వరుస అవకాశాలు చుట్టుముట్టాయి.
https://twitter.com/i/status/1662932748166889473
‘లౌక్యం’ (Loukyam), ‘కరెంట్ తీగ’ (Current theega), ‘పండగ చేస్కో’ (Pandaga Chesko), ‘కిక్ 2’ (Kick 2), ‘బ్రూస్లీ’ (Bruce lee) వంటి వరుస సినిమాల్లో రకూల్ నటించింది. అయితే అవి పెద్దగా హిట్ కాకపోవడంతో రకుల్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది.
అయితే, ఆ తర్వాత వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ (Nannaku Prematho), ‘సరైనోడు’ (Sarainodu), ‘ధ్రువ’ (Dhruva) వంటి సినిమాలు సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరిగా రకుల్ గుర్తింపు తెచ్చుకుంది.
మళ్లీ తెలుగులో అవకాశాలు తగ్గడంతో ఆమె తన ఫోకస్ అంతా బాలీవుడ్పై పెట్టింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తోంది. ఈ క్రమంలోనే నిర్మాత జాకీ భగ్నానీకి దగ్గరై అతడితో ప్రేమలో పడింది.
ఇటీవల ‘కట్పుట్లి’ (Cuttputlli), ‘డాక్టర్ G’ (Doctor G), ‘థ్యాంక్ గాడ్’ (Tank God), ‘ఛత్రివలి’ (Chhatriwali) సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది.
తాజాగా వచ్చిన తమిళ చిత్రం 'అయాలన్' (Ayalaan)లోనూ ఈ బ్యూటీ హీరోయిన్గా చేసింది. హీరో శివకార్తికేయన్కు జోడీగా మంచి నటన కనబరించింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో రకుల్ ఫుల్ జోష్లో ఉంది.
కమల్హాసన్ హీరోగా శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘ఇండియన్ 2’ (Indian 2) సినిమాలోనూ రకుల్ నటిస్తోంది. ఈ చిత్రం కూడా ఈ ఏడాదే రిలీజయ్యే ఛాన్స్ ఉంది.
అలాగే హిందీలో 'మేరి పత్ని కా రీమేక్' (Meri Patni Ka Remake) సినిమాలో ఈ భామ నటిస్తోంది. ఇందులో అర్జున్ కపూర్ హీరోగా చేస్తున్నాడు.
ఓవైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలోనూ రకుల్ చాలా చురుగ్గా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటో షూట్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ను అలరిస్తోంది.
ఫిబ్రవరి 12 , 2024
Telugu hot movies : గత 25 ఏళ్లలో తెలుగులో వచ్చిన అడల్ట్ సినిమాలు, అవి స్ట్రీమింగ్ అవుతున్న ఓటీటీ ప్లాట్ఫామ్స్ లిస్ట్ ఇదే!
రొమాంటిక్, అడల్ట్, బొల్డ్ కంటెంట్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలు యూత్ను టార్గెట్ చేస్తూ వస్తాయి. కథలో పెద్దగా లాజిక్లు ఏమి లేకుండా కేవలం.. హీరోయిన్ల అందాల ఆరబోతకే ప్రాధాన్యత ఇస్తుంటాయి. పాత్ర డిమాండ్ చేసినా చేయకపోయినా.. కుదిరితే ముద్దు సీన్లు.. ఇంకాస్తా ముందుకెళ్తే బెడ్ రూం సీన్లు కూడా ప్రస్తుతం సినిమాల్లో సాధారణమై పోయాయి. మరి అలాంటి చిత్రాలు గడిచిన 25 ఏళ్లలో తెలుగులో ఎన్ని వచ్చాయో ఓసారి చూద్దాం.
[toc]
ఎవోల్
రీసెంట్గా ఓటీటీలో రిలీజైన ఎవోల్ చిత్రం ట్రెండింగ్లో ఉంది. తొలుత ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ.. ఈ చిత్రంలోని బొల్డ్ సీన్లకు సెన్సార్ బోర్డు అడ్డు చెప్పడంతో నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే. నిధి అనే యువతి ప్రభుని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అయితే ప్రభు బిజినెస్ పార్ట్నర్ అయిన రిషితో నిధి అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. ఇదే క్రమంలో ప్రభు తన అసిస్టెంట్ దివ్యతో ఎఫైర్ పెట్టుకుంటాడు. ఓ రోజు దివ్య గురించి చెప్పి విడాకులు అడుగుతాడు. ఇదే సమయంలో నిధి కూడా తనకున్న అఫైర్ను బయటపెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? మరి వీరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అన్నది మిగతా కథ.
యావరేజ్ స్టూడెంట్ నాని
ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ సినిమా హీరో, డైరెక్టర్ పవన్ కొత్తూరి ట్రోలింగ్కు గురయ్యాడు. ఈ చిత్రంలో బొల్డ్ సీన్లు శృతి మించాయని ట్రోల్ చేశారు. సరే, ఇక కథలోకి వెళ్తే..
చదువులో యావరేజ్ స్టూడెంట్ అయిన నాని తన కాలేజ్ సీనియర్ సారాతో ప్రేమలో పడుతాడు. ఆమెతో ఎఫైర్ పెట్టుకుంటాడు. బ్రేకప్ అయిన తర్వాత అనుతో ప్రేమలో పడుతాడు. సారాతో ఎఫైర్ ఉన్నట్లు తెలిసిన అను అతన్ని ఎందుకు ప్రేమించింది? బ్రేకప్ అయిన తర్వాత కూడా నానితో సారా ఎందుకు రిలేషన్ షిప్ కొనసాగించాలనుకున్నది అనేది మిగతా కథ.
https://www.youtube.com/watch?v=xQxqX7fO4Ps
హాట్ స్పాట్
నాలుగు కథల సమాహారంగా హాట్స్పాట్ చిత్రం రూపొందింది. నలుగురు యువతులు వారి భాగస్వాముల చుట్టూ కథ నడుస్తుంది. వారి రిలేషన్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? వాటి నుంచి ఆ జంట ఎలా బయటపడింది? అన్నది స్టోరీ.
లవ్ మౌళి
2024లో వచ్చిన బొల్డ్ కంటెంట్ సినిమాల్లో లవ్ మౌళి చిత్రం ముందు వరుసలో నిలుస్తుంది. ఈ చిత్రం మూడేళ్ల నుంచి ఊరిస్తూ ఊరిస్తూ ఇప్పటికీ విడుదలైది. ఈ సినిమాలోనూ బొల్డ్ సీన్లు పుష్కలంగా ఉన్నాయి. కథ పక్కకు పెడితే అడల్ట్ కంటెంట్ ఇష్టపడేవారిని ఈ చిత్రం ఏమాత్రం డిస్సాపాయింట్ చేయదని చెప్పాలి. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.."తల్లిదండ్రులు విడిపోవడంతో మౌళి (నవదీప్) చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరుగుతాడు. కొన్ని అనుభవాల వల్ల అతడికి ప్రేమపై కూడా నమ్మకం పోతుంది. పెయిటింగ్ వేస్తూ వాటి ద్వారా వచ్చిన డబ్బులతో జీవిస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల ఓ అఘోరా (రానా దగ్గుబాటి) అతడికి మహిమ గల బ్రష్ ఇస్తాడు. ఆ పెయింటింగ్ బ్రష్తో తను కోరుకునే లక్షణాలున్న అమ్మాయిని సృష్టించే శక్తి మౌళికి వస్తుంది. ఈ క్రమంలో అతడు వేసిన పెయింటింగ్ ద్వారా చిత్ర (ఫంఖూరీ గిద్వానీ) అతడి ముందు ప్రత్యక్షమవుతుంది. కొన్నాళ్లు సాఫీగా సాగిన వారి ప్రేమ బంధం.. గొడవలు రావడంతో బ్రేకప్ అవుతుంది. మౌళి.. మళ్లీ బ్రష్ పట్టి అమ్మాయి పెయింటింగ్ గీయగా తిరిగి చిత్రనే ముందుకు వస్తుంది. అలా ఎందుకు జరిగింది? మౌళి.. లవ్ బ్రేకప్కు కారణమేంటి? ప్రేమకు నిజమైన అర్థాన్ని హీరో ఎలా తెలుకున్నాడు? మౌళి, చిత్ర ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ.
Mr & Miss
ఈ చిత్రం కూడా బొల్డ్ కంటెంట్తో ప్రేక్షకులను ఏ మాత్రం డిస్సాపాయింట్ చేయదు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. "తన బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ కావడంతో శశి(జ్ఞ్యానేశ్వరి) ఓ పబ్లో అనుకోకుండా శివ(సన్నీ)ని కిస్ చేస్తుంది. అక్కడ మొదలైన వారి బంధం ముందుకు సాగుతుంది. ఇద్దరు ఒకరిపై ఒకరు ఇష్టం పెంచుకుని శారీరకంగా దగ్గరవుతారు. అయితే కొన్ని కారణాల వల్ల విడిపోయే పరిస్థితి వస్తుంది. సరిగ్గా బ్రేకప్ చెప్పే సమయంలో శివ ఫొన్ మిస్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వీరి రిలేషన్ ఏమైంది అనేది మిగతా కథ.
ఏడు చేపలా కదా
ఈ సినిమా తెలుగులో పెద్ద ఎత్తున బజ్ సంపాదించింది. అడల్ట్ మూవీల్లో ఓ రకమైన ట్రెండ్ సెట్ చేసింది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. రవి(అభిషేక్ పచ్చిపాల) పగలు ఏ అమ్మాయిని చూసి టెంప్ట్ అవుతాడో.. అదే అమ్మాయి రాత్రి అతనితో శారీరకంగా కలుస్తుంటుంది. ఈక్రమంలో అతను ప్రేమించిన (ఆయేషా సింగ్) కూడా రవికి దగ్గరవుతుంది. దీని వల్ల రవి ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అసలు రవిని చూసి వాళ్లెందుకు టెంప్ట్ అవుతున్నారన్నది మిగతా కథ.
RGV’s Climax
తెలుగులో వచ్చిన బొల్డ్ కంటెంట్ సినిమాల్లో ఇదొకటి. మియా మాల్కోవా మరియు ఆమె ప్రియుడు ఎడారి పర్యటనను అనుసరిస్తూ, వారు వేరే ఏదైనా కొత్తగా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో వారి పయనం ఎడారిలో ఎటు వైపు సాగిందనేది కథ.
రాజ్
ఈ చిత్రం కూడా అడల్ట్ కంటెంట్ ఉన్న మూవీ. ఇక ఈ సినిమాలో కూడా రొమాంటిక్ సీన్లు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇక కథలోకి వెళ్తే.. ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అయిన రాజ్ (సుమంత్) తన తండ్రి సన్నిహితుడి కూతురు మైథిలి (ప్రియమణి)తో నిశ్చితార్థం చేసుకున్నాడు. పెళ్లి తేదీ దగ్గర పడుతున్న సమయంలో, అతను మరో అమ్మాయి ప్రియ (విమలా రామన్)తో ప్రేమలో పడుతాడు.పెళ్లిని రద్దు చేయాలని తండ్రిని కోరుతాడు. అయితే ఇంతలో ప్రియ కనిపించకుండా వెళ్లిపోతుంది. దీంతో ప్రియను రాజ్ పెళ్లి చేసుకుంటాడు? ఇంతకు ప్రియ ఎటు వెళ్లింది? మైథిలి, రాజ్ మధ్య కాపురం సజావుగా సాగిందా లేదా అనేది మిగతా కథ.
నేను
మానసిక రోగి అయిన వినోద్ తన స్నేహితురాలిగా భావించే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆ యువతి వెరొకరితో ప్రేమలో ఉంటుంది. ప్రేమను గెలిపిస్తాననే నెపంతో ఆ యువతిని వినోద్ అడవిలోకి తీసుకెళ్లడంతో కథ మలుపు తిరుగుతుంది.
BA పాస్
బాలీవుడ్లో వచ్చిన అత్యంత బోల్డ్ సినిమాల్లో ఒకటిగా BA PAss గుర్తింపు పొందింది. ఈ చిత్రం తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే…
ముఖేష్ (షాదబ్ కమల్) అనే ఓ యువకుడి చూట్టూ తిరుగుతుంది. బీఏ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ముఖేష్ తల్లిదండ్రులు చనిపోతారు. దీంతో అతను ఢిల్లీలో ఉన్న తన మేనత్త ఇంట్లో ఉంటూ చదువుకుంటూ ఉంటాడు. అక్కడ అవమానాలను ఎదుర్కొంటూ చాలీ చాలని డబ్బుతో కాలం నెట్టుకొస్తుంటాడు. ఈ క్రమంలో అతనికి సారికా(శిల్పా శుక్లా) అనే ఓ పెళ్ళైన మహిళ పరిచయమవుతుంది.ఇద్దరూ శారీరకంగా ఒక్కటవుతారు. ముఖేష్ పరిస్థితి అర్థం చేసుకున్న సారికా అతనికి తనలాగా శారీరక సుఖం కోసం పరితపిస్తున్న పెళ్లైన మహిళలను పరిచయం చేస్తుంది. డబ్బు బాగా చేతికందుతున్న క్రమంలో అతని జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ముఖేష్ జీవితంలో జరిగిన ఆ సంఘటన ఏమిటి? ఈ వృత్తిని ముఖేష్ కొనసాగించాడా? మానేశాడా? అనేది మిగతా కథ.
