రివ్యూస్
How was the movie?
తారాగణం

విజయ్

కీర్తి సురేష్

వరలక్ష్మి శరత్కుమార్

రాధా రవి
పాల కరుప్పయ్య

యోగి బాబు

రాజేష్
J. లివింగ్స్టన్

తులసి
కల్యాణి నటరాజన్
.jpeg)
ప్రేమ్ కుమార్

పాప్రీ ఘోష్
రంజినీ హరిహరన్
యువినా పార్థవి
ఆరుముగం బాల
ఎంజే శ్రీరామ్
జానకి
జయదిత్య కాంగ్
కనిష్క్
మాన్య

కె. శివశంకర్

SS స్టాన్లీ
అశ్వంత్ తిలక్
రనీష్
రవి
మీను
అలోక్ నాథ్
ECR శరవణన్
సెల్వ
అనిత సంపత్
బాలసుబ్రమణి

లల్లూ
ఎలిస్సా ఎర్హార్డ్ట్
రాజా రాణి పాండియన్
వినోద్

ఏఆర్ మురుగదాస్
సిమ్రాన్ గుప్తా ప్రత్యేక పాత్రలో కనిపించింది
సిబ్బంది

ఏఆర్ మురుగదాస్
దర్శకుడు
కళానిధి మారన్
నిర్మాత
బి. జయమోహన్
రచయిత
AR రెహమాన్
సంగీతకారుడు
గిరీష్ గంగాధరన్
సినిమాటోగ్రాఫర్ఎ. శ్రీకర్ ప్రసాద్
ఎడిటర్ర్కథనాలు

Revanth Reddy: టాలీవుడ్పై రేవంత్ సర్కార్ పగ? వరుస ఘటనలు ఏం చెబుతున్నాయి?
తెలంగాణలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తుంటే టాలీవుడ్ (Tollywood)ను రేవంత్ సర్కార్ టార్గెట్ చేసిందా అన్న అనుమానాలు అందరిలో కలుగుతున్నాయి. కొన్ని నెలల క్రితం నాగార్జున విషయంలో మెుదలైన ఈ ప్రచారం తాజాగా అల్లు అర్జున్ నేపథ్యంలో మరోమారు ఊపందుకుంది. రేపో మాపో మోహన్ బాబు అరెస్టు కూడా తథ్యం అన్న వార్తలు నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కావాలనే ఇదంతా చేస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సెలబ్రిటీలకు తన పవర్ ఏంటో రుచి చూపించాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు చక్కర్లు కొడుతున్నాయి. అల్లు అర్జున్ అరెస్టు సందర్భంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. రేవంత్ ప్రభుత్వంలో ఇండస్ట్రీకి వ్యతిరేకంగా జరిగిన ఘటనలు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
బన్నీ అరెస్టు నేపథ్యంలో..
అల్లు అర్జున్ (Allu Arrest) అరెస్టు నేపథ్యంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కార్ ఇండస్ట్రీని టార్గెట్ చేసిందా? అన్న అనుమానాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అంతకుముందు రేవంత్ నుంచి ఎదురైన ప్రతీకూల సంఘటనలకు బన్నీ అరెస్టును ముడిపెట్టి చూసినప్పుడు ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. బన్నీ అరెస్టుపై నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సైతం ఫిల్మ్ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ‘చట్టం ముందు అందరూ సమానులే’.. ‘సినిమావాళ్లు సరిహద్దుల్లో యుద్ధం ఏమీ చేయడంలేదు కదా’.. ‘నాకు నేనే సూపర్ స్టార్’ అంటూ చేసిన కామెంట్స్పై ఇండస్ట్రీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గత ముఖ్యమంత్రులు ఇండస్ట్రీతో ఎంతో సామరస్యంగా ఉన్నారని, రేవంత్ ప్రభుత్వం మాత్రం తమపై కన్నెర్ర చేస్తోదంటూ పలువురు దర్శక నిర్మాతలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.
https://twitter.com/profAIPC/status/1867584148153552902
https://twitter.com/narne_kumar06/status/1867753868052115915
మంచు ఫ్యామిలీ గొడవలోనూ..
ఇటీవల మంచు ఫ్యామిలీ (Manchu Family)లో చెలరేగిన వివాదం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్టాపిక్గా మారింది. ఈ క్రమంలో మంచు మనోజ్ (Manchu Manoj)తో పాటు మంచు విష్ణు (Manchu Vishnu), మోహన్బాబు (Mohan Babu) ఒకరిపై ఒకరు మీడియా ముఖంగా విమర్శలు చేసుకున్నారు. ప్రధాన మీడియా ఛానళ్లు ఈ ఫ్యామిలీ గొడవ గురించే చూపించింది. దీంతో తీవ్ర అసహనానికి లోనైనా మోహన్బాబు ఓ మీడియా ప్రతినిధిపై దాడి సైతం చేశారు. దీనికి సంబంధించి ఆయనపై హత్య కేసు కూడా నమోదైంది. త్వరలో అరెస్టు కూడా చేస్తారని అంటున్నారు. అయితే మనోజ్తో వివాదం నేపథ్యంలో పోలీసులకు ముందే ఫిర్యాదు చేసిన వారు ప్రేక్షక పాత్ర వహించారని ఆడియో సందేశంలో మోహన్ బాబు అసహనం వ్యక్తం చేశారు. మనోజ్ కూడా పోలీసుల వ్యవహార తీరును తప్పుబట్టాడు. ఆపై రాచకొండ సీపీ మంచు విష్ణుతో పాటు, మంచు మనోజ్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం కూడా మీడియాలో హైలెట్ అయ్యింది.
డ్రగ్స్ కేసుల విషయంలో..
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తొలినాళ్లలో డ్రగ్స్పై అవగాహన కల్పించే కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో రేవంత్ సెలబ్రిటీ (Tollywood)లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ నటులు తప్పకుండా డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో పాల్గొనాలని ఆదేశించారు. అందుకు సంబంధించిన వీడియోలు చేయాలని పిలుపునిచ్చారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ దుష్ఫలితాలపై అవగాహన కల్పించే విధంగా తారాగణంతో ఒకటిన్నర లేదా రెండు నిమిషాల నిడివితో వీడియో సినిమాకు ముందు ప్రదర్శించాలని కోరారు. అలా చేస్తేనే టికెట్ ధరల పెంపునకు, షూటింగ్లకు తమ ప్రభుత్వం అనుమతిస్తుందని హుకుం జారీ చేశారు. అయితే రేవంత్ ఇచ్చిన పిలుపు మంచిదే అయిన్పపటికీ ఆయన ఇండస్ట్రీకి వార్నింగ్ ఇచ్చినట్లుగా మాట్లాడటం చాలా మంది దర్శక నిర్మాతలకు నచ్చలేదని అప్పట్లో టాక్ వినిపించింది.
https://twitter.com/Telugu360/status/1808059015038959963
గద్దర్ అవార్డ్స్ సందర్భంలో..
సి. నారాయణ రెడ్డి 93వ జయంతి సందర్భంగా హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలోనూ మరోమారు టాలీవుడ్ (Tollywood)పై సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డులపై రాష్ట్రప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంపై మండిపడ్డారు. ఈ ఏడాది జనవరిలో ప్రతిష్టాత్మక నంది అవార్డులని గద్దర్ అవార్డులతో భర్తీ చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయించింది. ఈ కొత్త కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఎలా అమలు చేయాలనే విషయమై అభిప్రాయాలు, సూచనలు అందించాలని తెలుగు సినీ ఇండస్ట్రీని సీఎం రేవంత్ కోరారు. అయితే దీని గురించి టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడాన్ని జులైలో జరిగిన సి. నారాయణ రెడ్డి జయంతి వేడుకల్లో రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. గద్దర్పై గౌరవంతో తీసుకున్న ఈ నిర్ణయంపై టాలీవుడ్ పెద్దల నుంచి స్పందన లేకపోవడం బాధాకరమని అన్నారు. ఓ బహిరంగ సమావేశంలో రేవంత్ మరోమారు టాలీవుడ్పై విమర్శలు చేయడం అప్పట్లో వార్తల్లో హైలెట్ అయ్యింది.
https://twitter.com/M9News_/status/1818214759227118067
ఎన్ కన్వెన్షన్ కూల్చివేత
చెరువులు, కుంటలను ఆక్రమించి భవనాలను నిర్మించిన అక్రమార్కులపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. అయితే తొలినాళ్లలో సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ భవనాన్ని ప్రభుత్వ అధికారులు ఆగమేఘాల మీద కూల్చివేయడం అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. రూ.వంద కోట్ల విలువైన చెరువు స్థలాన్ని కబ్జా చేసి రెవెన్యూ, ఇరిగేషన్ చట్టాలను ఉల్లంఘించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారన్న ఆరోపణలతో ఆయనపై క్రిమినల్ కేసును సైతం పోలీసులు నమోదు చేశారు. దీనిని కక్ష్యసాధింపు చర్యగా విపక్షాలు ఆరోపించాయి. దురుద్దేశ్యంతోనే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను కూల్చివేశారని మండిపడ్డాయి.
https://twitter.com/sudhakarudumula/status/1827197076960375266
సమంతపై కాంగ్రెస్ మంత్రి వ్యాఖ్యలు
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ (KTR)ను టార్గెట్ చేస్తూ ఇటీవల మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య - సమంత విడాకుల అంశాన్ని కేటీఆర్తో ముడిపెడుతూ దారుణంగా మాట్లాడారు. దీనిని అక్కినేని కుటుంబంతో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. సినీ కుటుంబానికి చెందిన వ్యక్తులను సాఫ్ట్ టార్గెట్ చేసుకోవడం సిగ్గు చేటని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇలాంటి చౌకబారు, నిరాధారమైన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మహేష్ బాబు ఎక్స్లో పోస్టు పెట్టాడు. దీనికి సంబంధించి సదరు మంత్రిపై నాగార్జున పరువు నష్టం దావా వేయగా ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది.
https://twitter.com/KDRtweets/status/1841433938297807337
డిసెంబర్ 14 , 2024

Game Changer: ఎట్టకేలకు ‘గేమ్ ఛేంజర్’ టికెట్ ధరలు పెంచిన తెలంగాణ సర్కార్, ఎంతంటే?
మెగా పవర్స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ చిత్రంపై అభిమానుల్లో విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుపై నీలి నీడలు కమ్మాయి. అయితే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ దిల్ రాజు అభ్యర్థన మేరకు టికెట్ ధరలను తెలంగాణ ప్రభుత్వం పెంచింది. కాగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం గేమ్ ఛేంజర్ టికెట్ ధరల పెంపుతో పాటు ఈ సినిమా ప్రదర్శనకు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది.
తెలంగాణలో టికెట్ ధరల పెంపు
తెలంగాణలో సినిమా టికెట్ ధరలను పెంచుకునే అవకాశాన్ని చిత్ర బృందం కోరగా, ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 11న ఉదయం 4 గంటల నుంచి ఆరు షోలకు ప్రదర్శనకు అనుమతి ఇచ్చారు.
సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరను అదనంగా రూ.100 పెంచుకునే వీలును కల్పించారు.మల్టీ ప్లెక్స్ థియేటర్లలో రూ.150 అదనంగా వసూలు చేసేందుకు అనుమతించారు.జనవరి 11 నుంచి 19 వరకు, రోజుకు ఐదు షోలకు అనుమతి ఇచ్చింది.సింగిల్ స్క్రీన్లలో అదనంగా రూ.50,మల్టీ ప్లెక్స్లలో రూ.100 పెంచుకునే వెసులుబాటు కల్పించారు.
అయితే, విడుదల రోజున జనవరి 10 అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చే సూచనను ప్రభుత్వం తిరస్కరించింది.
ఆంధ్రప్రదేశ్లో టికెట్ ధరలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ‘గేమ్ ఛేంజర్’ చిత్రానికి టికెట్ ధరల పెంపునకు, బెనిఫిట్ షోలకు ముందుగానే అనుమతిని ఇచ్చింది.
జనవరి 10న అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షో ప్రదర్శనకు అనుమతి ఇచ్చారు.ఈ బెనిఫిట్ షో టికెట్ ధరను రూ.600 (పన్నులతో కలిపి)గా నిర్ణయించారు.అదే విధంగా, ఆరు షోలకు జనవరి 10న ప్రత్యేక అనుమతి ఇచ్చారు.జనవరి 11 నుంచి 23 వరకు ఐదు షోలకు అనుమతి ఇచ్చి,సింగిల్ స్క్రీన్లలో అదనంగా రూ.135 (జీఎస్టీతో కలిపి),మల్టీ ప్లెక్స్లలో అదనంగా రూ.175 (జీఎస్టీతో కలిపి) వరకు టికెట్ ధర పెంచుకునే వెసులుబాటును కల్పించారు.
ఫ్యాన్స్లో సంబరాలు
తెలంగాణ & ఏపీ ప్రభుత్వాల నిర్ణయాలతో రామ్ చరణ్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. మెగా ఫ్యాన్స్ కోసం భారీ స్థాయిలో ప్రదర్శనలు ప్లాన్ చేస్తూ, ఈ సినిమా టికెట్ ధరలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. రెండు రాష్ట్రాల్లోనూ టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వడం వల్ల మొదటి రోజున సినిమా భారీ కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. ‘గేమ్ ఛేంజర్’ విడుదల కోసం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, టికెట్ ధరల పెంపు, అనుమతులు ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.
జనవరి 09 , 2025

కీర్తి సురేష్ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
కీర్తి సురేష్ తెలుగులో 'నేను శైలజ'(2016) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. నేను లోకల్(2017), మహానటి(2017) వంటి సూపర్ హిట్లతో స్టార్ హిరోయిన్ స్థాయికి ఎదిగింది. మిస్ ఇండియా(2020), రంగ్ దే(2021), సర్కారువారి పాట(2022)వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్లోను చాలా చిత్రాల్లో కీర్తి నటించింది. రెమో, బైరవా, సర్కార్, తొడరి వంటి హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అయితే కీర్తి సురేష్ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Keerthy Suresh) విషయాలు ఇప్పుడు చూద్దాం.
కీర్తి సురేష్ దేనికి ఫేమస్?
కీర్తి సురేష్.. మహానటి, సర్కారువారి పాట వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది.
కీర్తి సురేష్ వయస్సు ఎంత?
1992, అక్టోబర్ 17న జన్మించింది. ఆమె వయస్సు 31 సంవత్సరాలు
కీర్తి సురేష్ ముద్దు పేరు?
కీర్తమ్మ
కీర్తి సురేష్ ఎత్తు ఎంత?
5 అడుగుల 2 అంగుళాలు
కీర్తి సురేష్ ఎక్కడ పుట్టింది?
చెన్నై
Screengrab Instagram: keerthysureshofficial
కీర్తి సురేష్కు వివాహం అయిందా?
ఇంకా కాలేదు
కీర్తి సురేష్ అభిరుచులు?
యోగ, ట్రావెలింగ్, స్మిమ్మింగ్
కీర్తి సురేష్కు ఇష్టమైన ఆహారం?
దోశ
కీర్తి సురేష్ అభిమాన నటుడు?
సూర్య, విజయ్
తెలుగులో కీర్తి సురేష్ తొలి సినిమా?
నేను శైలజ(2016)
కీర్తి సురేష్ నటించిన తొలి తెలుగు సినిమా?
శ్రీ
కీర్తి సురేష్ ఏం చదివింది?
ఫ్యాషన్ డిజైన్లో BA హానర్స్
Courtesy Instagram: Keerthy suresh
కీర్తి సురేష్ పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ.3 కోట్లు వరకు ఛార్జ్ చేస్తోంది.
కీర్తి సురేష్ తల్లిదండ్రుల పేర్లు?
సురేష్ కుమార్, మేనక
కీర్తి సురేష్కు అఫైర్స్ ఉన్నాయా?
తమిళంలో కమెడియన్ సతీష్తో అఫైర్ ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి.
కీర్తి సురేష్ ఎన్ని అవార్డులు గెలిచింది?
మహానటి చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటి అవార్డును కీర్తి సురేష్ అందుకుంది.
తమన్నా భాటియా ఇన్స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/keerthysureshofficial/?hl=en
కీర్తి సురేష్ ఎన్ని లిప్ లాక్ సీన్లలో నటించింది?
ఇంతవరకు అలాంటి సీన్లలో నటించలేదు
కీర్తి సురేష్ ఫెవరెట్ హీరోయిన్
సిమ్రాన్
కీర్తి సురేష్ గురించి మరికొన్ని విషయాలు
కీర్తి సురేష్ తండ్రి సురేష్, మలయాళం మెగాస్టార్ మమ్మూటి ఇద్దరు కాలేజీ రోజుల్లో క్లాస్మెట్స్ తన స్కూల్ డేస్లో కీర్తి సురేష్ అనేక స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని చాలా అవార్డులు గెలుచుకుంది.కీర్తి సురేష్ సోదరి రేవతి మంచి VFX స్పెషలిస్ట్, షారుక్ ఖాన్కు చెందిన రెడ్ చిల్లీస్ సంస్థలో పనిచేస్తోంది.కీర్తి సురేష్ తండ్రి ఫిల్మ్ మేకర్ కాగా ఆమె తల్లి మేనక 100కు పైగా చిత్రాల్లో నటించింది.
https://www.youtube.com/watch?v=dCuIkapXKDY
ఏప్రిల్ 16 , 2024

