• TFIDB EN
  • రచ్చ (2012)
    U/ATelugu2h 24m

    రాజ్‌ బెట్టింగ్ కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడే యువకుడు. విలన్‌ కూతుర్ని ప్రేమలో పడేస్తానని రూ.20 లక్షలకు పందెం కాస్తాడు. అనుకున్నట్టుగానే ఆమెను ప్రేమలో పడేస్తాడు. ఆమె చేత ఐ లవ్‌ వ్యూ చెప్పించుకునే క్రమంలో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది స్టోరీ.

    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌Hotstar
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌JioCinema
    ఇన్ ( Telugu )నాట్‌ అవైలబుల్‌ ఇన్‌ తెలుగు
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    తమన్నా భాటియాచైత్ర అమ్ము
    ముఖేష్ రిషిబళ్లారి
    దేవ్ గిల్బైరెడ్డి కొడుకు
    నాసర్ చైత్ర తండ్రి
    బ్రహ్మానందండా.రంగీల
    అలీపాపా రావు
    దీక్షా పంత్ పాపారావు ప్రియురాలు
    పరుచూరి బ్రదర్స్జేమ్స్ తండ్రి
    జయ ప్రకాష్ రెడ్డిసబ్ ఇన్స్పెక్టర్ JPD సౌజా
    గీతా కాదంబీబళ్లారి భార్య
    వేణు మాధవ్రాజ్ స్నేహితుడు
    శ్రీనివాస రెడ్డిరాజ్ స్నేహితుడు
    తాగుబోతు రమేష్ రాజ్ స్నేహితుడు
    ఎంఎస్ నారాయణరాజ్ పెంపుడు తండ్రి
    సుధరాజ్ పెంపుడు తల్లి
    రవిబాబుచైత్ర అంగరక్షకుడు
    ఝాన్సీ లక్ష్మిస్లమ్ సభ్యుడు
    చత్రపతి శేఖర్గ్రామస్థుడు
    ఎల్బీ శ్రీరామ్ఎల్బీ శ్రీరామ్ గ్రామస్థుడు
    శ్రియా శర్మచైత్ర సోదరి
    హేమరాజ్ అత్త
    సత్య కృష్ణస్లమ్ సభ్యుడు
    వెన్నెల కిషోర్రాజ్ స్నేహితుడు
    జూనియర్ రేలంగిమతస్థుడు
    సిబ్బంది
    సంపత్ నందిదర్శకుడు
    RB చౌదరినిర్మాత
    ఎన్వీ ప్రసాద్నిర్మాత
    పరాస్ జైన్నిర్మాత
    మణి శర్మసంగీతకారుడు
    సమీర్ రెడ్డిసినిమాటోగ్రాఫర్
    కథనాలు
    Disha patani: మత్తెక్కించే అందాలతో రచ్చ చేసిన లోఫర్‌ బ్యూటీ!
    Disha patani: మత్తెక్కించే అందాలతో రచ్చ చేసిన లోఫర్‌ బ్యూటీ!
    బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ మరోమారు అందాల విందు చేసింది. తాజాగా ఎల్లె లిస్ట్ అవార్డు వేడుకల్లో పాల్గొన్న ఆమె మత్తెక్కించే పరువాలతో అందర్నీ కవ్వించింది.  క్లీన్ క్లీవేజ్‌ అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. అసలైన బోల్డ్‌నెస్‌కు తెరలేపి ఫ్యాన్స్‌ దృష్టిని తనవైపునకు తిప్పుకుంది.  దిశా పెట్టే బోల్డ్‌ ఫొటోలు ట్రెండింగ్‌లో నిలవడం గత కొంతకాలంగా కామన్‌ అయిపోయింది. ఈ భామ నుంచి పోస్టు వచ్చిందంటే ఇక తమకు పండగేనని నెటిజన్లు కేరింతలు కొడుతున్నారు.  మోడల్‌ అయిన దిశా పటాని ‘లోఫర్‌’ సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో దిశా హోయలు చూసి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.  లోఫర్‌ సినిమా తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసిన ఈ భామ.. అక్కడ పలు హిట్‌ చిత్రాలు తీసి హిందీ ప్రేక్షకులను అలరించింది.  దిశా నటించిన ఎం.ఎస్‌ ధోని (M.S. Dhoni), భాగీ 2 (Baaghi 2),  బాగీ 3 (Baaghi 3), రాధే వంటి చిత్రాలు మంచి హిట్‌ టాక్ తెచ్చుకున్నాయి.  భాగీ సినిమా షూటింగ్‌ సమయంలో హీరో టైగర్ ష్రాఫ్‌తో దిశా ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. వారి ఇరువురి డేటింగ్ అంశం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.  అయితే టైగర్, దిశా రిలేషన్‌ ఎక్కువ కాలం నిలబడలేదు. ఏదో కారణాల వల్ల వారు బ్రేక్‌ చెప్పుకున్నట్లు అప్పట్లో బాలీవుడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ భామ చేతిలో పలు భారీ బడ్జెట్‌ సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్‌ నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్రా నటించిన ‘యోధ’ చిత్రంలో దిశా హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీ డిసెంబర్‌ 15న రిలీజ్‌ కాబోతోంది.  పాన్‌ ఇండియా స్థాయిలో రాబోతున్న ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంలో దిశా కూడా నటిస్తోంది. అలాగే తమిళ హీరో సూర్య నటిస్తున్న ‘కంగువా’లో కూడా ఈ బ్యూటీ కీలక పాత్ర పోషిస్తోంది. 
    నవంబర్ 20 , 2023
    Anasuya Bharadwaj: కైపెక్కించే ఫోజుల్లో రచ్చ రచ్చ చేస్తున్న రంగమ్మత్త!
    Anasuya Bharadwaj: కైపెక్కించే ఫోజుల్లో రచ్చ రచ్చ చేస్తున్న రంగమ్మత్త!
    బుల్లితెర యాంకర్‌ & నటి అనసూయ భరద్వాజ్‌ మరోమారు గ్లామర్‌ ఫొటోలతో తళుక్కుమంది. హాఫ్‌ జాకెట్‌లో సింధూర పువ్వులా మెరిసిపోయింది. ట్రెండీ లెహంగా, మ్యాచింగ్ టాప్ ధరించిన అనసూయ.. మతులు పోగెట్టో ఫోజులతో అలరించింది. సోఫాలో పడుకొని అందాల విందు చేసింది. హాట్‌ హాట్‌ స్టిల్స్‌తో ఆకట్టుకుంది.  జబర్దస్త్‌ షో ద్వారా బుల్లితెరకు తొలిసారి అనసూయ పరిచయమైంది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి కుర్రకారును తన మాయలో పడేసింది.  2012 - 2022 మధ్య  బుల్లితెర యాంకర్‌గా ‌కొనసాగిన అనసూయ.. మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. కేవలం యాంకర్‌గానే గాక గ్లామర్‌ బ్యూటీగానూ పేరు తెచ్చుకుంది.  యాంకర్‌ కాకముందు ప్రముఖ వార్త ఛానల్‌లో అనసూయ న్యూస్‌ రీడర్‌గా చేసింది. నటనపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులో సోగ్గాడే చిన్ని నాయన, క్షణం, విన్నర్‌, గాయత్రి సినిమాల్లో అనసూయ నటించింది. క్షణం చిత్రంలో ఆమె పోషించిన ప్రతినాయక పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. రంగస్థలం సినిమా అనసూయ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించింది. తన యాక్టింగ్‌తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది.  రంగస్థలం తర్వాత వరుస సినిమా ఆఫర్లు అనసూయను చుట్టుముట్టాయి. మీకు మాత్రమే చెప్తా, కథనం, F2, చావు కబురు చల్లగా, థ్యాంక్‌ యూ బ్రదర్‌, కిలాడీ, వాంటెడ్ పండుగాడు సినిమాల్లో అనసూయ మెరిసింది.  సుకుమార్‌ తెరకెక్కించిన ‘పుష్ప’ సినిమాలోనూ అనసూయ గోల్డెన్‌ ఛాన్స్‌ కొట్టేసింది. ఇందులో దాక్షయణి పాత్ర పోషించి అలరించింది. ప్రస్తుతం పుష్ప2 చిత్రంలోనూ ఈ భామ నటిస్తోంది.  తాజాగా విమానం సినిమాలో అనసూయ కీలకపాత్ర పోషించింది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజై ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్‌లో అనసూయ బిజీబిజీగా గడుపుతోంది. 
    జూన్ 01 , 2023
    The Kerala Story : రచ్చ రేపుతున్న ‘ది కేరళ స్టోరీ’.. వివాదానికి ప్రధాన కారణం అదేనా?