కుమారి 21F
తెలుగులో వచ్చిన బోల్డ్ కాన్సెప్ట్తో వచ్చిన చిత్రాల్లో కుమారి 21F ఒకటి. యూత్ను తెగ ఆకర్షించింది ఈ సినిమా. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే..
సిద్దు(రాజ్ తరుణ్) హోటల్ మెనేజ్మెంట్లో డిగ్రీ కంప్లీట్ చేసి చెఫ్గా వెళ్ళాలని తెగ ట్రై చేస్తుంటాడు. ఈక్రమంలో ముంబై నుంచి వచ్చిన మోడల్ కుమారి(హేభ పటేల్) సిద్ధు ప్రేమలో పడుతుంది. ఆమె బోల్డ్ యాటిట్యూడ్ వల్ల సిద్ధు తొలుత ఇబ్బంది పడ్డా తర్వాత ఆమెను ప్రేమిస్తాడు. ఈక్రమంలో కుమారి క్యారెక్టర్ మంచిదికాదని సిద్ధు ఫ్రెండ్స్ అతనికి చెబుతారు. దీంతో ఆమెను అనుమానించిన సిద్ధు… కుమారి ఓ రోజు వేరే ఎవరి బైక్ మీదో వెళ్తుంటే నిలదీస్తాడు. దాంతో కుమారి తనని అర్థం చేసుకునే మెచ్యూరిటీ తనకు లేదని తన ప్రేమకి నో చెప్పి వెళ్లిపోతుంది. అసలు కుమారి ఎందుకు అంతలా బోల్డ్ గా ఉండటానికి కారణం ఏమిటి? అసలు ముంబై నుంచి కుమారి హైదరాబాద్ ఎందుకు వచ్చింది? అన్నది మిగతా కథ.
మిక్స్ అప్
రీసెంట్గా వచ్చిన ఈ చిత్రం బొల్డ్ కంటెంట్కు కెరాఫ్ అడ్రస్గా మారింది. ఈ చిత్రం థియేటర్లలో పెద్దగా విజయం సాధించనప్పటికీ.. ఓటీటీలో మాత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమా(Telugu hot movies) ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది. రెండు జంటలకు సెక్స్, లవ్ పరంగా సమస్యలు తలెత్తుతాయి. సైకాలజిస్ట్ సూచన మేరకు వారు గోవా టూర్ ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో ఒకరి భార్యను మరొకరు మార్చుకుంటారు. చివరికి ఆ రెండు జంటల పరిస్థితి ఏమైంది? అన్నది స్టోరీ. ఈ సినిమాలో స్టార్టింగ్ సీన్ నుంచే బొల్డ్ కంటెంట్తో ప్రేక్షకులకు కావాల్సి మసాల అందుతుంది. ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి చూడలేమని గుర్తించుకోవాలి.
సిద్ధార్థ్ రాయ్
రీసెంట్గా వచ్చిన మంచి హాట్ సీన్లతో ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రం ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు తెగ వెతకసాగారు. ఎట్టకేలకు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది. ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. 12 ఏళ్లకే ప్రపంచంలోని ఫిలాసఫీ పుస్తకాలన్నీ చదివిన సిద్ధార్థ్.. ఏ ఏమోషన్స్ లేకుండా జీవిస్తుంటాడు. లాజిక్స్ను మాత్రమే ఫాలో అయ్యే సిద్ధార్థ్ అనుకోకుండా ఇందుతో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమలో హీరో ఏం తెలుసుకున్నాడు? ఇందు ఎందుకు బ్రేకప్ చెప్పింది? సిద్ధార్థ్ ప్రేమకథ చివరికీ ఏమైంది? అన్నది కథ.
ఆట మొదలైంది
ఈ చిత్రంలో బొల్డ్ కంటెంట్ అవసరానికి మించి ఉంటుంది. కథ ఎలా ఉన్నా.. బోల్డ్ కంటెంట్ ప్రేమికులను ఈ సినిమా నిరాశపర్చదు. కథ విషాయానికొస్తే.. శ్రీను మేనకోడలికి గుండె జబ్బు వచ్చినప్పుడు, మంచి మనసున్న వ్యక్తిగా వారికి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతని దయకు ప్రతిఫలంగా మరియు అతని కలలను నెరవేర్చుకునే ప్రయత్నంలో, శ్రీను తైక్వాండో ఛాంపియన్షిప్లో పాల్గొంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.
భక్షక్
సామాజిక రుగ్మతలపై మంచి సందేశం ఇచ్చినప్పటికీ.. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు బొల్డ్గా తీశారు. ఇక సినిమా కథలోకి వెళ్తే.. జర్నలిస్టు వైశాలి.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్థానిక వార్తలు అందిస్తుంటుంది. ఊరిలోని అనాథ బాలికల వసతి గృహంలో లైంగిక దాడులు జరుగుతున్నట్లు ఆమెకు తెలుస్తుంది. అయితే దానిని రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి నిర్వహిస్తుంటాడు. అతడి దారుణాలను వైశాలి ఎలా బయటపెట్టింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ.
బబుల్గమ్
ఇటీవల వచ్చిన బబుల్గమ్ చిత్రంలో ఉన్న బోల్డ్ కంటెంట్ యూత్ను బాగా టెంప్ట్ చేస్తుంది. చాలా వరకు లిప్ లాక్ సీన్లు అలరిస్తాయి. ఈ సినిమా కథలోకి వెళ్తే.. హైదరాబాదీ కుర్రాడు ఆది (రోషన్ కనకాల) డీజే కావాలని కలలు కంటాడు. ఓరోజు పబ్లో జాన్వీ(మానస చౌదరి)ని చూసి ప్రేమిస్తాడు.(Telugu hot movies) ఆమెని ఫాలో అవుతుంటాడు. అయితే జాన్వీ పెద్దింటి అమ్మాయి. లవ్, రిలేషన్స్ పెద్దగా నచ్చవు. అబ్బాయిల్ని ఆటబొమ్మల్లా చూస్తుంటుంది. ఇలాంటి అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో ఆదితో లవ్లో పడుతుంది. భిన్న మనస్తత్వాలు కలిగిన ఆది, జాన్వీ ఎలాంటి సమస్యలు ఫేస్ చేశారు? చివరకు ఒక్కటయ్యారా? లేదా? అనేదే కథ. ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
యానిమల్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా యానిమల్. ఈ చిత్రంలోని హింసాత్మక సంఘటనలు ఏ స్థాయిలో ఉన్నాయో.. శృంగార సన్నివేశాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. రష్మిక మంధాన, తృప్తి దిమ్రితో ఉండే లిప్ లాక్ సీన్లు ప్రేక్షకులను రంజింప జేస్తాయి.ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే..దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఈ సినిమా ప్రైమ్లో అందుబాటులో ఉంది.
పర్ఫ్యూమ్
అమ్మాయిల వాసనపై వ్యామోహం పెంచుకున్న ఒక వ్యక్తి.. వారిని కిడ్నాప్ చేస్తూ రాక్షసానందం పోందుతుంటాడు. అతడ్ని పట్టుకోవడానికి పోలీసులు ఏం చేశారు? అతడు ఇలా ఎందుకు మారాడు? అనేది కథ.
మంగళవారం
ఈ చిత్రంలో పాయల్ రాజ్పుత్ చాలా హాట్గా కనిపిస్తుంది. మునుపెన్నడు లేని విధంగా బోల్డ్ సీన్లలో పాయల్ నటించింది. శృంగార సన్నివేశాలు కావాలనుకునేవారిని ఈ చిత్రం నిరాశపరుచదు. ఇక ఈ చిత్రం కథ విషయానికొస్తే.. మహాలక్ష్మీపురంలోని ఓ జంట మధ్య అక్రమ సంబంధం ఉందని ఊరి గోడలపై రాతలు కనిపిస్తాయి. ఆ జంట అనూహ్య పరిస్థితుల్లో చనిపోతుంది. మరో జంటకి కూడా అదే పరిస్థితి ఎదురై చనిపోవడంతో ఊరి ప్రజల్లో భయం మొదలవుతుంది. ఆ హత్యలన్ని మంగళవారం రోజునే జరుగుతుంటాయి. ఈ కేసును ఛేదించేందుకు ఎస్ఐ నందితా శ్వేత ప్రయత్నిస్తుంది. ఇంతకు ఆ హత్యల వెనుక ఉన్నది ఎవరు? అనేది మిగతా కథ. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది.
ది కేరళ స్టోరీ
ఈ చిత్రంలో కాస్త సందేశం ఉన్నప్పటికీ.. బొల్డ్ కంటెంట్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. సినిమా స్టోరీ విషయానికొస్తే..కేరళలోని ఓ నర్సింగ్ కాలేజీలో హిందువైన షాలిని ఉన్నికృష్ణన్ (అదాశర్మ) చేరుతుంది. అక్కడ గీతాంజలి (సిద్ధి ఇద్నానీ), నిమా (యోగితా భిహాని), ఆసిఫా (సోనియా బలానీ)లతో కలిసి హాస్టల్లో రూమ్ షేర్ చేసుకుంటుంది. అయితే అసీఫా ఐసీస్ (ISIS)లో (Telugu Bold movies) అండర్ కవర్గా పనిచేస్తుంటుంది. అమ్మాయిలను బ్రెయిన్ వాష్ చేసి ఇస్లాం మతంలోకి మారుస్తుంటుంది. ఆమె పన్నిన ఉచ్చులో షాలిని చిక్కుకొని ఎలాంటి కష్టాలు అనుభవించింది అన్నది కథ. ఈ చిత్రం జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంది. థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో వీక్షించవచ్చు.
ఒదెల రైల్వే స్టేషన్
ఈ చిత్రంలో బొల్డ్ కంటెంట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. హెబ్బా పటేల్, పూజిత పొన్నాడ అందాలు మిమ్మల్ని దాసోహం చేస్తాయి. ఇక స్టోరీ విషయానికొస్తే...అనుదీప్ (సాయి రోనక్) ఐపీఎస్ అధికారి. ట్రైనింగ్ కోసం ఓదెల వెళతాడు. ఈ క్రమంలో ఆ ఊరిలో వరుస హత్యాచారాలు తీవ్ర కలకలం రేపుతాయి. మరి అనుదీప్ హంతకుడ్ని పట్టుకున్నాడా? కేసు విచారణలో రాధ (హెబ్బా పటేల్) అతడికి ఎలా సాయపడింది? అనేది కథ. ఈ సినిమాను ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో వీక్షించవచ్చు.
హెడ్స్ అండ్ టేల్స్
హాట్ సీన్లు దండిగా కావాలనుకునేవారికి ఈ సినిమా ఒక మంచి ఛాయిస్గా చెప్పవచ్చు. ఈ సినిమా స్టోరీ ఏమిటంటే?..ముగ్గురు యువతులు తమ వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వాటి నుండి ఎలా బయటపడ్డారు? ఆ ముగ్గురి కథ ఏంటి? అన్నది కథ. ఈ సినిమా జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది.
క్రష్
ముగ్గురు యువకులు పై చదువుల కోసం అమెరికా వెళ్లాలని ప్రయత్నిస్తుంటారు. అమెరికా నుంచి వచ్చిన తమ సీనియర్ ఇచ్చిన సలహాతో వారి జీవితాలు అనూహ్య మలుపు తిరుగుతాయి.
ఏక్ మినీ కథ
ఈ చిత్రం కూడా బొల్డ్ కంటెంట్ ప్రేమికులను ఎక్కడా నిరుత్సాహ పరుచదు. ఇక సినిమా విషయానికొస్తే, సంతోష్ శోభన్ (సంతోష్) తన జననాంగం చిన్నదని భావిస్తూ నిత్యం సతమతమవుతుంటాడు. ప్రాణహాని ఉందని తెలిసినా సర్జరీ చేయించుకునేందుకు సిద్ధమవుతాడు. ఈ క్రమంలోనే అమృత (కావ్య)తో అతడికి పెళ్లి జరుగుతుంది. తన సమస్య బయటపడకుండా సంతోష్ ఏం చేశాడు? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరకు ఏమైంది? అన్నది కథ. ఈ సినిమా ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది.
డర్టీ హరి
హరికి హైదరాబాద్లో కోటీశ్వరురాలైన వసుధతో ప్రేమలో పడుతాడు. వారి ప్రేమ సాగుతున్న క్రమంలో వసుధ అన్న గర్ల్ఫ్రెండ్ అందానికి ఆకర్షితుడవుతాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో సంబంధాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ. ఈ సినిమా ప్రైమ్లో అందుబాటులో ఉంది. చూసి ఎంజాయ్ చేయండి.
