రివ్యూస్
How was the movie?
తారాగణం
విశాల్
రీమా సేన్
శ్రీయా రెడ్డి
వడివేలు
మనోజ్ కె. జయన్
I.M. విజయన్
వినాయకన్
శ్రీరంజిని
నీలిమ ఎసై రాణి
నిజల్గల్ రవి
పవన్
మాణిక్క వినాయగం
భాను చందర్
హేమలత
రోబో చంద్రు
సిబ్బంది
తరుణ్ గోపి
దర్శకుడువిక్రమ్ కృష్ణా రెడ్డి'
నిర్మాతయువన్ శంకర్ రాజా
సంగీతకారుడుప్రియన్
సినిమాటోగ్రాఫర్విటి విజయన్
ఎడిటర్కథనాలు
Hero Vishal: విశాల్ vs తమిళ నిర్మాతల మండలి.. కోలీవుడ్లో రచ్చరేపుతున్న వివాదం!
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ (Vishal)కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. అతడు చేసే యాక్షన్ చిత్రాలకు మాస్ ఆడియన్స్లో పెద్ద ఫాలోయింగ్ ఉంది. అయితే ముక్కుసూటి మనస్తత్వం కలిగిన విశాల్ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో వివాదానికి విశాల్ కేంద్ర బిందువుగా మారారు. తమిళ నిర్మాతల మండలితో తలెత్తిన గొడవ నేపథ్యంగా ఎక్స్ వేదికగా ఘాటు పోస్టు పెట్టాడు. ‘నన్ను ఆపడానికి ప్రయత్నించండి’ అంటూ గట్టి సవాలు విసిరారు. అసలు విశాల్ ఈ పోస్టు ఎందుకు పెట్టాడు? నిర్మాతల మండలితో అతడికి తలెత్తిన వివాదం ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం.
అసలేం జరిగింగంటే?
హీరో విశాల్ గతంలో టీఎఫ్పీసీ (తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్) అధ్యక్షుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రూ.12 కోట్ల నిధులను విశాల్ దుర్వినియోగం చేశాడని అతడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఇటీవల తమిళనాడు ప్రభుత్వం, కొందరు నిర్మాతలను పరోక్షంగా టార్గెట్ చేస్తూ విశాల్ కొన్ని కామెంట్స్ చేశాడు. తమిళనాడులోని థియేటర్స్ అన్ని కొంతమంది చేతుల్లోనే ఉన్నాయని ఆరోపించారు. వాళ్లు చెప్పినప్పుడే సినిమాను రిలీజ్ చేయాలని, సినిమా వాళ్లను వారు కంట్రోల్ చేస్తున్నారని విమర్శించారు. దీనిపై ఆగ్రహించిన ‘టీఎఫ్పీసీ’ విశాల్ను టార్గెట్ చేస్తూ కొన్ని ఆంక్షలు విధించింది. ఇక మీదట విశాల్తో సినిమాలు చేయకూడదని అల్టిమేటం జారీ చేసింది.
విశాల్ స్ట్రాంగ్ వార్నింగ్!
‘టీఎఫ్పీసీ’ ఆదేశాలను తీవ్రంగా ఖండిస్తూ విశాల్ (Vishal) ఆసక్తికర పోస్టు పెట్టారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సినిమాలు చేయడం మానుకోనని స్పష్టం చేశాడు. ఒకవేళ తనను ఆపే ప్రయత్నం చేస్తే నిర్మాతలమని చెప్పుకొనే కొందరు ఎప్పటికీ సినిమాలు ప్రొడ్యూస్ చేయాలేరని హెచ్చరించాడు. అలాగే నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలపై తన పోస్టులో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు విశాల్. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యుల సంక్షేమానికే మేం నిధులు వినియోగించాం. వృద్ధులు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఆరోగ్య బీమా కల్పించాం. మిస్టర్ కథిరేసన్ ఈ నిర్ణయం మీ టీమ్తో కలిసి తీసుకున్నదనే విషయం తెలియదా? మీ పని మీరు సక్రమంగా చేయండి. ఇండస్ట్రీ కోసం చేయాల్సింది చాలా ఉంది. రెట్టింపు పన్ను, థియేటర్ నిర్వహణ ఖర్చులు ఇలా ఎన్నో సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. నేను సినిమాలు చేస్తూనే ఉంటా. కావాలంటే నన్ను ఆపడానికి ప్రయత్నించండి' అంటూ ఎక్స్లో సుదీర్ఘ పోస్టు పెట్టాడు. ప్రస్తుతం ఇది వైరల్గా మారింది. తమిళ నిర్మాతల మండలి ఈ వ్యాఖ్యలపై ఎలా బదులిస్తుందో చూడాలి.
https://twitter.com/VishalKOfficial/status/1816832712193573070
విశాల్ ఎలా పాపులర్ అంటే?
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన విశాల్ టాలీవుడ్ నిర్మాత జి.కె. రెడ్డి దంపతులకు 29 ఆగస్టు 1975న జన్మించాడు. ప్రేమ చదరంగం (2004) సినిమాతో తెరంగేట్రం చేశాడు. విశాల్ ప్రధానంగా తమిళ చిత్రాలు చేసినప్పటికీ చాలావరకూ అవి తెలుగులో డబ్ అయ్యాయి. అలా వచ్చిన 'పందెం కోడి' (Pandem Kodi), 'పొగరు' (Pogaru), 'భరణి' (Bharani), 'పూజ' (Pooja), 'అభిమన్యుడు' (Abhimanyudu) చిత్రాలు విశాల్కు తెలుగులోనూ పాపులారిటీ తీసుకొచ్చాయి. రీసెంట్గా ‘రత్నం’ (2024) అనే సినిమాతో విశాల్ తెలుగు ఆడియన్స్ను పలకరించాడు. అయితే అది పెద్దగా ఆకట్టుకులేదు. ప్రస్తుతం ‘తుప్పరివాళన్ 2’ అనే చిత్రంలో విశాల్ నటిస్తున్నాడు. ఇది 2017లో వచ్చిన ‘డిటెక్టివ్’ చిత్రానికి సీక్వెల్గా రూపొందుతోంది.
జూలై 27 , 2024
janhvi kapoor: లేత పరువాలను అడ్డు చీరలో దోపుకున్న జాన్వీ కపూర్.. కుర్రాళ్లను టెంప్ట్ చేస్తూ అందాల ప్రదర్శన
బాలీవుడ్ అందాల క్వీన్ జాన్వీ కపూర్ ఒక్కసారిగా రవివర్మ కుంచె గీసిన బొమ్మగా మారిపోయింది. పరువాలను అడ్డు చీరలో దోపుతూ ఫొటో షూట్కు పొజులిచ్చింది. అచ్చం రవివర్మ గీసిన పెయింటింగ్లా ఉందంటూ సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాలను నెటిజన్ల తెగ పొగుతుతున్నారు.
కేరళ కుట్టిలా ముస్తాభై నేల మీద కూర్చోని అందాలను అమర్చింది ఈ కొంటె పిల్ల. జబ్బల అందాలు, సొగసైన ఎద అందాల అచ్చాదనను ఎకరువు పెడుతూ తళుక్కున మెరిసింది
ముగ్దమైన కళ్లు, సగం తెరుచుకున్న ఎర్రని లాలీపప్స్ వంటి పెదాలు, పొడవైన నల్లని జుట్టులో దోపిన కలువ పూల అందాల్లో జాన్వీ అందాలకే అందంగా నిలిచింది.
అతిలోక సుందరి శ్రీదేవికి తగిన తనయగా తన అందానికి మరింత హంగులు అద్దింది. చూపు తిప్పుకోలేని భంగిమలో కుర్రకారును టెంఫ్ట్ చేస్తోంది.
రాఖీ పండగ సందర్భంగా కవ్వించే సొగసులతో కుదురుగా ఉండనివ్వడం లేదంటే నమ్మండి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో రచ్చ చేస్తున్నాయి. దీంతో కుర్రాళ్లు తమ పదునై కామెంట్లకు పని చెబుతున్నారు.