Game Changer: 'మేము మూలాలు మర్చిపోలే'.. బన్నీకి పవన్ చురకలు?
గ్లోబల్ స్టార్ రామ్చరణ్ (Ramcharan) హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) రూపొందించిన తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్' (Game Changer). సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలవుతున్న ఈ చిత్రంపై సినీ లవర్స్లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఇందులో చరణ్కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) చేసింది. అంజలి, ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, సునీల్ కీలకపాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే ఏపీలోని రాజమండ్రిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ వేడుకకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బన్నీకి పవన్ చురకలు!
‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ (Allu Arjun)కు పరోక్షంగా చురకలు అంటించారు. 'మేము మూలాలు మర్చిపోకూడదు. పవన్ కల్యాణ్ ఉన్నా.. రామ్చరణ్ ఉన్నా.. ఏ హీరోలు ఉన్నా గానీ దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు. మీరు ఈ రోజు కల్యాణ్ బాబు అనండి.. ఓజీ అనండి.. డిప్యూటీ సీఎం అనండి.. ఏది అన్న కూాడా ఆయనే ఆద్యులు (చిరంజీవి). నేను మూలాలు మర్చిపోను' అంటూ చెప్పుకొచ్చారు.
https://twitter.com/Aryashree69/status/1875561189297848476
ఏకైక గేమ్ ఛేంజర్ పవన్ కల్యాణ్: చరణ్
'గేమ్ ఛేంజర్' ఈవెంట్లో రామ్చరణ్ మాట్లాడుతూ రాజమండ్రి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 'గేమ్ ఛేంజర్ టైటిల్ శంకర్ గారు ఎందుకు పెట్టారో తెలియదు. కానీ నిజ జీవితంలో గేమ్ ఛేంజర్ ఎవరో అందరికీ తెలుసు. కేవలం ఏపీలోనే కాదు ఇండియన్ పాలిటిక్స్కు ఉన్న ఏకైక గేమ్ ఛేంజర్ ఇవాళ పవన్ కల్యాణ్ గారు. అలాంటి ఆయన పక్కన నేను నిలబడటం చాలా అదృష్టం' అని చరణ్ చెప్పుకొచ్చారు.
https://twitter.com/10TvTeluguNews/status/1875561046905426062
పవన్కు థ్యాంక్స్: దిల్రాజు
'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత దిల్ రాజు మాట్లాడారు. 'గేమ్ ఛేంజర్ కథ ప్రస్తుత సమాజానికి అద్ధం పడుతుంది. రామ్చరణ్ నటన నేషనల్ అవార్డు వచ్చే లెవల్లో ఉంటుంది. ఈ సినిమా సంక్రాంతికి అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మేము అడగ్గానే సమయాన్ని కేటాయించినందుకు పవన్ గారికి స్పెషల్ థ్యాంక్స్. టికెట్లు రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ జీవో ఇచ్చినందుకు నా ధన్యవాదాలు' అంటూ దిల్రాజు చెప్పుకొచ్చారు.
రెండు కొత్త సాంగ్స్ రిలీజ్..
‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. మెగా ఫ్యాన్స్కు గ్రాండ్ ట్రీట్ ఇచ్చారు. బ్యాక్ టూ బ్యాక్ రెండు కొత్త పాటలను విడుదల చేశారు. ఈ సందర్భంగా థమన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'పొలిటికల్ గేమ్ ఛేంజర్ పవన్ కల్యాణ్, సినిమా గేమ్ ఛేంజర్ రామ్చరణ్ సమక్షంలో ఈ వేడుక జరగడం చాలా సంతోషంగా ఉంది' అంటూ వ్యాఖ్యానించారు.
https://twitter.com/AlwayzRamCharan/status/1875545320534503879
https://twitter.com/Pirateishere_/status/1875546243805671786
చరణ్పై అంజలి కామెంట్స్..
‘గేమ్ ఛేంజర్’లో హీరోయిన్ అంజలి కీలక పాత్ర పోషించింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముందుగా పవన్ గురించి మాట్లాడుతూ.. ‘మీపైనా నాకు చాలా గౌరవముంది. మీతో వకీల్సాబ్లో నటించారు. మీ గ్రోత్ డిప్యూటీ సీఎం స్థాయికి చేరింది. ఇలాగే మరిన్ని విజయాలు సాధించాలి’ అని పేర్కొంది. అలాగే చరణ్ గురించి ప్రస్తావిస్తూ ‘ఎలాంటి కోస్టార్స్తో చేస్తే కంఫర్టబుల్గా ఫీలవుతామో అలాంటి యాక్టర్ చరణ్. మీతో వర్క్ చేయడం అద్భుతంగా ఉంది. మీతో మరిన్ని చిత్రాలు చేయాలి’ అని అంజలి చెప్పుకొచ్చింది.
నేషనల్ అవార్డు పక్కా..
ఏపీలోని రాజమండ్రిలో ఏర్పాటు చేసిన 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్కు భారీగా మెగా అభిమానులు తరలివచ్చారు. ముందుగా నటుడు పృథ్వీ మాట్లాడుతూ సినిమాపై భారీగా అంచనాలు పెంచేశారు. ‘గేమ్ ఛేంజర్తో రామ్చరణ్కు నేషనల్ అవార్డ్ పక్కా. అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్తో ఉన్న క్యారెక్టరైజేషన్ ఆయనది. సీన్లు బాగా వచ్చాయి. ఎస్.జే సూర్య పక్కన కనిపించే పొలిటిషియన్ పాత్ర చేశా. తమిళంలోనూ నేనే డబ్బింగ్ చెప్పా’ అంటూ చెప్పుకొచ్చారు.
https://twitter.com/OnlyForRC45/status/1875536386679566757
ఏపీ సర్కార్ గుడ్న్యూస్..
'గేమ్ ఛేంజర్' చిత్రానికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టికెట్ ధరల పెంపుతో పాటు, (Game Changer Ticket Rates) బెనిఫిట్ షోలకూ అనుమతి ఇచ్చింది. అర్ధరాత్రి 1గంట ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600 (పన్నులతో కలిపి) నిర్ణయించారు. అలాగే, జనవరి 10న ఆరు షోలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉదయం 4 గంటలకు ప్రత్యేక షో నిర్వహించేందుకూ అనుమతి ఇచ్చారు. మల్లీప్లెక్స్లో అదనంగా రూ.175 (జీఎస్టీతో కలిపి), సింగిల్ థియేటర్లలో రూ.135 (జీఎస్టీతో కలిపి) వరకూ టికెట్ పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. జనవరి 11 తేదీ నుంచి 23 తేదీ వరకూ ఇవే ధరలతో ఐదు షోలకే అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది.
జనవరి 04 , 2025

Pushpa 2 Ticket Price: ‘పుష్ప 2’ టికెట్ ధర రూ.1,239/-.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ చిత్రం మరో ఐదు రోజుల్లో రిలీజ్ కానుంది. దీంతో చిత్ర బృందం వరుసగా మూవీ ప్రమోషన్స్ చేస్తూ సినిమా హైప్ పెంచేస్తోంది. పాట్నా నుంచి మెుదలుకొని చెన్నై, కొచ్చి, ముంబయి ఇలా వరుసగా ప్రమోషన్స్ చేసింది. ఇదిలా ఉంటే శుక్రవారం నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో ‘పుష్ప 2’ అడ్వాన్స్ బుకింగ్ (Pushpa 2 Advance Bookings) మెుదలయ్యాయి. దీంతో తెలుగు స్టేట్స్లో ఎప్పుడు మెుదలవుతాయా? అని తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో పుష్ప టీమ్కు తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. వారు చేసిన విజ్ఞప్తిని మన్నిస్తూ టికెట్లు రేట్లు పెంచుకునేందుకు అనుమతించింది.
‘టికెట్కు రూ.800 తీసుకోండి’
పాన్ ఇండియా స్టార్ బన్నీ 'పుష్ప 2' మూవీ టికెట్ల రేట్లు (Pushpa 2 Ticket Price) పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. సుకుమార్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం డిసెంబర్ 5న గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. భారీ బడ్జెట్తో రూపొందిన నేపథ్యంలో రెండు బెనిఫిట్ షోలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతించింది. డిసెంబర్ 4న రాత్రి 9.30 గం.లకు తొలి బెనిఫిట్ షోతో పాటు అర్ధరాత్రి 1 గం.లకు రెండో షో వేసుకునేందుకు వీలు కల్పించింది. అంతేకాదు ఈ బెనిఫిట్ షోల టికెట్ ధరను రూ.800 వరకూ పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఫలితంగా బెనిఫిట్ షోలలో ‘పుష్ప 2’ టికెట్స్ రూ.1000కి పైగా పలకనుంది. సింగిల్ స్క్రీన్లో రూ.1,121, మల్టీప్లెక్స్ రూ.1,239కి టికెట్స్ విక్రయించనున్నారు.
https://twitter.com/RainbowMedia_/status/1862792646055338010
https://twitter.com/TeluguScribe/status/1862784973419196691
మిగతా రోజుల్లో..
బెన్ఫిట్ షోలతో పాటు మిగిలిన రోజులకు సంబంధించి కూడా టికెట్ పెంపు రేటును (Pushpa 2 Ticket Price) తెలంగాణ సర్కార్ ఫిక్స్ చేసింది. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్లకు సెపరేట్స్ నిర్ణయించింది. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.150, మల్టీఫ్లెక్స్లో రూ.200 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్లో రూ.105, మల్టీఫ్లెక్స్లో రూ.150 పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్లో రూ.20, మల్టీఫ్లెక్స్లో రూ.50 పెంపునకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా తెలంగాణ వ్యాప్యంగా ఉన్న థియేటర్లలో టికెట్ ధరలు పెరగనున్నాయి. దీని ప్రకారం మెుదటి నాలుగు రోజుల టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్స్లో రూ.354, మల్టీ ప్లెక్స్లో రూ.531గా ఉండనున్నాయి. ఇవాళ (నవంబర్ 30) సా. 4.56 తెలంగాణలో అడ్వాన్స్ బుకింగ్ మెుదలయ్యాయి.
ఏపీలో కష్టమేనా..
టికెట్ల పెంపునకు తెలంగాణతో పాటు ఏపీ ప్రభుత్వాన్ని సైతం ‘పుష్ప 2’ టీమ్ రిక్వెస్ట్ చేసుకుంది. దీంతో ఏపీ సర్కార్ నుంచి కూడా సోమవారం అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అక్కడ కూడా రెండు బెన్ఫిట్ షోలు వేసుకునేందుకు అనుమతి ఇచ్చే ఛాన్స్ ఉందని ఫిల్మ్ వర్గాలు అంటున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన స్థాయిలో భారీగా పెంచుకునేందుకు అవకాశం ఉంటుందా? లేదా? అన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే అల్లు వర్సెస్ మెగా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. చెన్నై ఈవెంట్లో ‘ఏం పీకలేరు’ అంటూ ఇంగ్లీషులో PK అనే పదాన్ని హైలెట్ చేసిన పోస్టు వైరల్ అయ్యింది. దీంతో పవన్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ ఉన్న నేపథ్యంలో టికెట్ల రేట్లు స్వల్పంగా పెంచుకునేందుకే అవకాశమిస్తారని అంటున్నారు.
రేపు బిగ్ ఈవెంట్
తెలుగు రాష్ట్రాలు మినహా దేశంలోని పలు రాష్ట్రాల్లో ‘పుష్ప 2’ వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. అయితే తెలుగు స్టేట్స్లో మాత్రం ఇప్పటివరకూ ఒక్క ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించలేదు. దీంతో హైదరాబాద్లో బిగ్ ఈవెంట్ను ‘పుష్ప 2’ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సినిమాకు ఎంతో కీలకమైన ప్రీ-రిలీజ్ ఈవెంట్ను మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించాలని అనుకుంటున్నారట. ఈవెంట్ ఆర్గనైజర్ శ్రేయాస్ మీడియా ఇప్పటికే మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యంతో మాట్లాడినట్లు తెలుస్తోంది. పోలీసుల అనుమతి సైతం లభిస్తే డిసెంబర్ 1న సాయంత్రం ఈవెంట్ జరగనుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ఫోర్త్ సింగిల్ ‘పీలింగ్స్’ను కూడా రిలీజ్ చేసే అవకాశముంది.
నవంబర్ 30 , 2024