RDX లవ్
అందాల తార పాయల్ రాజ్పుత్ పరువాల ప్రదర్శనను పీక్ లెవల్ తీసుకెళ్లిన చిత్రమిది. అలివేలు (పాయల్ రాజ్పుత్) రాష్ట్ర ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ పొందడం కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తుంటుంది. దీని కోసం, ఆమె హీరో(తేజస్)ని ఉపయోగించుకుంటుంది. ఇంతకు అలివేలు ఎవరు? సీఎంను ఎందుకు కలవాలనుకుంటుంది అనేది అసలు కథ. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో చూడవచ్చు.
చీకటి గదిలో చితక్కొట్టుడు
ఈ చిత్రంలో కావాల్సినంత బోల్ట్ కంటెంట్ ఉంటుంది. ఈ సినిమాలో స్టోరీ విషయానికొస్తే.. ఓ స్నేహితుల బృందం బ్యాచిలర్ పార్టీ కోసం నగరానికి దూరంగా (Telugu hot movies) ఉన్న విల్లాకు వెళ్తారు. ఆ విల్లాలో వారికి వింత పరిస్థితి ఎదురవుతుంది. ఓ అదృశ్య శక్తి వారిని వెంబడిస్తుంటుంది.
నాతిచరామి
ఈ చిత్రంలో పూనమ్ కౌర్ హాట్ ఎక్స్ప్రెషన్స్ మిమ్మల్ని థ్రిల్ చేస్తాయి. ఒంటరి మహిళలకు ఏం కావాలి అనే ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందింది. వారి శారీర కోరికలు, వారి భావోద్వేగాలు వంటి అంశాల ప్రాతిపాదికగా నడిచే బోల్డ్ చిత్రం ఇది. ఈ సినిమా MX ప్లేయర్లో అందుబాటులో ఉంది.
24 కిసెస్
ఆనంద్ (అదిత్ అరుణ్) సామాజిక స్పృహ ఉన్న సినీ దర్శకుడు. శ్రీలక్ష్మీ (హెబ్బా పటేల్)తో ప్రేమలో పడి డేటింగ్తోనే జీవితాన్ని గడపాలని అనుకుంటాడు. దీంతో వారి లవ్ బ్రేకప్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వారు మళ్లీ కలిశారా? 24 ముద్దుల వెనక రహస్యం ఏంటి? అన్నది కథ. ఈ సినిమా ప్రైమ్లో అందుబాటులో ఉంది.
RX 100
ఈ చిత్రంలో పాయల్ రాజ్పుత్ అందాల ఆరబోత మాములుగా ఉండదు. సెలవులకు ఇంటికి వచ్చిన ఇందు (పాయల్) ఊర్లోని శివ (కార్తికేయ)ను ప్రేమిస్తుంది. పెళ్లికి ముందే అతనితో శారీరకంగా దగ్గరవుతుంది. అయితే ఓ రోజు ఇందు అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్లిపోతుంది. మరి శివ ఏమయ్యాడు? ఇందు వేరే పెళ్లి ఎందుకు చేసుకుంది? అన్నది మిగతా కథ.
దండుపాళ్యం 3
దండుపాళ్యంగా పేరొందిన సైకో కిల్లర్స్ ముఠా తమ సరదాల కోసం ఎంతకైనా తెగించి నగరంలో బీభత్సం సృష్టిస్తుంటుంది. వారి కామం, డబ్బు కోసం క్రూరంగా చంపుతుంటారు. వారిని పట్టుకునేందుకు పోలీసు అధికారి (రవి శంకర్) గాలిస్తుంటాడు. చట్టం వద్ద దోషులుగా నిరూపించడానికి అతను ఏం చేశాడు? మరి వారికి శిక్ష పడిందా? లేదా? అన్నది మిగతా కథ.
జూలీ 2
నటి కావాలనుకునే సాదాసీదా అమ్మాయి జూలీ. ఓ సినిమాలో హీరోయిన్గా నటించి స్టార్గా ఎదుగుతుంది. కొన్ని నాటకీయ పరిణామాలు జూలీని చీకటి మార్గంలో పయనించేలా చేస్తాయి. అసలు జూలీ స్టార్గా ఎదిగిన తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
అర్జున్ రెడ్డి
ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, శాలిని పాండే మధ్య వచ్చే కిస్ సీన్లు రంజింపజేస్తాయి. అర్జున్ రెడ్డి టాలెంట్ ఉన్న ఒక యువ సర్జన్. ప్రీతి అనే యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే ఓ సంఘటన అర్జున్ రెడ్డిని షాక్కు గురిచేస్తుంది. మద్యానికి బానిసవుతాడు.(Telugu Bold movies) ఇంతకు తన( ప్రేయసిని అతను తిరిగి కలుసుకున్నాడా లేదా? అన్నది మిగతా కథ.ఈ చిత్రం ప్రైమ్లో వీక్షించవచ్చు.
బాబు బాగా బిజీ
తెలుగులో వచ్చిన బోల్డ్ కంటెంట్ సినిమాల్లో ఇది టాప్ లెవల్లో ఉంటుంది. మాధవ్ అనేక మంది స్త్రీలతో లైంగిక సంబంధాన్ని కలిగి ఉంటాడు. అయితే, మాధవ్ తన డ్రీమ్ గర్ల్ రాధను కలిసినప్పుడు అతను తన మార్గాన్ని మార్చుకునేందుకు ప్రయత్నిస్తాడు.
గుంటూరు టాకీస్
గిరి (నరేష్), హరి (సిద్ధు) ఓ మెడికల్ షాపులో పనిచేస్తూనే అప్పుడప్పుడు దొంగతనాలు చేస్తుంటారు. ఓ దశలో పెద్ద దొంగతనమే చేయాలని నిర్ణయించుకొని ఓ ఇంట్లో 5 లక్షల రూపాయలను దోచేస్తారు. ఆ తర్వాత వారి జీవితాలు అనుకోని మలుపు తిరిగాయి. చివరికీ వీరి కథ ఎటు పోయింది? అన్నది కథ.
అవును2
ఇది "అవును" సినిమాకి సీక్వెల్. మోహిని మరియు హర్ష కొత్త ఇంటికి మారుతారు. ఆ ఇంటిలో మళ్లీ వింత ఘటనలు జరుగుతాయి. పగపట్టిన ఆత్మ వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటుంది.
ఐస్ క్రీమ్ 2
ఐదుగురు ఫ్రెండ్స్ షార్ట్ఫిల్మ్ తీసేందుకు అడవిలోని గెస్ట్ హౌస్కు వెళ్తారు. అక్కడ వారికి వింత అనుభూతులు ఎదురవుతాయి. ఈ క్రమంలో వారిని కొందరు కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ఫ్రెండ్స్ ఒక్కొక్కరిగా చనిపోవడానికి కారణం ఏంటి? అన్నది కథ. ఈ చిత్రాన్ని నేరుగా యూట్యూబ్లో వీక్షించవచ్చు.
నా బంగారు తల్లి
దుర్గ (అంజలి పాటిల్) అమలాపురంలో చాలా తెలివైన విద్యార్థి. ఉన్నత చదువులను హైదరాబాద్లో పూర్తి చేయాలనుకుంటుంది. కానీ ఆమె తండ్రి ఒప్పుకోడు. రహస్యంగా హైదరాబాద్కు వెళ్లిన ఆమెను దుండగులు కిడ్నాప్ చేసి వ్యభిచారంలోకి దింపుతారు. ఈ క్రమంలో తన తండ్రి గురించి ఒక షాకింగ్ నిజం తెలుసుకుంటుంది. ఆమె తెలుసుకున్న నిజం ఏమిటి? వ్యభిచార గృహం నుంచి ఎలా తప్పించుకున్నది అన్నది మిగతా కథ. ఈ సినిమా హాట్స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
గ్రీన్ సిగ్నల్
ఈ సినిమాలోనూ కావాల్సినంత హాట్ మసాల సీన్లు మిమ్మల్ని అలరిస్తాయి. సినిమా కథ విషయానికొస్తే..నాలుగు జంటల జీవితాల్లో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అపర్థాల వలన వారి ప్రయాణంలో చోటుచేసుకున్న సంక్లిష్టతలు ఏంటి? వాటి నుంచి ఎలా బయటపడ్డారు? అన్నది కథ.
ప్రేమ ఒక మైకం
మల్లిక (ఛార్మీ కౌర్) ఓ అందమైన వేశ్య. మద్యం మత్తులో లైఫ్ లీడ్ చేస్తూ.. నచ్చిన విటులతోనే వ్యాపారం చేస్తుంటుంది. ఓరోజు అనుకోకుండా యాక్సిడెంట్ చేస్తుంది. యాక్సిడెంట్ గురైన లలిత్ను హస్పిటల్కు చేర్చి.. బ్రతికించి చేరదీసి తన ఇంట్లో ఆశ్రయం కల్పిస్తుంది. అయితే యాక్సిడెంట్లో లలిత్ చూపు కోల్పోతాడు. ఒకానొక సందర్భంలో యాక్సిడెంట్కు గురైన లలిత్ డైరీని చదువుతుంది. దాంతో డైరీ తర్వాత ఆతని జీవితం గురించి తెలుసుకున్న మల్లిక ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఏం చేసింది అన్నది మిగతా కథ. ఈ సినిమాను నేరుగా యూట్యూబ్లో వీక్షించవచ్చు.
పవిత్ర
శ్రియ అందాలను ఆరాధించాలంటే ఈ బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమా చూడాల్సిందే..వ్యభిచారం చేసే ఒక మహిళ తన జీవితం మార్చుకోవడానికి ఉన్న అన్నీ అడ్డంకులు దాటుకొని, పట్టుదలగా ఎలా ప్రయాణించింది అనేది సినిమా కథ. ఈ చిత్రాన్ని నేరుగా MX ప్లేయర్ ఓటీటీల్లో వీక్షించవచ్చు.
దండుపాళ్యం
క్రూరమైన ఓ గ్యాంగ్ నగరంలో దొంగతనాలు హత్యలు చేస్తుంచారు. మహిళలను దారుణంగా అత్యాచారం చేసి చంపేస్తుంటారు. పోలీసు అధికారి చలపాతి ఆ గ్యాంగ్ను ఎలా కనిపెట్టాడు? చట్టం ముందు వారిని ఏవిధంగా నిలబెట్టాడు? అన్నది కథ. ఈ సినిమాను యూట్యూబ్ ద్వారా నేరుగా చూడవచ్చు.
ది డర్టీ పిక్చర్
ఈ చిత్రంలో సిల్క్స్మిత పాత్రలో నటించిన విద్యాబాలను తన అందాలను కొంచెం కూడా దాచుకోకుండా బోల్డ్ షో చేసింది. శృంగార సన్నివేశాలు ఈ చిత్రంలో కొకొల్లలు. కథ విషయానికొస్తే.. రేష్మ పెద్ద హీరోయిన్ కావాలని చెన్నైకి వస్తుంది. కొద్ది రోజుల్లోనే నటిగా అవకాశం వస్తుంది. ఎక్కువగా ఐటెం గర్ల్ పాత్రలు వస్తుంటాయి. తరువాత ఆమె సిల్క్ స్మితగా మారుతుంది. తన గ్లామర్తో మొత్తం ఇండస్ట్రీని శాసించే స్థాయికి చేరుకుంటుంది. సౌత్ సూపర్ స్టార్ సూర్య కాంత్, రమా కాంత్తో(Telugu hot movies) ఆమె వివాహేతర సంబంధ కొనసాగిస్తుంది. మద్యానికి బానిసై.. కొద్దిరోజుల్లోనే అన్నీ కోల్పోతుంది. చివరికి ఆమె జీవితం ఎలా ముగిసిందన్నది అసలు కథ.
శ్వేత 5/10 వెల్లింగ్టన్ రోడ్
కాలేజీ స్టూడెంట్ అయిన శ్వేత ఓ బంగ్లాలో తన కుటుంబంతో నివసిస్తుంటుంది. ఆమె తల్లి దండ్రులు ఊరు వెళ్తారు. ఈక్రమంలో ఆమె తన బాయ్ ఫ్రెండ్ క్రిష్ ఇంటికి రావాలని కాల్ చేస్తుంది. అయితే ఒక అపరిచితుడు ఆమె ఇంటికి వస్తాడు. తనతో సెక్స్ చేయాలని లేకపోతే ఆమె బాయ్ ఫ్రెండ్తో ఉన్న ప్రైవేట్ వీడియోలను నెట్లో పెడుతానని బెదిరిస్తాడు. తర్వాత ఏం జరిగింది? శ్వేత అతనికి లొంగుతుందా? చివరకు ఏం జరిగింది అనేది మిగతా కథ.
అరుంధతి
ఈ సినిమాలోనూ కొన్ని సీన్లలో అనుష్క హాట్గా కనిపిస్తుంది.చాలా ఎళ్ల తర్వాత తన సొంత ఊరికి వెళ్లిన సమయంలో అరుందతి... తాను తన తాతమ్మ జేజమ్మలాగా ఉన్నానని తెలుసుకుంటుంది. ఈక్రమంలో తనను తన కుటుంబాన్ని నాశనం చేయాలనుకునే ఓ ప్రేతాత్మతో పోరాడుతుంది. ఈ సినిమా యూట్యూబ్లో అందుబాటులో ఉంది.