ఈ ఫొటోలను ట్యాగ్ చేస్తూ ... ఇది ఆర్ట్ గొప్పతనం అంటూ పోస్ట్ చేసింది. ఇక పోస్ట్కు రిప్లే ఇస్తూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. జాన్వీ అందాలను పొగుడుతూ తమలోని కామెంట్ల కవిత్వానికి పని చెప్పారు.
లుకింగ్ గార్జియస్, డ్రీమీ, ఏంజెల్లా ఉన్నావని కొందరూ, అతిలోక సుందరిని మించిపోయావంటూ తెగ పొగుడుతున్నారు.
స్టార్ కిడ్ అయినప్పటికీ జాన్వీ బాలీవుడ్లో గొప్పగా అయితే లాంచ్ కాలేదు. చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ నటనలో పరిపక్వతను సాధిస్తోంది. తాజాగా వరుణ్ దావణ్తో `బవాల్` చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మ నటన పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఈ సినిమా ఓటీటీలో విడుదలై ప్రశంసలందుకుంది.
ఇప్పుడు ఈ సొగసుల సోయగం తెలుగులో భారీగా ఎంట్రీ ఇస్తోంది. కొరటాల శివ- జూ. ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న దేవర సినిమాలో మెయిన్ లీడ్లో నటిస్తోంది. గతంలో ఎన్టీఆర్పై తన ఇష్టాన్ని పలు ఇంటర్వ్యూలో పంచుకున్న ఈ అల్లరి పిల్ల నేరుగా ఆయన పక్కన హీరోయిన్గా ఛాన్స్ కొట్టేయడం విశేషం.
అయితే దేవర కంటే ముందుగానే జాన్వీ.. లైగర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కావాల్సి ఉంది. కానీ కుదరలేదు. అయితే ఆ సినిమాలో నటించకపొవడం జాన్వీకి మంచే చేసిందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న 'దేవర' సినిమా ఆమె కెరీర్కు మంచి బూస్టింగ్ ఇస్తుందని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తన తల్లి శ్రీదేవి లాగా పాన్ ఇండియన్ హీరోయిన్గా ఎదిగేందుకు అన్ని విధాల దేవర సినిమా అయితే ఉపయోగపడనుంది.
ఈ సినిమా ద్వారా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ జాన్వీ పరిచయం కానుంది. ప్రస్తుతం దేవర సినిమాతో పాటు హిందీలో.. మిస్టర్ అండ్ మిసెస్ మహీ, ఉలజ్ సినిమాల్లో నటిస్తోంది. అడపాదడపా చిత్రాలు చేస్తున్నా జాన్వీకి మాత్రం బిగ్ బ్రేక్ రాలేదు. మరి జూ. ఎన్టీఆర్ దేవరతో ఆ బ్రేక్ వస్తుందో చూడాలి మరి.
ఆగస్టు 31 , 2023
Creative Video songs In Tollywood: టాలీవుడ్లో ట్రెండ్ సెట్ చేసిన టాప్ 10 సాంగ్స్ ఇవే!
టాలీవుడ్ ప్రేక్షకులు సంగీత ప్రియులు. సినిమాలోని ఫైట్స్, కామెడీ, అడ్వెంచర్ సీన్లను ఎలాగైతే ఇష్టపడతారో అదే స్థాయిలో పాటలకు వారు పెద్ద పీట వేస్తుంటారు. అందుకే తెలుగులో చాలా సినిమాలు పాటలతోనే సూపర్ హిట్గా నిలిచాయి. ఈ కారణం చేతనే మన డైరెక్టర్లు మంచి కథతో పాటు.. అద్భుతమైన పాటలు, డ్యాన్స్ తమ సినిమాల్లో ఉండేలా జాగ్రత్తపడతారు. అయితే కొందరు డైరెక్టర్లు మరో అడుగు ముందుకేసి చాలా క్రియేటివ్గా తమ సినిమాల్లోని పాటలను చిత్రీకరించారు. అభిమానులను థ్రిల్ చేసి వారి అభిమానాన్ని సంపాదించారు. తెలుగులో ఇప్పటివరకూ వచ్చిన క్రియేటివ్ సాంగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
వివాహభోజనంబు
‘మాయాబజార్’ (1957) సినిమాలోని ‘వివాహభోజనంబు’ పాటను డైరెక్టర్ కె.వి. రెడ్డి చాలా వినూత్నంగా తెరకెక్కించారు. పెళ్లి అంటే ఎటువంటి పంచభక్ష్య పరమాన్నాలు ఉండాలో కళ్లకు కట్టాడు. వంటశాలలోకి ప్రవేశించిన నటుడు ఘటోత్కచుడు (ఎస్వీ రంగరావు) పసందైన వంటకాలను పొగుడుతూ ఆరగిస్తాడు. ఈ సాంగ్ తెలుగు వారింట్లో శుభప్రదమైన పాటగా కొనసాగుతోంది. పెళ్లిళ్లలో ఈ సాంగ్ పరిపాటిగా మారింది.
https://www.youtube.com/watch?v=dZejdBmYC3k
‘సుందరి నీవంటి’
సాధారణంగా హీరో, హీరోయిన్లతో డైరెక్టర్లు సాంగ్ ప్లాన్ చేస్తారు. కానీ ‘మాయాబజార్’ సినిమాలోని ‘సుందరి నీవంటి’ ఇందుకు విరుద్ధం. హాస్యనటుడు రేలంగి.. హీరోయిన్ సావిత్రితో కలిసి ఈ సాంగ్లే నటించాడు. ఆమె అందాలను వర్ణిస్తూ పాడతాడు. అయితే సాంగ్ను ఈ జనరేషన్ వాళ్లు కూడా అన్వయించుకోవచ్చు. పెళ్లి చూపులకు వెళ్లిన వరుడు.. వధువు అందాలను ఈ స్థాయిలో పొగిడే సాంగ్ ఇప్పటివరకూ టాలీవుడ్లో రాలేదు.
https://www.youtube.com/watch?v=ScasolQHzxs
'నిలువరా వాలు కనులవాడా'
జంబలకిడి పంబ సినిమాలోని క్లైమాక్స్ సాంగ్ చాలా క్రియేటివ్గా తెరకెక్కించారు దర్శకుడు ఈ.వీ.వీ. సత్యనారాయణ. అన్ని పాటలను స్పూఫ్ చేస్తూ తీసిన తొలి తెలుగు సాంగ్ ఇదే కావడం విశేషం. ఈ సాంగ్లో మగవారు ఆడవారిగా, ఆడవారు మగవారి వేషధారణ కనిపించి నవ్వులు పూయిస్తారు.
https://www.youtube.com/watch?v=CI4qkIdvSmA
'చెప్పమ్మా.. చెప్పమ్మా..'
‘మురారి’ సినిమాలోని ‘చెప్పమ్మా.. చెప్పమ్మా’ సాంగ్ ఇప్పటికీ చాలా మందికి ఫేవరేట్గా ఉంది. మహేష్.. హీరోయిన్ను వదిలి కారులో బయల్దేరగా ఆమె జ్ఞాపకాలు అతడ్ని వెంటాడుతాయి. దారి పొడవునా హీరోయిన్ కనిపిస్తూ డిస్టర్బ్ చేస్తుంది. ఇష్టమైన వారితో ఎడబాటు రాగానే యువతులకు ముందుగా ఈ పాటనే గుర్తుకు వస్తుంది. ప్రియుడు దూరంగా వెళ్తున్న క్రమంలో ఓ యువతి ఎంతగా అతడ్ని మిస్ అవుతుందో ఈ సాంగ్ కళ్లకు కడుతుంది.
https://www.youtube.com/watch?v=9qC9XGOuhaI
'బుగ్గే బంగారమా..'