    The Kerala Story : రచ్చ రేపుతున్న ‘ది కేరళ స్టోరీ’.. వివాదానికి ప్రధాన కారణం అదేనా?
    'ది కేరళ స్టోరీ ' చిత్రం విడుదలకు ముందే తీవ్ర దుమారం రేపుతోంది. మే 5న ఈ సినిమా విడుదల కానుండగా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయోద్దంటూ కేరళ ప్రభుత్వం సహా కాంగ్రెస్‌, సీపీఐ, ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ‘ది కేరళ స్టోరీ’ విద్వేషపూరితంగా చిత్రీకరించారని, సినిమా విడుదల చేస్తే మత సామరస్యం దెబ్బతింటుందని పలువురు ఏకంగా సుప్రీకోర్టునే ఆశ్రయించారు. ఈ స్థాయిలో వివాదం రాజుకోడానికి కారణమేంటి? ఈ చిత్రంపై సుప్రీంకోర్టు ఎలా స్పందించింది? కేరళ కంటే తమిళనాడు ఎందుకు ఎక్కువగా ఆందోళన చెందుతోంది? అసలు ఈ సినిమా సెన్సార్‌ క్లియర్‌ చేసుకుందా? వంటి ప్రశ్నలకు ఈ ప్రత్యేక కథనంలో సమాధానం చూద్దాం. వివాదానికి బీజం: సుదీప్తోసేన్‌ దర్శకత్వం వహించిన ‘ది కేరళ స్టోరీ’ అదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలో నటించారు విపుల్‌ అమృత్‌లాల్‌ షా నిర్మాతగా వ్యవహరించారు. కేరళలో 2016-17 మధ్య 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడ అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఓ నలుగురు యువతులు మతం మారి ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో చేరతారు. ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో కథ చూపించడం వివాదానికి దారితీసింది. ‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ ఏప్రిల్‌ 26న విడుదలవ్వగా అప్పటి నుంచే దీనిపై రాజకీయ రగడ మొదలైంది.  కేరళ సీఎం ఆగ్రహం 'ది కేరళ స్టోరీ' ట్రైలర్‌.. కేరళ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై ఆ రాష్ట్ర సీఎం స్పందించారు. ‘రాష్ట్రంలో మతపరమైన విభజన, ద్వేషాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఈ చిత్రం నిర్మించినట్లు అర్థమవుతుంది. ‘లవ్‌ జిహాదీ’ అంశాన్ని దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, హోం మంత్రిత్వశాఖ కూడా తిరస్కరించినా.. కేరళను ప్రపంచం ముందు అవమానించేందుకే మరోసారి దీన్ని తెరపైకి తీసుకొచ్చారు’ అంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విమర్శించారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ఈ ప్రయత్నాలు చేస్తున్నాయని.. వారి రాజకీయాలు ఇక్కడ సాగవని పరోక్షంగా భాజపా, RSSలకు చురకలు అంటించారు.  సినిమాను బ్యాన్‌ చేయాలి ‘ది కేరళ స్టోరీ’ చిత్రం విడుదలను కేరళ అధికార పార్టీతోపాటు విపక్ష కాంగ్రెస్‌ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. సమాజంలో విషం చిమ్మేందుకు భావప్రకటనా స్వేచ్ఛ ఓ లైసెన్సు కాదంటూ మండిపడింది. రాష్ట్రంలో చిత్రం విడుదలకు అనుమతి ఇవ్వకూడదని కాంగ్రెస్‌, డీవైఎఫ్‌ఐ, ఐయూఎంఎల్‌ వంటి యువజన సంఘాలు డిమాండ్‌ చేశాయి. అంతర్జాతీయ స్థాయిలో కేరళను అవమానించే రీతిలో ఈ చిత్రం ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీడీ సతీశన్‌ పేర్కొన్నారు. మత విశ్వాసాలను దెబ్బతీసేందుకు ఓ వర్గం యత్నిస్తోందని ఐయూఎంఎల్ జాతీయ కార్యదర్శి పీకే ఫిరోజ్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ కూడా సినిమాను వ్యతిరేకిస్తూ ట్విట్ చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛను తప్పుగా చిత్రీకరించారని మండిపడ్డారు.  తమిళనాడు అలెర్ట్‌ ది కేరళ స్టోరి రిలీజ్‌ డేట్‌ సమీపిస్తుండటంతో తమిళనాడు ప్రభుత్వాన్ని ఇంటెలిజెన్స్‌ బృందాలు అలెర్ట్‌ జారీ చేశాయి. తమిళనాడులో మూవీ విడుదలైతే రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు, నిరసనలు చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. ‘కేరళ స్టోరీ’ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకోవాలని ప్రభుత్వానికి నిఘా వర్గాలు సూచించాయి. అయితే ఇప్పటి వరకు తమిళనాడులో సినిమాను విడుదల చేసేందుకు  ఎవరూ ముందుకు రాలేదని రాష్ట్ర పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అన్ని థియేటర్లలో పొన్నియన్‌ సెల్వన్‌-2 నడుస్తున్నట్లు చెప్పాయి. ధియేటర్‌ యాజమానులు ‘ది కేరళ స్టోరీ’ని ఇప్పట్లో రిలీజ్‌ చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదని పేర్కొన్నాయి. సెన్సార్‌ బోర్డ్‌ అభ్యంతరాలు ‘ది కేరళ స్టోరీ’ ఇటీవలె సెన్సార్‌ పూర్తి చేసుకుంది. వివాదస్పదంగా మారిన ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు ‘A సర్టిఫికేట్’ ఇచ్చింది. అంతేగాక సినిమాలోని వివిధ సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దేవుళ్లకు సంబంధించిన డైలాగులు కొందరి మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని తెలిపింది. మరికొన్ని పదాలను సవరించాలని కోరింది. మొత్తం 10 సన్నివేశాలు వివాదాస్పదంగా ఉన్నాయని పేర్కొంది. వాటిని డిలీట్ చేయాలని చెప్పింది. పలు సవరణలతో మే 5న చిత్ర విజయానికి అనుమతించింది.  సుప్రీంకోర్టు స్పందన ‘ది కేరళ స్టోరీ’ సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన అభ్యర్థనను ధర్మాసనం నిరాకరించింది. ‘ది కేరళ స్టోరీ’లో విద్వేషపూరితమైన ప్రసంగాలు, వీడియోలు ఉన్నాయని దాఖలైన పిటీషన్‌పై కోర్టు స్పందించింది. ‘ఈ సినిమా సెన్సార్‌ సర్టిఫికెట్‌ పొందింది. మీరు దీని విడుదలను సవాల్‌ చేయాలనుకుంటే ఆ సర్టిఫికెట్‌తో తగిన ఫోరంను సంప్రదించండి’ అని సుప్రీంకోర్టు పిటిషనర్లకు సూచించింది. 
    మే 03 , 2023
    Cameraman Gangatho Rambabu: థియేటర్ల వద్ద పవన్‌ ఫ్యాన్స్‌ రచ్చ… సినిమా రీరిలీజ్‌కు కారణమదే!
    Cameraman Gangatho Rambabu: థియేటర్ల వద్ద పవన్‌ ఫ్యాన్స్‌ రచ్చ… సినిమా రీరిలీజ్‌కు కారణమదే!
    పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్‌ యాక్షన్‌ మూవీ 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' (Cameraman Gangatho Rambabu). 2012లో వచ్చిన ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా తమన్నా భాటియా (Tamannaah Bhatia) నటించింది. ప్రకాష్‌ రాజ్‌, కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రలు పోషించారు. బద్రి (2000) తర్వాత పవన్‌ - పూరి కాంబోలో వచ్చిన రెండో చిత్రమిది. అప్పట్లో ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే ఇవాళ ఈ సినిమా రీరిలీజ్‌ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్లలో మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  రీరిలీజ్‌కు కారణమదేనా! టాలీవుడ్‌లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవన్‌ కళ్యాణ్‌ (Cameraman Gangatho Rambabu Re Release) ఒకరు. పైగా ఏపీ రాజకీయాల్లో జనసేన (Janasena Party) అధ్యక్షుడిగా పవన్‌ కళ్యాణ్‌ చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుందని విశ్లేషణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ మూవీ ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ రీరిలీజ్‌ కావడం ఆసక్తి రేపుతోంది. ఆయన పొలిటికల్‌ మైలేజ్‌ను మరింత పెంచేందుకు సినిమా రీరిలీజ్‌ చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న వేళ.. ఈ సినిమా రీరిలీజ్‌ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.  థియేటర్లలో ఫ్యాన్స్‌ రచ్చ రచ్చ! ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు' సినిమా రీరిలీజైన థియేటర్లలో ఫ్యాన్స్‌ హంగామా చేస్తున్నారు. కొత్త సినిమా రిలీజైనంత ఆనందంగా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. పేపర్‌ కటింగ్స్‌ను గాల్లోకి విసిరేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. అంతేకాకుండా మూవీలోని సీన్లను నెట్టింట షేర్‌ చేసి వైరల్‌ చేస్తున్నారు. #CameramanGangathoRambabu హ్యాష్‌ట్యాగ్‌తో ఆ వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.  హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని సంధ్యా థియేటర్లలో ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ (Cameraman Gangatho Rambabu Re Release) చిత్రాన్ని ప్రదర్శించారు. హీరో ఎంట్రీ సందర్భంగా ఫ్యాన్స్‌ చేసిన గోలతో థియేటర్‌ దద్దరిల్లింది. మరికొన్ని థియేటర్లలోనూ పవన్‌ ఎంట్రీ సందర్భంగా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. https://twitter.com/i/status/1755066839678460162 https://twitter.com/i/status/1755059327348752417 https://twitter.com/i/status/1755080872309490050 సినిమా ప్రదర్శనకు ముందు సంధ్య థియేటర్ బయట ఫ్యాన్స్‌ నినాదాలు చేశారు. పవన్‌ అప్‌కమింగ్‌ మూవీ ‘ఓజీ’ పేరుతో పరిసరాలను దద్దరిల్లేలా చేశారు. అదే సమయంలో ‘బాబులకే బాబు కళ్యాణ్‌ బాబు’ అంటూ స్లోగన్స్ కూడా ఇచ్చారు. బాణాసంచా సైతం కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.  https://twitter.com/i/status/1755097512300691556 https://twitter.com/i/status/1755050940854575519 https://twitter.com/i/status/1755076337927410140 ఏపీలోని వైజాగ్‌లో కూడా ఈ చిత్రం రీరిలీజ్‌ సందర్భంగా ఫ్యాన్స్‌ సందడి చేశారు. ముఖ్యంగా ఓ థియేటర్‌కు భారీగా వచ్చిన పవన్‌ ఫ్యాన్స్‌.. జనసేన జెండాలను ప్రదర్శించారు. స్క్రీన్‌ వద్దకు వెళ్లి ఈలలు, కేకలు వేస్తూ ఊర్రూతలూగించారు. https://twitter.com/i/status/1755058297563185509 పవన్‌ ఎంట్రీ సందర్భంగా నటుడు ఎం.ఎస్‌ నారాయణ చెప్పే డైలాగ్స్‌ కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.  https://twitter.com/i/status/1755087745880564102 సినిమాలోని ‘ఎక్స్‌ట్రాడ్నరీ’ పాట సందర్భంగా ఫ్యాన్స్ మరింత ఊగిపోయారు. కుర్చీలపైన నిలబడి మరి పవన్‌ స్టెప్పులను ఎంజాయ్‌ చేశారు.  https://twitter.com/i/status/1755074209372385626 ‘మెలికలు తిరుగుతుంటే’ పాట కూడా పవన్‌ ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పించింది. ఈ పాటలో పవన్‌ స్టెప్పులను హైలేట్‌ చేస్తూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.  https://twitter.com/i/status/1755130614301569433 https://twitter.com/i/status/1755074988850438494 ఓ థియేటర్‌లో పదుల సంఖ్యలో పవన్ ఫ్యాన్స్‌ స్క్రీన్‌ వద్దకు వెళ్లి చిందులు వేశారు. పాటను హమ్‌ చేస్తూ గోల గోల చేశారు. https://twitter.com/i/status/1755087070811537517 పవన్‌ రాజకీయ జీవితాన్ని ప్రతిబింబిచేలా సినిమాలోని కొన్ని డైలాగ్స్‌ను జనసైనికులు వైరల్ చేస్తున్నారు.  https://twitter.com/i/status/1755120800028582335 https://twitter.com/i/status/1755087298054766925 https://twitter.com/i/status/1755117782461567301
    ఫిబ్రవరి 07 , 2024
    Tamannaah Bhatia: ఎద పొంగుల అందంతో రచ్చ రేపుతున్న మిల్కీ బ్యూటీ!
    Tamannaah Bhatia: ఎద పొంగుల అందంతో రచ్చ రేపుతున్న మిల్కీ బ్యూటీ!
    మిల్కీ బ్యూటీ తమన్నా మరోమారు తన అందచందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. బిగుతైన అవుట్‌ఫిట్‌లో యద అందాలను ఆరబోసింది. ముంబయిలో జరిగిన యానిమల్‌ సక్సెస్‌ పార్టీలో పాల్గొన్న తమన్నా.. తాజా లుక్‌తో అక్కడి వారిని కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తమన్నా ఇండస్ట్రీకి పరిచయమై 18 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అదే జోరు కొనసాగిస్తూ కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెడుతోంది.  View this post on Instagram A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus) మెుదట బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన తమన్నా.. ఆ తర్వాత దక్షిణాదిలో వరుస సినిమాలు చేసి స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది.  https://twitter.com/Zoom_News_India/status/1743860862207803778?s=20 గతేడాది చిరంజీవితో చేసిన ‘భోళాశంకర్‌’ చిత్రం నిరాశ పరిచినా.. రజనీకాంత్‌ ‘జైలర్‌’తో ఈ భామ ఘన విజయాన్ని అందుకుంది.  అయితే జైలర్‌ విజయం తర్వాత తమన్నాకు ఆ స్థాయిలో సినిమా ఆఫర్లు రాకపోవడంతో ఫ్యాన్స్‌ నిరాశకు గురవుతున్నారు.  View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) ప్రస్తుతం తమిళంలో ‘అరణ్మణై-4’ చిత్రంతో పాటు ‘హిందీ’లో వేద సినిమాలో తమన్నా నటిస్తోంది. అలాగే మలయాళంలోనూ మరో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లపైనా ఈ భామ ఫోకస్‌ పెట్టింది. ఇటీవల ‘లస్ట్‌ స్టోరీస్‌-2’ వెబ్‌సిరీస్‌లో తమన్నా బోల్డ్‌గా కనిపించింది. తన ప్రియుడు విజయ్‌ వర్మతో ముద్దు సీన్లలో రెచ్చిపోయింది.  ఇప్పటికే 11th అవర్,  నవంబర్ స్టోరీ వంటి రెండు వెబ్ సిరీస్‌లతో తమన్నా ఓటీటీ ప్రేక్షకులను అలరించింది. ఇటీవలలో ‘జీ కర్డా’, ‘ఆఖ్రీ సచ్‌’ వంటి సిరీస్‌లలో కనిపించి మెప్పించింది. ఓ వైపు సినిమాలు, సిరీస్‌లు చేస్తూనే వ్యాపార రంగంపైనా ఈ భామ దృష్టి సారిస్తోంది. వాణిజ్య ప్రకటనల్లో నటించడంతో పాటు పెళ్లిళ్లు, ఇతరత్రా వేడుకల్లో డ్యాన్స్‌ చేస్తూ భారీ మెుత్తంలో అర్జిస్తోంది. మరోవైపు భాయ్‌ ఫ్రెండ్‌ విజయ్‌ వర్మతో షికార్లు చేస్తూ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. సోషల్‌ మీడియాలో తన గ్రామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ ఎప్పటికప్పుడు హాట్‌ ట్రీట్‌ ఇస్తోంది. 