Pushpa 2: పవన్ సాయంతో చరిత్ర సృష్టించబోతున్న ‘పుష్ప 2’.. ఎలాగంటే?
మెగా, అల్లు కుటుంబాల మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఏపీ ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఎన్నికల అనంతరం పవన్ భాగస్వామిగా ఉన్న కూటమి పార్టీలు భారీ విజయం సాధించడం, ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం చేయడం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం బన్నీ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో టికెట్ల పెంపు విషయంలో పవన్ ఏ విధంగా స్పందిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చిత్ర నిర్మాతలు పవన్ వద్దకు వెళ్లినట్లు సమాచారం. అక్కడ పవన్ స్పందన చూసి అందరూ షాకవుతున్నారు.
పవన్.. గ్రీన్ సిగ్నల్!
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొందిన 'పుష్ప 2' (Pushpa 2) చిత్రం డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 13,500 స్క్రీన్స్లో ప్రదర్శితం కానుంది. దేశంలో 8,500, ఓవర్సీస్లో 5,000 థియేటర్లలో పుష్ప 2 షోలు పడనున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాను నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్లు దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్తో రూపొందించారు. దీంతో టికెట్ల రేట్లు పెంపునకు అనుమతివ్వాలని తాజాగా వారు ఏపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకున్నారట. ఈ విషయపై పవన్తో నిర్మాతలు చర్చించినట్లు ఏపీ రాజకీయ వర్గాలు తెలిపాయి. టికెట్ల పెంపుపై పవన్ (Pawan Kalyan) సానుకూలంగా స్పందించారని అంటున్నారు. అల్లు వర్సెస్ మెగా అంటూ బయట జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో పవన్ ఎలా రియాక్ట్ అవుతారోనని నిర్మాతలు తెగ ఆందోళన చెందారట. కానీ, పవన్ చాలా కూల్గా ఓకె చెప్పడం చూసి వారు ఆశ్చర్యపోయారట. టికెట్ల పెంపునకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం ఏపీ ప్రభుత్వం నుంచి రానున్నట్లు తెలుస్తోంది.
పవన్ సాయం.. రూ.350 కోట్లు పక్కా!
టికెట్ల పెంపు అంశంపై ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించినట్లే త్వరలోనే తెలంగాణ సర్కార్ను కూడా ‘పుష్ప 2’ (Pushpa 2) టీమ్ కలవనుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా టికెట్ల పెంపుపై సానుకూలంగా స్పందించే ఛాన్స్ ఉంది. సగటున టికెట్పై రూ.100-125 పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీని ప్రకారం సింగిల్ స్క్రీన్ ధరలు ప్రస్తుతం రూ.175 ఉండగా రూ.300, మల్టీప్లెక్స్లలో రూ.275 ఉండగా రూ.425 లేదా అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికితోడు 13,500 స్క్రీన్స్లో ప్రదర్శితం కానుండటంతో ‘పుష్ప 2’ తొలిరోజే దాదాపుగా రూ.350 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే కలెక్షన్స్ పరంగా ఇండియాలోనే బిగ్గెస్ట్ డే 1 గ్రాసర్గా పుష్ప 2 చరిత్ర సృష్టించనుంది. రూ.223.5 కోట్ల తొలి రోజు కలెక్షన్స్తో ప్రస్తుతం RRR టాప్లో కొనసాగుతోంది. ‘పుష్ప 2’ తొలిరోజు రూ.350+ కోట్లు కలెక్ట్ చేస్తే టికెట్ల పెంపు ద్వారా పవన్ ఇచ్చిన ప్రోత్సాహం కూడా అందుకు కారణం కానుందని చెప్పవచ్చు.
ట్రైలర్ నేపథ్యంలో మళ్లీ లొల్లి..!
బిహార్ రాజధాని పాట్నాలో పుష్ప 2 (Pushpa 2) ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన ఈ వేడుకకు ఎవరు ఊహించని స్థాయిలో భారీగా బన్నీ అభిమానులు తరలివచ్చారు. పొరుగు రాష్ట్రంలో బన్నీకి దక్కిన ఈ స్థాయి ఆదరణ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఈ విషయాన్ని ఆయుధంగా చేసుకొని బన్నీ ఫ్యాన్స్ పవన్ను టార్గెట్ చేస్తున్నారు. పవన్కు కేవలం ఏపీలో మాత్రమే జనం వస్తారని, కానీ బన్నీకి ఉత్తరాది రాష్ట్రంలోని పాట్నాలో కూడా పోటెత్తారని కామెంట్స్ చేస్తున్నారు. బన్నీకి మద్దతుగా పోస్టులు పెడుతున్న వారిలో వైకాపా అభిమానులు సైతం ఉండటం విశేషం. అల్లు అర్జున్ ముందు పవన్ కల్యాణ్ నథింగ్ అంటూ మెగా ఫ్యాన్స్ను రెచ్చగొడుతున్నారు. మరోవైపు పవన్ ఫ్యాన్స్ సైతం గట్టిగా సమాధానం ఇస్తున్నారు. మహాారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్కు వచ్చిన ఆదరణ చూడాలని సూచిస్తున్నారు. దేశ ప్రధాని మెచ్చిన గొప్ప వ్యక్తి పవన్ అంటూ కౌంటర్ ఇస్తున్నారు.
పుష్ప 2 మరో రికార్డు
'పుష్ప 2' (Pushpa 2) చిత్రం రిలీజ్కు ముందే పలు రికార్డులను కొల్లగొడుతోంది. తాజాగా ప్రీసేల్ బుకింగ్స్లో మరో ఘనత సాధించింది. ఓవర్సీస్లో అత్యంత వేగంగా ‘పుష్ప2’ (Pushpa 2) వన్ మిలియన్ డాలర్ల క్లబ్లోకి చేరింది. అమెరికన్ బాక్సాఫీస్లో అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్ ద్వారానే వన్ మిలియన్ డాలర్ల మార్క్ను చేరిన సినిమాగా ‘పుష్ప2’ నిలిచింది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టింది. ‘మరో రోజు.. మరో రికార్డుతో చరిత్ర సృష్టించాడు. బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా కొనసాగుతూనే ఉంటుంది’ అంటూ కొత్త పోస్టర్ను విడుదల చేసింది. ఇది చూసిన అల్లు ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. పుష్ప గాడి జైత్ర యాత్ర మెుదలైందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/PushpaMovie/status/1858759197883834867
నవంబర్ 19 , 2024

Top Searched Telugu Heroines in 2024: ఈ ఏడాది గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టాలీవుడ్ అందాల భామలు వీళ్లే
టాలీవుడ్ అంటేనే ప్రపంచ సినీ ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ప్రత్యేకించి, ఈ పరిశ్రమను ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దడంలో హీరోయిన్ల పాత్ర అమోఘం. అద్భుతమైన అభినయంతో పాటు, అందంతో కట్టిపడేసి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. కను సైగలతోనే మాట్లాడగల నేర్పుతో అలరిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తమ ప్రతిభతోనే కష్టపడి ఎదిగిన ఈ కథానాయికల అందం, నటన మనం మరిచిపోలేము. ఈ క్రమంలో 2024 సంవత్సరంలో ఇంటర్నెట్లో నెటిజన్లు ఎక్కువగా వెతికిన టాప్ తెలుగు హీరోయిన్ల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. మీరు ఓ లుక్ వేయండి
Sobhita Dhulipala
శోభితా ధూళిపాళ టాలీవుడ్ హీరోయిన్ . ఆమె ప్రధానంగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళ చిత్రాలలో నటిస్తోంది. ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ను గెలుచుకుంది. మిస్ ఎర్త్ 2013లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం రామన్ రాఘవ్ 2.0 (2016) ద్వారా నటిగా పరిచయమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో డ్రామా సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ (2019)లో ప్రధాన పాత్ర పోషించింది. తెలుగులో గూఢచారి చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. రీసెంట్గా ఆమె హీరో నాగచైతన్యను వివాహం చేసుకుంది.
Meenakshi Chaudhary
మీనాక్షి చౌదరి.. టాలీవుడ్కు చెందిన ప్రముఖ హీరోయిన్. హరియాణాలో పుట్టి పెరిగిన మీనాక్షి.. కెరీర్ ప్రారంభంలో మోడల్గా చేసింది. 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' (2021) ఫిల్మ్తో టాలీవుడ్లో అడుగుపెట్టింది. హిట్ 2, గుంటూరు కారం, లక్కీ బాస్కర్ వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలతో క్రేజ్ సంపాదించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 9 సినిమాలు చేసింది.
Sreeleela
శ్రీలీల తెలుగులో స్టార్ హీరోయిన్. శ్రీలీల చిన్నతనంలో భరతనాట్యం నేర్చుకుని పలు ప్రదర్శనలు ఇచ్చింది. MBBS చదివిన శ్రీలీల నటనపై మక్కువతో సినిమాల్లోకి రంగ ప్రవేశం చేసింది. పెళ్లి సందD చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. ధమాకా, గుంటూరుకారం వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది
Samantha
సమంత భారతీయ నటి. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో ప్రధానంగా నటిస్తోంది. కెరీర్ ఆరంభంలో మోడలింగ్ చేసిన సమంత... గౌతమ్ మీనన్ డైరెక్షన్లో వచ్చిన 'ఏ మాయ చేశావే'(2010) చిత్రంతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె నటనకు గాను విమర్శల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. బృందావనం, దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013), మనం(2014), మజిలి(2019), ఖుషి(2023) వంటి సూపర్ హిట్ చిత్రాలతో అతితక్కువ సమయంలోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అటు సమంత హిందీ వెబ్-సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ రెండవ సీజన్లో రాజీ పాత్రను పోషించింది. ఈ సిరీస్లో ఆమె నటనకు ఎంతో గుర్తింపు లభించింది.
Courtesy Instagram: samantha
Rashmika Mandanna
నేషనల్ క్రష్గా పేరుగాంచిన రష్మిక మందన్న భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ప్రధానంగా నటిస్తోంది. 2016లో వచ్చిన కన్నడ చిత్రం కిర్రాక్ పార్టీ ద్వారా నటిగా పరిచయమైంది. తెలుగులో ఛలో(2018) చిత్రం ద్వారా టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ సరసన గీతా గోవిందం చిత్రంలో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడంతో రష్మికకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత డియర్ కామ్రెడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప, సీతారామం, వారసుడు, యానిమల్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. యానిమల్, పుష్ప ఆమె కెరీర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి. కిరాక్ పార్టీ, గీతాగోవిందం చిత్రాలకు గాను ఉత్తమ నటిగా ఆమె సైమా పురస్కారం అందుకుంది .
Sai Pallavi
సాయిపల్లవి భారతీయ సినీ నటి. మలయాళం చిత్రం ప్రేమమ్ సినిమాతో పరిచయమైంది. ఈ సినిమాలోని మలర్ క్యారెక్టర్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ఫిదా సినిమా ద్వారా టాలీవుడ్కు పరిచయమైంది. ఈ సినిమాలో భానుమతి క్యారెక్టర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఎంసీఎ, పడి పడి లేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్, విరాట పర్వం, గార్గి వంటి చిత్రాల ద్వారా స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది.
Kiara Advani
కియారా అద్వానీ అసలు పేరు ఆలియా అద్వానీ . ఆమె హిందీ మరియు తెలుగు భాషా చిత్రాలలో పని చేస్తుంది. ఆమె హాస్య చిత్రం ఫగ్లీ (2014)లో తొలిసారిగా నటించింది. స్పోర్ట్స్ బయోపిక్ MS ధోని: ది అన్టోల్డ్ స్టోరీ (2016)లో MS ధోని భార్యగా నటించింది. నెట్ఫ్లిక్స్ ఆంథాలజీ ఫిల్మ్ లస్ట్ స్టోరీస్ (2018)లో లైంగికంగా సంతృప్తి చెందని భార్యగా నటించి ప్రశంసలు అందుకుంది మరియు పొలిటికల్ థ్రిల్లర్ భరత్ అనే నేను మేయిన్ హీరోయిన్గా నటించి మెప్పించింది.
Rukshar Dhillon
రుక్సర్ థిల్లాన్ టాలీవుడ్కు చెందిన నటి. 2016లో కన్నడ సినిమా 'రన్ ఆంటోని'తో సినీ రంగ ప్రవేశం చేసింది. ‘ఆకతాయి’ (2017) సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 'కృష్ణార్జున యుద్ధం' (2018), ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ (2022), ‘నా సామిరంగా’ (2024) చిత్రాలతో తెలుగులో పాపులర్ అయ్యింది.
Samyuktha Menon
సంయుక్త మీనన్ తెలుగులో భీమ్లా నాయక్ చిత్రం(2022) ద్వారా టాలీవుడ్కు పరిచయం అయింది. ఈ చిత్రంలో రాణా భార్యగా నటించింది. అయితే ధనుష్తో నటించిన సార్ చిత్రంలో నటించి మంచి గుర్తింపు సాధించింది. ఆ తర్వాత విరూపక్ష, బింబిసారా వంటి బ్లాక్ బాస్టర్ హిట్తో తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరింది. సంయుక్త మీనన్ తెలుగు కంటే ముందు మలయాళం చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. పాప్కార్న్, థివాండి వంటి చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది.
Keerthy Suresh
కీర్తి సురేష్ తెలుగులో 'నేను శైలజ'(2016) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. నేను లోకల్(2017), మహానటి(2017) వంటి సూపర్ హిట్లతో స్టార్ హిరోయిన్ స్థాయికి ఎదిగింది. మిస్ ఇండియా(2020), రంగ్ దే(2021), సర్కారు వారి పాట(2022)వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్లోను చాలా చిత్రాల్లో కీర్తి నటించింది. రెమో, బైరవా, సర్కార్, తొడరి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మహానటిలో ఆమె నటనకు గాను జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది.
Divyansha Kaushik
దివ్యాంశ కౌశిక్ తెలుగు చిత్రం మజిలీ (2019)తో తొలిసారిగా నటించింది, దీని కోసం ఆమె ఉత్తమ మహిళా అరంగేట్రం కోసం SIIMA అవార్డును అందుకుంది.
Pooja Hegde
పూజా హెగ్డే తెలుగులో ఒక లైలా కోసం(2014) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ముకుంద చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్, రాధే శ్యామ్, బీస్ట్, మహర్షి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మహర్షి చిత్రానికి గాను జీసినీ అవార్డ్స్ ఉత్తమ నటి అవార్డు, అల వైకుంఠపురములో చిత్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారాలు అందుకుంది.
Mirnalini Ravi
మృణాళిని రవి 'గద్దలకొండ గణేష్' ద్వారా టాలీవుడ్కు పరిచయమైంది. తర్వాత ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’, ‘మామా మశ్చింద్రా’ చిత్రాల్లో నటించింది. మృణాళిని నటించిన లేటెస్ట్ చిత్రం 'లవ్ గురు'లోనూ మంచి నటన కనబరిచి అభిమానులను అలరించింది.
Kethika Sharma
కేతిక శర్మ తెలుగు సినిమా నటి. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్(2021) చిత్రం ద్వారా టాలీవుడ్కు పరిచయమైంది. ఈ చిత్రం పరాజయం పొందినప్పటికీ.. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. లక్ష్య, రంగ రంగా వైభవంగా, బ్రో చిత్రాల్లో హీరోయిన్గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ గ్లామరస్ డాల్గా గుర్తింపు పొందింది. కేతిక సినిమాల్లోకి రాకముందే మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆమె 2016లో నటించిన 'థగ్ లైఫ్ (2016)' వీడియోతో పాపులర్ అయ్యింది. దబ్ స్మాష్ వీడియోలు, మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో యూత్లో సూపర్ క్రేజ్ పొందింది.
Chandini Chowdary
చాందిని చౌదరి తెలుగులో మధురం సినిమాతో ఆరంగేట్రం చేసింది. 'కలర్ ఫొటో' సినిమాతో గుర్తింపు పొందింది. తన సహజమైన నటన, అందంతో అవకాశాలను అందిపుచ్చుకుంది. గ్లామర్ పరంగా మెప్పిస్తూనే.. ట్రెడిషనల్ లుక్లో అదరగొడుతోంది. ముంబై బామలకు తీసిపోకుండా దూసుకెళ్తోంది. సమ్మతమే, హౌరా బ్రిడ్జ్, గామి చిత్రాల్లో లీడ్ రోల్లో నటించి సత్తా చాటింది. ఈ ముద్దుగుమ్మకు తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Eesha Rebba
ఈష రెబ్బ తెలుగు సినీ నటి. 'అంతకు ముందు... ఆ తరువాత'(2013) చిత్రం ద్వరా హీరోయిన్గా పరిచయమైనది. బందిపోటు, బ్రాండ్ బాబు సినిమాల్లో హిరోయిన్గా గుర్తింపు పొందింది. అయితే ఆ తర్వాత హీరోయిన్గా అవకాశాలు పెద్దగా రాలేదు. కానీ సహాయ నటి పాత్రలు చేస్తూ మెప్పిస్తోంది. అరవింద సమేత వీర రాఘవ, సుబ్రహ్మణ్యపురం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఈష రెబ్బ సినిమాలతో పాటు పలు వెబ్సిరీస్ల్లోనూ నటించింది. 3 రోజస్, పిట్టకథలు, మాయాబజార్ ఫర్ సేల్ వెబ్ సిరీస్ల్లో నటించి ప్రేక్షకులకు చేరువైంది.
Priyanka Jawalkar
"ప్రియాంక జవాల్కర్ తెలుగు సినిమా నటి. కలవరం ఆయే సినిమా(2017) సినిమా ద్వారా ఆమె సినిమారంగ ప్రవేశం చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా 2018లో వచ్చిన టాక్సీవాలా చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. మరాఠి కుటుంబానికి చెందిన ప్రియాంక విద్యాభ్యాసం అంతా ఏపీలోనే జరిగింది. ఆమె హైదరాబాద్లోని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. యాక్టింగ్పై ఇంట్రెస్ట్ ఉన్న ప్రియాంక ఎన్.జె.బిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకుంది. టాలీవుడ్లో నటనతో పాటు గ్లామర్కు అవకాశం ఉన్న పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Dimple Hayathi
డింపుల్ హయాతి తెలుగు సినిమా నటి. గల్ఫ్(2017) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే ఆమెకు గద్దలకొండ గణేష్ చిత్రంలోని 'సూపర్ హిట్టు.. బొమ్మ హిట్టు ఐటెం' సాంగ్ ద్వారా గుర్తింపు లభించింది. ఆ తర్వాత రవి తేజ సరసన ఖిలాడి చిత్రంలో హీరోయిన్గా నటించింది. గోపిచంద్తో రామబాణం సినిమాలోనూ కథానాయికగా నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి. డింపుల్ డ్యాన్స్కు పేరుగాంచింది. ఆమెకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం.
Courtesy Instagram: Dimple Hayathi
Pujita Ponnada
పూజిత పొన్నాడ టాలీవుడ్కు చెందిన నటి. విశాఖపట్నంలో జన్మించింది. తండ్రి ఉద్యోగరిత్యా చెన్నై, ఢిల్లీ నగరాల్లో పెరిగింది. ఊపిరి (2016) సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. 'రన్' (2020) సినిమాతో హీరోయిన్గా మారింది. ఇప్పటివరకూ తెలుగులో 18 చిత్రాల్లో నటించింది.
Ananya Nagalla
అనన్య నాగళ్ల తెలుగు సినీ నటి. మల్లేశం(2019) సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమైంది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'ప్లే బ్యాక్', వకీల్ సాబ్, మాస్ట్రో, ఊర్వశివో రాక్షశివో, శాకుంతలం, మళ్లీ పెళ్లి సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లోకి రాకముందు హైదరాబాద్లోని రాజా మహేంద్ర ఇంజినీరింగ్ కాలేజ్లో బీటెక్ పూర్తి చేసింది. కొన్నిరోజులు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసింది.
Courtesy Instagram:Ananya Nagalla
డిసెంబర్ 04 , 2024