‘చందమామ’ సినిమాలోని ఈ పాట.. ఒక అబ్బాయి ఎడబాటుకు అద్దం పడుతుంది. మనసుకు నచ్చిన అమ్మాయి పదే పదే కళ్లకు కనిపిస్తూ తన జ్ఞాపకాలతో మైమరిపిస్తుంటుంది. ప్రేయసి దూరంగా వెళ్లినప్పుడు అబ్బాయిలు ఆమెను గుర్తుచేసుకునేందుకు తరచూ ఈ సాంగ్ వింటూ ఉంటారు.
https://www.youtube.com/watch?v=WABcMeOf0oM
‘అసలేం గుర్తుకు రాదు’
‘అంతపురం’లోని ఈ సాంగ్.. ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్ ఆల్బమ్స్లో ఒకటిగా ఉంది. నచ్చిన వ్యక్తి తోడుంటే పెళ్లికాని యువతులకు ఇక ఏది గుర్తుకు రాదన్న కాన్సెప్ట్టో దర్శకుడు ఈ పాటను చిత్రీకరించారు. అప్పట్లో ఈ పాట ట్రెండ్ సెట్టర్. దీని తర్వాత ఈ తరహాలో ఎన్నో పాటలు టాలీవుడ్లో రావడం గమనార్హం.
https://youtu.be/sgMKZfdPads?si=8Lj2ooFdt-Q56Mss
‘ఇంకి పింకి పాంకీ’
సుడిగాలి సినిమాలోని ‘ఇంకి పింకి పాంకి’ చాలా గమ్మత్తుగా ఉంటుంది. తమ ఫ్యామిలీ సాంగ్ అంటూ అల్లరి నరేష్ పాడే ఈ సాంగ్ వినటానికి బాగుండటంతో పాటు నవ్వులు పూయిస్తుంది. మీరు ఓసారి వినండి.
https://www.youtube.com/watch?v=FusD0RVkKAk
‘ఊ అంటావా.. ఉ ఊ అంటావా’
తెలుగులో రీసెంట్గా వచ్చిన ఐటెం సాంగ్లలో ‘పుష్ప’లోని ‘ఉ అంటావా.. ఉ ఊ అంటావా’ పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. మాస్ సాంగ్స్లలో కొత్త ట్రెండ్ను సృష్టించింది. ఈ పాట లిరిక్స్ చాలా యూనిక్గా అనిపిస్తాయి. పైగా ఐటెం సాంగ్ అంటే దద్దరిల్లే మ్యూజిక్ అవసరం లేదని దేవిశ్రీ ఈ సాంగ్తో నిరూపించాడు.
https://www.youtube.com/watch?v=u_wB6byrl5k
‘ఐతే’
ఐదుగురు స్నేహితులు కలిస్తే ఎంత సరదాగా ఉంటారో.. అల్లరి చేస్తారో ‘ఐతే’ సినిమాలోని 'చిటపట చినుకులు' సాంగ్ కళ్లకు కడుతుంది. క్లోజ్ ఫ్రెండ్స్ ఒకచోట చేరితే ప్రపంచాన్ని మర్చిపోయి వారు ఎంత సంతోషంగా ఉంటారో ఈ పాట చెప్పేస్తుంది. ఫ్రెండ్స్ అంతా కలిసి ట్రిప్కు వెళ్లినప్పుడు ముందుగా వారికి ఈ పాటనే గుర్తుకు వస్తుంది.
https://www.youtube.com/watch?v=mGmYW7tp2B4
‘లైఫ్ ఆఫ్ రామ్’
ఒంటరి జీవితమని బాధ పడకుండా దాన్ని ఎంత అందంగా జీవించవచ్చో ‘జాను’ సినిమాలోని ‘లైఫ్ ఆఫ్ రామ్’ తెలియజేస్తుంది. మనకు తెలియని ప్రపంచం ఎంతో ఉందని కళ్లకు కడుతుంది. డిప్రెషన్లో ఉన్న వారు ఒక్కసారి ఈ పాట వింటే వెంటనే దాని నుంచి బయటకు వచ్చేస్తారు. ఈ తరహా సాంగ్ తెలుగులో ఇప్పటివరకూ రాలేదని చెప్పవచ్చు.
https://www.youtube.com/watch?v=2a34XyiZO14
‘చెలియా చెలియా’
ప్రేయసితో సంతోషంగా ఉన్నప్పుడు ముందుగా ‘ఖుషి’లోని ‘చెలియా చెలియా’ పాటనే గుర్తుకు వస్తుంది. నచ్చిన వ్యక్తి పక్కన ఉంటే ‘కోపాలు, తాపాలు మనకేలా.. సరదాగా కాలాన్ని గడపాలా’ అంటూ సాగే ఈ పాట మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంటుంది.
https://www.youtube.com/watch?v=-Z9jQn442Ts
మార్చి 02 , 2024
Unique Movie Titles: సలార్, కంగువ, తంగలాన్.. ఈ టైటిల్స్ వెనక ఎంత అర్థం ఉందో తెలుసా?
సినిమాపై ఆసక్తిని పెంచడంలో టైటిళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. సినిమా పేరు ఎంత యూనిక్గా ఉంటే ఆడియన్స్ అంతగా ఆ మూవీకి కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం రూపొందుతున్న చాలావరకూ సినిమాలు తమ ప్రాంతానికే పరిమితం కాకుండా పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్నాయి. అయితే కథ డిమాండ్ మేరకు ఆయా ప్రాంతాల్లో వాడుకలో ఉన్న పేర్లనే డైరెక్టర్లు సినిమాకు ఖరారు చేస్తున్నారు. దీంతో ఇతర ప్రాంతాల వారికి ఆ టైటిళ్లు కొత్తగా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. వాటి అర్థం తెలుసుకోవాలన్న ఉత్సాహం వారిలో పెరిగిపోతోంది. ఇంతకీ ఆ సినిమా పేర్లు ఏవి? వాటి వెనకున్న అర్థం ఏమిటీ? ఇప్పుడు పరిశీలిద్దాం.
తండేల్
నాగ చైతన్య లేటెస్ట్ మూవీ పేరు 'తండేల్' (Thandel). ఈ సినిమా టైటిల్ వెనకున్న అర్థం చాలా మందికి తెలియకపోవచ్చు. తండేల్ అంటే మత్సకారుల బృంద నాయకుడు అని అర్థం. సముద్రంలో వేటకు వెళ్లేటప్పుడు అతడే బోటు నడుపుతాడు. చందూ మెుండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా చేస్తోంది. అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
సలార్
ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న మూవీ 'సలార్' (Salar). దీనికి నాయకుడు.. రక్షకుడు ఇలా పలు అర్థాలున్నాయి. ఇందులో ప్రభాస్కు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. డిసెంబర్ 22న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
డంకీ (DUNKI)
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'డంకీ' (DUNKI). ఈ టైటిల్కు అర్ధం.. అక్రమంగా దేశ సరిహద్దుల గుండా ప్రయాణించడం. ఈ సినిమాకు రాజ్కుమార్ హిరాణి దర్శకత్వం వహించారు. ప్రముఖ నటి తాప్సీ కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ డిసెంబర్ 21న విడుదల కానుంది.
తంగలాన్
చియాన్ విక్రమ్ హీరోగా చేస్తున్న కొత్త చిత్రం ‘తంగలాన్’ (Thangalaan). ఇది తమిళనాడులోని ఓ తెగ పేరు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF)లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో విక్రమ్కు జోడీగా మాళవిక మోహనన్ నటించింది. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 26, 2024న విడుదల కానుంది.
కంగువ
స్టార్ హీరో సూర్య అప్కమింగ్ మూవీ పేరు 'కంగువ' (Kanguva). దీనికి ‘అగ్ని శక్తి ఉన్న వ్యక్తి, పరాక్రమవంతుడు’ అని అర్థం. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సూర్యకు జోడీగా దిశా పటానీ (Disha Patani) నటిస్తోంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.
మట్కా
వరణ్తేజ్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం పేరు 'మట్కా' (Matka). ఇదో రకమైన జూదం. యాథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అయ్యింది.
జిగర్తండ డబుల్ ఎక్స్
రాఘవ లారెన్స్, ఎస్.జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'జిగర్తండ డబుల్ ఎక్స్' (Jigarthanda DoubleX). తమిళనాడులోని మధురైలో ప్రసిద్ధి చెందిన ఓ కూల్డ్రింక్ పేరును దీనికి పెట్టారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు.