    జనవరి 08 , 2024
    Malaika Arora: ఘాటు అందాలతో మలైకా రచ్చ రచ్చ… నెటిజన్లకు పెద్ద పని చెప్పిన హాట్ బ్యూటీ
    Malaika Arora: ఘాటు అందాలతో మలైకా రచ్చ రచ్చ… నెటిజన్లకు పెద్ద పని చెప్పిన హాట్ బ్యూటీ
    హాట్ డాల్ మలైకా అరోరా మరోసారి ఘాటు అందాలతో రచ్చ చేసింది. మిల్కీ వైట్ అవుట్‌ ఫిట్‌తో సోగసుల విందు చేసింది. లేటు వయసులోనూ వన్నె తగ్గని అందంతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వైట్ అండ్ వైట్ జార్జెట్‌లో టాప్‌ ఆండ్ బాటమ్స్‌లో టూ పాయింట్స్ వద్ద బ్లాక్ ప్లవర్స్‌ అద్దికతో సొగసును రెట్టింపు చేసుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు అరోరా వయసు పెరుగుతుందా? తరగి పోతుందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందాలను విందు చేయడంలో కుర్ర హీరోయిన్లతో పొటీపడుతోంది ఈ ముద్దుగుమ్మ. ఊపిరి సలపకుండా గ్లామర్ ట్రీట్ ఇస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. హాట్ హాట్ క్లీవేజ్ అందాలతో అబ్బా..! అనిపిస్తోంది. నిత్యం యోగా, బాడీ ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ ఇంపైన అందంతో బాడీని మెయిన్‌టెయిన్ చేస్తోంది ఆరోరా తన అందాన్ని కాపాడుకునేందుకు జిమ్‌, యోగా సెంటర్లలో గంటల తరబడి ఉంటానని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది ఈ సొగసుల కోవా ఐదు పదుల వయసుకు చేరువవుతున్నా.. ఇంకా 25+ అందంలా మెరిసిపోతూ మాయ చేస్తోంది మలైకా అరోరా 1973 అక్టోబర్ 23న మహారాష్ట్రలోని థానేలో జన్మించింది. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించింది. హీందీతో పాటు పలు చిత్రాల్లో నటిగా, ఐటెం సాంగ్స్ చేసి తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది షారుక్ ఖాన్ నటించిన దిల్‌సే చిత్రంలో చయ్య.. చయ్య పాటలో నర్తించి యావత్ సినీలోకం దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఈ పాట తనకు ఎంతో గుర్తింపు తీసుకొచ్చింది  నటిగా మలైకా కాంటే (2002), EMI (2008) వంటి చిత్రాలలో లీడ్ రోల్స్‌లో నటించి మెప్పించింది. దబాంగ్, దబాంగ్ 2,  బిచ్చు, భారతీయుడు, మా తుఝే సలామ్, డాలీ కీ డోలీ వంటి చిత్రాల్లో ఐటెం సాంగ్స్‌తో  ప్రేక్షకులను అలరించింది. తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన గబ్బసింగ్ సినిమాలో కెవ్వు కేక పాటలో నటించి పవర్ స్టార్ ఫ్యాన్స్ మనసుల్ని దోచుకుంది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతిథి సినిమాలో రాత్రైనా నాకు ఓకే ఐటెం సాంగ్‌లో నర్తించి యూత్‌లో యమ క్రేజ్ సంపాదించింది. ఇక మలైకా అరోరా వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను 1998లో వివాహం చేసుకుని 2015వరకు కాపురం చేసింది. ఆ తర్వాత తనకన్న వయసులో చాలా చిన్నవాడైన యంగ్ హీరో అర్జున్ కపూర్‌ను 2016లో పెళ్లి చేసుకుంది. దీంతో తన అందానికి మరింత మెరుగులు దిద్దుతూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది ఈ సొగసుల కొమ్మ
    సెప్టెంబర్ 05 , 2023
    Esther Anil: దృశ్యం పాప నాభి అందాలతో రచ్చ రచ్చ.. కామెంట్లతో హీటెక్కిన సోషల్ మీడియా
    Esther Anil: దృశ్యం పాప నాభి అందాలతో రచ్చ రచ్చ.. కామెంట్లతో హీటెక్కిన సోషల్ మీడియా
    దృశ్యం సినిమాలో వెంకటేష్‌ చిన్న కూతురిగా క్యూట్‌గా మెప్పించిన నటి ఎస్తర్‌ అనిల్‌ సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో రచ్చరచ్చ చేస్తోంది. గ్లామర్‌ డోసును అమాంతం పెంచేసి సొదసుల విందు చేస్తోంది. తాజాగా లాంగ్‌ స్కర్ట్‌పై క్లీవేజ్‌ షోతో కైఫెక్కిస్తోంది.  టైట్‌ ఫీట్ జాకెట్‌ ధరించిన ఈ భామ ఎద అందాలను ఆరబోసింది. నాభి అందాల ఆలంబనతో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఎస్తర్ అనిల్ పసందైన పరువాలను  చూసిన నెటజన్లు తమ కామెంట్లకు పనిచెబుతున్నారు.  సోషల్‌ మీడియాలో గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ నెటిజన్లకు హాట్‌ ట్రీట్‌ ఇస్తోంది. తద్వారా ఫాలోవర్లను భారీగా పెంచుకుంటోంది. లెలేత పరువాలతో ఓలలాడిస్తున్న ఈ మలయాళి తెగింపుకు.. ఇన్‌స్టాలో 1.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఏ డ్రెస్ వేసినా తనలోని అందాల కోణాలను మాత్రం కసిగానే చూపిస్తోంది.. ఈ కొంటె అందం.  మెున్నటిదాకా చిన్నపిల్లలా కనిపించిన ఎస్తర్‌ అప్పుడే ఇంత పెద్దదయ్యిందా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.  క్యూట్ లుక్స్‌లో కనిపించిన ఎస్తర్‌.. ఇప్పుడు హాట్‌ బ్యూటీగా మారిందంటూ కమెంట్లు చేస్తున్నారు. ఎస్తేర్ అనిల్  ఆగస్టు 27 (2001)  కేరళలోని వాయనాడ్‌లో జన్మించింది. మలయాళంలో పాపనాశం(దృశ్యం) 2016 సినిమాలో నటించినందుకు గాను కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు సొంతం చేసుకుంది. 2010లో 'నల్లవన్‌' అనే మలయాళం సినిమాతో ఎస్తర్‌ సినీ రంగ ప్రవేశం చేసింది.  మలయాళంలో వచ్చిన పాపనాశం చిత్రం ఎస్తర్‌ కెరీర్‌ను మలుపు తిప్పింది.  తెలుగు, తమిళం రీమేక్‌గా వచ్చిన దృశ్యం 1, 2 సినిమాల్లోనూ ఎస్తర్‌నే తీసుకున్నారు.  తాజాగా తమిళ్‌లో రిలీజైన వింధ్య బాధితుల తీర్పు V3లోనూ నటించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా అవకాశాల కోసం ఈ హాట్ క్యూటీ ఎదురు చూస్తోంది. అందులో భాగంగానే హాట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది
    జూలై 10 , 2023
    MANCHU VISHNU VS MANOJ:  మనోజ్ అనుచరుడిపై మంచు విష్ణు దాడి.. ఇంట్లో చొరబడి రచ్చ రచ్చ 
    MANCHU VISHNU VS MANOJ:  మనోజ్ అనుచరుడిపై మంచు విష్ణు దాడి.. ఇంట్లో చొరబడి రచ్చ రచ్చ 
    ప్రముఖ నటుడు మంచు మోహన్‌ బాబు కుటుంబంలో విబేధాలు రచ్చకెక్కాయి. మంచు విష్ణు, మనోజ్‌ మధ్య వివాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. తనకు కావాల్సిన వాళ్లపై దాడి చేస్తున్నాడంటూ మనోజ్ ఓ వీడియోను  ఫేస్‌బుక్‌ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. అందులో విష్ణు ఎవరిపైకో దూకుడు వెళ్తుంటే ఇద్దరు అడ్డుకున్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ విషయం తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.  https://twitter.com/yousaytv/status/1639147782295666688?s=20 అసలేం జరిగింది? మంచు మనోజ్‌ అనుచరుడు సారథి అనే వ్యక్తిని విష్ణు కొట్టాడని సమాచారం. ఆ సమయంలో మనోజ్ అక్కడే ఉండటంతో  వీడియోను తీసినట్లు తెలుస్తోంది. “నా ఇష్టం” అంటూ విష్ణు గట్టిగా అరవటం చూస్తే ఇద్దరి మధ్య వాడీవేడీగానే పోరు జరుగుతుందని అర్థమవుతోంది. “ఇలా తనకు కావాల్సిన వాళ్ల ఇంటికి వచ్చి కొడుతున్నాడు. ఇది పరిస్థితి” అంటూ మనోజ్‌ మాట్లాడుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాడని వినికిడి. గొడవలు వాస్తవమే! మంచు కుటుంబంలో చాలా రోజులుగానే విబేధాలు ఉన్నాయి. మనోజ్‌ చాలాకాలంగా ఇంటికి దూరంగా ఉంటున్నాడు. దాదాపు సంవత్సరంన్నర పాటు ఎక్కడా మీడియా కంట పడలేదు. విష్ణుతో గొడవల కారణంగానే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లుగానే పరిస్థితులన్ని కనిపించాయి. గత కొన్ని నెలలుగా వీరు మాట్లాడుకోవటం లేదు. మోహన్‌బాబు యూనివర్సిటీ స్నాతకోత్సవంలోనూ ఇద్దరూ పలకరించుకోకపోవటంతో గొడవలున్నాయని అందరూ భావించారు.  పెళ్లి ఇష్టంలేదు భూమా మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవటం కూడా విష్ణుకి ఇష్టం లేదని సమాచారం. అందుకే వివాహ వేడుకకు సంబంధించి ఏ పనుల్లోనూ జోక్యం చేసుకోలేదు. మంచు లక్ష్మీ తన ఇంట్లోనే పెళ్లి ఏర్పాట్లు చేసి అన్నింటిని దగ్గరుండి చూసుకుంది. విష్ణు పెళ్లికి ఏదో అతిథిలా వచ్చి పోయాడంతే. దీంతో వివాహ విషయంలోనూ విబేధాలు తలెత్తాయని సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరిగింది.  రోడ్డుకెక్కాయి ఇద్దరి మధ్య వివాదం చాలాకాలంగా ఉన్నప్పటికీ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. మోహన్‌ బాబు, మంచు లక్ష్మి వారిని నిలువరించారని తెలుస్తోంది. కానీ, ఇప్పుడు మనోజ్ వీడియో పెట్టడంతో మెుత్తం బట్టబయలు అయ్యింది.  క్రమ శిక్షణ మోహన్ బాబు క్రమ శిక్షణకు మారుపేరు. చిత్ర పరిశ్రమలో ఆయనకంటూ ఉన్న గుర్తింపు అది. కానీ, ప్రస్తుతం ఆయన ఇంట్లోనే విబేధాలు రోడ్డున పడటంతో సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ మెుదలయ్యాయి. ఇదేనా క్రమశిక్షణ అంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు. అయితే, కుటుంబంలో గొడవలనేవి సాధారణమే కానీ.. సెలబ్రిటీల ఇంట్లో జరిగేతి అవి కాస్త చర్చకు దారితీస్తాయి. ఇప్పుడు అదే జరుగుతుందనే వారు కూడా ఉన్నారు.  మోహన్‌ బాబు సీరియస్ మంచు విష్ణు, మనోజ్ వివాదంపై మోహన్ బాబు సీరియస్ అయ్యారు. వెంటనే స్టేటస్‌ను డిలీట్ చేయాలని మంచు మనోజ్‌కు గట్టిగా చెప్పారు. దీంతో మనోజ్ తన ఫేస్‌బుక్ స్టేటస్‌ను డిలీట్ చేశారు. ఇంటి పరువు రచ్చకెక్కిస్తున్నారని ఇద్దర్ని ఫొన్‌లో మందలించినట్లు తెలిసింది. సమస్యలు ఉంటే ఇంట్లో చూసుకోవాలని రోడ్డుకెక్కొద్దని తనదైన శైలీలో గట్టిగా హెచ్చరించారు.