RGV Heroines List: శ్రీదేవి To ఆరాధ్య దేవి.. ఆర్జీవీ చేతిలో పడి స్టార్లుగా మారిన హీరోయిన్లు వీరే!
భారత చిత్ర పరిశ్రమలో వివాదస్పద డైరెక్టర్ అనగానే ముందుగా అందరికీ ‘రామ్ గోపాల్ వర్మ’ (Ram Gopal Varma)నే గుర్తుకు వస్తారు. ‘శివ’ వంటి ట్రెండ్ సెట్టర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆర్జీవీ (RGV).. ఆ తర్వాత కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆర్జీవీ.. ఇప్పటివరకూ పదుల సంఖ్యలో చిత్రాలకు దర్శకత్వం వహించి, మరికొన్నింటిని నిర్మించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఈ చిత్రాల్లో నటించి చాలా మంది నటీమణులు స్టార్ హీరోయిన్లుగా మారిపోయారు. మరికొందరు తమ ఫేమ్ను మరింత పెంచుకున్నారు. ఆర్జీవీ చిత్రాల్లో చేసిన ఆ టాప్ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
ఆరాధ్య దేవి (Aaradhya Devi)
ఆర్జీవీ అప్కమింగ్ చిత్రం 'చీర'లో శ్రీలక్ష్మీ సతీష్ (Shri Lakshmi Satish) నటించింది. ఇందులో ఆమె ఆరాధ్య దేవి పాత్ర పోషిస్తుండటంతో ఆ పేరునే తన పేరుగా మార్చుకుంది. గతేడాది చీరలో ఉన్న అమ్మడి ఫొటో చూసి ఆర్జీవీ ఇంప్రెస్ అయ్యారు. ఆమె అందానికి దాసోహం అయినట్లు తెలిపారు. అంతే కాకుండా ఆమెతో ఏకంగా చీర అనే పేరుతో సినిమా తీసి ఆమె చేత అందాల ప్రదర్శన చేయించాడు. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.
Aaradhya Devi Hot images gallery
ఇర్రా మోర్ (Irra Mor)
ఆర్జీవీ డైరెక్షన్లో వచ్చిన ‘కొండ’ సినిమాతో నటి ఇర్రా మోర్ చాలా పాపులర్ అయ్యింది. అంతకుముందు 'భైరవ గీత', ‘డీ కంపెనీ’ వంటి చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. ‘కొండ’ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో తన అందం, అభినయంతో ఆకట్టుకుంది.
శాన్వీ శ్రీవాస్తవ (Shanvi Srivastava)
హాట్ బ్యూటీ శాన్వీ శ్రీవాస్తవ ఆర్జీవీ డైరెక్షన్లో వచ్చిన 'రౌడీ' సినిమాతో బాగా ఫేమస్ అయ్యింది. ఇందులో మంచు విష్ణుకు జోడీగా నటించి మెప్పించింది. అంతకుముందు లవ్లీ, అడ్డా, చంద్రలేఖ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడుకు పెద్దగా పేరు రాలేదు. రౌడీలో ఈ భామ హోయలు చూసి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ భాషల్లో శాన్వీ వరుసగా చిత్రాలు చేసింది.
Shanvi Srivastava Hot images gallery
పూజా భలేకర్ (Pooja Bhalekar)
హీరోయిన్ల అందాలను చూపించడంలో ఒక్కో డైరెక్టర్ ఒక్కో శైలి ఉంటుంది. అలాగే ఆర్జీవీకి ఓ భిన్నమైన శైలి ఉంటుంది. వివిధ రకాల పొజిషన్లో కెమెరాను పెట్టి హీరోయిన్ అందాలను ఆర్జీవీ క్యాప్చర్ చేస్తుంటారు. ఇలా వచ్చిన చిత్రమే ‘లేడీ బ్రూస్లీ. వర్మ రూపొందించిన ఈ చిత్రంలో నటి పూజా భలేకర్ హాట్ బాంబ్లా చేసింది. తెరపై ఈ భామ అందాల విన్యాసాలకు కుర్రకారు ఫీదా అయ్యారు.
Pooja Bhalekar Bikini images gallery
నైనా గంగూలి (Naina Ganguly)
ఆర్జీవీ టాలెంటెడ్ హీరోయిన్లతో పాటు బోల్డ్ నటీమణులను సైతం ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలా ఇంట్రడ్యూస్ చేసిన నటి నైనా గంగూలి. 2016లో వచ్చిన వంగవీటి సినిమా ద్వారా ఈమె ఇండస్ట్రీకి పరిచయమైంది. 2022లో వచ్చిన డేంజరస్ సినిమాలో ఈ అమ్మడు రెచ్చిపోయింది. గ్లామర్ షో చేసింది.
అప్సర రాణి (Apsara Rani)
ఆర్జీవీ చేతిలో పడి స్టార్గా మారిన మరో హాట్ బాంబ్ అప్సర రాణి. 2022లో వచ్చిన డేంజరస్ సినిమా ద్వారా ఈ భామ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అంతకుముందే పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈ భామకు ఫేమ్ రాలేదు. ఆర్జీవీ సినిమా తర్వాతి నుంచి ఈ అమ్మడు ఓవైపు సినిమాలు, మరోవైపు గ్లామర్ పోస్టులతో సోషల్ మీడియాను ఊపేస్తోంది.
Apsara Rani Hot images gallery
ఊర్మిళ (Urmila Matondkar)
ఆర్జీవీ సినిమాల్లో అత్యధికసార్లు హీరోయిన్గా చేసిన నటి ఊర్మిల. 1992లో నాగార్జున హీరోగా చేసిన ‘అంతం’ సినిమాతో ఊర్మిళ తొలిసారి ఆర్జీవీతో కలిసి వర్క్ చేశారు. ఆ తర్వాత వరుసగా ‘సత్య’, ‘భూత్’, ‘రంగీలా’, ‘అనగనగా ఒక రోజు’, ‘మస్త్’, ‘జంగిల్’, ‘దావుద్’ తదితర చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించి అలరించారు. ముఖ్యంగా రంగీలా సినిమాల్లో ఈమె అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అద్భుతమైన మ్యూజిక్, అందమైన హీరోయిన్ ఉంటే సినిమాను సక్సెస్ చేయవచ్చని ఆర్జీవీ నిరూపించాడు.
అక్కినేని అమల (Akkineni Amala)
స్టార్ హీరో అక్కినేని నాగార్జున భార్య అమల.. ఆర్జీవీ తొలి చిత్రంలో హీరోయిన్గా చేసింది. ‘శివ’ హిందీ వెర్షన్లోనూ అమల నటించింది. ఇందులో ఆమె చక్కటి నటన కనబరిచి సినిమా విజయంలో తన వంతు పాత్ర పోషించింది. ఈ సినిమా తర్వాత ఆమె ఆర్జీవీ డైరెక్షన్లో సినిమా చేయలేదు.
శ్రీదేవి (Sridevi)
రామ్గోపాల్ వర్మకు బాగా ఇష్టమైన హీరోయిన్ ‘శ్రీదేవి’. ఆర్జీవీ డైరెక్షన్లో వచ్చిన 'గోవిందా గోవిందా', 'క్షణ క్షణం' చిత్రాల్లో ఆమె కథానాయికగా చేసింది. ఆ తర్వాత కూడా ఆమెతో వర్క్ చేయాలని ఆర్జీవీ భావించిన అది సాధ్యపడలేదు. తన ఫేవరేట్ అయిన శ్రీదేవిపై ఆర్జీవీ పలు వేదికలపై ప్రశంసలు కురిపించడం విశేషం.
రేవతి (Revathi)
ఊర్మిళ తర్వాత ఆర్జీవీ సినిమాల్లో ఎక్కువగా కనిపించిన హీరోయిన్ రేవతి. ‘రాత్రి’, ‘గాయం’, ‘గాయం-2’ వంటి తెలుగు చిత్రాలతో పాటు ‘నిశబ్ద్’, ‘అబ్ తక్ ఛాపన్’, ‘డర్నా మనా హై’ తదితర హిందీ చిత్రాల్లో ఆమె నటించింది. హార్రర్ (RGV Horror Movies) బ్యాక్డ్రాప్లో వచ్చిన ‘రాత్రి’ సినిమాలో ఆమె నటన ప్రతీ ఒక్కరిని బయటపెట్టింది. ఈ సినిమా రేవతితో పాటు రామ్ గోపాల్ వర్మకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
మహేశ్వరి (Maheswari)
ఒకప్పటి స్టార్ నటి మహేశ్వరి సైతం ఆర్జీవీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ఆర్జీవీ ప్రొడక్షన్లో వచ్చిన గులాబీ ఆమె కెరీర్ను మలుపు తిప్పింది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'దెయ్యం' సినిమాలో మహేశ్వరి లీడ్ రోల్లో నటించింది. హర్రర్ సీన్స్లో ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఆడియన్స్ను థ్రిల్ చేశాయి.
మనీషా కోయిరాలా (Manisha Koirala)
ఒకప్పటి స్టార్ హీరోయిన్ మనీషా కోయిరాలా కూడా ఆర్జీవీ తీసిన సూపర్ హిట్ చిత్రాల్లో తళుక్కుముంది. 2002లో వచ్చిన 'కంపెనీ' చిత్రం ద్వారా ఆమె తొలిసారి ఆర్జీవీ డైరెక్షన్లో నటించింది. ఆ తర్వాత ‘భూత్ రిటర్న్స్’, ‘దర్వాజ బంద్’ సినిమాల్లో కనిపించింది. ముఖ్యంగా భూత్ రిటర్న్స్లో ఆమె నటన అందర్ని ఆకట్టుకుంది.
సుస్మితా సేన్ (Sushmita Sen)
ఆర్జీవీ దర్శకత్వంతో పాటు ఆయన నిర్మాతగా వ్యవహరించిన సినిమాల్లో సుస్మితా సేన్ నటించింది. ఆర్జీవీ ప్రొడక్షన్లో వచ్చిన ‘మర్రిచెట్టు’ సినిమా.. 2004లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో ఆమె నటన మెప్పిస్తుంది. అటు ఆర్జీవీ డైరెక్షన్లో వచ్చిన బాలీవుడ్ చిత్రం 'AAG' లోనూ సుస్మితా సేన్ మెరిసింది.
ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai Bachchan)
ఆర్జీవీ డైరెక్షన్లో స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కూడా ఓ సినిమాలో నటించింది. 2008లో వచ్చిన 'సర్కార్ రాజ్' అనే హిందీ మూవీలో ఈమె నటించింది. ఇందులో భర్త అభిషేక్ బచ్చన్, మామ అమితాబ్ బచ్చన్త
https://telugu.yousay.tv/heroines-launched-by-ram-gopal-varma.html
ఏప్రిల్ 24 , 2024

2022లో ఇంతవరకు తెలుగులో బాక్సాఫీస్ హిట్లు ఇవే
]కార్తీ హీరోగా తెరకెక్కిన ‘సర్దార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. రూ.5.5 కోట్ల తెలుగు హక్కులతో రూ.10.5 కోట్లు వసూళ్లు చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం ఇంకా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.సర్దార్
ఫిబ్రవరి 11 , 2023

Raai Laxmi: థండర్ థైస్ అందాలతో పంబ రేపుతున్న రాయ్ లక్ష్మి.. కుర్రకారుకు కనుల విందు!
హీరోయిన్ రాయ్ లక్ష్మి మరోసారి సోగసుల విందు చేసింది. మల్దీవ్స్లో వెకెషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అందాల తెగింపునకు పాల్పడింది.
థండర్ థైస్ అందాలతో కుర్రకారుకు కనువిందు చేసింది. వైట్ డ్రెస్లో అమ్మడి అందాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.
బోట్లో ప్రయాణిస్తూ డ్రింక్ స్విప్ చేస్తున్న రాయ్ లక్ష్మి.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంది.
ఇక రాయ్ లక్ష్మి థండస్ థైస్ అందాలకు పెద్దఎత్తున సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
ఈ హాట్ డాల్ ఎప్పుడు ఫోటోలు పెడుతుందా.. ఎప్పుడూ తమ కామెంట్లకు పనిచెప్పాలా అని ఉబలాటపడుతుంటారు.
3 పదుల వయసులోనూ తరగని అందంతో కుర్రకారు డ్రీమ్ గర్ల్గా మారింది రాయ్ లక్ష్మి. తెలుగులో కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో 15 ఏళ్ల క్రితమే తెరంగేట్రం చేసింది
తొలి చిత్రం నుంచే అందాల దాడి పెంచిన రాయ్ లక్ష్మి ఇండస్ట్రీలో గ్లామర్ డాల్గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత దక్షిణాది భాషల్లో బిజీగా మారి పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది.
సర్దార్ గబ్బర్ సింగ్, బలుపు, ఖైదీ నెంబర్ 150 సినిమాల్లో రాయ్ లక్ష్మి చేసిన ఐటెం సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
ఖైదీ 150 సినిమాలో చిరంజీవి సరసన ఐటెం సాంగ్లో నటించి ప్రేక్షకుల చేత ముద్దుగా రత్తాలుగా పిలిపించుకుంటోంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే రాయ్ లక్ష్మి... అందాల ఆరబోతకు కెరాఫ్ ఆడ్రస్గా నిలుస్తోంది.
ఇక సముద్రయానానికి వెళ్లిందంటే.. రాయ్ లక్ష్మి అందాల దాడిని ఎవరు ఆపలేరు. బికినీ అందాలను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేని రాత్రులను మిగుల్చుతుంది. సింగిల్ పీస్ ధరించి ఇచ్చే ఫోజులకు, ఆమె కళ్లు చెదిరే అందాలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఎప్పటికప్పుడూ తన అందాలకు మెరుగులు అద్దుతూ సరికొత్తగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది రాయ్ లక్ష్మి.
ఇక సినిమా ఈవెంట్లలో అమ్మడు ప్రదర్శించే అందాలకు కొలత కట్టడం అసాధ్యమే. ఆ రీతిలో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ ఎక్స్పోజింగ్.
ప్రస్తుతం రాయ్ లక్ష్మి తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉంటుంది. సోలో రోల్స్తో పాటు గ్లామర్కు అవకాశం ఉండే పాత్రలను సైతం ఇష్టంగా చేస్తోందీ సొగసుల సంచలనం.
అక్టోబర్ 23 , 2023