ఆపరేషన్ దుర్యోధన
ఈ చిత్రంలో ముమైత్ ఖాన్ రెచ్చిపోయి మరి అందాల విందు చేసింది. బొల్డ్ అందాలను వీక్షించాలనుకునే వారికి ఈ సినిమా మంచి ఛాయిస్. ఇక కథ విషయానికొస్తే..మహేష్ (శ్రీకాంత్) నిజాయితీగల పోలీసు అధికారి. అతని నిజాయితీ వల్ల నష్టపోతున్న కొద్దిమంది రాజకీయ నాయకుల వల్ల అతని భార్యను, పిల్లలను కోల్పోతాడు. దాంతో మహేష్ రాజకీయాల్లో చేరడానికి తన వేషాన్ని, పేరును మార్చుకుంటాడు. వ్యవస్థలో ఉన్న లోపాల్ని ప్రజలను ఎలా తెలియజేశాడన్నది మిగతా కథ.
రా
శ్రీధర్ ఒక ప్లేబాయ్. అమ్మాయిలను ఆకర్షిస్తూ వారిని నిరాశకు గురిచేస్తుంటాడు. శ్రీధర్ స్త్రీ ద్వేషిగా మారడానికి ఒక బలమైన గతం ఉంది. అయితే శాంతి అనే అమ్మాయి కలవడంతో అతని జీవితం మారుతుంది. ఈ చిత్రం యూట్యూబ్లో చూడొచ్చు.
సముద్రం
సాక్షి శివానంద్ ఈ సినిమాలో అవసారనికి మించి అందాల ప్రదర్శన చేసింది. ఈ సినిమా బొల్డ్ కంటెంట్ ప్రేమికులకు మంచి మత్తు అందిస్తుంది. ఈ చిత్రం సన్నెక్స్ట్ ఓటీటీ ప్లాట్పామ్లో అందుబాటులో ఉంది.
10th Class
టినేజ్లో ఉండే ఆకర్షణలను ఈ చిత్రం ద్వారా చూపించారు. ఈ సినిమాలోనూ కొన్ని శృంగార సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. కథ విషయానికొస్తే.. శీను, అంజలి పదోతరగతిలో ప్రేమించుకుంటారు. పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకుని వారికి దూరంగా జీవిస్తుంటారు. ఈక్రమంలో శీను జీవితంలో ఓ విషాదం జరుగుతుంది.
ఆరుగురు పతివ్రతలు
ఈ చిత్రం కూడా బొల్డ్ కంటెంట్ ప్రేమికులకు మంచి మజా అందిస్తుంది. ఈ సినిమాలోని కొన్ని సీన్లకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమా కథ ఏంటంటే.. ఆరుగురు చిన్ననాటి స్నేహితులు ఆరేళ్ల తర్వాత తిరిగి కలుస్తారు. అందరు ఒక దగ్గర చేరి వారి వైవాహిక జీవితంలో జరిగిన సాధక బాధకాలను ఒకరితో ఒకరు పంచుకుంటారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని నేరుగా యూట్యూబ్ ద్వారా వీక్షించవచ్చు.
4 లెటర్స్
ఈ సినిమా కథ ఎలా ఉన్నా.. బొల్డ్ కంటెంట్ మాత్రం దండిగా ఉంటుంది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే.. విజ్జు టాప్ బిజినెస్ మెన్ కొడుకు. కాలేజీలో అంజలిని ఇష్టపడతాడు. అయితే (Telugu Bold Movies) ఆమె బ్రేకప్ చెప్పి వెళ్లిపోవడంతో విజ్జు మరో అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే అంజలి మళ్లీ విజ్జు లైఫ్లోకి వస్తుంది. చివరికి అతడు ఏ అమ్మాయిని ప్రేమించాడు? అన్నది కథ.
రొమాంటిక్ క్రిమినల్స్
ఇందులో కూడా మోతాదుకు మించి అడల్ట్ కంటెంట్ ఉంటుంది. కథ విషయానికొస్తే... కార్తీక్ మరియు ఏంజెల్ అనే యువ జంట డ్రగ్స్ పెడ్లర్ సహాయంతో అనేక నేరాలకు పాల్పడుతారు. తీరా వారు మారాలని నిర్ణయించుకున్నప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఈ చిత్రాన్ని ప్రైమ్లో వీక్షించవచ్చు.
ఈరోజుల్లో
ఇందులో కూడా మంచి రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. కథ విషయానికొస్తే..హీరో (శ్రీ) ఓ అమ్మాయిని పిచ్చిగా ప్రేమించి మోసపోతాడు. అప్పటి నుంచి శ్రీ అమ్మాయిలపై ద్వేషం పెంచుకుంటాడు. శ్రేయాకి కూడా అబ్బాయిలంటే అసలు నచ్చదు. అటువంటి వ్యక్తులు ఎలా ప్రేమలో పడ్డారు? చివరికి ఎలా ఒక్కటయ్యారు? అన్నది కథ. ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్లో చూడవచ్చు.
అల్లరి
అల్లరి నరేష్ హీరోగా నటించిన తొలి చిత్రమిది. ఈ చిత్రంలో కొన్ని హాట్ సీన్లు ప్రేక్షకులను రంజింపజేస్తాయి. ఇందులో పెద్దగా కథేమి లాజిక్గా ఉండదు. రవి, అపర్ణ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. పక్క ఫ్లాట్లోకి వచ్చిన రుచిని రవి ప్రేమిస్తాడు. ఆమెను ముగ్గులో దింపేందుకు రవికి అపర్ణ సాయం చేస్తుంది. ఈ క్రమంలో రవితో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఈ సినిమాను నేరుగా యూట్యూబ్ ద్వారా వీక్షించవచ్చు.
ఆగస్టు 24 , 2024
Niharika Konidela Divorce: అక్కడ పెళ్లి చేసుకుంటే అంతేనా? నిహారిక- చైతన్య, సమంత- నాగచైతన్యకు కలిసి రాని డెస్టినేషన్ వెడ్సింగ్స్!
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక, మాజీ ఐజీ ప్రభాకరరావు కుమారుడు చైతన్యలకు విడాకులు మంజూరు అయ్యాయి. ఏప్రిల్ 1న పరస్పర అంగీకారంతో విడాకుల కోసం కూకట్పల్లిలోని ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకోగా.. జూన్ 5న వీరికి డైవర్స్ మంజూరు అయ్యాయి. అయితే ఈ విషయం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. 2020 డిసెంబర్లో నిహారిక, చైతన్యల వివాహం జరిగింది. పెళ్లి తర్వాత 2 ఏళ్లపాటు ఈ జంట బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో కొద్దికాలం దూరంగా జీవనం సాగించారు. ఆ తర్వాత ఇక కలిసి ఉండలేమని భావించి పరస్పర అంగీకారంతో విడిపోయారు.
విడాకులకు అసలు కారణం ఇదేనా?
నిహారిక- చైతన్య జొన్నలగడ్డ వివాహం తర్వాత నిహారిక చుట్టూ వివాదాలు చుట్టుముట్టాయి. ఒకసారి ఓ పబ్ పార్టీలో నిహారిక పేరు వినిపించడం అప్పట్లో తెగ వైరల్ అయింది. ఓసారి అపార్ట్మెంట్ వాళ్లతో గొడవతో నిహారిక మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో చైతన్య- నిహారికల మధ్య మనస్పర్థలు పెరిగి విడాకులకు దారితీసినట్లు సమాచారం. పెళ్లికి ముందు గారాల పట్టిగా పెరిగిన నిహారిక వివాహా అనంతరం కాస్త ఫ్రీడమ్ను కోల్పోయినట్లు తెలిసింది.
https://twitter.com/Ferrari_Monk/status/1676291467445440512?s=20
విడాకులపై నిహారిక స్పందన
చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకోవడంపై మెగా డాటర్ నిహారిక తొలిసారి స్పందించింది. తాము పరస్పర అంగీకారంతోనే విడిపోయినట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. ఈ సున్నిత సమయంలో తమని ఇబ్బంది పెట్టవద్దని కోరింది. అభిమానులు సంయమనం పాటించాలని కోరింది. కొత్తగా ప్రారంభించే వ్యక్తిగత జీవితంలో తాము ప్రైవసీని కోరుకుంటున్నట్లు పోస్టులో తెలిపింది. దీనిని అందరూ గౌరవించి సహకరించాలని నిహారిక కోరింది. ఇంత కాలం తనకు అండగా ఉన్న కుటుంబసభ్యులకు, స్నేహితులకు ధన్యవాదాలు అంటూ తన పోస్టును నిహారిక ముగించింది.
https://twitter.com/SureshPRO_/status/1676474938033840128?s=20
చైతన్య ఎమన్నారంటే?
నిహారికతో విడాకుల నేపథ్యంలో చైతన్య జొన్నలగడ్డ చేసిన ఇన్స్టా పోస్ట్ వైరల్గా మారింది. నన్ను ఇక్కడికి వచ్చేలా చేసిన ప్రతిఒక్కరికి రుణపడి ఉంటా. 10 రోజులుగా నా జీవితంలో వచ్చిన 'విపాసన' ప్రక్రియ అద్భుతం. మనం ఒక ప్రాంతానికి ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లి.. అద్భుత జ్ఞానంతో తిరిగొస్తుంటాం. ఇది కూడా అలాంటిదే అని పోస్ట్ పెట్టాడు. కాగా ప్రస్తుతం చైతన్య మానసిక ప్రశాంతత పొందేందుకు ముంబైలోని విపాసన మెడిటేషన్ సెంటర్లో ఉన్నట్లు తెలిసింది.
అక్కడ పెళ్లి చేసుకుంటే అంతేనా?
టాలీవుడ్లో సమంత- నాగచైతన్య (Samantha- Nagachithanya) విడాకులు పొందిన తీరును కొంతమంది.. నిహారిక- చైతన్య డైవర్స్తో పోలుస్తున్నారు. ఈ రెండు జంటలు సొంత ప్రాంతంలో కాకుండా బయటి ప్రదేశంలో (డెస్టినేషన్ వెడ్డింగ్) వివాహం చేసుకున్నారు. కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిహారిక- చైతన్య.. 2020 డిసెంబర్ 9న రాజస్థాన్లో గ్రాండ్గా డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination wedding) చేసుకున్నారు. అలా చేసుకున్న రెండేళ్లకే ఈ జంట విడిపోయింది.
అంతకు ముందు 2017 అక్టోబర్ 6న గోవాలో నాగచైతన్య- సమంత ఇదే తరహాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఈ జంట కాపురం కూడా కొద్ది కాలం సజావుగానే సాగింది. ఆ తర్వాత ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో పరస్పర అంగీకారంతో 2021లో విడిపోయారు. దీంతో ఫ్యాన్స్ టాలీవుడ్ సెలబ్రెటీలకు డెస్టినేషన్ మ్యారెజెస్ కలిసి రావడం లేదని వాదిస్తున్నారు. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి అయినా ఇక్కడే పెళ్లి చేసుకోవాలని సూచిస్తున్నారు.
జూలై 05 , 2023
Venkatesh: గుట్టు చప్పుడుకాకుండా వెంకటేష్ రెండో కూతురు పెళ్లి.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ హీరో వెంకటేశ్ రెండో కుమార్తె హయ వాహిని నిశ్చితార్థం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.
విక్టరీ వెంకటేష్ ఇంట్లో త్వరలోనే పెళ్లిసందడి మొదలు కానుంది. ఆయన రెండో కూతురు హయ వాహిని ఎంగేజ్మెంట్ అతి తక్కువ మంది బంధువులు, టాలీవుడ్ ప్రముఖుల మధ్య ఘనంగా జరిగింది.
ఈ నిశ్చితార్థం వేడుక వెంకటేష్ ఇంట్లో జరగ్గా.. టాలీవుడ్కు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, రానా, నాగచైతన్యలతో పాటు ఇతర సినీ ప్రముఖులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
వెంకటేష్ రెండో కుమార్తే హయ వాహినికి విజయవాడకు చెందిన ఓ ప్రముఖ డాక్టర్ కుమారుడితో వివాహం జరగనుంది.
వెంకటేష్, నీరజ దంపతులకు మొత్తం నలుగురు సంతానం... ఆశ్రిత, హయ వాహిని, భావన, అర్జున్ ఉన్నారు. మూడో కుమార్తే భావన, కుమారుడు అర్జున్ విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారు.
వీరిలో పెద్ద కుమార్తే ఆశ్రిత వివాహం 2019లో జరిగింది. . హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో ఆశ్రిత పెళ్లి జైపూర్లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆశ్రిత దంపతులు స్పెయిన్లో సెటిల్ అయినట్లు తెలిసింది.
అయితే వెంకటేష్ రెండో అల్లుడు వివరాలు మాత్రం ఇంకా వెళ్లడించలేదు. కొంత గోప్యత పాటిస్తున్నారు. వచ్చే ఏడాదిలో తన రెండో కుమార్తె హయ వాహిని పెళ్లి చేయనున్నట్లు సమాచారం.