    మార్చి 24 , 2023
    Animal OTT: యానిమల్‌ ఓటీటీ వెర్షన్‌లో ఆ సీన్లు లేకపోవడమే రచ్చకు కారణమైందా?
    Animal OTT: యానిమల్‌ ఓటీటీ వెర్షన్‌లో ఆ సీన్లు లేకపోవడమే రచ్చకు కారణమైందా?
    ఓటీటీ ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 'యానిమల్' (Animal) చిత్రం ఎట్టకేలకు స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. రిపబ్లిక్ డే నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (#AnimalOnNetflix)లో ప్రసారం అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, దక్షిణాది భాషల్లో శుక్రవారం (జనవరి 26న) అందుబాటులోకి వచ్చింది. సినిమా బాగుందా? బాగాలేదా? అన్న విషయాన్ని పక్కన పెడితే ఓ విషయంలో మాత్రం ఓటీటీ ప్రేక్షకులు ‘యానిమల్‌’పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా చెప్పుకుంటూ వచ్చిన విషయాన్ని చిత్ర యూనిట్‌ పక్కన పెట్టేయడంపై డిసప్పాయింట్ అవుతున్నారు. ఆ మేటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం.  అసంతృప్తికి కారణమదే! యానిమల్‌ ప్రమోషన్స్ సందర్భంగా సినిమా గురించి ఎన్నో విషయాలు చెప్పిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga).. థియేటర్లలో 3 గంటల 21 నిమిషాల మూవీ కాకుండా మరిన్ని సీన్లు ఉన్నాయని చెప్పాడు. ఈ క్రమంలోనే ఓటీటీలోకి ఎడిట్ చేసిన సన్నివేశాలు కూడా జోడిస్తామని తెగ ఊరించారు. దీంతో యానిమల్ ఓటీటీ వెర్షన్‌పై అందర్లో చెప్పలేనంత క్యూరియాసిటీ పెరిగింది. థియేటర్‌లో సినిమా చూసిన వారు సైతం అదనపు సీన్లు జోడిస్తుండంతో ఓటీటీ వెర్షన్‌పై ఆసక్తి పెంచుకున్నారు. తీరా చూస్తే థియేటర్లలో చూసిన సినిమా కట్‌నే ఓటీటీలోనూ రిలీజ్ చేశారు. దీంతో అదనపు సన్నివేశాలు ఉంటాయని భావించిన వారంతా చాలా డిసప్పాయింట్ అవుతున్నారు.  నెటిజన్ల మండిపాటు డైరెక్టర్‌ సందీప్‌ చెప్పినట్లు 8 నిమిషాల సీన్లను కాకుండా కేవలం 3 నిమిషాల అదనపు సీన్లను మాత్రమే ఓటీటీ వెర్షన్‌లో యాడ్‌ చేసినట్లు తెలుస్తోంది. యానిమల్‌ థియేటర్‌ వెర్షన్‌ నిడివి 3 గంటల 21 నిమిషాలు. అదే ఓటీటీ వెర్షన్‌ తీసుకుంటే 3 గంటల 24 నిమిషాలుగా ఉంది. దీని ప్రకారం కేవలం మూడు సీన్లను మాత్రమే ఓటీటీలో వెర్షన్‌లో యాడ్‌ చేశారని వీక్షకులు అంటున్నారు. ట్విటర్‌ (ఎక్స్‌)లో #Animal హ్యాష్‌ట్యాగ్‌ పేరుతో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అదనపు సీన్లు కూడా పట్టి పట్టి చూస్తే కానీ గుర్తించలేమని అంటున్నారు. కొత్త సీన్లను ఎక్స్‌పెక్ట్‌ చేసిన తమకు తీవ్ర నిరాశే ఎదురైందని పేర్కొంటున్నారు. మెుత్తంగా యానిమల్‌ వ్యవహారంపై కొందరు క్రేజీగా కామెంట్స్‌ చేస్తుంటే మరికొందరు మూవీ యూనిట్‌ తమను మోసం చేసిందని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కోరుకున్న సీన్లు అవేనా! యానిమల్‌ ఓటీటీ వెర్షన్‌లో తాము ఏ సీన్లను కోరుకున్నామో కొందరు నెటిజన్లు ట్విటర్‌ (ఎక్స్‌) వేదికగా స్పష్టం చేశారు. ఫ్లైట్‌లో హీరో, హీరోయిన్ల మధ్య జరిగే రొమాన్స్‌, రణ్‌బీర్‌ - త్రిప్తి దిమ్రితో శారీరకంగా కలిసే సన్నివేశాలకు అదనపు సీన్లను జత చేసి మరింత బోల్డ్‌గా చూపిస్తారని ఆశించినట్లు పోస్టులు పెట్టారు. మరికొందరు ఆ పోస్టులను లైక్‌ చేయడం ద్వారా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంకొందరు నెటిజన్లు యాక్షన్‌ సీన్స్‌లో మరింత వైలెంట్‌ ఎక్స్‌పెక్ట్‌ చేసినట్లు చెప్పారు. సెన్సార్‌ బోర్డు ప్రేక్షకులకు చూపించకుండా కట్‌ చేసిన రొమాన్స్‌, వైలెన్స్‌ సీన్లు అన్ని ఓటీటీలో ఉంటాయని భావించి భంగపడినట్లు కామెంట్స్‌ చేశారు. https://twitter.com/MaayonTweetz_/status/1750863511738265790 మరోవైపు ప్రశంసలు కూడా! ఇదిలా ఉంటే మెుదటిసారి యానిమల్‌ చిత్రాన్ని చూసినవారు మాత్రం సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రన్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) నటన అద్భుతమంటూ కొనియాడుతున్నారు. డైరెక్టర్‌ సందీప్‌ వంగా టేకింగ్‌, స్క్రీన్‌ప్లే చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. యాక్షన్‌ సన్నివేశాలను, హీరోయిజాన్ని ఆయన చక్కగా ఎలివేట్‌ చేశారని కొనియాడుతున్నారు. అంతేకాకుండా యానిమల్‌ చిత్రంలోని హైలెట్‌ సీన్లను తమ ఎక్స్‌ ఖాతాల ద్వారా షేర్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పోస్టులు కూడా #Animal హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్నాయి.  https://twitter.com/i/status/1751101072092127579 బాక్సాఫీసుపై కాసుల వర్షం! డిసెంబర్‌ 1న విడుదలైన యానిమల్‌ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాకు బాలీవుడ్‌లో రెండోది. ఆయన మెుదటి చిత్రం కబీర్‌ సింగ్‌ (Kabir Singh). యానిమల్‌ వరల్డ్‌వైడ్‌గా రూ.900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌కు జోడీగా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించింది. తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అటు తండ్రి పాత్రలో అనిల్‌ కపూర్‌ జీవించారు. చిత్ర విజయంలో తన వంతు పాత్ర పోషించారు.  https://twitter.com/i/status/1751124216349638941
    జనవరి 27 , 2024
    Unique Promotions: ప్రమోషన్స్‌తోనే పడేశారు.. సోషల్ మీడియాలో ‘మేమ్‌ ఫేమస్‌’ రచ్చ రచ్చ..!