అయలాన్
శివకార్తికేయన్, రకుల్ప్రీత్ సింగ్ జంటగా నటిస్తోన్న చిత్రం 'అలయాన్' (Ayalaan). దీనికి పొరుగువాడు అని అర్థం. మానవుడు ఏలియన్ మధ్య స్నేహం కుదిరితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్తో ఈ మూవీ రూపొందుతున్నట్లు తెలుస్తోంది. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
నవంబర్ 25 , 2023
RRRపై తమ్మారెడ్డి భరద్వాజ విమర్శలు… ఏకిపారేసిన నాగబాబు.. నీయమ్మ *** ఖర్చు పెట్టాడారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు
RRR చిత్రంపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తమ్మారెడ్డిని సినీ ప్రముఖులు విమర్శిస్తున్నారు. తెలుగు చలన చిత్ర స్థాయి పెరగడాన్ని స్వాగతించాల్సింది పోయి ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
అసలేంటీ వివాదం?
బంగారుతల్లి సినిమా ప్రమోషన్లలో భాగంగా తమ్మారెడ్డి భరద్వాజ RRR చిత్ర యూనిట్పై విమర్శలు చేశారు. “ ఆర్ఆర్ఆర్ సినిమాకు రూ.600 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రస్తుతం ఆస్కార్ అవార్డు కోసం రూ.80 కోట్లు వెచ్చిస్తున్నారు. విమాన టికెట్ల కోసమే కోట్లు ఖర్చు పెడుతున్నారు. వాటితో 8 సినిమాలు తీసి వారి ముఖాన కొట్టచ్చు” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
https://twitter.com/i/status/1633519566235275266
రచ్చ రచ్చ
తమ్మారెడ్డి వ్యాఖ్యలతో సామాజిక మాధ్యమాల్లో రచ్చ మెుదలయ్యింది. తెలుగు సినిమా స్థాయి ప్రపంచానికి తెలుస్తుంటే సొంత ఇంటి వాళ్లే విమర్శలు చేయడం ఏంటనే ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు. 8 సినిమాలు తీసి నష్టం మిగల్చడం తప్ప మీరు చేసేది ఏముండదంటూ కామెంట్లు పెడుతున్నారు.
అకౌంట్స్ ఉన్నాయా?
ఈ విమర్శలపై దర్శక దిగ్గజం రాఘవేంద్ర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా , సాహిత్యం, దర్శకుడు, నటీనటులకు మెుదటిసారి ప్రపంచవేదికలపై వస్తున్న పేరు ప్రఖ్యాతలు చూసి గర్వపడాలి అన్నారు. అంతే కానీ..రూ.80 కోట్లు ఖర్చు అంటూ చెప్పడానికి మీదగ్గర అకౌంట్స్ ఉన్నాయా ? అని ప్రశ్నించారు. జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ వంటి పేరుపొందిన దర్శకులు డబ్బులు తీసుకొని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని మీ ఉద్దేశమా? అన్నారు.
https://twitter.com/Ragavendraraoba/status/1633871454445137921
స్ట్రాంగ్ కౌంటర్
ప్రముఖ నటుడు నాగబాబు మరింత ఘాటుగా సమాధాన మిచ్చారు. “ నీయమ్మ మెుగు ఖర్చు పెట్టాడారా రూ.80 కోట్లు RRRకి ఆస్కారం కోసం” (#RRR మీద కామెంట్కు వైసీపీ వారి భాషలో సమాధానం) అంటూ కౌంటర్ ఇచ్చాడు.
https://twitter.com/NagaBabuOffl/status/1633845057622253568
నాగబాబుపై విమర్శలు
విమర్శలపై కాస్త కఠినంగానే స్పందించే నాగుబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అతడిని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. గౌరవప్రదమైన కుటుంబంలో ఉండి.. ఇలాంటి విమర్శలతో పేరు చెడగొడుతున్నారని మండిపడ్డారు. చిరంజీవి, పవన్ను చూసి నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు మరికొందరు.
మార్చి 10 , 2023
పరువాళ్లు ఆరబోస్తున్న వర్షిణి
]ట్రావెలింగ్, డ్యాన్సింగ్, రీడింగ్లను హాబీలుగా మార్చుకుంది
అక్టోబర్ 21 , 2022
Shanvi Srivastava: బాంబ్ జాకెట్లో పరువాలు బయటపెడుతూ హద్దులు చెరిపిన శాన్వి పాప
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్లోడ్ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
ఏప్రిల్ 16 , 2024
TRISHA:సోషల్ మీడియాలో త్రిష పరువాల జాతర… కుర్ర హీరోయిన్లతో పోటా పోటీ
పొన్నియన్ సెల్వన్ చిత్రం విడుదలైనప్పటి నుంచి ఓ హీరోయిన్ క్రేజ్ భారీగా పెరిగింది. ఆమె మరోసారి లైమ్లైట్లోకి వచ్చింది. తను ఎవరో కాదు సూపర్ క్యూట్ బ్యూటీ త్రిష కృష్ణన్.
ఒకప్పుడు తన లుక్స్తో అలరించిన ఈ ముద్దుగుమ్మ… ఇప్పుడు 40 ఏళ్ల వయసులోనూ అంతే అందంతో ఆకట్టుకుంటుంది.
సామాజిక మాధ్యమాల్లో ఎక్కడచూసిన త్రిష ఫొటోలు కనిపిస్తున్నాయి. పరువాల జాతరతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. దాదాపు 4 నెలలుగా ఈ అమ్మడు ట్రెండింగ్లో నిలుస్తోంది అంటే అతిశయోక్తి కాదు.
PS-2 చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉంది త్రిష. రోజుకో గెటప్లో దర్శనమిస్తూ కుర్లాళ్ల గుండెల్ని కొళ్లగొడుతుంది.
వయసు పెరిగే కొద్ది అందం తగ్గుతుందంటారు. కానీ, త్రిష విషయంలో అసలు ఏ మాత్రం అలా అనడానికి వీళ్లేదు.
ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసినా కుర్ర హీరోయిన్లదే హవా. వాళ్లతో పోటీ పడుతూ ఆఫర్లు కొట్టేస్తుంది సొగసరి.
పొన్నియన్ సెల్వన్ చిత్రంలో కుందవి పాత్రలో నటించింది త్రిష. అంతేకాదు, దళపతి విజయ్, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న లియో సినిమాలోనూ చేస్తోంది.
తమిళ్లో ది రోడ్ అనే చిత్రంతో పాటు సత్తురాంగ వెట్టై అనే సినిమాలోనూ నటిస్తోంది త్రిష. ఇలా వరుస ఆఫర్లతో బిజీగా ఉంది.
తెలుగులో నీ మనసు నాకు తెలుసు అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ప్రభాస్ సరసన వర్షం ద్వారా సూపర్ హిట్ అందుకుంది ఈ అమ్మడు.
వరుసగా తమిళ్, తెలుగు చిత్రాల్లో అగ్రహీరోల సరసన నటించింది ఈ హీరోయిన్. తర్వాత వివిధ కారణాల వల్ల సినిమాలు ఒప్పుకోలేదు. ఇప్పుడు మళ్లీ వరుస సినిమాల్లో చేస్తోంది.
ఏప్రిల్ 20 , 2023
NIDHI AGARWAL: పరువాలతో కనువిందు చేస్తున్న అందాల “నిధి”
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్లోడ్ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
మార్చి 16 , 2023
ఇస్మార్ట్ బ్యూటీ పరువాలు..
]రీసెంట్గా హీరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిందిమత్తెక్కించే తన ఫొటోలతో ఎప్పుడూ అభిమానులకు టచ్లో ఉంటోంది.ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఈ బ్యూటీ జాతకమే మారిపోయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తుంది
అక్టోబర్ 21 , 2022
యాషిక ఆనంద్ పరువాల విందు
]ఇన్స్టాలో 3.2 మిలియన్ల ఫాలోవర్లను పొందింది
అక్టోబర్ 21 , 2022
గాయత్రి భరద్వాజ్ పరువాలు
]భరతనాట్యం, సింగింగ్, ఫుట్ బాల్ ఆడటం ఈ భామ హాబీలు
అక్టోబర్ 21 , 2022
Ruhani Sharma Hot: మరోసారి రుహానీ శర్మ పరువాల దాడి.. కుర్రకారు హార్ట్ బీట్ ఢమాల్!