మంచి ముహూర్తం ఉండటంతో ఇప్పుడు నిశ్చితార్థం చేసి.. వచ్చే ఏడాదిలో పెళ్లి చేయనున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. వెంకటేష్ ప్రస్తుతం 'సైంధవ్' సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్టైనర్గా శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి. చాలా రోజుల తర్వాత వెంకటేష్ పూర్తి స్థాయి యాక్షన్ చిత్రంలో నటిస్తుండటంతో అంచనాలు ఏర్పడ్డాయి. వెంకటేష్ సరసన రుహాని శర్మ హీరోయిన్గా నటిస్తోంది.
కాగా సైంధర్ చిత్రం ద్వారా బాలీవుడ్ విలక్షణ నటుడు నవజుద్దీన్ సిద్దిఖీ టాలీవుడ్కు పరిచయం కానున్నారు. ఈ సినిమాలో నవజుద్దీన్ విలన్ రోల్లో కనిపించనున్నారు. సైంధవ్ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.
సంక్రాంతి కానుకగా సెంధవ్ చిత్రాన్ని జనవరి 13న విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
అక్టోబర్ 26 , 2023
Bhale Unnade Movie Review: నెల రోజుల్లో రాజ్ తరుణ్ మూడో చిత్రం.. ‘భలే ఉన్నాడే!’తో హిట్ కొట్టాడా?
నటీనటులు: రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్, అభిరామి, అమ్ము అభిరామి, హైపర్ ఆది, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, కృష్ణ భగవాన్, వీటీవీ గణేష్, సింగీతం శ్రీనివాస్, లీలా శాంసన్, రచ్చ రవి తదితరులు
దర్శకత్వం: జె శివసాయి వర్ధన్
సంగీతం: శేఖర్ చంద్ర
ఛాయాగ్రహణం: నగేష్ బానెల్లా
నిర్మాత: N.V కిరణ్ కుమార్
సమర్పణ: మారుతి
విడుదల తేదీ: 13-09-2024
రాజ్ తరుణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భలే ఉన్నాడే!’ (Bhale Unnade Movie Review in telugu). ఇందులో మనీషా కంద్కూర్ హీరోయిన్గా నటించారు. జె. శివసాయి వర్ధన్ దర్శకత్వం వహించారు. మారుతి టీమ్ సమర్పణలో రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్పై ఎన్వీ కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. నెల రోజుల వ్యవధిలో రాజ్తరుణ్ నుంచి వచ్చిన మూడో చిత్రం ఇది. గత రెండు చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో ‘భలే ఉన్నాడే!’ సినిమాపై రాజ్ తరుణ్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? రాజ్తరుణ్కు విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
రాధ (రాజ్తరుణ్) వైజాగ్లో శారీ డ్రాపర్ (అమ్మాయిలకు చీర కట్టే వృత్తి)గా పనిచేస్తుంటాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి గౌరి (అభిరామి) పెంపకంలో పెరుగుతూ ఆమెకు చేదోడుగా ఉంటాడు. గౌరి పని చేసే బ్యాంకులోనే కొత్తగా కృష్ణ (మనీషా) ఉద్యోగంలో చేరుతుంది. ఆమె గౌరీ తీసుకొచ్చే లంచ్ బాక్స్ తిని రాధ వంటలకు ఫిదా అవుతుంది. రాధ మొహం కూడా చూడకుండానే అతనిపై మనసు పారేసుకుంటుంది. రాధ కూడా కృష్ణను చూడకుండానే లంచ్ బాక్స్ ద్వారా ఆమె పంపే లేఖలు చదువుతూ తనతో ప్రేమలో పడిపోతాడు. వీళ్లిద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమవ్వగా నిశ్చితార్థం సమయంలో కృష్ణ స్నేహితురాలు ఆమెకు ఓ విషయం చెబుతుంది. దీంతో రాధ పెళ్లికి పనికొస్తాడా? లేదా? అన్న సందేహాం కృష్ణకు కలుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? రాధకు కృష్ణ పెట్టిన పరీక్ష ఏంటి? రాధ అమ్మాయిలకు ఎందుకు దూరంగా ఉంటున్నాడు? వారి పెళ్లి జరిగిందా? లేదా? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
రాధ పాత్రలో రాజ్తరుణ్ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. గత చిత్రాలతో పోలిస్తే ఇందులో నటనకు బాగా స్కోప్ దొరికింది. అతడి లుక్స్, భావోద్వేగాలు మెప్పిస్తాయి. కృష్ణ పాత్రలో మనీషా అందంగా కనిపించింది. వీరిద్దరి కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. తల్లిగా అభిరామి పాత్ర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. సింగీతం శ్రీనివాస్ కనిపించేది నాలుగైదు సన్నివేశాలైనా బలమైన ప్రభావాన్ని చూపించారు. అమ్ము అభిరామి, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరుల పాత్రలు పరిధి మేర ఉంటాయి. హైపర్ ఆది, నెల్లూరు సుదర్శన్ పాత్రలు అక్కడక్కడా నవ్వులు పంచుతాయి. మిగిలిన పాత్రధారులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
రాముడిలా ఉండాలనుకునే అబ్బాయిని నేటి సమాజం, అమ్మాయిలు ఎలా చూస్తారన్న కాన్సెప్ట్తో దర్శకుడు శివసాయి వర్ధన్ ఈ సినిమా తెరకెక్కించారు. ప్రథమార్ధం మెుత్తం హీరో, హీరోయిన్ లవ్ట్రాక్, తల్లీకొడుకుల అనుబంధంతో సరదా సరదాగా సాగిపోతుంది. లంచ్ బాక్స్ వారధిగా నడిచే ప్రేమ రాయబరాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. నిశ్చితార్థ సమయంలో వచ్చే మలుపుతో తొలి భాగాన్ని ముగించారు దర్శకుడు. అమ్మాయిలకు రాధ ఎందుకు దూరంగా ఉన్నాడనే నేపథ్యంతో సెకండ్పార్ట్ను తీసుకెళ్లారు. ప్రథమార్ధంతో పోల్చితే ద్వితీయార్ధం చప్పగా సాగినట్లు అనిపిస్తుంది. హీరోను పరీక్షించేందుకు కేరళ ఆశ్రమానికి తీసుకెళ్లడం, అక్కడ వైద్యం పేరుతో శ్రీకాంత్ అయ్యంగార్ చేసే హంగామా పెద్దగా వర్కౌట్ కాలేదు. రాధ-కృష్ణ విడిపోయిన తీరులోనూ కొత్తదనం కనిపించదు. క్లైమాక్స్ కూడా బలహీనంగా ఉండటం మరో మైనస్గా చెప్పవచ్చు.
టెక్నికల్గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్ చక్కటి పనితీరు కనబరిచారు. తన అద్భుత పనితీరుతో స్క్రీన్ను ఫ్రెష్గా, కలర్ఫుల్గా మార్చేశారు. శేఖర్ చంద్ర అందించిన పాటలు గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
రాజ్ తరుణ్ నటనకథా నేపథ్యంప్రథమార్థం
మైనస్ పాయింట్స్
కమర్షియల్ హంగులు లేకపోవడంసెకండాఫ్
Telugu.yousay.tv Rating : 3/5
సెప్టెంబర్ 13 , 2024
Naga Chaitanya - Sobhita: సమంత చేస్తే తప్పు.. శోభిత చేస్తే ఒప్పా! చైతూ నిశ్చితార్థంపై నెటిజన్ల ప్రశ్నలు!
అక్కినేని ఇంటి మరోమారు పెళ్లి బాజాలు మోగనున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. స్టార్ హీరోయిన్ సమంత (Samantha)తో విడాకులు అనంతరం ఆయన మరోమారు పెళ్లికి సిద్దమవుతున్నారు. ప్రముఖ నటి శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala)ను నాగచైతన్య రెండో వివాహం చేసుకోనున్నాడు. తాజాగా వీరికి నిశ్చితార్థం కూడా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇది చూసి అక్కినేని ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. మరోవైపు కొందరు నెటిజన్లు మాత్రం వీరి కలయికను తప్పుబడుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
నాగార్జున స్పెషల్ పోస్టు
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తన తనయుడు నాగ చైతన్య నిశ్చితార్థం గురించి స్వయంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ‘నా తనయుడు నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం ఈ రోజు ఉదయం 9.42 గంటలకు జరిగింది. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది. మా కుటుంబంలోకి ఆమెను సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. నూతన జంటకు నా అభినందనలు. వీరి జీవితం సంతోషం, ప్రేమతో నిండాలని కోరుకుంటున్నా 8.8.8 అనంతమైన ప్రేమకు నాంది’ అని నాగార్జున పేర్కొన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
https://twitter.com/iamnagarjuna/status/1821450886238851531
రెండేళ్లుగా ప్రేమాయణం!
నాగ చైతన్య - శోభిత మధ్య నిశ్చితార్థం వ్యవహారం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. ఇందుకు కారణం వారు రిలేషన్లో ఉన్నట్లు గత కొంత కాలంగా వార్తలు రావడమే. చై-శోభిత డేటింగ్లో ఉన్నట్లు గత రెండేళ్ల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి హాలీడే ట్రిప్నకు సంబంధించిన ఫొటోలు సైతం పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. వీరి జోడి బాగుందంటూ అక్కినేని అభిమానులు పోస్టులు సైతం పెట్టారు. దీంతో చై-శోభిత కచ్చితంగా పెళ్లి పీటలు ఎక్కుతారని అంతా ఊహించారు. అనుకున్నట్లుగానే ఇవాళ బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వీరి నిశ్చితార్థం జరిగింది.
సమంతతో విడాకులు
స్టార్ హీరోయిన్ సమంత (Samantha)ను గతంలో నాగ చైతన్య పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 'ఏం మాయ చేశావే' (Ye Maaya Chesave) సినిమాతో చైతు-సమంతకు పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. 2017లో వివాహ బంధం ద్వారా వారిద్దరు ఒక్కటయ్యారు. బెస్ట్ కపుల్ అంటూ ప్రసంశలు కూడా అందుకున్నారు. అటువంటిది నాలుగేళ్ల తర్వాత వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అభిమానులకు షాకిస్తూ 2021లో నాగ చైతన్య, సమంత విడిపోయారు. ప్రస్తుతం ఎవరి దారి వారిది అన్నట్లుగా జీవిస్తున్నారు. మూడేళ్ల తర్వాత చైతు మరో పెళ్లికి రెడీ కావడంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
శోభితా గురించి ఈ విషయాలు తెలుసా!
శోభితా దూళిపాళ్ల ఏపీలోని తెనాలిలో జన్మించింది. 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్గా నిలిచింది. బాలీవుడ్లో 2016లో విడుదలైన రామన్ రాఘవన్ 2.0 చిత్రం ద్వారా శోభిత సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ‘చెఫ్’, ‘కళాకంది’ వంటి బాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వచ్చి గూఢచారి చిత్రం ద్వారా శోభితా టాలీవుడ్కు పరిచయమైంది. తన అంద చందాలతో తెలుగు యూత్ ఆడియన్స్ను ఆకర్షించింది. ఆ తర్వాత మేజర్, పొన్నియన్ సెల్వన్ 1 & 2 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇటీవల 'మంకీ మాన్' అనే అమెరికన్ ఫిల్మ్లోనూ శోభితా నటించింది. ప్రస్తుతం హిందీలో 'సితారా' అనే చిత్రంలో నటిస్తోంది. ఇక నాగచైతన్య ‘తండేల్’తో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.
సమంత కంటే చాలా బోల్డ్!
‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్లో సమంత బోల్డ్గా నటించడమే విడాకులకు కారణమని అప్పట్లో తెగ ప్రచారం జరిగింది. అలాగే పుష్ప మూవీలో ఐటమ్ సాంగ్ చేయడం వంటి అనేక కారణాలూ వినిపించాయి. అయితే, ఇప్పుడు నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్న శోభిత ధూళిపాళ స్క్రీన్ ప్రజెన్స్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సమంత కంటే ఎక్కువగా బోల్డ్ సీన్స్లో శోభిత నటించిందని కొందరు నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. ‘మేడ్ ఇన్ హెవెన్’ అనే బోల్డ్ వెబ్ సిరీస్లో హాట్ షోతో శోభితా ధూళిపాళ్ల రెచ్చిపోయిందని చెబుతున్నారు. అందులో ఇంటిమేట్ సీన్లలో శోభిత నటించిందని పేర్కొంటున్నారు. అలాగే ‘ది నైట్ మేనెజర్’ వెబ్ సిరీస్లో కూడా బికినీతోపాటు ఘాటు శృంగార సీన్లలో శోభిత యాక్ట్ చేసింది. ఇటీవల రిలీజైన ‘ది మంకీ మ్యాన్’ సినిమాలో సైతం శోభితా హాట్ షో చేసింది. ఎక్స్పోజింగ్, బోల్డ్ సీన్స్ కారణంగా సమంతకు డివోర్స్ ఇచ్చిన నాగ చైతన్య ఆెమె కంటే బోల్డ్ హీరోయిన్ అయిన శోభితాను ఎలా పెళ్లి చేసుకోబోతున్నారు? అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
ఆగస్టు 08 , 2024
Varunlav: కాక్టైల్ పార్టీలో వరుణ్తేజ్ను ఆట పట్టించిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి కార్యక్రమం.. ఇటలీలో జరుగుతున్న సంగతి సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు ఇటలీకి చేరుకున్నాయి. తాజాగా కాబోయే వధువరులు వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి జంట కుటుంబ సభ్యులకు కాట్ టైల్ పార్టీ ఇచ్చింది. తాజాగా ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి.