    Unique Promotions: ప్రమోషన్స్‌తోనే పడేశారు.. సోషల్ మీడియాలో ‘మేమ్‌ ఫేమస్‌’ రచ్చ రచ్చ..!
    సుమంత్‌ ప్రభాస్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ, తెరకెక్కించిన చిత్రం ‘మేమ్‌ ఫేమస్‌’. ఈ సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం చేస్తున్న ప్రమోషన్స్‌ ఆకట్టుకుంటున్నాయి. రొటిన్‌ ప్రమోషన్స్‌లా కాకుండా చిత్ర యూనిట్‌ వినూత్నంగా తమ సినిమాను ప్రమోట్‌ చేసుకుంటోంది. డీజే బ్యాండ్‌తో స్వయంగా సెలబ్రిటీల దగ్గరకు వెళ్లి తమ ప్రమోషన్స్‌లో వారిని భాగస్వామ్యం చేస్తోంది. ‘మేమ్‌ ఫేమస్‌’ను ప్రమోట్‌ చేస్తూ సెలబ్రిటీలు చెబుతున్న డైలాగ్స్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. విశ్వక్‌సేన్‌ ‘దాస్‌ కా ధమ్కీ’ మూవీ హిట్‌తో విశ్వక్‌ సేన్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో విశ్వక్‌ను కలిసిన ‘మేమ్‌ ఫేమస్‌’ చిత్ర యూనిట్‌ ఆయన చేత వినూత్నంగా సినిమాను ప్రమోట్ చేయించింది.  View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas) తిరువీర్‌ హారర్‌ చిత్రం ‘మసూద’లో లీడ్‌ రోల్‌ చేసిన నటుడు తీరువీర్‌ కూడా ‘మేమ్‌ ఫేమస్‌’ ప్రమోషన్స్‌లో భాగమయ్యాడు. View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas) రాహుల్‌ సిప్లిగంజ్ ఆస్కార్‌ విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ను కూడా చిత్ర యూనిట్‌ కలిసింది. ఊరమాస్‌ స్టెప్పులతో తమ మూవీని ప్రమోట్‌ చేయించుకుంది.  View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas) సింగర్ మంగ్లీ ప్రముఖ సింగర్‌ మంగ్లీ కూడా ధూమ్‌ ధామ్‌ డ్యాన్స్‌తో ‘మేమ్‌ ఫేమస్‌’ సినిమాపై హైప్‌ క్రియేట్ చేసింది.  View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas) అడివి శేష్ యంగ్‌ హీరో అడివి శేష్‌ను కూడా చిత్ర యూనిట్‌ వదల్లేదు. తమ డప్పులకు చిందేయించి మరి హీరోతో ప్రమోషన్ చేయించుకుంది. View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas) విజయ్‌ ఆంటోనీ బిచ్చగాడు-2 సినిమా హీరో ‘విజయ్‌ ఆంటోనీ’ సైతం ఎంతో ఉత్సాహాంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు.  View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas) రానా దగ్గుబాటి ‘మేమ్‌ ఫేమస్‌’ యూనిట్‌తో కలిసి హీరో రానా కూడా రచ్చ రచ్చ చేశాడు. కిర్రాక్‌ స్టెప్పులతో అలరించాడు. View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas) తరుణ్‌ భాస్కర్‌ యంగ్‌ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ ఎంతో హుషారుగా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు. View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas) సుహాస్‌ ‘కలర్‌ ఫొటో’ సినిమా హీరో సుహాస్ చేసిన ప్రమోషన్స్ అన్నింటి కంటే హైలెట్‌ అని చెప్పొచ్చు. సినిమా ఫంక్షన్స్‌లో ఎంతో బిడియంగా కనిపించే సుహాస్‌ తన డ్యాన్స్‌తో ఇరగదీశాడు.  View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas) అనిల్‌ రావిపూడి ప్రముఖ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి కూడా మూవీ ప్రమోషన్స్‌లో తళుక్కుమన్నాడు.  View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas) నవదీప్‌ హీరో నవదీప్‌ ఇటీవల ‘న్యూసెన్స్‌’ అనే వెబ్‌సిరీస్‌లో నటించాడు. ‘మేమ్‌ ఫేమస్‌’ చిత్రంతో పాటు తెలివిగా తన వెబ్‌సిరీస్‌ను కూడా నవదీప్‌ ప్రమోట్‌ చేసుకున్నాడు.  View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas) హరీశ్‌ శంకర్‌ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ కూడా మేమ్ ఫేమస్‌ చిత్ర ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొన్నాడు. View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas) నాగచైతన్య ఎప్పుడూ సాఫ్ట్‌గా, కూల్‌గా ఉండే హీరో నాగచైతన్య కూడా దుమ్ములేపాడు.  View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas) విజయ్‌ దేవరకొండ యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ కూడా తనదైన శైలిలో కొత్త మూవీని ప్రమోట్ చేశాడు. View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas) అల్లు అరవింద్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ కార్యాలయం ఎదుట కూడా ‘మేమ్‌ ఫేమస్‌’ టీమ్ హల్‌చల్‌ చేసింది. ఈ క్రమంలో సడెన్ ఎంట్రీ ఇచ్చిన అల్లుఅరవింద్‌.. మే 26న థియేటర్స్‌లో కలుద్దాం అంటూ మూవీ బృందంతో అన్నారు.  View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas)
    మే 23 , 2023
    <strong>OTT Suggestion: ఆహాలో ఈ బోల్డ్‌ మూవీని చూసేందుకు పోటెత్తుతున్నారు.. బెడ్‌ రూం సీన్లతో రచ్చ!</strong>
    OTT Suggestion: ఆహాలో ఈ బోల్డ్‌ మూవీని చూసేందుకు పోటెత్తుతున్నారు.. బెడ్‌ రూం సీన్లతో రచ్చ!