RAKESH MASTER: ఏపీ కల్తీ మద్యమే రాకేష్ మాస్టర్ను చంపేసిందా?... ఇవిగో సాక్ష్యాలు!
టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ తీవ్ర అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే రాకేష్ మాస్టర్ మృతి కారణాల పట్ల సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాకేష్ మాస్టర్ చనిపోవడానికి ఏపీలో అమ్ముతున్న చీప్ లిక్కర్, కల్తీ మద్యమే కారణమని వైసీపీ సర్కారును ట్రోల్ చేస్తున్నారు. అక్కడ విరివిగా లభించే 'బూమ్ బూమ్' బీర్లను రాకేశ్ మాస్టర్ ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యం చెడిపోయి ప్రాణాలు కోల్పోయారని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు వీడియోలను షేర్ చేస్తున్నారు.
https://twitter.com/mana_Prakasam/status/1670462301533765632?s=20
ఏపీలో మద్యపానం నిషేధం పేరిట తొలుత మద్యం ధరలు భారీగా పెంచారని గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత నకిలీ, కల్తీ మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇచ్చి విచ్చలవిడిగా అమ్ముతున్నారనీ ఆరోపించారు. వీటి తయారీ వెనుక ఉన్నది వైసీపీ నేతలే ఉన్నారని గతంలో ప్రతిపక్షాలు కూడా పెద్దఎత్తున విమర్శించిన సంగతి తెలిసిందే. బ్రాండెడ్ మద్యం అమ్మకం వల్ల ప్రభుత్వానికి ఆదాయం రాదని.. అందుకే చీప్ మద్యానికి అనుమతించారని కామెంట్లు చేస్తున్నారు. కల్తీ మద్యానికి రాకేష్ మాస్టర్ బలి అయ్యారని పోస్టులు పెడుతున్నారు.
https://twitter.com/apramayanam/status/1670464153348190209?s=20
మరణం ముందే తెలుసు..
ఎప్పుడూ యూట్యూబ్లో ఎంటర్టైన్ చేసే రాకేష్ మాస్టర్ మృతిని చూసి తట్టుకోలేని అభిమానులు ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. రాకేష్ మాస్టర్ తాను చనిపోతాననే విషయం తనకు ముందే తెలుసు. తన అనారోగ్యం గురించి తెలిసినా... అందర్ని నవ్విస్తూ కడుపులోనే తన బాధను దాచుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాకేశ్ మాస్టర్ మృతిపై సోషల్ మీడియాలో నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులు పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ.. "నా శరీరంలో మార్పు కనిపిస్తోంది. అది నాకు తెలుస్తోంది. నువ్వు ఉదయించే సూర్యుడివి నువ్వు అయితే… నేను అస్తమించే సూర్యుడిని. అమ్మా, నాన్నలను బాగా చూసుకో'' అంటూ వీడియోలో చెబుతున్నట్లు ఉంది. దీంతో తాను చనిపోతానన్న విషయం తనకు ముందే తెలుసని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.
https://twitter.com/Devineni_Hari/status/1670424465300402177?s=20
రాకేష్ మాస్టర్ చివరి కోరిక
ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్యూ ఇచ్చిన రాకేష్ మాస్టర్ తన చివరి కోరిక ఏమిటో చెప్పారు. ఆయన చనిపోయాక ఎక్కడ సమాధి చేయాలో పేర్కొన్నారు. 'ఇల్లు, దుస్తులు, శరీరం ఏదీ శాశ్వతం కాదు. నా మామగారి సమాధి పక్కన వేప మెుక్క నాటా. దాన్ని పెంచుతా. నేను చనిపోయిన తర్వాత ఆ చెట్టు కిందే నన్ను సమాధి చేయండని యూట్యూబ్ ఛానెల్స్కు విజ్ఞప్తి చేశా' అని మాస్టర్ అన్నారు.
డాక్టర్లు ఏమన్నారు?
రాకేశ్ మాస్టర్ మృతిపై గాంధీ ఆస్పత్రి వైద్యులు బులెటెన్ విడుదల చేశారు. ఉదయం రక్త విరేచనాలు కావడంతో మధ్యాహ్నం గాంధీ ఆసుపత్రిలో రాకేష్ మాస్టర్ అడ్మిట్ అయ్యారు. ఆయనకు డయాబెటిస్, సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ తీవ్రంగా ఉండటంతో శరీరంలోని చాలా అవయవాలు దెబ్బతిన్నాయి అని గాంధీ సూపరింటిండెంట్ రాజారావు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు రాకేశ్ మాస్టర్ తుదిశ్వాస విడిచారని పేర్కొన్నారు.
ప్రభాస్కు డ్యాన్స్ శిక్షణ
రాకేశ్ మాస్టర్కి ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరుంది. దాదాపు 1500కు పైగా సినిమాలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఈయన దగ్గర శిక్షణ తీసుకున్నవారే. కెరీర్ ఆరంభంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హీరో వేణు ప్రత్యూష మొదలైన సినీ నటులు రాకేష్ మాస్టర్ వద్ద శిక్షణను పొందారు. లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు మొదలైన సినిమాలలోని పాటలకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అలాగే ఈటీవీ వేదికగా ప్రారంభమైన డ్యాన్స్ షో ఢీ లో బషీర్ అనే కంటెస్టెంట్కు మాస్టర్గా వ్యవహరించాడు. ఆయన మృతికి తెలుగు చిత్ర పరిశ్రమ నివాళులు అర్పిస్తోంది.
https://twitter.com/CreatorYog/status/1670510684935962625?s=20
జూన్ 19 , 2023

DIRECTORS: దర్శకులుగా వచ్చి నటులుగా సెటిల్ అయిపోతున్న డైరెక్టర్లు
సినిమా వాళ్ల కెరీర్ అంతా చిత్ర విచిత్రమే. ఎందుకంటే విలన్ అవుదామనుకొని కమెడియన్గా, హీరో అవ్వాలనుకొని దర్శకులుగా, డైరెక్టన్ చేయాలని వచ్చి డాన్స్ మాష్టర్లుగా సెటిల్ అవుతుంటారు. ఇక ఇంకో కేటగిరీ కూడా ఉంది. దర్శకులుగా హిట్లు కొట్టి తర్వాత నటులుగా మారిపోతుంటారు. దండిగా వచ్చే ఆదాయమో లేదా ఇష్టమో కానీ, ఇలా మారిన దర్శకులు చాలామందే ఉన్నారు వాళ్లేవరో చూద్దామా?
సముద్రఖని
సముద్రఖని తొలుత అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చి తమిళ్లో సినిమాలకు దర్శకత్వం వహించాడు. రఘువరన్ బీటెక్ చిత్రంతో పూర్తిస్థాయి నటుడిగా మారారు సముద్రఖని. అప్పట్నుంచి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అలా వైకుంఠపురం చిత్రంతో విలన్గా మారాడు ఈ దర్శకుడు. క్రాక్, బీమ్లా నాయక్, సర్కారు వారి పాట చిత్రాలతో తనలో ఉన్న మరో కోణాన్ని వెలికి తీసి ఇప్పుడు నటుడిగా సెటిల్ అయిపోయాడు.
ఎస్జే సూర్య
పవన్ కల్యాణ్తో ఖుషీ సినిమా తీసిన ఎస్జే సూర్య తెలియనివారు ఉండరు. వివిధ చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు హీరోగానూ చేశాడు సూర్య. మహేశ్ బాబు, మురుగదాస్ కాంబోలో వచ్చిన స్పైడర్ చిత్రంలో విలన్గా విశ్వరూపం చూపించాడు. ఏడుస్తున్న వారిని చూసి నవ్వుతూ సంతోషపడే క్యారెక్టర్ బాగా పేలింది. తర్వాత మెర్సల్, మానాడు వంటి చిత్రాల్లో ఎస్జే సూర్య నటనకి ఫిదా అవ్వాల్సిందే.
గౌతమ్ మీనన్
ఘర్షణ, ఏ మాయ చేశావే, ఎటో వెళ్లిపోయింది మనసు వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన గౌతమ్ మీనన్ నటుడిగా బిజీ అయిపోయాడు. పోలీస్ పాత్రలకు సరిగ్గా సరిపోయే పర్సనాలిటీ గౌతమ్ది. కనులు కనులు దోచే సినిమాలో నెగటివ్ షేడ్ రోల్లో మెప్పించాడు. ఇక సందీప్ కిషన్ హీరోగా వచ్చిన మైఖేల్ చిత్రంలో విలన్గా కనిపించి షాకిచ్చాడు ఈ దర్శకుడు. ఎలాంటి క్యారెక్టర్ అయినా చేసేందుకు సిద్ధమని మిగతా దర్శకులకు హింట్ ఇచ్చేస్తున్నాడు.
భారతీ రాజా
శ్రేదేవితో పదహారేళ్ల వయసు చిత్రం తీసిన దర్శకుడు గుర్తున్నాడా? అంత సులభంగా లెజెండరీ దర్శకుడిని ఎలా మర్చిపోతారు. అతడే భారతీ రాజా. ఆయన ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేశారు. ధనుశ్ హీరోగా వచ్చిన తిరు చిత్రంలో తాతగా నవ్వించారు. ఇటీవల సూపర్హిట్గా నిలిచిన సార్లోనూ చివర్లో గెస్ట్రోల్లో నటించారు భారతీ రాజా.
తరుణ్ భాస్కర్
పెళ్లి చూపులు వంటి మెుదటి సినిమాతోనే హిట్ కొట్టిన దర్శకుడు తరుణ్ భాస్కర్ తర్వాత నటుడిగా అవతారమెత్తాడు. ఫలక్నామా దాస్లో మాస్ పోలీస్ ఆఫీసర్గా, నేను మీకు తెలుసా చిత్రంలో నటనతో ఆకట్టుకున్నాడు. ఏ సినిమాలో ఛాన్స్ వచ్చినా తరుణ్ భాస్కర్ వదులుకోవట్లేదు.
రిషబ్ శెట్టి
కాంతారా హీరో రిషబ్ శెట్టి తెలుసు కదా.. ఆయన మెుదట దర్శకుడు. క్లాప్ బాయ్, స్పాట్ బాయ్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా ఎదిగాడు. హీరో రక్షిత్ శెట్టితో కలిసి రిక్కీ అనే చిత్రం చేయగా.. యావరేజ్ టాక్ వచ్చింది. తర్వాత అదే హీరోతో కిర్రిక్ పార్టీ చిత్రాన్ని తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. కాంతార సినిమాతో ఏకంగా పాన్ ఇండియాను షేక్ చేశాడు రిషబ్ శెట్టి. ఈ సినిమాకు స్వీయ దర్శకత్వం వహించాడు.
ఏప్రిల్ 27 , 2023

Sid Sriram: తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే టాప్-10 సిద్ శ్రీరామ్ సాంగ్స్..
ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ ఎన్నో హిట్ పాటలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. మిస్మరైజింగ్ వాయిస్తో కోట్లాది మంది సంగీత ప్రియులను ఉర్రూతలూగించాడు. ఇండో అమెరికన్ అయినప్పటికీ తెలుగు పాటలను ఎంతో అద్భుతంగా పాడుతూ శ్రీరామ్ తనదైన మార్క్ చూపిస్తున్నాడు. సిద్ శ్రీరామ్ స్వరం నుంచి వచ్చిన టాప్-10 తెలుగు హిట్ సాంగ్స్ను ఇప్పుడు చూద్దాం.
1. శ్రీవల్లి:
పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటను సిద్ శ్రీరామ్ చాలా అద్భుతంగా పాడాడు. అప్పటివరకు పాడిన పాటలకు పూర్తి భిన్నంగా ఈ పాటను ఆలపించాడు. శ్రీరామ్ యూనిక్ వాయిస్ వల్లే ఈ పాటకు అంత హైప్ వచ్చింది.
https://www.youtube.com/watch?v=txHO7PLGE3o
2. కళావతి
సర్కారు వారి పాటలో కళావతి సాంగ్ను శ్రీరామ్ చాలా బాగా ఆలపించాడు. కమాన్ కమాన్ కళావతి అంటూ మహేష్ చేత స్టెప్పులు వేయించాడు. ఈ పాట రిలీజ్ తర్వాత సిద్ శ్రీరామ్ ఫేమ్ మరింత పెరిగింది.
https://www.youtube.com/watch?v=SfDA33y38GE
3. మగువ మగువ
వకీల్సాబ్ చిత్రంలోని మగువ మగువ సాంగ్ మహిళల గొప్పతనాన్ని తెలియజేసింది. ఈ పాటకు తన స్వరం ద్వారా సిద్ శ్రీరామ్ జీవం పోశాడు.
https://www.youtube.com/watch?v=fqM8DJIZIDw
4. ఇంకేం ఇంకేం కావాలి
గీతా గోవిందం సినిమాలోని ‘ఇంకేం ఇంకేం కావాలి’ పాటను శ్రీరామ్ ప్రాణం పెట్టి పాడాడు. ఒక్క ఇంగ్లీష్ పదం లేని ఈ పాటను ఎంతో అద్భుతంగా ఆలపించి ప్రశంసలు అందుకున్నాడు. లిరిక్స్లోని డీప్ ఎమోషన్స్ను శ్రీరామ్ తన గొంతులో చక్కగా పలికించాడు. అప్పట్లో యూత్ను ఈ పాట విపరీతంగా ఆకర్షించింది.
https://www.youtube.com/watch?v=VkmXX_jKmZw
5. ఉండిపోరాదే
2018లో విడుదలైన హుషారు సినిమాలోని ‘ఉండిపోరాదే పాట’ అప్పట్లో చాలా పెద్ద హిట్ అయింది. ప్రేమలో విఫలమైన యువకుడి బాధను తన గొంతులో శ్రీరామ్ పలికించాడు. దీంతో యువకులు ఈ పాటకు చాలా బాగా కనెక్ట్ అయ్యారు.
https://www.youtube.com/watch?v=wCnUAKzAmVo
6. సామజవరగమన
అలా వైకుంఠపురంలో చిత్రంలోని ‘సామజవరగమన’ పాట ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పాట ఘన విజయానికి అల్లు అర్జున్ క్లాసీ స్టెప్పులు ఎంతగానో దోహదం చేశాయి. అలాగే శ్రీరామ్ కూడా తన స్వరం ద్వారా సాంగ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
https://www.youtube.com/watch?v=OCg6BWlAXSw
7. మాటే వినదుగా
టాక్సీవాలా చిత్రంలోని ‘మాటే వినదుగా’ పాట సిద్ శ్రీరామ్ హిట్ ఆల్బమ్స్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ పాట ద్వారా కోట్లాది మంది సంగీత ప్రియుల హృదయాల్లో శ్రీరామ్ స్థానం సంపాదించాడు.
https://www.youtube.com/watch?v=HMh6W8oxmyc
8. అడిగా అడిగా
నిన్నుకోరి సినిమాలోని ‘అడిగా అడిగా’ పాట భగ్న ప్రేమికులను ఎంతగానో ఆకర్షించింది. ప్రేయసి ప్రేమను బలంగా కోరుకునే యువకుడి ఫీలింగ్స్ను సిద్ చాలా బాగా వ్యక్తపరిచాడు. ఈ పాటకు గాను ఈ యువ గాయకుడికి మంచి ప్రశంసలే దక్కాయి.
https://www.youtube.com/watch?v=evbYFsSJ4pU
9. వచ్చిందమ్మ
గీతా గోవిందం మూవీలోని ‘వచ్చిందమ్మా’ పాట కూడా మంచి హిట్ అయింది. ఈ పాటలో శ్రీరామ్ వాయిస్ ప్రేక్షకులను మిస్మరైజింగ్ చేసిందనే చెప్పాలి.
https://www.youtube.com/watch?v=xVcoYF--0mM
10. ఏమున్నావే పిల్ల
నల్లమల్ల సినిమాలోనే ఏమున్నావే పిల్ల పాట ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. సినిమా పెద్దగా ఆడకపోయిన ఈ పాట మాత్రం ఇప్పటికా చాలా మందికి ఫేవరేట్ సాంగ్ ఉంది.
https://www.youtube.com/watch?v=0K7HpHP2Jk8
ఏప్రిల్ 05 , 2023