మెగాబాబు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ త్వరలో లావణ్య త్రిపాఠితో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే.
వీరిద్దరు కొంత కాలంగా ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే.
ఈ కొత్త జంట ఇక్కడ కాదని డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకుంటోంది. వీరిద్దరు తొలిసారిగా అంతరిక్షం సినిమాలో జంటగా నటించారు. ఆ సినిమా షూటింగ్ ఇటలీలో జరిగింది. అక్కడే వరుణ్, లావణ్యలు ప్రేమలో పడ్డారు.
తమ ప్రేమ చిగురించిన ఇటలీలోనే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇటలీలోని టస్కానీలో ఈ కొత్త జంట వివాహం చేసుకోనుంది.
ఈ పెళ్లి కూడా పెద్దగా హడావుడి లేకుండా ఇరుకుటుంబాలకు చెందిన అతికొద్దిమంది కుటుంబ సభ్యుల నడుమ జరగనుంది. నవంబర్ 1న ఈ లవ్ బర్డ్స్ పెళ్లి బంధం ద్వారా ఒక్కటి కానున్నారు.
అయితే సోమవారం రాత్రి వరుణ్తేజ్- లావణ్య జంట కుటుంబ సభ్యులకు కాక్టైల్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీ బోర్గోసాన్ ఫెలిస్ రిసార్ట్లో కాక్టైల్ పార్టీ ఘనంగా జరిగింది.
ఈ పార్టీకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దంపతులు హాజరయ్యారు. అలాగే రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఉత్సాహంగా గడిపాడు. కుటుంబ సమేతంగా దిగిన ఈ పిక్స్ వైరల్గా మారాయి. ఈక్రమంలో అల్లు అర్జున్ వరుణ్ను సరదాగా ఆట పట్టించాడు. నా చెల్లిని జాగ్రత్తగా చూసుకో అంటూ ఫన్నీగా బెదిరించాడు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ ఈ పార్టీలో సందడి చేశారు. చాలా రోజుల తర్వాత అటు మెగా ఫ్యామిలీని ఇటు అల్లు ఫ్యామిలీని ఒకే ఫ్రేమ్లో చూడటంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే వరుణ్ తేజ్ తల్లిదండ్రులు నాగబాబు, పద్మజ దంపతులు పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటలీలోనే లావణ్య త్రిపాఠి పేరెంట్స్ దియోరాజ్, కిరణ్ త్రిపాఠిలతో కలిసి దగ్గరుండి పెళ్లి వేడుకకు కావాల్సిన పనులు చేస్తున్నారు.
నవంబర్ 1న మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాలకు వరుణ్- లావణ్య పెళ్లి బంధం ద్వారా ఏకం కానున్నారు. అదే రోజు రాత్రి 8గంటలకు అక్కడే రిసెప్షన్ కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో 120 మంది వరకు ప్రత్యేక అతిథులు పాల్గొననున్నారు.
ఇటలీ నుంచి హైదరాబాద్కు తిరిగి వచ్చాక నవంబర్ 5న ఇక్కడ రిసెప్షన్ పెట్టనున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ పెద్దలతో పాటు రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు.
అక్టోబర్ 31 , 2023
Sobhita Dhulipala: దేశంలో శోభిత ధూళిపాళ క్రేజ్ మాముల్గా లేదుగా.. జాన్వీ, దీపిక, మృణాల్ను సైతం వెనక్కి నెట్టి!
ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ (Sobhita Dhulipala) పేరు గత కొన్ని రోజులుగా మార్మోగుతోంది. స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya)తో నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి ఈ అమ్మడి పేరు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. స్టార్ హీరోయిన్ సమంతకు విడాకులు ఇచ్చిన చైతూను శోభిత పెళ్లి చేసుకోనుండటంతో ఒక్కసారిగా ఈ భామపై అటెన్షన్ ఏర్పడింది. అక్కినేని ఫ్యాన్స్ శోభిత రాకను సమర్థిస్తుంటే సామ్ అభిమానులు మాత్రం నెట్టింట విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే దేశంలో అత్యంత ప్రజాధరణ పొందిన సెలబ్రిటీల జాబితాలో శోభిత రెండో స్థానంలో నిలిచి సత్తా చాటింది. స్టార్ హీరోలు, హీరోయిన్స్ను వెనక్కి నెట్టి మరి ఈ ఫీట్ సాధించింది. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
శోభితానా మజాకా..!
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ (IMDb) ఎక్కువ ప్రజాదరణ పొందిన నటీనటుల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ వారం తమ వెబ్సైట్లో ఎక్కువ మంది యూజర్లు సెర్చ్ చేసిన సెలబ్రిటీల పేర్ల ఆధారంగా ఐఎండీబీ ఈ లిస్ట్ను రూపొందించింది. ఇందులో నటి శోభిత దూళిపాళ దేశంలోనే టాప్ 2లో నిలిచారు. తొలిస్థానంలో బాలీవుడ్ నటి శార్వరీ (Sharvari) నిలిచింది. శోభిత తర్వాతి స్థానంలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) నిలవడం గమనార్హం. ఇక దీపిక పదుకొణే (Deepika Padukone), జాన్వీ కపూర్ (Janhvi Kapoor), కాజోల్ (Kajol) 4, 5, 6 స్థానాల్లో నిలిచారు. బాలీవుడ్ నటుడు లక్ష్య, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi), హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai) తదుపరి స్థానాల్లో నిలిచారు. అటు శ్వేత బసు ప్రసాద్ 14, దివ్య ఖోస్లా కుమార్ 18, ఫహాద్ ఫాజిల్ 25, విజయ్ 27, విక్రాంత్ మెస్సీ 35, త్రిష 37, జాన్ అబ్రహం 39, కమల్ హాసన్ 50 స్థానాల్లో నిలిచినట్లు ఐఎండీబీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించింది.
View this post on Instagram A post shared by IMDb India (@imdb_in)
పాపులారిటీకి కారణమిదే!
నటుడు నాగ చైతన్యతో శోభితకు ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగార్జున ఈ విషయాన్ని తొలిసారి పంచుకోవడంతో శోభిత పేరు ఒక్కసారిగా వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో ఎంతోమంది నెటిజన్లు ఆమె గురించి తెలుసుకునేందుకు తెగ సెర్చ్ చేశారు. అక్కినేని కుటుంబంలో భాగం కాబోతున్న ఈ భామ వ్యక్తిగత, సినిమా నేపథ్యం గురించి కనుక్కొనే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె ఈ వారం ఇండియన్ పాపులర్ సెలబ్రిటీగా మారిపోయింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఐఎండీబీ పాపులర్ సెలబ్రిటీల జాబితాలో రెండో స్థానం దక్కించుకుంది. చైతూతో ఎంగేజ్మెంట్ శోభితాకు బాగా కలిసొచ్చిందని నెటిజన్లు భావిస్తున్నారు.
నిశ్చితార్థంపై శోభిత స్పందన ఇదే!
టాలీవుడ్ హీరో నాగ చైతన్య (Naga Chaitanya)తో నిశ్చితార్థం జరిగిన ఫొటోలను శోభిత షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేసింది. ‘మన పరిచయం ఎలా మొదలైనా? ప్రేమలో మన హృదయాలు కలిసిపోయాయి’ అని రాసుకొచ్చింది. దీన్ని నాగ చైతన్య రీ పోస్ట్ చేశారు. వాస్తవానికి చై-శోభిత డేటింగ్లో ఉన్నట్లు గత రెండేళ్ల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి హాలీడే ట్రిప్నకు సంబంధించిన ఫొటోలు సైతం పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. వీరి జోడి బాగుందంటూ అక్కినేని అభిమానులు పోస్టులు సైతం పెట్టారు. దీంతో చై-శోభిత కచ్చితంగా పెళ్లి పీటలు ఎక్కుతారని అంతా ఊహించారు. అనుకున్నట్లుగానే బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వీరి నిశ్చితార్థం జరిగింది.
View this post on Instagram A post shared by Sobhita (@sobhitad)
శోభితా గురించి ఈ విషయాలు తెలుసా!
శోభితా దూళిపాళ్ల ఏపీలోని తెనాలిలో జన్మించింది. 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్గా నిలిచింది. బాలీవుడ్లో 2016లో విడుదలైన రామన్ రాఘవన్ 2.0 చిత్రం ద్వారా శోభిత సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ‘చెఫ్’, ‘కళాకంది’ వంటి బాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వచ్చి గూఢచారి చిత్రం ద్వారా శోభితా టాలీవుడ్కు పరిచయమైంది. తన అంద చందాలతో తెలుగు యూత్ ఆడియన్స్ను ఆకర్షించింది. ఆ తర్వాత మేజర్, పొన్నియన్ సెల్వన్ 1 & 2 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇటీవల 'మంకీ మాన్' అనే అమెరికన్ ఫిల్మ్లోనూ శోభితా నటించింది. ప్రస్తుతం హిందీలో 'సితారా' అనే చిత్రంలో నటిస్తోంది. ఇక నాగచైతన్య ‘తండేల్’తో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.
ఆగస్టు 13 , 2024
Raj Tarun Case: కడుపు చేసి అబార్షన్ చేయించాడు..రాజ్తరుణ్పై లావణ్య సంచలన వ్యాఖ్యలు!
టాలీవుడ్ నటుడు రాజ్తరుణ్ (Raj Tarun), అతడి మాజీ ప్రేయసి లావణ్య (Lavanya) కేసు వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని లావణ్య ఇటీవల నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తాజాగా ఆమె మరోమారు పోలీసులను ఆశ్రయించడం ఆసక్తికరంగా మారింది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు, మెడికల్ రిపోర్ట్స్ను సైతం ఆమె పోలీసులకు అందజేశారు. దీంతో నార్సింగి పోలీసులు రాజ్తరుణ్తో పాటు హీరోయిన్ మాల్వి మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రాపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం టాలీవుడ్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
తాజా ఫిర్యాదులో ఏముందంటే?
లావణ్య ఇచ్చిన లేటెస్ట్ ఫిర్యాదు ఆధారంగా ఈ కేసులో ఏ1గా రాజ్తరుణ్, ఏ2గా మాల్వీ మల్హోత్రా, ఏ3గా మయాంక్ మల్హోత్రాను పోలీసులు చేర్చారు. అంతకుముందు లావణ్య తన ఫిర్యాదులో వారిపై మరిన్ని అభియోగాలు మోపారు. 2008 నుంచి రాజ్తరుణ్తో పరిచయం ఉందని, 2010లో ప్రపోజ్ చేసి 2014లో తనను పెళ్లి చేసుకున్నట్లు ఎఫ్ఐఆర్లో వెల్లడించారు. రాజ్తరుణ్ కుటుంబానికి తన ఫ్యామిలీ రూ.70 లక్షలు ఇచ్చిందని లావణ్య తెలిపారు. 2016లో తాను గర్భం దాల్చానని రెండో నెలలోనే అతడు అబార్షన్ చేయించినట్లు ఫిర్యాదులో వెల్లడించారు. సర్జరీకి సంబంధించిన ఆసుపత్రి బిల్లులు రాజ్ చెల్లించినట్లు చెప్పారు. నటి మాల్వీ పరిచయం అయ్యాకే రాజ్ తన నుంచి దూరమయ్యాడని పోలీసులకు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే నటి మాల్వీతో పాటు ఆమె సోదరుడు మయాంక్ తనను బెదిరించారని తెలిపారు. లావణ్య ఫిర్యాదు మేరకు సెక్షన్ 420, 493, 506 కింద రాజ్ తరుణ్తో పాటు మాల్వీ, మయాంక్లపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు.
https://twitter.com/i/status/1811302046747803956
కీలక ఆధారాలు అందజేత!