    సాధారణంగా బోల్డ్‌ కంటెంట్‌ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్‌ బేస్ ఉంటుంది. ఆ తరహా చిత్రాలను చూసేందుకు వారు విపరీతమైన ఆసక్తిని కనబరుస్తుంటారు. అయితే ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే ‘A’ సర్టిఫికేట్‌ చిత్రాలు టాలీవుడ్‌లో రావడం చాలా అరుదు. గతంలో వచ్చిన అరకొర చిత్రాలను కూడా గుట్టుచప్పుడు కాకుండా వెళ్లి థియేటర్లలో చూసి వచ్చేవారు. ప్రస్తుతం ఓటీటీ యుగం నడుస్తుండటంతో ఆ సమస్యకు చెక్‌ పడింది. ప్రస్తుతం ఎలాంటి కంటెంట్‌ అయినా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగులో వచ్చిన ఓ బోల్డ్‌ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో హల్‌చల్‌ చేస్తోంది. ఆ చిత్రాన్ని వీక్షించేందుకు ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకీ ఆ చిత్రం ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం.  ఆ సినిమా పేరేంటి? ఆదర్శ్ బాలకృష్ణ, అక్షర గౌడ, కమల్ కామరాజు, పూజ జవేరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బోల్డ్ కంటెంట్ మూవీ ‘మిక్సప్’ (Mixup). ఆకాష్ బిక్కి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో.. మార్చి 15న ఈ సినిమా రిలీజైంది. అప్పటి నుంచి ఈ సినిమా నెంబర్‌ వన్‌ స్థానంలో దూసుకెళ్తోంది. పేరుకి ‘A’ సర్టిఫికేట్ అయినా.. ఈ మూవీ టేకింగ్‌, మెసేజ్‌ నేపథ్యం ఆడియన్స్‌ బాగా కనెక్ట్ అవుతోంది. అందుకే ఈ సినిమాను చూసేందుకు ఓటీటీ ప్రేక్షకులు విపరీతంగా ఆసక్తి కనబరుస్తున్నారు.&nbsp; ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటి? దర్శకుడు ఆకాష్‌ బిక్కి.. ఈ సినిమా కోసం తీసుకున్న కథ నేటి సమాజాన్ని అద్దం పడుతోంది. ఇందులో హైలెట్‌ చేసిన శృంగార కాన్సెప్ట్స్‌ కూడా యదార్థ సంఘటనలకు దగ్గరగా ఉన్నాయి. ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే.. విపరీతమైన శృంగార కోరికలు ఉన్న భార్య ఉంటే అవతలి వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుంది? పెళ్లి అంటే కేవలం పడక సుఖం మాత్రమే అనుకునే భర్త ఉంటే ఆ భార్య పరిస్థితి ఏంటి? కట్టుకున్న వాళ్లు వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ భాగస్వామి మానసిక స్థితి ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించాడు దర్శకుడు అకాశ్ బిక్కి .  మిక్సప్‌ కథేంటి? అభయ్ (కమల్ కామరాజు), నిక్కీ (అక్షర గౌడ).. సాహో (ఆదర్శ్ బాలకృష్ణ), మైథిలి (పూజ ఝవేరి) భార్య భర్తలు. ఈ రెండు జంటలు సెక్సువల్ లైఫ్ దగ్గర విబేధాలు వచ్చి విడిపోదాం అనుకుంటారు. మొదటి జంటలో నిక్కీకి, రెండు జంటలో సాహోకి సెక్సువల్ లైఫ్‌పై ఎక్కువ ఇంట్రెస్ట్. అయితే వారి పార్ట్నర్స్ అయిన అభయ్, మైథిలి.. లస్ట్ కంటే ప్రేమ లైఫ్‌ని కోరుకుంటూ ఉంటారు. దీంతో రెండు జంటల్లో విబేధాలు వస్తాయి. విడిపోవాలని నిర్ణయం తీసుకుంటారు. అయితే ఓ డాక్టర్‌ సూచన మేరకు ఈ రెండు జంటలు కామన్ ఫ్రెండ్ ద్వారా ఒక రిసార్ట్‌కి వెళ్తాయి. అక్కడ ఒకరికి ఒకరు పరిచయాలు కావడం.. సెక్సువల్ లైఫ్‌పై ఎక్కువ ఇంటరెస్ట్ ఉన్న సాహో, నిక్కీ బాగా కనెక్ట్‌ అవడం జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ రెండు జంటలు చివరికి కలిసున్నాయా? విడిపోయాయా? అన్నది కథ.&nbsp;
    మార్చి 25 , 2024
    #KurchiMadathapetti: షేక్‌ చేస్తున్న ‘కుర్చీమడత పెట్టి’ సాంగ్‌.. ఇన్‌స్టాలో యువతుల రచ్చ రచ్చ!
    #KurchiMadathapetti: షేక్‌ చేస్తున్న ‘కుర్చీమడత పెట్టి’ సాంగ్‌.. ఇన్‌స్టాలో యువతుల రచ్చ రచ్చ!
    మహేష్‌బాబు (Mahesh Babu), డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ (Trivikram) కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). అయితే ఈ సినిమాలోని ‘కుర్చీని మడత పెట్టి’ పాట గత కొన్ని రోజులుగా సోషల్‌మీడియాను షేక్‌ చేస్తోంది.&nbsp; https://www.youtube.com/watch?v=mUr_1FNOR74 https://twitter.com/i/status/1743682443595702709 అధిక సంఖ్యలో యువత ఈ సాంగ్‌ (Kurchi Madatha petti)కు తమదైన శైలిలో సెప్పులు వేసి రీల్స్‌ చేస్తున్నారు. వాటిని తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్టు చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు.&nbsp;&nbsp; https://twitter.com/i/status/1748050960021389418 ఈ క్రమంలోనే ‘కుర్చీని మడత పెట్టి’ (#KurchiMadathapetti) సాంగ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డు సృష్టించింది. ఈ సాంగ్‌పై ఇప్పటివరకు వచ్చిన రీల్స్‌ 1 మిలియన్‌&nbsp; (1 Million+ Reels) మార్క్‌ దాటినట్లు ‘గుంటూరు కారం’ మేకర్స్‌ తెలిపారు.&nbsp; https://twitter.com/i/status/1750042925827072227 నెటిజన్ల చేసిన రీల్స్‌ను అన్నింటిని చూపిస్తూ నిర్మాణ సంస్థ హారిక &amp; హాసిని క్రియేషన్స్ వారు తాజాగా ఓ ఆసక్తికర పోస్టును ట్విటర్‌లో షేర్‌ చేశారు. దీంతో #KurchiMadathapetti సాంగ్‌ నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చింది. https://twitter.com/i/status/1749703696202780888 గుంటూరు కారం మేకర్స్‌ చేసిన పోస్టును మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ షేర్‌ చేస్తూ ఆసక్తికర కామెంట్ చేశాడు. 'మడతపెట్టిఫైయింగ్‌ రికార్డ్స్‌ ఆల్‌ ఓవర్‌' అంటూ పోస్టు ట్యాగ్‌ ఇచ్చారు. ప్రస్తుతం థమన్‌ పోస్టును ఫ్యాన్స్‌ షేర్‌ చేస్తూ ట్రెంగిండ్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/MusicThaman/status/1750049401215598875 అంతకుముందు కూడా థమన్‌ మరో ఆసక్తిక పోస్టును ఎక్స్‌ (ట్విటర్‌)లో పెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘ఇది చాలా కాలంగా ట్రెండ్ అవుతోంది’ అనే ట్యాగ్‌తో ‘కుర్చీని మడత పెట్టి’ సాంగ్‌పై వచ్చిన రీల్స్‌ను పోస్టు చేశాడు.&nbsp; https://twitter.com/i/status/1749736285345030645 #KurchiMadathapetti హ్యాష్‌టాగ్‌ ట్రెండింగ్‌లోకి రావడంతో ఈ పాటపై ప్రముఖులు చేసిన రీల్స్‌ కూడా మరోమారు ట్రెండ్‌ అవుతున్నాయి. బిగ్‌బాస్‌ ఫేమ్‌ యావర్‌, నయని పావని కలిసి చేసిన 'కుర్చీని మడత పెట్టి' సాంగ్‌ రీల్‌ నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1748381299424088193 అలాగే #KurchiMadathapetti సాంగ్‌పై పలువురు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్లు చేసిన వీడియోలు&nbsp; సైతం ట్విటర్‌లో ట్రెండింగ్ అవుతున్నాయి. రెడ్‌ శారీలో హుషారెత్తించే స్టెప్పులతో నలుగురు యువతులు వేర్వేరు రీల్స్‌ ఆకట్టుకుంటున్నాయి.&nbsp; https://twitter.com/NaveenMBVizag/status/1750048431916380658 విదేశాల్లోనూ ఈ కుర్చీని మడత పెట్టి సాంగ్ హవా కొనసాగుతోంది. ముగ్గురు యువతులు మంచులో ఈ పాటకు డ్యాన్స్ చేసి అదరగొట్టారు. దానికి సంబంధించిన రీల్‌ కూడా #KurchiMadathapetti హ్యాష్‌ ట్యాగ్‌తో వైరల్‌ అవుతోంది. https://twitter.com/i/status/1747277314097058058 పలువురు డ్యాన్సర్లు కూడా కుర్చీని మడత పెట్టి పాటపై డ్యాన్స్‌ చేశారు. ముఖ్యంగా ఇద్దరు యువతులు తమదైన స్టెప్పులతో ఈ పాటకు ఇరగదీశారు. వారు పర్‌ఫార్మెన్స్ ఎలా ఉందో చూడండి. https://twitter.com/i/status/1749634549741748389 ఒకేసారి ఆరుగురు యువతులు చేసిన రీల్‌ కూడా ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది. వారి డ్యాన్స్‌ అదిరిపోయిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1750060388304212182
    జనవరి 24 , 2024
    Virat Kohli Biopic: విరాట్‌ కోహ్లీగా రామ్‌చరణ్ సెట్ అవుతాడా? సినిమా స్టోరీ, క్లైమాక్స్‌, డైరెక్టర్ల‌పై నెట్టింట్లో రచ్చ..
    Virat Kohli Biopic: విరాట్‌ కోహ్లీగా రామ్‌చరణ్ సెట్ అవుతాడా? సినిమా స్టోరీ, క్లైమాక్స్‌, డైరెక్టర్ల‌పై నెట్టింట్లో రచ్చ..