హాట్ బ్యూటీ రుహానీ శర్మ (Ruhani Sharma) తన గ్లామర్ షోతో మరోమారు సోషల్ మీడియాను హీటెక్కించింది. రెడ్ కలర్ జాకెట్లో ఎద అందాలను ఆరబోసింది.
ఎర్రటి జాకెట్తో తెల్లటి అందాలను ప్రదర్శించి నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ ఫొటోలకు స్మైలింగ్ ఎమోజీని క్యాప్షన్గా పెట్టి కుర్రకారుకు కొంటె వల విసిరింది.
రుహానీ శర్మ అందాలతో పాటు ఫిట్నెస్ కూడా ఈ ఫొటోల్లో కనిపించింది. ఆమె ఫిజిక్ అద్భుతంగా ఉందంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మోడల్గా కెరీర్ను ప్రారంభించిన రుహానీ శర్మ.. తమిళ చిత్రం 'కడైసి బెంచ్ కార్తీ' (Kadaisi Bench Karthi) అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
2018లో వచ్చి 'చిలసౌ' చిత్రంతో ఈ అమ్మడు తొలిసారి టాలీవుడ్లో అడుగుపెట్టింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుశాంత్కు జోడీగా నటించి మెప్పించింది.
‘చిలసౌ’ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో రుహానీకి వెంటనే టాలీవుడ్లో అవకాశం దక్కలేదు. దీంతో ఈ భామ ఫోకస్ మలయాళ ఇండస్ట్రీపై పడింది.
2018లో 'కమల' అనే చిత్రంలో నటించిన రూహానీ.. ఆ సినిమా ద్వారా మలయాళ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో మంచి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించింది.
2020లో విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన 'హిట్' సినిమాలో ఈ బ్యూటీకి అవకాశం దక్కింది. ఇందులో నేహా పాత్రలో తెలుగు ఆడియన్స్ హృదయాలను గెలుచుకుంది.
ఆ తర్వాత ‘అవసరాల శ్రీనివాస్’ కథానాయకుడిగా చేసిన 'నూటక్క జిల్లాల అందగాడు' సినిమాలో హీరోయిన్గా చేసింది. ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. కానీ, రుహానీ నటనకు మంచి మార్కులే పడ్డాయి.
గతేడాది 'హర్ ; చాప్టర్ 1' (Her - Chapter 1) అనే లేడీ ఒరియేంటెడ్ చిత్రంలో నటించిన ఈ భామ.. పోలీసు అధికారిణి పాత్రలో అదరహో అనిపించింది.
ఈ ఏడాది సంక్రాంతికి రీలైజన 'సైంధవ్' చిత్రంలో డా.రేణు పాత్రలో కనిపించి రుహానీ ఆకట్టుకుంటుంది. ఇందులో వెంకటేష్తో పోటీ పడి నటించి అందరి ప్రశంసలు అందుకుంది.
మెగా హీరో వరుణ్ తేజ్ రీసెంట్ చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’లోనూ రుహానీ శర్మ కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రం పరాజయం పాలైనప్పటికీ.. రుహాని శర్మ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
తాజాగా ‘శ్రీరంగ నీతులు’ అనే సినిమాలోనూ ఈ ముద్దుగమ్మ నటించింది. ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రూహానీ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ప్రస్తుతం రుహానీ.. హిందీలో ‘బ్లాకౌట్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
బ్లాక్ బాస్టర్ హిట్స్ రానప్పటికీ రుహానీ శర్మకు సోషల్ మీడియాలో ఏ మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఈ అమ్మడు మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
జూన్ 01 , 2024
Shubra Aiyappa: స్లీవ్లెస్ క్రాప్ టాప్లో పరువాలు బయటపెడుతూ హద్దులు దాటిన శుభ్ర
శుభ్ర అయ్యప్ప తాజాగా హాటో ఫోటోషూట్ ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది.
కంప్లీట్ క్రాప్ టాప్లో ఎద అందాలను ఎకరువు పెట్టింది. స్లీవ్ లెస్ టాప్లో నడుమందాలను చూపిస్తూ కవ్విస్తోంది.
ఈ గ్లామర్ పిక్స్ చూసిన ఆమె అభిమానులు లుకింగ్ హాట్, గార్జియస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
శభ్ర అయ్యప్ప తమిళ్ నటి. తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించింది.
శుభ్ర అయ్యప్ప 1991, జనవరి 1న బెంగళూరు సమీపంలోని కొడగులో జన్మించింది.
బెంగళూరులోని బాల్డ్విన్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసాన్ని పూర్తిచేసింది.
చిన్నప్పటి నుంచి మోడలింగ్, సినిమా రంగాలపై ఉన్న ఆసక్తితో మోడల్గా తన కెరీర్ను ప్రారంభించింది.
View this post on Instagram A post shared by Shubra Aiyappa (@shubra.aiyappa)
వై. వి. ఎస్. చౌదరి డైరెక్షన్లో వచ్చిన 'రేయ్' సినిమాలో తొలిసారిగా కనిపించింది.
ఆ తర్వాత 2014లో వచ్చిన ప్రతినిధి సినిమాలో తొలిసారిగా శుభ్ర అయ్యప్ప(Shubra Aiyappa) హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో జర్నలిస్ట్గా యాక్ట్ చేసింది.
2015లో విజయ్ కాంత్ కుమారుడు షణ్ముగపాండియన్ నటించిన సగప్తం సినిమాతో తమిళ సినిరంగంలోకి ప్రవేశించింది.
అదే ఏడాదిలో వచ్చిన 'వజ్రకాయ' అనే కన్నడ సినిమాతో కన్నడ సినిరంగంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో వెనిస్ నగరంలో చిత్రీకరించిన పాటలో నటించింది.
ఈ సినిమాలో శుభ్ర నటనకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత యవ్వనం ఒక ఫాంటసీ అనే సినిమాలో కూడా నటించింది.
శుభ్ర అయ్యప్ప గతేడాది జనవరిలో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. వ్యాపారవేత్త విశాల్ శివప్పతో ఆమె ఏడడుగులు వేసింది.
View this post on Instagram A post shared by Shubra Aiyappa (@shubra.aiyappa)
అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో….150 ఏళ్ల ప్రాచీన గృహంలో గురువారం వీరి వివాహం జరిగింది.
ప్రస్తుతం తమిళ్, తెలుగులో ఈ ముద్దుగుమ్మకు పెద్దగా అవకాశాలు లేనప్పటికీ... కన్నడలో మాత్రం దూసుకెళ్తోంది. అక్కడ తిమ్మయ్య తిమ్మయ్య, రామన అవతార వంటి చిత్రాల్లో ఛాన్స్ కొట్టేసింది.
ఏప్రిల్ 01 , 2024
Love Reddy Review: ఒకే కులమైనా ప్రేమకు పరువు అడ్డొస్తే.. ‘లవ్ రెడ్డి’ పరిస్థితి ఏంటి?