రాజ్తరుణ్ను హెచ్చరిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో క్లిప్స్పై లావణ్య స్పందించారు. తనను రెచ్చగొట్టి ఉద్దేశపూర్వంగా ఆడియో రికార్డ్ చేశారని పేర్కొంది. మాల్వీ మల్హోత్రా, రాజ్తరుణ్ విదేశాలకు వెళ్లేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. తమ బెదిరింపు, చాట్కు సంబంధించిన స్క్రీన్ షాట్స్, టెక్నికీల్ ఎవిడెన్స్ను నార్సింగి పోలీసులకు అందజేసినట్లు లావణ్య చెప్పారు. పోలీసు వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.
https://twitter.com/i/status/1811055519525679537
లావణ్యనే బెదిరించింది : మాల్వీ
నటుడు రాజ్తరుణ్తో తనకు ఎలాంటి సంబంధం లేదని 6 నెలలుగా తాము మాట్లాడుకుందే లేదని ఓ న్యూస్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో మాల్వీ మల్హోత్రా స్పష్టం చేశారు. తాను లావణ్యను బెదిరించలేదని, కనీసం ఆమె ఎలా ఉంటుందో కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చారు. మరోవైపు లావణ్యనే తనకు కాల్ చేసి వేధించిందని ఆరోపించారు. తనను, తన కుటుంబాన్ని లావణ్య మెంటల్గా హేరాస్ చేసిందని చెప్పారు. తన నెంబర్ బ్లాక్ చేస్తే ఆమె నేరుగా తన తల్లిదండ్రులకు కాల్ చేసి వాళ్లని ఇబ్బంది పెట్టిందని అన్నారు. తన పేరెంట్స్ నెంబర్ ఎవరితోనూ షేర్ చేసుకోలేదని అయినా ఆమె వద్దకు ఎలా వచ్చిందని మాల్వీ ప్రశ్నించారు. లావణ్య తన మీద అసత్య ప్రచారాలు చేస్తోందని పేర్కొన్నారు. రాజ్ కేవలం తనకు సహచర నటుడు మాత్రమేనని మేము కలిస్తే సినిమాల గురించే మాట్లాడుకుంటామని మాల్వీ స్పష్టం చేశారు. అంతకుమించి అతడిలో ఎలాంటి సంబంధం లేదని ఇంటర్యూలో వెల్లడించారు. తన సోదరుడు గురించి చేసినవన్నీ తప్పుడు ఆరోపణలు అని కొట్టిపారేశారు.
https://twitter.com/i/status/1809555802203607322
లావణ్యపై ఫిర్యాదు
మరోవైపు నటి మాల్వీ మల్హోత్రా లావణ్యపై ఫిల్మ్నగర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హిమాచల్ప్రదేశ్కు చెందిన మాల్వీ మల్హోత్ర ఫిల్మ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని టోలిచౌకి అజీజ్బాగ్కాలనీలోని విక్టోరియం ఆదిత్య ఎంప్రెస్ టవర్లో నివాసం ఉంటున్నారు. కొన్ని రోజులుగా తన సోదరుడికి లావణ్య వాట్సాప్, ఇన్స్టాలో అనుచిత సందేశాలు పంపుతుందని మాల్వీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై లావణ్య తప్పుడు ఆరోపణలు చేస్తోందని వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఫిల్మ్నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జూలై 11 , 2024
హీరోయిన్ ఆనంది గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
వరంగల్కు చెందిన ఆనంది(Anandi).. 2012లో వచ్చిన 'ఈ రోజుల్లో' (Ee Rojullo) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చిన్న పాత్రలు చేసుకుంటూ వెళ్లిన ఈ భామ.. తన ఫోకస్ను తమిళ మూవీస్పై వైపు మళ్లించింది. అక్కడ యంగ్ హీరోల సరసన హీరోయిన్గా చేసి అందరి ప్రశంసలు అందుకుంది. తెలుగులో జాంబి రెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం చిత్రాల్లో ఈ తెలుగింటి అందం మెయిన్ హీరోయిన్గా చేసింది. మరి ఆనంది గురించి కొన్ని టాప్ సీక్రెట్స్ ఇప్పుడు చూద్దాం.
ఆనంది అసలు పేరు?
రక్షిత
ఆనంది ముద్దు పేరు?
హసిక
ఆనంది ఎప్పుడు పుట్టింది?
1993, జులై 30న జన్మించింది
ఆనంది ఎక్కడ పుట్టింది?
ఆనంది వరంగల్లో జన్మించింది.
ఆనంది నటించిన తొలి సినిమా?
ఈరోజుల్లో(2012)
ఆనంది తమిళ్లో నటించిన తొలి సినిమా
పోఱియాళన్
ఆనంది ఎత్తు ఎంత?
5 అడుగుల 5అంగుళాలు
ఆనంది అభిరుచులు?
డ్యాన్సింగ్
ఆనందికి ఇష్టమైన ఆహారం?
నాన్వెజ్
ఆనందికి ఇష్టమైన కలర్?
బ్లాక్
ఆనందికి ఇష్టమైన హీరో?
మహేష్ బాబు
ఆనంది ఏం చదివింది?
డిగ్రీ
ఆనంది పారితోషికం ఎంత తీసుకుంటుంది?
ఒక్కొ సినిమాకు రూ. 50లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.
ఆనంది సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
మోడలింగ్ చేసేది
ఆనంది వివాహం ఎప్పుడు జరిగింది?
2021 జనవరి 7న తమిళ్ కో డైరెక్టర్ సోక్రటీస్తో ఆనంది పెళ్లి జరిగింది.
https://www.youtube.com/watch?v=LzEupj3YxAc
ఆనంది ఇన్స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/kayal_anandhi/
అక్టోబర్ 22 , 2024
Kiara Advani: వైరల్ అవుతున్న కియారా అద్వానీ హాట్ పిక్స్.. ఎందుకంటే?
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్మోగుతోంది. స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను ఆమె పెళ్లి చేసుకొని నేటితో సంవత్సరం పూర్తవడమే ఇందుకు కారణం.
https://twitter.com/i/status/1755075870287696051
ప్రస్తుతం #KiaraAdvani, #SidKiara హ్యాష్ట్యాగ్లతో ఈ జంటకు సంబంధించిన సమాచారం నెట్టింట వైరల్ అవుతోంది.
https://twitter.com/narmadakrystle/status/1755107606824440246
గతేడాది ఈ రోజునే (07 ఫిబ్రవరి, 2024) ఈ బాలీవుడ్ స్టార్ జంట పెళ్లి జరిగింది. రాజస్థాన్ జైసల్మేరులోని ప్యాలెస్లో అతిరథ మహారథుల సమక్షంలో అంగరంగ వైభోగంగా జరిగింది.
https://twitter.com/i/status/1754935624178778242
నటి కియారా అద్వానీ బాలీవుడ్తో పాటు టాలీవుడ్కు సుపరిచితమే. ఆమె తెలుగులోనూ పలువురు స్టార్ హీరోలతో నటించింది.
View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani)
2018లో మహేష్తో చేసిన 'భరత్ అనే నేను' (Bharat Ane Nenu) సినిమా ద్వారా ఆమె తొలిసారి టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఇందులో వసుమతి పాత్రలో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani)
మరుసటి ఏడాది రామ్చరణ్తో ‘వినయ విధేయ రామ’ (Vinaya Vidheya Rama)లో కనిపించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ చరణ్తో పాటు కియారా కూడా మంచి నటనే కనబరిచి ప్రశంసలు అందుకుంది.
ఆ సినిమా ఫ్లాప్తో కియారాకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఆమె పూర్తిగా బాలీవుడ్కు పరిమితమై అక్కడ పలు హిట్ సినిమాల్లో నటించింది.
ఇక కియారా (Kiara Advani) చేసిన ప్రముఖ బాలీవుడ్ సినిమాల విషయానికి వస్తే.. ఆమె తొలుత ‘ఫుగ్లీ’ (Fugly) చిత్రం ద్వారా కెరీర్ను ప్రారంభించింది.
తన రెండో చిత్రం ఎం.ఎస్ ధోని (M.S. Dhoni: The Untold Story) ద్వారా కియారా పేరు బాలీవుడ్లో మార్మోగిపోయింది. ఇందులో సాక్షి రావత్ పాత్రలో ఆమె జీవించింది.
‘లస్ట్ స్టోరీస్’ (Lust Stories) సిరీస్లో మేఘా ఉపాధ్యాయ్ పాత్ర పోషించి ఆశ్చర్యపరిచింది. హస్త ప్రయోగం చేసుకునే అమ్మాయి పాత్రలో కనిపించి అందరికీ షాకిచ్చింది. ఈ సిరీస్లో శృంగారం హద్దులు దాటిందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
https://twitter.com/i/status/1755140256859615281
ఆ తర్వాత బాలీవుడ్లో ‘కబీర్ సింగ్’, ‘షేర్షా’, ‘భూల్ భూలయ్యా 2’ వంటి హిట్ చిత్రాల్లో నటించి బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ (Kiara Advani)గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
షేర్షా సినిమాలో సిద్ధార్థ మల్హోత్రాతో ఈ కియారా జోడీగా నటించింది. అయితే సినిమాకు ముందు నుంచే వీరి మధ్య రిలేషన్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. 2020లోనే వీరు డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
ఆ వార్తలపై స్పందించకుండా సస్పెన్స్ మెయింటెన్ చేసిన ఈ జంట.. చివరికీ పెళ్లి బంధంతో ఒక్కటై ఆ వార్తలను నిజం చేసింది.
ప్రస్తుతం కియారా (Kiara Advani).. చరణ్తో ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తోంది. తమిళ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న ఈ చిత్రం పాన్ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
అటు తారక్ - హృతిక్ రోషన్ కాంబోలో రానున్న వార్-2 సినిమాలోనూ కియారా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ రెండు సినిమాల్లో నటిస్తూ కియారా బిజీ బిజీగా గడుపుతోంది.
ఓ వైపు వరుస సినిమాల్లో నటిస్తూన్నే సోషల్మీడియాలోనూ ఈ బ్యూటీ (Kiara Advani) చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది.
ఫిబ్రవరి 07 , 2024
ఉగాది స్పెషల్(మార్చి 22): ఈ వారం థియేటర్లు / ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు
తెలుగు కొత్త సంవత్సరం ఉగాది పురస్కరించుకొని వివిధ సినిమాలు సందడి చేయనున్నాయి. థియేటర్లు / ఓటీటీల్లో విడుదలకు సిద్ధమయ్యాయి. దర్శకుడిగా విశ్వక్ సేన్, పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ మళ్లీ అలరించేందుకు రెఢీ అయ్యారు.
దాస్ కా ధమ్కీ
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మళ్లీ మెగా ఫోన్ పట్టుకున్నాడు. దాస్ కా ధమ్కీ చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించనున్నాడు. మార్చి 22న ఉగాది రోజున సినిమాను విడుదల చేస్తున్నారు. పాగల్ తర్వాత విశ్వక్ సేన్, నివేదా పెతురాజ్ మరోసారి జంటగా నటించారు. యాక్షన్, కామెడీ తరహాలో సినిమా రూపుదిద్దుకుంది.
రంగ మార్తాండ
కుటుంబ కథా చిత్రాల దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కించిన చిత్రం రంగ మార్తాండ, రంగస్థల కళాకారుల జీవితాన్ని తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరాఠీ చిత్రం నట సామ్రాట్ చిత్రానికి రీమేక్గా వస్తుంది. ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్య కృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కూడా ఉగాదికి విడుదలవుతుంది.
ఘోస్టీ
వివాహం తర్వాత భర్త, కుమారుడికి సమయాన్ని కేటాయించిన కాజల్ అగర్వాల్ అభిమానుల కోసం మళ్లీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె నటించిన ఘోస్టీ తెలుగులో కోస్టీ పేరుతో సినిమాను విడుదల చేస్తున్నారు. హార్ర్ర్ కామెడీ తరహాలో తెరకెక్కిన చిత్రం ఉగాదికి థియేటర్లలో సందడి చేయనుంది.
గీత సాక్షిగా
ఆదర్శ్, చిత్రా శుక్లా జంటగా నటించిన ఈ సినిమా కూడా మార్చి 22న రిలీజ్ అవుతుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా గీత సాక్షిగా చిత్రాన్ని ఆంటోని మట్టపల్లి తెరకెక్కించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. చిత్రాన్ని తెలుగు, హిందీలోనూ విడుదల చేస్తున్నారు మేకర్స్. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ చూస్తే సస్పెన్స్ జోనరల్ సాగే చిత్రమని అర్థమవుతుంది.
ఓటీటీ సినిమాలు
Title CategoryLanguagePlatformRelease DatePanchatantram Movie Telugu ETV WinMarch 22Vinaro bhagyamu vishnu kathaMovie Telugu Aha March 22American apokalipseMovieEnglishNetflixMarch 22Jhony Movie EnglishNetflixMarch 23
మార్చి 20 , 2023
Divorces in Akkineni Family: అక్కినేని ఫ్యామిలీలో ఇంత మంది విడాకులు తీసుకున్నారా?