Mufasa: The Lion King Review: మహేష్ ప్రాసలు, పంచ్లు అదరహో.. ‘ముఫాసా’ ఎలా ఉందంటే?
నటులు: మహేష్ బాబు, సత్యదేవ్, బ్రహ్మానందం, అలీ (డబ్బింగ్ చెప్పినవారు)
దర్శకత్వం: బబ్యారీ జెన్ కిన్స్
సినిమాటోగ్రఫీ: జేమ్స్ లక్ట్సాన్
ఎడిటింగ్: జోయ్ మెక్మిలన్
సంగీతం: డేవ్ మెట్జర్, నికోలక్ బ్రిటెల్, లిన్ మాన్యుల్ మిరాండ
నిర్మాతలు: అడెలె రొమన్స్కీ, మార్క్ కారియాక్
నిర్మాణ సంస్థ: డిస్నీ
విడుదల: డిసెంబర్ 20, 2024
హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ తెరకెక్కిస్తోన్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King Review In Telugu) ఒకటి. ఇందులో కీలకమైన ‘ముఫాసా’ పాత్రకు తెలుగులో మహేష్బాబు (Mahesh babu) డబ్బింగ్ చెప్పాడు. అలాగే సత్యదేవ్, బ్రహ్మానందం, అలీ వంటి స్టార్స్ కూడా పలు తమ స్వరాన్ని అందించారు. భారీ బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ఈనెల 20న ఇంగ్లీషుతో పాటు తెలుగు, తమిళం, హిందీలో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? మహేష్ డబ్బింగ్ ఆకట్టుకుందా? యానిమేషన్ వర్స్క్ మెప్పించాయా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
ముఫాసా (మహేష్ బాబు వాయిస్ ఓవర్) చిన్నతనంలో అమ్మ చెప్పిన కథలు వింటూ పెరుగుతాడు. దూరంగా ఉండే మిలేలే అనే స్వర్గం లాంటి రాజ్యం గురించి తరచూ వింటూ ఉండేవాడు. ఈ క్రమంలో ఓరోజు వరదల రావడంతో ముఫాసా కొట్టుకుపోతాడు. అలా టాకా (సత్యదేవ్ వాయిస్ ఓవర్) ఉన్న రాజ్యానికి వస్తాడు. ముఫాసా రాకను టాకా తండ్రి ఒప్పుకోడు. కానీ టాకా తన అన్నలా పెంచుకుందామని పట్టుబడతాడు. టాకా తల్లి కూడా సపోర్ట్ చేయడంతో ముఫాసా వారి ఫ్యామిలీలో భాగమవుతాడు. ఓ రోజు టాకా తల్లిపై తెల్ల సింహాలు దాడి చేయగా ముఫాసా ధైర్యంగా ఎదుర్కొంటాడు. తెల్ల సింహాల యువరాజును చంపేస్తాడు. అది తెలిసిన తెల్ల సింహాల రాజు కిరోస్ ముఫాసా ఉంటున్న రాజ్యంపై దాడి చేస్తాడు. ఆ దాడి నుంచి తప్పించుకొని ముఫాసా, టాకాలు చిన్నప్పుడు విన్న మిలేలే రాజ్యం వైపు పయనమవుతారు. ఈ ప్రయాణంలో వాటికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ముఫాసాను చంపడానికి కిరోస్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ముఫాసాకు టాకా ఎందుకు ఎదురు తిరిగాడు? చివరకూ ముఫాసా ఎలా రాజయ్యాడు? అన్నది స్టోరీ.
డబ్బింగ్ ఎలా ఉందంటే
ముఫాసా: ది లయన్ కింగ్ (Mufasa: The Lion King Review) లైవ్ యానిమేషన్ చిత్రం. ఇందులో నటీనటులు కనిపించరు వారు చెప్పిన వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. డబ్బింగ్ గురించి మాట్లాడాల్సి వస్తే తెలుగులో ముఫాసా పాత్రకు మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఫాసా పాత్రకు మహేష్ డబ్బింగ్ బాగా సెట్ అయ్యింది. తెరపై సింహాం ప్లేస్లో మహేష్ను ఊహించుకునేంతలా అతడు తన వాయిస్తో మెస్మరైజ్ చేశాడు. సెటైర్లు, పంచ్లు, గంభీరమైన డైలాగ్స్తో మహేష్ అదరగొట్టాడు. టాకా పాత్రకు నటుడు సత్యదేవ్ వాయిస్ బాగా సెట్ అయ్యింది. మంచి సోదరుడిగా, ఆ తర్వాత విలన్లతో చేతులు కలిపిన వెన్నుపోటు దారుడిగా వాయిస్లో మంచి వేరియేషన్స్ ప్రదర్శించాడు. అటు పుంబా పాత్రకు బ్రహ్మీ డబ్బింగ్ చెప్పగా, టిమోన్ రోల్కు అలీ గాత్ర దానం చేశారు. వారిద్దరు తమ వాయిస్తో కామెడీని బాగా పండించారు. మిగిలిన పాత్రలకు డబ్బింగ్ చెప్పినవారు కూడా తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
https://twitter.com/DisneyStudiosIN/status/1867064334456615039
డైరెక్షన్ ఎలా ఉందంటే
2019లో వచ్చిన 'ది లయన్ కింగ్' చిత్రానికి ప్రీక్వెల్గా దర్శకుడు బ్యారీ జెన్ కిన్స్ ఈ చిత్రాన్ని రూపొందించారు. అందులో ముఫాసా రాజు కాగా అతడి కొడుకు సింబా చుట్టూ కథ తిరిగింది. తాజా చిత్రంలో ముఫాసా ఎలా రాజు అయ్యాడు? టాకా అలియాస్ స్కార్ ఎవరు? అనేది చూపించాడు. స్టోరీ పరంగా చూస్తే పెద్దగా మెరుపులు కనిపించవు. కానీ విజువల్స్, స్క్రీన్ ప్లే పరంగా ఆడియన్స్లో ఆసక్తి రగిలించాడు దర్శకుడు. ముఖ్యంగా మిలేలే అనే స్వర్గం లాంటి ప్రపంచంలో ప్రేక్షకులను లీనం చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగున్నాయి. ముఫాసా, టాకా సోదరుల కథ ప్రస్తుత సమాజాన్ని అద్దం పట్టేలా ఉండటం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అయితే రొటీన్ స్టోరీ, ఊహాజనీతమైన కథనం మైనస్గా చెప్పవచ్చు. పెద్దలు, మాస్ ఆడియన్స్ సంగతి ఏమోగానీ, చిన్నారులకు మాత్రం ముఫాసా పక్కా ఎంటర్టైన్ చేస్తుందని చెప్పవచ్చు. రెండున్నర గంటల పాటు కొత్త ప్రపంచంలోకి వెళ్లి వస్తారు.
టెక్నికల్గా..
టెక్నికల్గా హాలీవుడ్ స్టాండర్డ్స్ (Mufasa: The Lion King Review) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సంగీతం, సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవల్లో ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ టాప్ నాచ్ పనితీరు కనబరిచింది. నిజమైన సింహాలను తెరపై చూస్తున్నట్లుగా భ్రమను కల్పించడంలో వారు పూర్తిగా సక్సెస్ అయ్యారు. నిర్మాణ విలువలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో డిస్నీ ఎక్కడా రాజీపడలేదు. చాలా నాణ్యమైన గ్రాఫిక్స్ను అందించారు.
ప్లస్ పాయింట్స్
మహేష్బాబు డబ్బింగ్గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ మాయజాలంసంగీతం, సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
ఊహాజనితంగా సాగే కథనంట్విస్టులు లేకపోవడం
Telugu.yousay.tv Rating : 3/5
డిసెంబర్ 20 , 2024

HBD Tarun Bhaskar: తల్లి రాసిన కవితతో తొలి షార్ట్ ఫిల్మ్.. గ్రేట్ జర్నీ!
'పెళ్లి చూపులు' సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన తరుణ్ భాస్కర్ (HBD Tarun Bhaskar) ఆ సినిమా సక్సెస్తో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు ఆ మూవీ తర్వాత 'ఈ నగరానికి ఏమైంది' వంటి కల్ట్ ఎంటర్టైనర్ను ప్రేక్షకులకు అందించి యూత్కు మరింత చేరవయ్యాడు. యంగేజ్ కామెడీ చిత్రాలకు కేరాఫ్గా మారిపోయాడు. ఆ తర్వాత నటుడిగానూ సినిమాలు చేస్తూ ఆకట్టుకున్నాడు. ఇటీవల ‘కీడాకోలా’తో నవ్వులు పూయించాడు. ఇదిలా ఉంటే నేడు (నవంబర్ 5) తరుణ్ భాస్కర్ పుట్టినరోజు. 36వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో అతడికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.
తరుణ్ భాస్కర్ 1988 నవంబరు 5న ఉదయ్ భాస్కర్, గీతా దంపతులకు చెన్నైలో పుట్టాడు. తరుణ్ భాస్కర్ (HBD Tarun Bhaskar) తండ్రిది వరంగల్ కాగా, తల్లిది తిరుపతి. అలా రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాడిగా తరుణ్ను చెప్పవచ్చు.
తన కొడుకు క్రియేటివ్ రంగంలో రాణించాలని తరుణ్ భాస్కర్ తండ్రి చిన్నప్పుడే కలలు కన్నారు. ఇందుకు అనుగుణంగా తరుణ్కు రెండేళ్ల వయసు ఉండగా ఆ రోజుల్లోనే రూ.300 పెట్టి కెమెరా కొని ఇచ్చారు. ఆ కెమెరా ఇప్పటికీ తరుణ్ భాస్కర్ దగ్గర ఉంది.
తరుణ్ భాస్కర్ తల్లి గీతా ప్రముఖ తెలుగు నటి. ఫిదా చిత్రంలో సాయిపల్లవికి తల్లిగా నటించింది. శ్రీరంగ నీతులు, సర్కారు వారి పాట, 118, అనుకోకుండా చిత్రాల్లోనూ ఆమె కనిపించింది.
తరుణ్ భాస్కర్ తల్లి గీతా గొప్ప కవియిత్రి. ఆమె తన జీవితంలో ఎన్నో కవితలు రాశారు. ఆమె రాసిన కవిత ఆధారంగానే తరుణ్ భాస్కర్ తన తొలి షార్ట్ఫిల్మ్ తీసి అందరి ప్రశంసలు అందుకున్నాడు.
ఆ ఉత్సాహంతో వరుసగా ‘జర్నీ’, ‘మినిట్స్ టూ మిడ్నైట్’, ‘అనుకోకుండా’, ‘జూనూన్’, ‘సైన్మా’ మెుదలైన షార్ట్ ఫిల్మ్ చేశాడు. వీటిలో కొన్ని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇంఫాల్ ఫిల్మ్ ఫెస్టివల్స్కు ఎంపికై తరుణ్ భాస్కర్కు మరింత పేరు తీసుకొచ్చింది.
ముఖ్యంగా ‘జూనూన్’ అనే షార్ట్ ఫిల్మ్కు పీపుల్స్ ఛాయిస్ అవార్డ్ కూడా వచ్చింది. అలాగే ‘అనుకోకుండా’ లఘు చిత్రం యూట్యూబ్లో అత్యధిక వ్యూస్ సాధించింది. ‘పెళ్లి చూపులు’ ఫేమ్ రీతువర్మ ‘అనుకోకుండా’ షార్ట్ ఫిల్మ్లో నటించడం విశేషం.
తరుణ్ భాస్కర్ (HBD Tarun Bhaskar) రూపొందించిన ‘సైన్మా’ షార్ట్ ఫిల్మ్ మంచు లక్ష్మీకి బాగా నచ్చింది. కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఇందులో లీడ్ రోల్లో నటించడం గమనార్హం.
సైన్మా షార్ట్ ఫిల్మ్ నచ్చడంతో కలిసి పనిచేద్దామని మంచు లక్ష్మీ తరుణ్కు ఆఫర్ ఇచ్చింది. ఆ ప్రాజెక్ట్కు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న సమయంలోనే తరుణ్ భాస్కర్ తండ్రి చనిపోయారు. ఈ క్రమంలో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
ఆ తర్వాత నిర్మాత రాజ్ కందుకూరును కలుసుకోవడం పెళ్లి చూపులు స్క్రిప్ట్ ఆయనకు బాగా నచ్చడం చకా చకా జరిగిపోయింది. అంతకుముందే మంచి పరిచయమున్న విజయ్ దేవరకొండ, రీతు వర్మను హీరో, హీరోయిన్గా తీసుకొని తరుణ్ భాస్కర్ మంచి సక్సెస్ అందుకున్నాడు.
2016లో రిలీజైన ‘పెళ్లి చూపులు’ (Pelli Chupulu).. ఉత్తమ తెలుగు చిత్రం, బెస్ట్ స్క్రీన్ప్లే, బెస్ట్ డైలాగ్స్కు గాను జాతీయ పురస్కారాలు అందుకుంది.
మహానటి సినిమాలో దర్శకుడు సింగీతం శ్రీనివాస్ పాత్రను పోషించి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించాడు తరుణ్ భాస్కర్.
తరుణ్ భాస్కర్ (HBD Tarun Bhaskar) వ్యక్తిగత విషయాలకు వస్తే ఆయన లతా నాయర్ను 2013 నవంబర్ 20వ తేదీన పెళ్లి చేసుకున్నారు. తరుణ్ భాస్కర్ పుట్టిన రోజు, పెళ్లి రోజు నవంబర్లోనే ఉండటం విశేషం.
తరుణ్ భాస్కర్ భార్య లతా కాస్ట్యూమ్ డిజైనర్గా చేస్తుంటారు. తన భర్త తీసిన పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలకు ఆమె పని చేశారు. అంతేకాదు సమంత నటించిన ‘యూ టర్న్’ మూవీకి కూడా వర్క్ చేశారు.
ఈటీవీలో ‘మీకు మాత్రమే చెప్తా’ షోకు హోస్ట్గా వ్యవహరించి తను ఏదైనా చేయగలగనని మరోమారు నిరూపించాడు తరుణ్ భాస్కర్.
తరుణ్ భాస్కర్ పుట్టిన రోజు (HBD Tarun Bhaskar) సందర్భంగా ఆయన కొత్త సినిమా పోస్టర్ రిలీజైంది. ఏ.ఆర్ సజీవ్ దర్శకత్వంలో రూపొందనున్న ఆ చిత్రంలో తరుణ్ ‘అంబటి ఓంకార్ నాయుడు’ పాత్రలో కనిపించనున్నాడు.
మలయాళంలో సూపర్ హిట్గా నిలిచిన 'జయ జయ జయ జయహే' చిత్రానికి రీమేక్గా అది రానుంది. ఇందులో ఈషా రెబ్బా హీరోయిన్గా నటించనుంది. ఈ చిత్రానికి 'ఓం శాంతి శాంతి శాంతి' టైటిల్ ఖరారు చేశారని తెలిసింది.
నవంబర్ 05 , 2024