నటీనటులు : అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి, ఎన్.టి. రామస్వామి, గణేష్ డి.ఎస్, రవి కళాబ్రహ్మ, వాణి గౌడ తదితరులు
రచన, దర్శకత్వం : స్మరణ్ రెడ్డి
సంగీతం : ప్రిన్స్ హెన్రీ
సినిమాటోగ్రఫీ : మోహన్ చారీ, అస్కర్ అలీ
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాత : హేమలతా రెడ్డి
విడుదల తేదీ: 18-10-2024
అంజన్ రామచంద్ర, శ్రావణిరెడ్డి కీలక పాత్రల్లో స్మరన్రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్రెడ్డి’ (Love Reddy Movie Review). ఎన్.టి. రామస్వామి, గణేష్ డి.ఎస్, రవి కళాబ్రహ్మ, వాణి గౌడ పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను రిలీజ్ చేయడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల వచ్చిన ట్రైలర్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ క్రమంలో అక్టోబరు 18న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆడియన్స్ను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
నారాయణ రెడ్డి (అంజన్ రామచంద్ర)కి 30 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాదు. ఇంట్లో వాళ్లు ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయి నచ్చలేదని రిజెక్ట్ చేస్తుంటాడు. ఓ రోజు బస్లో దివ్య(శ్రావణి రెడ్డి)ని చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. లవ్రెడ్డిగా మారి ఆ అమ్మాయియే లోకంగా మారిపోతాడు. దివ్య కూడా నారాయణ రెడ్డితో స్నేహం చేస్తుంది. ఓ రోజు ధైర్యం చేసి నారాయణ తన ప్రేమ విషయాన్ని దివ్యతో చెబుతాడు. దివ్య మాత్రం అతని ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తుంది. లవ్రెడ్డిపై ఇష్టం ఉన్నప్పటికీ దివ్య ఎందుకు రిజెక్ట్ చేసింది? దివ్య ఎంట్రీతో నారాయణ రెడ్డి లైఫ్ ఎలాంటి మలుపు తిరిగింది? వీరి ప్రేమ కథ చివరికి సుఖాంతం అయ్యిందా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
‘లవ్రెడ్డి’ సినిమాలో నటించినవారంతా కొత్త వాళ్లే. భగ్నప్రేమికుడు నారాయణరెడ్డి పాత్రలో అంజన్ రామచంద్ర ఒదిగిపోయాడు. తొలి సినిమానే అయినా తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక దివ్య పాత్రకు శ్రావణి రెడ్డి న్యాయం చేసింది. హీరోయిన్ తండ్రిగా చేసిన ఎన్.టి రామస్వామి నటన అందరినీ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్లో ఆయన ఇచ్చే ట్విస్ట్ మెప్పిస్తుంది. హీరోని ఇష్టపడే అమ్మాయి స్వీటీగా జ్యోతి మదన్ కొన్ని చోట్ల నవ్వులు పూయించారు. హీరో తమ్ముడిగా చేసిన నటుడుతో పాటు ఇతర పాత్రదారులు తమ పరిధిమేరకు మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
పరువు ప్రతిష్ట అనే కీలకమైన అంశంతో సాగే స్వచ్ఛమైన ప్రేమ కథగా దర్శకుడు స్మరణ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. రొటిన్ స్టోరీనే అయినప్పటికీ ఆంధ్రా - కర్ణాటక నేటివిటితో చాలా సహజంగా తెరకెక్కించారు. పెళ్లి చూపుల సీన్తో సినిమాను ప్రారంభించిన డైరెక్టర్, హీరో లవ్రెడ్డిగా మారిన తర్వాత నుంచి కథను ఆసక్తికరంగా మార్చారు. అయితే తన ప్రేమను వ్యక్తం చేయడానికి హీరో చేసే ప్రయత్నాలు రొటీన్గా అనిపిస్తాయి. లవ్ రెడ్డిని దివ్య ప్రేమిస్తుందా? లేదా? అన్న క్యూరియాసిటీతోనే ఫస్టాఫ్ గడిచిపోతుంది. సెకండాఫ్లో హీరో ప్రేమను రిజెక్ట్ చేయడం, అందుకు చెప్పిన కారణం నేటి యూత్కు బాగా కనెక్ట్ అవుతుంది. చివరి 20 నిమిషాలు అయితే చాలా ఎమోషనల్గా నడిపారు దర్శకుడు. క్లైమాక్స్తో ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించాడు. ఓవరాల్గా దర్శకుడిగా స్మరణ్ రెడ్డి మంచి మార్కులు సంపాదించుకున్నాడని చెప్పాలి
టెక్నికల్గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే ప్రిన్స్ హేన్రి సంగీతం సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ని తెరపై రిచ్గా చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
నటీ నటులుభావోద్వేగాలుసంగీతం
మైనస్ పాయింట్స్
రొటీన్ స్టోరీఫస్టాఫ్లో సాగదీత సీన్స్
Telugu.yousay.tv Rating : 2.5/5
అక్టోబర్ 18 , 2024
Prabhas: పరుశురాముడిగా ప్రభాస్? అన్ని సినిమాలు ఒక్క లెక్క ఈ మూవీ మరో లెక్క!
ప్రభాస్ అనగానే ముందుగా అతడి ఫిజిక్ అందరికీ గుర్తుకువస్తోంది. పాన్ ఇండియా స్టార్గా ప్రభాస్ ఎదగడంలో అతడి కటౌట్ బాగా ఉపయోగపడింది. ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్ చేశాడంటే స్క్రీన్స్పై చూసేవాళ్లకు రియల్గా అనిపిస్తుంటుంది. యాక్షన్ ఒక్కటే కాదు పౌరాణిక పాత్రలకు సైతం అతడి కటౌట్ ఇట్టే సరిపోతుంది. ప్రభాస్ ఇప్పటికే ‘ఆదిపురుష్’లో రాముడిలా, ‘కల్కి 2898 ఏడీ’లో కర్ణుడిగా కనిపించాడు. త్వరలో రానున్న ‘కన్నప్ప’లో నందీశ్వరుడిగా పాత్రలోనూ కనిపిస్తాడని టాక్ ఉంది. ఈ క్రమంలోనే ప్రభాస్కు సంబంధించి ఓ క్రేజీ వార్త బయటకొచ్చింది. త్వరలో పరుశురాముడి పాత్రను సైతం అతడు పోషించనున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
పరుశురాముడిగా ప్రభాస్!
ప్రస్తుతం బాలీవుడ్లో రామాయణం అనే అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో సీతారాముల కల్యాణఘట్టాన్ని కన్నుల పండువగా తీయాలనే తలంపుతో దర్శకుడు నితీష్ తివారి ఉన్నారట. ఈ ఘట్టంలో పరశురాముడి పాత్ర చాలా కీలకం. విష్ణుమూర్తి దశావాతారాల్లో రామావతారానికి ముందు వచ్చే అవతారం పరశురామావతారం. కాబట్టి రాముడిగా రణబీర్కపూర్ చేస్తున్నప్పుడు, పరశురాముడిగా కూడా ఆ స్థాయి హీరో చేస్తే సబబుగా ఉంటుందని నితీశ్ భావించారట. ఈ నేపథ్యంలో ప్రభాస్ను ఆ పాత్ర కోసం తీసుకోవాలని నితీశ్ తివారి భావిస్తున్నారట. ఈ విషయమై ప్రభాస్ను కూడా కలిసినట్లు బీ టౌన్లో టాక్ వినిపిస్తోంది. పరుశురాముడి పాత్ర చేసేందుకు ప్రభాస్ అంగీకరించినట్లు కూడా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందట. అయితే సినిమాలో ప్రభాస్ పాత్ర కొద్దిసేపే ఉండనుంది. అయినప్పటికీ కథపై ఎంతో ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.
విలన్స్గా స్టార్ కపుల్స్
‘యానిమల్’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ప్రభాస్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ‘స్పిరిట్’ పేరుతో ఈ మూవీ రూపొందనుంది. ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్ట్ దశలో ఉంది. అయితే ఇందులో బాలీవుడ్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) నటించనున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషిస్తాడని ప్రచారం జరగింది. కాగా, లేటెస్ట్ బజ్ ప్రకారం ‘స్పిరిట్’లో కరీనా కపూర్ సైతం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. రియల్ లైఫ్లో కపుల్స్ అయిన కరీనా, సైఫ్ ‘స్పిరిట్’ సినిమాలో విలన్స్గా కనిపిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
పోలీసు vs మాఫియా డాన్!
‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ ద్విపాతాభినయం చేయనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని డైలాగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక ప్రభాస్ డ్యూయల్ రోల్స్ విషయానికి వస్తే ఒక పాత్రలో పోలీసుగా మరో పాత్రలో మాఫియా డాన్గా ప్రభాస్ కనిపిస్తారని బజ్ ఉంది. డాన్ పాత్ర నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే బాక్సాఫీస్ వద్ద ఊచకోత ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. ఇకపోతే అక్టోబర్ 10న ప్రభాస్ బర్త్డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజవుతుందని, వచ్చే ఏడాది జనవరి 25 నుంచి ‘స్పిరిట్’ సెట్స్పైకి వెళ్తుందని టాక్. మరోవైపు ప్రభాస్ ఇప్పటివరకూ మూడు సినిమాల్లో ద్విపాత్రిభినయం చేశారు. తొలి చిత్రం ‘బిల్లా’ కాగా ఆపై ‘బాహుబలి’, ‘బాహుబలి 2’లోనూ డ్యూయల్ రోల్స్లో కనిపించారు. రీసెంట్గా తెరకెక్కుతున్న రాజాసాబ్లోనూ ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తారని ప్రచారం ఉంది.
పీరియాడికల్ లవ్ స్టోరీ!
ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమాకు సంబంధించిన పూజాకార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఇక ఈ చిత్రం పీరియాడికల్ యాక్షన్ లవ్ డ్రామాగా రూపొందనున్నట్లు తెలుస్తోంది. రజాకార్స్ బ్యాక్డ్రాప్లో బ్యూటీఫుల్ లవ్ డ్రామాగా దర్శకుడు హను రాఘవపూడి ఈ కథను రాసినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యే టైమ్ పీరియడ్లో ఈ మూవీ సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ను పరిశీలిస్తోన్నట్లు సమాచారం. ‘ఫౌజీ’ అంటే సైనికుడు అని అర్థం. ఇందులో ఇండియన్ పారా మిలిటరీకి చెందిన సైనికుడిగా ప్రభాస్ కనిపించనున్నట్లు చెబుతున్నారు. అయితే ఇందులో ఇమాన్ ఇస్మాయిల్ అనే యువతి హీరోయిన్గా నటించనుంది. ఇటీవల జరిగిన పూజా కార్యక్రమాల్లో ఇమాన్ పాల్గొని తన లుక్స్తో సోషల్ మీడియాను అట్రాక్ట్ చేసింది.
సెప్టెంబర్ 28 , 2024
Yashika Aannand Bold Pics: యాషిక ఆనంద్ పరువపు పొంగులు.. నెక్స్ట్ లెవెల్ గ్లామర్ అంతే!
కోలీవుడ్ హాట్ బ్యూటీ యషికా ఆనంద్ (Yashika Aannand) మరోమారు తన అందాలతో సోషల్ మీడియాను ఆకర్షించింది.
తాజాగా హాట్ ఫొటో షూట్ నిర్వహించిన ఈ అమ్మడు తన వెనుకవైపు అందాలు చూపిస్తూ నెటిజన్లను రెచ్చగొట్టింది.
సోఫాలో నెమలిని తలపించేలా కూర్చొని తన ఎద అందాలను ప్రదర్శించింది. మత్తెక్కించే లుక్స్తో మాయ చేసింది.
యషికా లేటెస్ట్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పాలరాతి శిల్పాన్ని తలపిస్తున్న ఆమె అందాలను చూసి కుర్రకారు మైమరిచిపోతున్నారు.
యషిక వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె 1999 ఆగస్టు 9న ఢిల్లీ జన్మించింది. మోడల్గా కెరీర్ ప్రారంభించింది.
ఢిల్లీ నుంచి చెన్నైకి వచ్చి అక్కడే మకాం వేసిన యాషికా ఆనంద్ పలు తమిళ సినిమాల్లో నటించింది.
తమిళ చిత్రం ‘కావలై వెండం’ (2016) చిత్రంలో స్విమ్మింగ్ ఇన్స్ట్రక్టర్ అనే చిన్న పాత్ర ద్వారా వెండితెరపై అడుగుపెట్టింది.
2018లో వచ్చిన ‘ఇరుట్టు అరైయిల్ మురట్టు’ సినిమా యాషికాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో కావ్య అనే బోల్డ్ పాత్రలో నటించి యూత్ను ఆకట్టుకుంది.
తర్వాత తమిళ బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొనడం ద్వారా యాషికా ఆనంద్కు విపరీతమైన క్రేజ్ వచ్చింది.
98 రోజుల పాటు హౌస్లో ఉన్న యషిక తన అందచందాలతో బుల్లితెర ఆడియన్స్ను ఎంతగానో అలరించింది.
దీంతో తమిళంలో ఆమెను వరుస అవకాశాలు చుట్టుముట్టాయి. ‘కఝుగు 2’, ‘జోంబీ’, ‘మూకుతి అమ్మన్’ ‘ఆర్23 క్రిమినల్స్ డైరీ‘ వంటి చిత్రాల్లో యాషిక నటించింది.
అలాగే ‘బెస్టీ’, ‘శిరుతై శివ’, ‘భగీర’, ‘సల్ఫర్’, ‘పంబట్టం’, ‘కదమైయై సెయ్' తదితర చిత్రాలతో తమిళంలో మరింత పాపులర్ అయ్యింది.
ప్రస్తుతం తమిళంలో ‘ఇవన్ థన్ ఉత్తమన్’, ‘రాజా భీమా’ తదితర చిత్రాల్లో నటిస్తూ యషికా ఆనంద్ బిజీ బిజీగా గడుపుతోంది.
ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ యషికా చాలా చురుగ్గా వ్యవహరిస్తోంది.
ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తోంది. సినిమాలకు అతీతంగా ఫాలోవర్లను సంపాదించుకుంటోంది.
ప్రస్తుతం యషికా అనంద్ ఇన్స్టాగ్రామ్ ఖాతాను 4.1 మిలియన్ల అనుసరిస్తుండటం గమనార్హం.
సెప్టెంబర్ 10 , 2024
Swag Movie Review: స్త్రీ, పురుషులలో ఎవరు గొప్పో చెప్పేసిన శ్రీవిష్ణు.. ‘స్వాగ్’తో హిట్ కొట్టినట్లేనా?