టాలీవుడ్ నటుడు అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya), ప్రముఖ నటి శోభిత దూళిపాళ (Sobhita Dhulipala) త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. తాజాగా వీరి నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. అక్కినేని నాగార్జున తన కుమారుడికి ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని స్వయంగా ప్రకటించడంతో ఈ వార్త నిమిషాల వ్యవధిలోనే వైరల్గా మారింది. అయితే స్టార్ హీరోయిన్ సమంతను గతంలో నాగచైతన్య వివాహం చేసుకున్నారు. మనస్పర్థల కారణంగా వారు విడిపోయారు. నాగ చైతన్య తాజా ఎంగేంజ్మెంట్ నేపథ్యంలో ఈ డివోర్స్ అంశం మరోమారు తెరపైకి వచ్చింది. అక్కినేని కుటుంబాలకు వివాహాలు అసలు కలిసి రావడం లేదన్న చర్చ కూడా నెట్టింట వినిపిస్తోంది. అక్కినేని ఫ్యామిలీలోని దాదాపు నాలుగు జంటలు విడాకుల తీసుకున్న విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. వాటికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
అక్కినేని ఫ్యామిలీ
అక్కినేని నాగచైతన్య - సమంత విడాకుల వ్యవహారానికి ముందే ఆ ఫ్యామిలోలో నాలుగు జంటలు విడాకులు తీసుకున్నాయి. నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరావు. అన్నపూర్ణమ్మ దంపతులకు ఐదుగురు సంతానం కాగా వారిలో ఒకరైనా అక్కినేని నాగార్జున హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. పెద్ద కుమారుడు అక్కినేని వెంకట్ నిర్మాతగా కొన్ని సినిమాలు నిర్మించారు. కూతురు సత్యవతి పిల్లలైన సుమంత్, సుప్రియ ఇద్దరూ కూడా తెలుగు సినీ పరిశ్రమకు సుపరిచితమే. మరో కూతురు నాగసుశీల కుమారుడు సుశాంత్ కూడా ఇండస్ట్రీలో నటుడిగా రాణిస్తున్నాడు.
https://twitter.com/iam_strganesh/status/1821881385251991843
నాగార్జున విడాకులు
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) మెుదట రామానాయుడు కుమార్తె లక్ష్మీ దగ్గుబాటిని వివాహం చేసుకున్నారు ఆమె సినీ హీరో వెంకటేష్ (Venkatesh), నిర్మాత సురేష్ బాబుల సోదరి. వీరి సంతానంగా నాగచైతన్య జన్మించగా ఆరేళ్ల వివాహ బంధానికి వీరు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత లక్ష్మీ అమెరికా వెళ్లిపోగా నాగార్జున రెండేళ్ల తర్వాత అమలతో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా అక్కినేని అఖిల్ జన్మించాడు. అక్కినేని కుటుంబంలో ఇది మొదటి విడాకుల వ్యవహారం.
సుమంత్ విడాకులు
నాగార్జున మేనల్లుడు సురేంద్ర యార్లగడ్డ -సత్యవతిల కుమారుడైన నటుడు సుమంత్ (Sumanth) కెరీర్ మంచి ఫామ్లో ఉండగా ‘తొలి ప్రేమ’ ఫేమ్ హీరోయిన్ కీర్తి రెడ్డిని ప్రేమించి 2004 ఆగస్టులో వివాహం చేసుకున్నాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ రెండేళ్ల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. కీర్తి రెడ్డి బెంగళూరు వెళ్లి సెటిల్ కాగా సుమంత్ మాత్రం అప్పటి నుంచి సింగిల్గానే ఉండిపోయారు. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలతో బిజీగా మారుతున్నారు.
సుప్రియా జీవితంలో విషాదం
సుమంత్ సోదరి సుప్రియ యార్లగడ్డ (Supriya Yarlagadda) కూడా దాదాపు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా పరిచయమైన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో సుప్రియ హీరోయిన్గా పరిచయమైంది. అయితే ఆ తర్వాత ఆమె నటనకు దూరమై ఎక్కువగా సినీ నిర్మాణ కార్యకలాపాలలో భాగమైంది. ఈ క్రమంలోనే ఆమె చరణ్ రెడ్డి అనే నటుడిని ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుంది. అయితే వీరి వివాహం కూడా ఎక్కువ రోజులు సాఫీగా సాగలేదు. కొన్నాళ్లకు చరణ్ రెడ్డి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే జీవిస్తున్నారు.
అఖిల్ నిశ్చితార్థం రద్దు
అక్కినేని నాగచైతన్య సమంతల వివాహం కంటే ముందే అక్కినేని అఖిల్ (Akhil Akkineni) పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమయ్యాడు. రామ్ చరణ్ భార్య ఉపాసన బంధువు అయినా శ్రియ భూపాల్తో అఖిల్కు నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఈ వ్యవహారం పెళ్లి వరకు వెళ్ళలేదు. కొన్ని కారణాలతో అఖిల్-శ్రియ పెళ్లి క్యాన్సిల్ అయింది. ఈ క్రమంలో శ్రియ భూపాల్ మరో యువకుడిని పెళ్లి చేసుకోగా అఖిల్ మాత్రం సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.
నాగ చైతన్య - సమంత డివోర్స్
2017లో నాగ చైతన్య, సమంత గోవాలో గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. 2010లో ‘ఏమాయ చేశావే’ సినిమాతో ఏర్పడిన పరిచయం ఆపై ప్రేమగా మారింది. ఏడేళ్ల లవ్ తర్వాత వీరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వివాహం తర్వాత టాలీవుడ్ క్యూట్ కపుల్గా గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. అటువంటిది అనూహ్యంగా 2021లో ఈ జంట విడాకులు తీసుకొని ఫ్యాన్స్తో పాటు యావత్ సినీ లోకాన్ని షాక్కు గురి చేసింది. ఆ సమయంలో అందరూ సమంతనే పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు. పెళ్లి తర్వాత సమంత బోల్డ్ రోల్స్ చేయడమే విడాకులకు కారణమైందని కొందరు నిందించారు.
ఆగస్టు 10 , 2024
Sonakshi Sinha: సోనాక్షి ప్రెగ్నెంట్ అంటూ టార్గెట్ చేసిన నెటిజన్లు.. అసలు నిజం ఇదే!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. జహీర్ ఇక్బాల్ (Zaheer Iqbal) అనే బాలీవుడ్ నటుడితో రెండేళ్లుగా రిలేషన్లో ఉన్న సోనాక్షి.. తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకుంది. జూన్ 23న కుటుంబ సభ్యులు, స్నేహితులు సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోనాక్షి నెట్టింట పంచుకోవడంతో పెళ్లి విషయం వెలుగుచూసింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఆసుపత్రి బయట సోనాక్షి సిన్హా కనిపించడం చర్చనీయాశంగా మారింది. పెళ్లైన ఐదు రోజులకే సోనాక్షి గర్భవతి అయ్యిదంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో వాస్తవమెంతా? సోనాక్షి ఎందుకు ఆస్పత్రికి వెళ్లింది? అందుకు గల కారణం ఏంటి? ఇప్పుడు చూద్దాం.
ఆస్పత్రి వీడియో వైరల్
ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తాజాగా నటి సోనాక్షి సిన్హా తన భర్త జహీర్ ఇక్బాల్తో కలిసి వెళ్లారు. దీంతో ఆమెకు పెగ్నెన్సీ వచ్చిందన్న రూమర్లు ఒక్కసారిగా బయటకొచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్గా మారింది. దీంతో పెళ్లైన ఐదు రోజులకే ఆమె ప్రెగ్నెంట్ అయ్యిందంటూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. చెకప్ చేయించుకోవడం కోసమే నవ దంపతులు ఆసుపత్రికి వెళ్లారంటూ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లై వారం కాకుండానే ప్రెగ్నెంట్ కావడం ఏంటని కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
https://twitter.com/i/status/1806851946453574006
https://twitter.com/kapil9994/status/1806705767241715793
నిజం ఏంటంటే?
ప్రముఖ బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా.. సోనాక్షి సిన్హాకు స్వయానా తండ్రి. అయితే ఒత్తిడి కారణంగా శత్రుఘ్న కాస్త అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ముంబయిలో కోకిలా బెన్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తండ్రిని యోగ క్షేమాలు తెలుసుకునేందుకు సోనాక్షి సిన్హా తన భర్తతో ఆసుపత్రికి వెళ్లినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. బయట జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశాయి. సోనాక్షి సిన్హా ప్రెగ్నెంట్ కాదని క్లారిటీ ఇచ్చాయి.
విందుతో పరిచయం
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇచ్చిన ఓ విందులో తొలిసారి సోనాక్షి, జహీర్ ఇక్బాల్ కలిశారు. అక్కడ ఏర్పడిన పరిచయం తొలుత స్నేహంగా మారింది. రెండేళ్ల క్రితం ఇద్దరూ కలిసి 'డబుల్ ఎక్సెల్' ఫిల్మ్ కూడా చేశారు. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురుంచినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే వారికి ఎంగేజ్మెంట్ కూడా జరిగిందని రూమర్లు వచ్చాయి. తాజాగా పెళ్లితో ఈ రూమర్లకు సోనాక్షి జంట బ్రేక్ వేసింది. అయితే పెళ్లికి ముందే కాబోయే శ్రీమతికి రూ.3 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ కారును జహీర్ గిఫ్ట్గా ఇచ్చినట్లు తెలుస్తోంది.
సోనాక్షి స్టార్డమ్
శత్రుఘ్న సిన్హా నట వారసురాలిగా సోనాక్షి సిన్హా.. బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తొలి చిత్రం 'దబాంగ్' (Dabangg) బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇందులో సల్మాన్ ఖాన్ (Salman Khan) సరసన రాజో పాండే పాత్రలో సోనాక్షి అదరగొట్టింది. తన తర్వాతి చిత్రం అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో ‘రౌడీ రాథోడ్’ (Rowdy Rathore)లో కనిపించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు మారిపోయింది. ఆ తర్వాత వరుసగా ఓమై గాడ్, దబాంగ్ 2, యాక్షన్ జాక్సన్, లింగా, అకిరా, ఫోర్స్ 2, దంబాగ్ 3, డబుల్ ఎక్స్ఎల్ చిత్రాలతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ప్రస్తుతం కకుడా, నికితా రాయ్ అండ్ ది బుక్ ఆఫ్ డార్క్నెస్ చిత్రాల్లో సోనాక్షి నటిస్తోంది.
జూన్ 29 , 2024
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్టు.. తండ్రిని గట్టిగా హగ్ చేసుకొని..!
టాలీవుడ్లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు 'విజయ్ దేవరకొండ' (Vijay Devarakonda). ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ రౌడీ బాయ్.. తనకంటూ ప్రత్యేకమైన స్టార్డమ్ను సృష్టించుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి’, ‘పెళ్లి చూపులు’, ‘గీతా గోవిందం’, ‘ట్యాక్సీవాలా’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలతో స్టార్ హీరోల సరసన నిలిచాడు. కాగా, ఇటీవల విజయ్.. తన ఫ్యామిలీతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లాడు. అక్కడ కుటుంబ సభ్యులతో దిగిన ఎమోషనల్ ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఎమోషనల్ పోస్టు
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.. తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవిలతో పాటు సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లాడు. విజయ్ తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి. గత కొంత కాలంగా వరుస షూటింగ్ షెడ్యూల్స్తో బిజీ బిజీగా గడుపుతోన్న విజయ్.. విరామం కోసం అమెరికాకు వెళ్లి కొద్ది రోజులు ఫ్యామిలీతో సరదాగా గడిపారు. తాజాగా ఇండియాకు వచ్చిన విజయ్.. అక్కడ తన ఫ్యామిలీతో దిగిన ఫొటోలను పంచుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన అమ్మనాన్న, సోదరుడితో కలిసి అమెరికా వెకేషన్ను.. విజయ్ ఎంత బాగా ఆస్వాదించారో ఈ ఫొటోల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా తండ్రి గోవర్ధన్రావును విజయ్ గట్టిగా హగ్ చేసుకున్న ఫొటో ఫ్యాన్స్ను విపరీతంగా ఆకర్షిస్తోంది.
https://www.instagram.com/p/C8W7M9Jys78/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
అసిస్టెంట్ డైరెక్టర్గా త్రివిక్రమ్ కుమారుడు!
విజయ్ దేవరకొండ తీసిన గత మూడు చిత్రాలు (లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్) బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచాయి. దీంతో విజయ్ తన తర్వాతి చిత్రంపై ఫోకస్ పెట్టాడు. ‘VD12’ ప్రొడక్షన్ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పెద్ద కుమారుడు రిషి.. ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతనిది హీరో ఫేస్ అని అభిమానులు అంటున్నా.. రిషి మాత్రం కెమెరా వెనుక నుంచి తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారట. ఇందుకు త్రివిక్రమ్ కూడా ఓకే చెప్పడంతో విజయ్ దేవరకొండ సినిమా ద్వారానే రిషి తన సినీ కెరీర్ను మెుదలుపెట్టినట్లు సమాచారం.
పోలీసు ఆఫీసర్గా విజయ్
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న VD12 చిత్రంలో విజయ్.. ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా కనిపిస్తారని సమాచారం. ఇందులో సీరియస్ పోలీసు ఆఫీసర్గా విజయ్ కనిపించనున్నాడట. హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree)ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా, ఈ సినిమాలో ప్రముఖ నటుడు సత్యదేవ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాలీవడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇటీవల అతడు నటించిన 'కృష్ణమ్మ' ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో సత్యదేవ్ కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారట.
సాయిపల్లవితో రొమాన్స్
రౌడీ భాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda).. దర్శకుడు రవికిరణ్ కోలా (Ravi Kiran Kola)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీకి దిల్ రాజు (Dil Raju) నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇది అందమైన, సరికొత్త ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా నటించనున్నట్లు కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. చిత్ర యూనిట్ సాయిపల్లవిని కలిశారని, ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు ఫిల్మ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది నిజమైతే విజయ్ - సాయి పల్లవి జోడీ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్గా నిలుస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.
జూన్ 19 , 2024