Tollywood Collections: జనవరి - డిసెంబర్.. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు
టాలీవుడ్లో ఏటా పదుల సంఖ్యలో చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. కొన్ని బాక్సాఫీస్ వద్ద చతికిలపడితే మరొన్ని వసూళ్ల సునామి సృష్టిస్తుంటాయి. అయితే ప్రతి సంతవ్సరం ఏ సినిమా టాప్లో నిలిచిందన్న లెక్కలు బయటకు వస్తూనే ఉంటాయి. కానీ నెలల వారీగా ఏ సినిమా టాప్లో ఉందన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఆ వివరాలను వెల్లడిస్తూ Yousay ఈ ప్రత్యేక కథనాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. జనవరి నుంచి డిసెంబర్ వరకూ ఆయా నెలల్లో రిలీజైన చిత్రాల్లో కలెక్షన్స్ పరంగా ఏది అగ్రస్థానంలో నిలిచిందో ఇప్పుడు తెలుసుకుందాం.
జనవరి
ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ‘హనుమాన్’ (Hanuman) చిత్రం రూ.350 కోట్ల గ్రాస్ను సొంతం చేసుకుంది. ఓవరాల్గా జనవరిలో రిలీజైన తెలుగు చిత్రాలతో పోలిస్తే హనుమాన్ కలెక్షన్స్ పరంగా టాప్లో ఉంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యువ నటుడు తేజ సజ్జ హీరోగా నటించాడు.
ఫిబ్రవరి
ఫిబ్రవరిలో రిలీజైన చిత్రాల్లో 'భీమ్లా నాయక్' (Bheemla Nayak) కలెక్షన్స్ పరంగా అగ్రస్థానంలో ఉంది. 2022లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.193 కోట్లను కలెక్ట్ చేసింది. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్ కల్యాణ్, రానా, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ ముఖ్య పాత్రలు పోషించారు.
మార్చి
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'RRR' మార్చి నెలలో అగ్రభాగాన నిలిచింది. 2022లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లను వసూలు చేసింది. ఇందులో రామ్చరణ్, జూ.ఎన్టీఆర్ హీరోలుగా నటించారు.
ఏప్రిల్
2017 ఏప్రిల్ వచ్చిన 'బాహుబలి 2' (Bahubali 2)చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1810 కోట్లను కొల్లగొట్టింది. తద్వారా ఏప్రిల్ నెలలో తిరుగులేని విధంగా టాప్లో నిలిచింది. ఓవరాల్గా చూస్తే కలెక్షన్స్ పరంగా రెండో భారతీయ చిత్రంగా 'బాహుబలి 2' నిలిచింది. ఇందులో ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో కనిపించారు.
మే
మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'సర్కారు వారి పాట' (Sarkaru vaari Pata)చిత్రం రూ.180 కోట్లకు పైగా గ్రాస్ సాధించి మే నెలలో టాప్లో నిలిచింది. 2022లో వచ్చిన ఈ చిత్రానికి పరుశురామ్ దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్ హీరోయిన్గా చేసింది.
జూన్
ఈ ఏడాది జూన్లో వచ్చిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తద్వారా జూన్లో ఎవరికి అందనంత ఎత్తులో నిలిచింది. ఇందులో ప్రభాస్ హీరోగా నటించగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీ ముఖ్య పాత్రలు పోషించారు.
జులై
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేసిన 'బాహుబలి' (Bahubali) చిత్రం కలెక్షన్ల పరంగా జులైలో నెం.1 స్థానంలో నిలిచింది. 2015లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.650 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాతోనే రాజమౌళి టాలెంట్ పాన్ ఇండియా స్థాయికి తెలిసింది.
ఆగస్టు
ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ‘సాహో’ (Saaho) బాక్సాఫీస్ వద్ద రూ.445 కోట్లు వసూలు చేసింది. తద్వారా ఆగస్టులో టాప్లో ఉంది. 2019లో వచ్చిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ హీరోయిన్గా చేసింది.
సెప్టెంబర్
గత నెల సెప్టెంబర్ రిలీజైన ‘దేవర’ (Devara: Part 1) చిత్రం వసూళ్ల పరంగా సెప్టెంబర్లో టాప్లో నిలిచింది. తారక్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.341 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పటికీ విజయవంతంగా బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించారు.
అక్టోబర్
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' (Syra Narasimha Reddy) 2019 అక్టోబర్లో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.240.60 కోట్లు రాబట్టి అక్టోబర్లో టాప్లో నిలిచింది. ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.
నవంబర్
టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరైన సమంత కలెక్షన్స్ పరంగా నవంబర్లో నెం.1గా ఉంది. 2022లో ఆమె నటించి యశోద (Yashoda) చిత్రం ఈ నెలలోనే రిలీజై రూ.33 కోట్లు రాబట్టింది. ఈ సినిమాకు హరి శంకర్ - హరీష్ నారాయణ్ ద్వయం దర్శకత్వం వహించారు.
డిసెంబర్
గతేడాది డిసెంబర్లో విడుదలైన ‘సలార్’ (Salaar) చిత్రం రూ.700 కోట్లు కొల్లగొట్టి ఈ నెలలో టాప్లో ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్ర పోషించాడు. హీరోయిన్గా శ్రుతి హాసన్ చేసింది. ఈ మూవీకి సీక్వెల్ కూడా రూపొందనుంది.
అక్టోబర్ 17 , 2024

Mufasa Telugu Trailer: సింహం నోట మహేష్ పంచ్ డైలాగ్స్.. డబ్బింగ్ ఇరగదీశాడు భయ్యా!
ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa The Lion King) ఒకటి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రంలో ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్ తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ విడుదలైంది. ఇందులో కీలకమైన ‘ముఫాసా’ పాత్రకు మహేశ్బాబు (Mahesh babu) డబ్బింగ్ చెప్పి అదరగొట్టాడు. సింహానికి మహేష్ సూపర్బ్గా డబ్బింగ్ చెప్పారంటూ సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇంతకీ ట్రైలర్ ఎలా ఉంది? అందులో మహేష్ చెప్పిన డైలాగ్స్ ఏంటి? ఇప్పుడు చూద్దాం.
మహేష్ వాయిసే హైలేట్
‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa The Lion King) తెలుగు ట్రైలర్ను నిర్మాణ సంస్థ డిస్నీ సోమవారం (ఆగస్టు 26) విడుదల చేసింది. నీకు ఒక కథ చెప్పే సమయం వచ్చింది. నీలాగే ఉండే చిట్టి సింహాల కథ అంటూ ట్రైలర్ ప్రారంభమైంది. పుట్టుకతోనే అన్నదమ్ములు కాకపోయినా ముఫాసా, స్కార్ అనే పేరుతో పిలువబడిన టాకాల కథ ఇది అంటూ కథలోకి వెళ్లారు. ఆ తర్వాత బాల్యంలో ముఫాసా, టాకాల మధ్య అనుబంధాన్ని, స్నేహాన్ని చూపించారు. ‘అప్పుడప్పుడు ఈ చల్లని గాలి, నా ఇంటి నుంచి జ్ఞాపకాల్ని గుర్తుచేస్తున్నట్లు అనిపిస్తుంది’ అంటూ మహేష్బాబు చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ‘మనం ఒక్కటిగా పోరాడాలి, నేను ఉండగా నీకు ఏం కాదు టాకా, భయపడకు’ అంటూ మహేష్ బాబు చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ ట్రైలర్కు హైలైట్గా నిలిచాయి. ‘ఇందాకా ఏదో అన్నావే’ అంటూ చివరలో తన కామెడీ టైమింగ్తో అలరించాడు మహేష్. ముఫాసా ది లయన్ కింగ్ ట్రైలర్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. మహేష్ వాయిస్ కోసమైనా సినిమాను థియేటర్లలో చూస్తామంటూ ఫ్యాన్స్తో పాటు తెలుగు సినీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/urstrulyMahesh/status/1827943721280631129
‘ఇది నాకెంతో ప్రత్యేకం’
ముఫాసా తెలుగు ట్రైలర్ను మహేష్ తన ఎక్స్ ఖాతాలో స్వయంగా పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మనకు తెలిసిన, ఇష్టపడే పాత్రకు కొత్త అంకం. తెలుగులో ముఫాసాకు వాయిస్ని అందించినందుకు చాలా సంతోషిస్తున్నా. ఈ క్లాసిక్కి నేను విపరీతమైన అభిమానిని కావడంతో ఇది నాకెంతో ప్రత్యేకంగా ఉంది’’ అని రాసుకొచ్చారు. అంతకుముందు కూడా డబ్బింగ్ చెప్పడంపై మహేష్ మాట్లాడారు. ‘డిస్నీ అంటే నాకెంతో గౌరవం. ముఫాసా తన కుమారుడిని నడిపించే తండ్రిగానే కాకుండా అడవికి గొప్ప రాజుగా అందరినీ ఆకర్షిస్తాడు. డిస్నీతో కలిసి వర్క్ చేయడం నాకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమైనది. దీన్ని నా పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తాను. డిసెంబర్ 20న ముఫాసాను నా కుటుంబంతో, అభిమానులతో కలిసి చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ ఆనందం వ్యక్తంచేశారు.
తెలుగులో మహేష్.. హిందీలో షారుక్
‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King) హిందీ వెర్షన్ ట్రైలర్ సైతం ఇటీవల విడుదలైంది. ఇందులో చిట్టి ముఫాసా పాత్రకు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) కుమారుడు అబ్రం (Abram) వాయిస్ అందించారు. ఇదే చిత్రంలో ముఫాసా (పెద్దయ్యాక) పాత్రకు షారుక్ ఖాన్, సింబా పాత్రకు షారుక్ పెద్ద తనయుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) వాయిస్ ఇవ్వడం విశేషం. ఈ సినిమా గురించి షారుక్ మాట్లాడుతూ ‘ముఫాసాకు అద్భుతమైన వారసత్వం ఉంది. అడవికి అతడే రారాజుగా నిలుస్తాడు. ఒక తండ్రిగా ఆ పాత్ర నా మనసుకు చేరువైంది. బాల్యం నుంచి రాజుగా ఎదగడం వరకూ ముఫాసా జీవితం ఎలా సాగిందనే విషయాన్ని ఈ సినిమా తెలియజేస్తుంది. 2019లో వచ్చిన ది లయన్ కింగ్ తర్వాత మరోసారి ఈ పాత్ర కోసం వర్క్ చేయడం ప్రత్యేకంగా ఉంది. మరీ ముఖ్యంగా నా పిల్లలతో కలిసి వర్క్ చేయడం ఆనందంగా అనిపిస్తోంది’ అని అన్నారు. కాగా, ముఫాసా చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీషుతో పాటు తమిళంలోనూ భారీగా రిలీజ్ చేయనున్నారు.
https://www.youtube.com/watch?v=oelsxH0orHI
మహేష్కు డబ్బింగ్ కొత్త కాదు.. కానీ!
ముఫాస పాత్రకు డబ్బింగ్ చెప్పడం మహేష్ బాబుకు ఇదే తొలిసారి కాదు. ఆయన గతంలో రెండు చిత్రాలకు తన వాయిస్ అందించారు. పవన్ కల్యాణ్ నటించిన 'జల్సా', తారక్ హీరోగా చేసిన 'బాద్షా' చిత్రాలకు బ్యాక్గ్రౌండ్లో మహేష్ తన వాయిస్ను ఇచ్చారు. అయితే అవి ఒక పాత్రకు చెప్పినవి కాదు. పాత్రను ఎలివేట్ చేసే క్రమంలో మహేష్ వాయిస్ ఇచ్చారు. అయితే మహేష్ ఒక పాత్రకు పూర్తిగా డబ్బింగ్ చెప్పడం ఇదే తొలిసారి. మరి తన వాయిస్తో ఏమేరకు ప్రేక్షకులను మహేష్ ఆకట్టుకుంటారో చూడాలి.
'SSMB29'తో బిజీ బిజీ
దర్శక ధీరుడు రాజమౌళితో ఓ అడ్వెంచరస్ యాక్షన్ మూవీని మహేష్ చేయబోతున్నాడు. ఇందులో మహేష్ కొత్త లుక్లో కనిపించబోతున్నాడు. ఇందుకోసం లాంగ్ హెయిర్, గడ్డంతో మహేష్ మేకోవర్ అవుతున్నాడు. త్వరలోనే మహేష్బాబు, రాజమౌళి మూవీ ఆఫీషియల్గా లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం పలువురు హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేయబోతున్నట్లు సమాచారం.
ఆగస్టు 26 , 2024

Guntur Kaaram: ‘సర్రా సర్రా’.. పాటకు స్పైడర్ మ్యాన్ అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం.. థియేటర్లలో డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించి ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలోని ఓ పాటకు స్పైడర్ మ్యాన్ గెటప్లో ఇద్దరు వ్యక్తులు డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
స్పైడర్ మ్యాన్స్ స్పెప్పులేస్తే..
గుంటూరు కారం సినిమాలో వచ్చే ‘మావ ఎంతైన’ పాటలో మహేష్ తన డ్యాన్స్తో అదరగొడతాడు. ముఖ్యంగా సాంగ్ ఎండింగ్లో వచ్చే ‘సర్రా.. సర్రా.. సర్రా.. సర్రా..’ మ్యూజిక్ హైలెట్గా అనిపిస్తుంది. బీట్కు తగ్గట్లు స్పెప్పులేసి మహేష్ అలరిస్తాడు. అయితే ఈ మ్యూజిక్కి స్పైడర్ మ్యాన్ (Spider Man) స్టెప్పులేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఓ నెటిజన్కు వచ్చింది. స్పైడర్ మ్యాన్ గెటప్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు వేసిన డ్యాన్స్ను.. ‘సర్రా.. సర్రా..’ మ్యూజిక్కు సరిగ్గా సింక్ అయ్యేలా ఎడిట్ చేశాడు. స్పైడర్ మ్యాన్ తెలుగు వెర్షన్ పాటకు డ్యాన్స్ వేస్తే... అందరికీ కనుల విందుగా ఉంటుందంటూ వీడియోకు క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వీడియోపై మీరూ లుక్కేయండి.
https://twitter.com/i/status/1781273824639725625
ఫ్యాన్స్ ఏమంటున్నారంటే..
మహేష్ పాటకు స్పైడర్ మ్యాన్ స్టెప్పులు వేసిన వీడియోపై ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. స్టెప్పులు భలే సింక్ అయ్యాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ఆసక్తికరంగా.. స్పైడర్ మ్యాన్ : గుంటూర్ కార్ 'హోమ్' (Spiderman: Guntur Kar'Home') అంటూ ఈ వీడియోకు ఫన్నీ టైటిల్ కూడా ఇచ్చాడు. మహేష్, స్పైడర్ మ్యాన్ కాంబోలో మూవీ వస్తే బాగుంటుందంటూ మరో ఫ్యాన్ అభిప్రాయపడ్డాడు. SSMB 29 తర్వాత మహేష్ క్రేజ్ హాలీవుడ్ స్థాయికి చేరుకుంటుందని అప్పుడు ఇది నిజంగానే సాధ్యమవుతుందని ఇంకో నెటిజన్ పేర్కొన్నాడు. అయితే ‘సర్రా.. సర్రా..’ మ్యూజిక్ తనకు ఎంతో ఇష్టమని మరికొందరు పోస్టు చేస్తున్నారు.
మరో రికార్డు..
గుంటూరు కారంలోని ‘కుర్చీని మడతపెట్టి’ సాంగ్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మహేష్ బాబు, శ్రీలీల (Sreeleela), పూర్ణ (Purna) ఈ పాటకు డ్యాన్స్తో అలరించారు. అయితే ఈ పాట విడుదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా రీల్స్లో సందడి చేస్తూనే ఉంది. తాజాగా యూట్యూబ్లో 200 మిలియన్ల మార్క్ను ఈ సాంగ్ అందుకుంది. మహేష్ బాబు కెరీర్లోనే అత్యధిక వ్యూస్ సాధించిన రెండో పాటగా ఇది నిలిచింది. సర్కారు వారి పాట సినిమా నుంచి కళావతి సాంగ్ అయితే ఏకంగా 245 మిలియన్ల వ్యూస్తో టాప్ ప్లేస్లో ఉంది.
https://www.youtube.com/watch?v=Ldn11dMHTJ8
ఏప్రిల్ 20 , 2024