నటీనటులు : శ్రీవిష్ణు, రితూ శర్మ, దక్ష నగర్కర్, మీరా జాస్మిన్, సునీల్, గెటప్ శ్రీను, రవి బాబు, గోపిరాజు రమణ, శరణ్య ప్రదీప్ తదితరులు
రచన, దర్శకత్వం : హసిత్ గోలి
సంగీతం : వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: వేదరామన్ శంకరన్
ఎడిటింగ్: విప్లవ్
నిర్మాత : టి. జి. విశ్వప్రసాద్
విడుదల తేదీ: 04-10-2024
వివైధ్య కథలకు కేరాఫ్గా మారిన శ్రీవిష్ణు (Sree Vishnu) నటించిన లేటెస్ట్ చిత్రం ‘స్వాగ్’ (Swag Movie) ‘రాజ రాజ చోర’ (Raja Raja Chora) వంటి సూపర్ హిట్ తర్వాత హసిత్ గోలి (Hasith Goli) దర్శకత్వంలో వచ్చిన రెండో చిత్రం ఇది. ఇందులో రీతూవర్మ (Ritu Varma), మీరా జాస్మిన్ (Meera Jasmine), దక్ష నగర్కర్ (Daksha Nagarkar) కథానాయికలుగా చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? శ్రీవిష్ణు-హసిత్ గోలి కాంబోకు మరో విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
శ్వాగనిక వంశానికి సంబంధించి కథ సాగుతుంది. 1550 ప్రాంతంలో మాతృస్వామ్యం, పితృస్వామ్యం అంటూ మగ, ఆడవారి మధ్య ఆధిపత్య తగాదాలు ఉండేవి. భవభూతి మహారాజు (శ్రీవిష్ణు) తన సతీమణి(రీతువర్మ)ని గుప్పెట్లో పెట్టుకోవాలని ప్లాన్ వేసి అందులో విజయం సాధిస్తాడు. అప్పటి నుండి రాజ్యంలోని మహిళలు అంతా అతని ఆధీనంలో ఉంటారు. ఇక అతని తర్వాతి సంతతిలో యభూతి (శ్రీవిష్ణు)కి వరుసగా ఆడపిల్లలు పుడతారు. తర్వాత మగపిల్లలు కవలలుగా పుడతారు. కానీ, తన స్నేహితుడు(సునీల్)కి మగపిల్లలు లేరని తన ఇద్దరి పిల్లల్లో ఒకరిని దానం చేసేస్తాడు. కాలక్రమేణా శ్వాగనిక వంశానికి చెందిన వారు చెల్లాచెదురు అవుతారు. కట్ చేస్తే శ్వాగనిక వంశానికి చెందిన సంపద ఓ చోట భద్రంగా ఉంటుంది. ఆ వంశానికి చెందిన వారసుడికి అది ఇవ్వాలని నిర్ణయిస్తారు. ఈ క్రమంలో తామే శ్వాగనిక వంశానికి చెందినవారమంటూ కొందరు వస్తారు. ఇంతకీ వారు ఎవరు? సంపద వారికి దక్కిందా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
యువ నటుడు శ్రీవిష్ణు తన నటనతో అదరగొట్టాడు. భవభూతి మహారాజు, యభూతి, భవభూతి, విభూతి, సింగ వంటి ఐదు పాత్రల్లో అతడు కనిపించాడు. యభూతి పాత్రతో ప్రేక్షకులకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాడు. భవభూతి పాత్రతో నవ్విస్తూ ఆకట్టుకున్నాడు. రీతూవర్మ కూడా తన పర్ఫామెన్స్తో మెప్పించింది. 11 ఏళ్ల తర్వాత తెలుగు తెరపై రీఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్ తన నటనతో పర్వాలేదనిపించింది. దక్షా నగర్కర్ తన గ్లామర్తో మంచి మార్కులు కొట్టేసింది. నటనకు పెద్దగా స్కోప్ లభించలేదు. రవి బాబు, సునీల్, గెటప్ శ్రీను వంటి నటులు ఉన్నప్పటికీ సినిమా మెుత్తం శ్రీవిష్ణు మీదనే తిరగడంతో వారి పాత్రలు హైలేట్ కాలేదు. మిగిలిన పాత్రదారులు పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు హసిత్ గోలి ఎంపిక చేసుకున్న పాయింట్ బాగుంది. కానీ టేకింగ్ చాలా గందరగోళంగా అనిపిస్తుంది. తొలి అర్ధభాగంలో దాదాపు 40 నిమిషాల వరకు కథేంటో తెలీదు. ఆ టైంలో వచ్చే కామెడీ కాస్త ఊరటనిస్తుంది. భవభూతి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆసక్తిగా చూపించి కథలోకి తీసుకెళ్లారు డైరెక్టర్. ఇంటర్వెల్ బ్లాక్ గజిబిజిగా అనిపించినా ఓకే అనిపిస్తుంది. మొత్తంగా ఫస్ట్ హాఫ్ యావరేజ్ అని చెప్పవచ్చు. సెకండాఫ్ విషయానికి వస్తే యభూతి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ను డిజైన్ చేసిన విధానం మెప్పిస్తుంది. కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు నవ్వించేలా ఉన్నాయి. కానీ క్లైమాక్స్ మళ్ళీ గందరగోళంగానే ముగుస్తుంది. ‘లింగ వివక్ష అనేది సమాజానికి చీడ’ అన్నట్టు ఓ లైన్తో ముగించారు దర్శకుడు. అయితే అర్దాంతరంగానే సినిమా ముగిసిన భావన కలుగుతుంది. స్క్రీన్ ప్లే చాలా కన్ఫ్యుజింగ్గా అనిపిస్తుంది. సినిమా మెుత్తం పూర్తి ఏకాగ్రతతో చూస్తే తప్ప అర్ధమయ్యేలా లేదు.
టెక్నికల్గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే వివేక్ సాగర్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్గా మారాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. బడ్డెట్ తక్కువే అయినా మంచి రిచ్ ఔట్పుట్ను అందించారు.
ప్లస్ పాయింట్స్
కథశ్రీవిష్ణు నటనకామెడీ
మైనస్ పాయింట్స్
కన్ఫ్యూజింగ్ స్క్రీన్ప్లేస్లో నేరేషన్
Telugu.yousay.tv Rating : 2.5/5
అక్టోబర్ 04 , 2024
Cannes Film Festival 2023: ఛీ..ఛీ..ఛీ.. భారతదేశం పరువు తీస్తున్నారు కదా..ట్రోల్స్తో ఏకిపారేస్తున్న నెటిజన్లు!
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్లోడ్ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
మే 19 , 2023
Avneet Kaur: కసి అందాలు చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతున్న అవ్నీత్ కౌర్
బాలీవుడ్ హాట్ బాంబ్ అవనీత్ కౌర్ తన లేలేత పరువాలతో సోషల్ మీడియాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మత్తెక్కించే అందాలతో రచ్చ రచ్చ చేస్తోంది.
ప్రస్తుతం జర్మనీలో పర్యటనలో ఉన్న ఈ అమ్మడు అక్కడి సముద్రపు పడవలో అందాల ప్రదర్శన చేసింది.
ఎద పొంగులు, నడుము అందాలను చూపిస్తూ నెటిజన్లకు అదిరిపోయే హాట్ ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అవనీత్ వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె పంబాబ్లోని జలంధర్లో జన్మించింది. 8 ఏళ్లకే 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్' షోలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది.
ఓ వైపు డ్యాన్స్ షోలలో పాల్గొంటూనే పంజాబీ, హిందీ టీవీ సీరియల్స్లో అవనీత్ నటించింది. 'మేరీ మా' 'సావిత్రి ఏక్ ప్రేమ్ కహానీ', 'హమారీ సిస్టర్ దీదీ' వంటి సీరియళ్లతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
ముఖ్యంగా 'అల్లాఉద్దీన్' సీరియల్లో హీరోయిన్ యాస్మిన్ పాత్రతో అవనీత్ పాపులర్ అయ్యింది. దీంతో బాలీవుడ్ అవకాశాలు ఆమెను వరించాయి.
2014లో వచ్చిన 'మర్దానీ' (Mardaani) చిత్రంతో తొలిసారి అవనీత్ బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఇందులో మంచి నటన కనబరిచి అందర్నీ ఆకట్టుకుంది.
ఆ తర్వాత వరుసగా దోస్త్, బ్రూనీ, ఏక్తా, మర్దానీ 2 చిత్రాల్లో ఈ బ్యూటీ నటించింది. అయితే అవేమి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
దీంతో ఓటీటీలోనూ అవనీత్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 'బాబర్ కా తాబర్', 'బందిశ్ బండిట్స్' వంటి వెబ్సిరీస్లలోనూ కనిపించింది.
గతేడాది టీకూ వేడ్స్ శేరూ, ఈ ఏడాది 'లవ్ కి అరేంజ్ మ్యారేజ్' చిత్రాల్లో అవనీత్ నటించింది. ఈ రెండు కూడా అవనీత్కు కోరుకున్న పాపులారిటీని అందించలేకపోయాయి.
ప్రస్తుతం 'లవ్ ఇన్ వియాత్నం' అనే ఫిల్మ్లో అవనీత్ నటిస్తోంది. ఈ సినిమా ద్వారానైనా బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదగాలని ఈ భామ ఆశిస్తోంది.
సినిమాల్లో జయపజయాలు ఎలా ఉన్న అవనీత్కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు హాట్ ట్రీట్ ఇస్తూ ఫ్యాన్స్ను అలరిస్తుండటమే ఇందుకు కారణం.
అవనీత్ కౌర్ ఇన్స్టాగ్రామ్ నుంచి పోస్టు వచ్చిందంటే అది నెట్టింట ట్రెండింగ్ కావాల్సిందే. తన జిగేలు మనే అందాలతో ఈ అమ్మడు కవ్విస్తుంటుంది.
దీంతో నెట్టింట అవనీత్ కౌర్ ఫాలోవర్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను 32.1 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
జూలై 27 , 2024