    రామ్‌చరణ్.. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకడు. సినిమా సినిమాకు తనలోని నటుడుని మెరుగు పరుచుకుంటూ స్థాయిని పెంచుకుంటున్న హీరో. RRR తర్వాత చరణ్ మేనియా మరింత పెరిగింది. దీంతో చెర్రీ అప్‌కమింగ్ ప్రాజెక్టులపై ఫ్యాన్స్‌కి ఎనలేని ఆసక్తి ఏర్పడింది. ఈ క్రమంలో రామ్‌చరణ్ చెప్పిన చేసిన వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారాయి.&nbsp; అవకాశం వస్తే రన్ మెషిన్ Virat Kohli Biopicలో నటిస్తానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు చరణ్. ఎప్పటి నుంచో క్రీడా నేపథ్యం కలిగిన సినిమా చేయాలని భావిస్తున్నట్లు మనసులో మాటను బయటపెట్టాడు. ఈక్రమంలో విరాట్ కోహ్లీ బయోపిక్ మూవీ స్టోరీ ఇలా ఉంటే బాగుంటుంది అని సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఫస్టాఫ్‌లో కథ ఇలా.. విరాట్ కోహ్లీ జీవితంలోని ముఖ్య ఘట్టాలను సినిమాలో చూపించొచ్చు. అండర్19 వరల్డ్‌కప్ ఛాంపియన్, జాతీయ జట్టుకు ఎంపిక, 2011 వన్డే వరల్డ్‌కప్, కెప్టెన్సీ బాధ్యతలు, రికార్డులు, ఫామ్ లేమి, కమ్‌బ్యాక్ వంటి దశలను ఫస్టాప్‌లో చపిస్తే బాగుంటుంది. అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకోవడం అతడి జీవితంలో కీలక ఘట్టం. దీంతో సినిమాలో లవ్ ట్రాక్‌కి రూట్ క్లియర్ అయినట్లే. విరాట్ కోహ్లీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. కెరీర్‌లో వివిధ స్థాయుల్లో కొనసాగుతున్న సమయంలో విరాట్ కోహ్లీ మనోగతం ఏంటో సినిమా ద్వారా చూపించొచ్చు.&nbsp; క్లైమాక్స్ ఇలా ఉంటే సూపర్బ్ భారత్‌కు కోహ్లీ ఎన్నో విజయాలు అందించాడు. జట్టును అత్యుత్తమంగా నడిపించాడు. కానీ, చిరస్థాయిలో నిలిచిపోయే ఘన విజయాన్ని ఖాతాలో వేసుకోలేక పోయాడు. వన్డే, టీ20 వరల్డ్‌కప్, టెస్టు ఛాంపియన్‌షిప్.. ఇలా కీలక ట్రోఫీలన్నీ నోటిదాకా అంది చేజారిపోయినవే. ఇలాంటివి సినిమాలో మంచి ఎమోషన్స్‌ను పండిస్తాయి. టీమిండియా 2023 వన్డే ప్రపంచకప్ గెలిస్తే విరాట్ బయోపిక్‌కి స్టోరీ లైన్ దొరుకుతుంది. అప్పుడు సినిమాకు మంచి క్లైమాక్స్ పాయింట్ దొరుకుతుంది. &nbsp;బహుశా విరాట్ కోహ్లీ ఆడబోయే చివరి వన్డే వరల్డ్‌కప్ కూడా ఇదే అయ్యుంటుంది. మళ్ళీ వరల్డ్‌కప్ 2027లో జరుగుతుంది. అప్పటికి కోహ్లీ వయసు 38కి చేరుకుంటుంది. కాబట్టి ఈ వరల్డ్‌కప్ కోహ్లీకి గొప్ప జ్ఞాపకంగా మిగిలే ఛాన్స్ ఉంటుంది. ఫలితంగా బయోపిక్ కోసం ఈ వరల్డ్‌కప్‌ విజయాన్నే స్ఫూర్తిగా తీసుకోవచ్చు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇలా.. విరాట్ కోహ్లీని టీమిండియా కెప్టెన్సీ నుంచి తొలగించిన ఘటనను ఇంటర్వేల్ బ్యాంగ్‌గా ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆ తర్వాత వరుస సెంచరీలతో కోహ్లీ కమ్ బ్యాక్‌ ఇచ్చిన తీరును సెకండాఫ్‌లో హైలెట్ చేస్తే బాగుంటుంది. వివాదాలపై క్లారిటీ.. విరాట్ ఓ పోరాటయోధుడు. కెరీర్‌లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఉన్నత స్థాయికి ఎదిగాడు.&nbsp; అతనిపై కెప్టెన్సీ వివాదం తీవ్ర ప్రభావం చూపించింది. భారత జట్టుకు నాయకత్వ బాధ్యతల నుంచి తనను అర్ధంతరంగా తప్పించారని విరాట్ ఆరోపించాడు. అయితే, ఇది వాస్తవం కాదని అప్పటి బీసీసీఐ ప్రతినిధులు వెల్లడించారు. దీంతో ఇలాంటి వివాదాలపై సినిమాలో ఓ క్లారిటీ ఇస్తే అది ఫలప్రదంగా ఉంటుందని విరాట్ ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు.&nbsp; రామ్ చరణ్- కోహ్లీ పోలికలు రామ్‌చరణ్, విరాట్ కోహ్లీ ముఖ కవలికలు ఒకే విధంగా ఉంటాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఈ మేరకు విరాట్, చెర్రీల ఫొటోలను పక్కపక్కన పెట్టి పోల్చుతున్నారు. విరాట్‌ బయోపిక్‌ని చేయడానికి చరణ్ సరిగ్గా నప్పుతాడని అంటున్నారు.&nbsp; https://twitter.com/Thyview/status/1636936587237003264?s=20 చరణ్‌లోనూ క్రికెటర్.. రామ్‌చరణ్‌లోనూ ఓ క్రికెటర్ ఉన్నాడు. సెలబ్రిటీల కోసం జరుపుతున్న ‘సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌’లోనూ చరణ్ పాల్గొన్నాడు. తెలుగు వారియర్స్ తరఫున కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. క్రికెట్ ఆడటం చరణ్‌కి అలవాటే కాబట్టి విరాట్ స్టైల్‌లో షాట్లు ఆడగలడని చెబుతున్నారు.&nbsp; https://twitter.com/AlwysVenuCharan/status/1337393959786532867?s=20 ఫిట్‌నెస్..&nbsp; విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌కి కేరాఫ్ అడ్రస్‌లా ఉంటాడు. రామ్‌చరణ్‌కూ ఫిట్‌నెస్ మెరుగ్గా ఉంటుంది. క్రికెట్ ఆడాలన్నా, ఆడుతున్నట్లు నటించాలన్నా ఫిట్‌నెస్ అవసరం. కొన్ని షాట్లు ఎక్కువ టేక్‌లు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలోనూ చరణ్ మనుగడ సాగించగలడు.&nbsp; https://twitter.com/BingedHelps/status/1636943158197252097?s=20 ఈ డైరెక్టర్లు కావాలంట.. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును టేకప్ చేయడం కూడా డైరెక్టర్లకు ఒక సవాళే. కాబట్టి, ఫ్యాన్స్ కొందరి డైరెక్టర్ల పేర్లు సూచిస్తున్నారు. ‘జెర్సీ’ సినిమా తీసిన గౌతమ్ తిన్ననూరి పేరు ముందుగా వినిపిస్తోంది. ఎం.ఎస్ ధోనీ సినిమా తీసిన ‘నీరజ్ పాండే’కు అనుభవం కలిసొస్తుంది. ఇక విలక్షణ దర్శకుడు సుకుమార్ ఈ ప్రాజెక్టును మరో స్థాయికి తీసుకెళ్తాడని భావిస్తున్నారు. హీరోయిజంను పండించే సందీప్ రెడ్డి వంగా, పూరీ జగన్నాథ్; కొరటాల శివ, గౌతమ్ మీనన్, ప్రశాంత్ నీల్, హను రాఘవపూడి పేర్లను సూచిస్తున్నారు.&nbsp;&nbsp; హీరోయిన్‌లు.. విరాట్ బయోపిక్‌లో హీరోయిన్‌గా పూర్తిగా న్యాయం చేయగలిగే నటి అనుష్క శర్మనే. విరాట్ రియల్ లైఫ్ పార్ట్‌నర్ కావడం ఈమెకు ప్లస్ పాయింట్. పైగా తన అనుభవం కూడా సినిమాకు పనికొస్తుంది. కృతిసనన్, శ్రద్ధా కపూర్, లవ్‌టుడే నటి ఇవానా, కన్నడ బ్యూటీ అషిక రంగనాథ్ ఈ పాత్రలకు సెట్ కాగలరని ఊహిస్తున్నారు.&nbsp;
    మార్చి 18 , 2023

    @2021 KTree