EXCLUSIVE: టాలీవుడ్లో కొత్త ట్రెండ్… దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు
'డైరెక్టర్' ని సినిమాకు టీమ్ లీడర్ లాంటి వాడు. హీరో నుంచి ఇతర నటీనటుల వరకు అతన్ని ఫాలో అవ్వాల్సిందే. అందుకే సినిమా ఫలితం ఎలా ఉన్నా అతకే ఆపాదిస్తారు. ప్రస్తుతం టాలీవుడ్లో ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది కుర్ర హీరోలు దర్శకుడు, రచయితలుగా కొత్త అవతారం ఎత్తుతున్నారు. టాలీవుడ్లో ఈ కోవలో హీరో నుంచి దర్శకులుగా మారిన వారి గురించి ఓసారి చూద్దాం.
అడవి శేషు(Adivi Sesh)
ఈ కేటగిరిలో మనకు ముందు గుర్తొచ్చే పేరు.. విలక్షణ నటుడు యంగ్ హీరో అడివి శేషు. 'కర్మ' అనే సినిమాతో డెరెక్టర్గా మారి అందరి దృష్టిని ఆకర్షించాడు.శేష్ ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించడమే కాకుండా అందులో ప్రధాన పాత్ర కూడా పోషించాడు. ఈ సినిమాకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత 'కిస్' సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా విజయవంతం కాలేదు. అయితే ప్రస్తుతం అడవి శేష్ రచయితగా, హీరోగా సత్తా చాటుతున్నాడు.
విశ్వక్ సేన్(Vishwak Sen)
ఈ నగరానికి ఏమైంది చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్లో మంచి టాలెంట్ దాగుంది. ఓ స్క్రీన్ప్లే రైటర్గా, రచయితగా, హీరోగా, డైరెక్టర్గా బహుముఖ ప్రజ్ఞను చాటుతున్నాడు. ఫలక్నామా దాస్(2019) చిత్రాన్ని డైరెక్ట్ చేసి ప్రశంసలు పొందాడు. ఈ చిత్రంలో నటించడంతో పాటు ప్రొడ్యూస్ చేశాడు. మరో నాలుగేళ్ల తర్వాత దాస్ కా ధమ్కీ(2023) చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇటీవల విడుదలైన గామి చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. విశ్వక్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల కావాల్సి ఉంది.
సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda)
ప్రస్తుతం టాలీవుడ్లో డైరెక్టర్లకు మోస్ట్ వాంటెడ్ హీరోగా సిద్ధు జొన్నలగడ్డ మారిపోయాడు. స్టార్ బాయ్ సిద్ధూ కూడా స్టోరీ రైటర్గా, స్క్రీన్ప్లే రచయితగా, ఎడిటర్గా సత్తా చాటుతున్నాడు. బ్లాక్ బాస్టర్ చిత్రం DJ టిల్లుకు స్టోరీ రాసిన సిద్ధు జొన్నలగడ్డ.. దాని సీక్వేల్ టిల్లు స్కేర్కు కూడా కథ అందించాడు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో సిద్ధు టాలెంట్ టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది. ఈ చిత్రాల కంటే ముందు గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల, మా వింత గాధ వినుమా చిత్రాలకు స్టోరీతో పాటు సంభాషణలు అందించాడు. టిల్లు స్కేర్ చిత్రం తర్వాత దీనికి సీక్వెల్గా టిల్లు క్యూబ్ ఉంటుందని ఇటీవల ప్రకటించారు.
రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran)
'అందాల రాక్షసి', 'టైగర్', 'అలా ఎలా' వంటి సినిమాలలో హీరోగా నటించిన రాహుల్ రవీంద్రన్.. 'చి..ల..సౌ' సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు. ఆ తర్వాత 'మన్మధుడు 2' సినిమాతో కింగ్ అక్కినేని నాగార్జున ను డైరెక్ట్ చేశాడు. 'స్నేహగీతం' 'ఇట్స్ మై లవ్ స్టోరీ' వంటి చిత్రాల్లో హీరోగా నటించిన వెంకీ అట్లూరి.. 'తొలిప్రేమ' సినిమాతో డైరెక్టర్ అవతరమెత్తాడు. ఈ క్రమంలో నటనను పక్కనపెట్టి 'మిస్టర్ మజ్ను' 'రంగ్ దే' వంటి సినిమాలను తెరకెక్కించాడు. అయితే టాలీవుడ్లో హీరోలు మెగా ఫోన్ పట్టుకోవడం ఇదే కొత్తకాదు. గతంలో దిగ్గజ నటులు ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, పవన్ కళ్యాణ్ డైరెక్టర్లుగా మారి తమ అభిరుచికి తగ్గ సినిమాలను తెరకెక్కించారు.
పవన్ కళ్యాణ్(Pawan Kalyan)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మెగాఫోన్ను చేత పట్టుకుని కట్, యాక్షన్ చెప్పారు. తన సొంత బ్యానర్లో తెరకెక్కిన 'జానీ' చిత్రానికి పవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్లాఫ్ అవడంతో పవన్ మళ్ళీ డైరెక్షన్ వైపు చూడలేదు. 'గుడుంబా శంకర్', 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాలకు స్టోరీ-స్క్రీన్ ప్లే అందించారు. టాలీవుడ్లో ఈ జనరేషన్లో హీరో నుంచి డైరెక్టర్గా మారిన నటుడు పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు.
ఆర్ నారాయణ మూర్తి(R. Narayana Murthy)
విప్లవ సినిమాల హీరో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి సైతం ఓ వైపు నటుడిగా రాణిస్తూనే నిర్మాతగా, డైరెక్టర్గా మారి... పలు సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించారు. అర్ధరాత్రి స్వాతంత్ర్యం సినిమా దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం. దండోరా, ఎర్రసైన్యం వంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.
ఎన్టీఆర్ &సూపర్ స్టార్ కృష్ణ
లెజెండరీ యాక్టర్ ఎన్టీర్ స్టార్ హీరోగా ఉన్న సమయంలోనే అనేక పౌరాణిక, జానపద చిత్రాలకు దర్శకత్వం వహించారు.'సీతారామ కళ్యాణం' అనే మూవీతో డైరెక్టర్గా ఆయనకు తొలి సినిమా. ఆ తర్వాత 'గులేభకావళి కథ' 'దాన వీర శూర కర్ణ' 'చాణక్య చంద్రగుప్తా' 'తల్లాపెళ్లామా' వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. ఓ వైపు స్టార్ హీరోగా కొనసాగుతూనే డైరెక్టర్గాను సక్సెస్ అయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా హీరోగా నటిస్తూనే డైరెక్టర్గా మారి పలు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు. . 'సింహాసనం' అనే భారీ బడ్జెట్ సినిమాతో డైరెక్టర్గా మారిన కృష్ణ.. ఆ తర్వాత ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను డైరెక్ట్ చేశారు. 'శంఖారావం', 'కలియుగ కర్ణుడు', 'ముగ్గురు కొడుకులు' 'కొడుకు దిద్దిన కాపురం' 'రిక్షావాలా' 'అన్నా తమ్ముడు' 'ఇంద్ర భవనం' 'అల్లుడు దిద్దిన కాపురం' 'రక్త తర్పణం' 'మానవుడు దానవుడు'వంటి హిట్ చిత్రాలను ఆయన తెరకెక్కించారు.
ఏప్రిల్ 01 , 2024

Tollywood: ఎక్కువ భాషల్లో రీమేక్ అయిన తెలుగు బ్లాక్ బాస్టర్ చిత్రాలు ఇవే!
భారత చలనచిత్ర పరిశ్రమలో రీమేక్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. సహజంగా ఒక భాషలో విజయం సాధించిన చిత్రాన్ని కంటెంట్ బాగుంటే మరో భాషలోకి రిమేక్ చేస్తుంటారు. కొత్త నటీనటులను పెట్టి వారి నేటివిటికి అనుగుణంగా ఆ చిత్రాన్ని నిర్మిస్తుంటారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మలయాళం, భోజ్పూరి, బెంగాలి పరిశ్రమల్లో ఇలా పదుల సంఖ్యలో చిత్రాలు వచ్చాయి. అయితే ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్ (Telugu movies that have been remade in most languages) నుంచే ఏటా ఎక్కువ సినిమాలు ఇతర భాషల్లోకి రీమేక్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రం.. ఏకంగా తొమ్మిది భాషల్లో రీమేక్ అయ్యి ఇటీవల సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో తెలుగులో రూపొంది మూడు లేదా అంతకంటే ఎక్కువ లాంగ్వేజెస్లో రీమేక్ అయిన చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
నువ్వొస్తానంటే నేనొద్దంటానా (Nuvvostanante Nenoddantana)
టాలీవుడ్లో వచ్చిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' (2005) చిత్రం.. తొమ్మిది భాషల్లో రీమేకైన తొలి తెలుగు చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రం 7 భారతీయ భాషల్లో (తమిళం, కన్నడ, హిందీ, ఒడియా, మణిపురి, పంజాబీ, బెంగాలీ), 2 విదేశీ భాషల్లో (బంగ్లాదేశ్ బెంగాలీ, నేపాలి) భాషల్లో అనువదింప బడింది. తెలుగులో సిద్ధార్థ్, త్రిష, శ్రీహరి నటించిన ఈ చిత్రాన్ని డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా డైరెక్ట్ చేశారు. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది.
ఒక్కడు (Okkadu)
మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో వచ్చిన ఈ తెలుగు సినిమా కూడా 5 భాషల్లోకి రీమేక్ అయ్యింది. తమిళం, కన్నడ, బెంగాలీ, హిందీ, ఒడియా భాషల్లో రిమేక్ చేయబడి అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. తమిళంలో స్టార్ హీరో విజయ్ (Vijay) 'గిల్లీ' పేరుతో ఈ సినిమాను రీమేక్ చేయగా.. కన్నడలో 'అజయ్' పేరుతో పునీత్ రాజ్కుమార్ (Punit Raj Kumar) నటించాడు.
మర్యాద రామన్న (Maryada Ramanna)
దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) రూపొందించిన ‘మర్యాద రామన్న’ చిత్రం కూడా ఐదు భాషల్లో రీమేక్ కావడం విశేషం. సునీల్ (Sunil) హీరోగా చేసిన ఈ చిత్రం కన్నడ, బెంగాలీ, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో రీమేక్ అయ్యింది. అక్కడా ఈ సినిమా విజయాన్ని అందుకోవడం గమనార్హం. హిందీలో ‘సన్ ఆఫ్ సర్దార్’ పేరుతో రాజమౌళినే ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం. ఇందులో అజయ్ దేవగన్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా ముఖ్య పాత్రలు పోషించారు.
వర్షం (Varsham)
ప్రభాస్ (Prabhas), త్రిష (Trisha) జంటగా 2004లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'వర్షం'. శోభన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా ఎక్కువ భాషల్లో రూపొందింది. ఒడియాలో ‘మై డార్లింగ్’ (2004), తమిళంలో ‘మజాయ్’ (2005), హిందీలో ‘భాగీ’ (2016) పేరుతో రిలీజై మంచి ఆదరణ పొందింది.
ఛత్రపతి (Chatrapathi)
ప్రభాస్ (Prabhas) హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి చిత్రం టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. నిర్మాతలకు మూడు రెట్లు లాభాలను అందించింది. అయితే మూడు భాషల్లో రీమేక్ అయ్యింది. కన్నడ, బెంగాలి భాషల్లో రిఫ్యూజ్ పేరుతో విడుదల కాగా, హిందీలో రీసెంట్గా ఛత్రపతి పేరుతోనే విడుదలైంది. వి.వి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేశాడు. అయితే ఈ సినిమా హిందీలో డిజాస్టర్గా నిలిచింది.
పోకిరి (Pokiri)
మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) డైరెక్షన్ లో వచ్చిన ఈ పోకిరి సినిమా.. 4 భాషల్లో రిమేక్ అయ్యింది. తమిళంలో విజయ్ హీరోగా ‘పొక్కిరి’ (2007), హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా 'వాంటెడ్' (2009), కన్నడలో దర్శన్ హీరోగా ‘పొర్కి’ (2010) పేరుతో ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. ఉర్దూలోనూ ఈ సినిమా రీమేక్ అయినప్పటికి కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు. అయితే హిందీలో ఈ సినిమాకు ప్రభుదేవ దర్శకత్వం వహించడం విశేషం.
డార్లింగ్ (Darling)
ప్రభాస్ హీరోగా 2010లో వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ను ఏ. కరుణాకరణ్ తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ హిట్ సాధించడంతో పలు భాషలకు చెందిన దర్శక నిర్మాతలు ఈ సినిమాను రీమేక్ చేశారు. కన్నడలో దర్షన్ హీరోగా 'బుల్బుల్', హిందీలో 'సబ్సే బధాకర్ హమ్' పేరుతో రీమేకై అక్కడ కూడా విజయాన్ని అందుకుంది. బెంగాలీలోనూ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మెుదలు కాగా కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోయింది.
విక్రమార్కుడు (Vikramarkudu)
రవితేజ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆరు భాషల్లో రీమేక్ అయ్యింది. కన్నడలో ‘వీర మదకారి’ (2009), తమిళంలో ‘సిరుతాయ్’ (2011), హిందీలో ‘రౌడీ రాతోడ్’ (2012), బంగ్లాదేశ్ బెంగాలీలో ‘ఉల్టా పల్టా 69’ (2007), ‘యాక్షన్ జాస్మిన్’ (2015) పేర్లతో రెండుసార్లు రీమేక్ అయ్యింది.
మిర్చి (Mirchi)
ప్రభాస్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి కూడా మూడు భాషల్లో రీమేక్ అయ్యింది. కన్నడలో 'మాణిక్య', బెంగాలీలో 'బిందాస్', ఒడియాలో 'బిశ్వంత్' పేర్లతో రిలీజ్ అయ్యింది. ఇక హిందీలో ఈ సినిమాకు సంబంధించిన రైట్స్ను స్టార్ నటుడు జాన్ అబ్రహం దక్కించుకున్నప్పటికీ ఇప్పటివరకూ సినిమా చేయలేదు.
ఆడవారికి మాటలకు అర్థాలే వేరులే
వెంకటేష్ (Venkatesh) హీరోగా సెల్వ రాఘవన్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా 5 భాషల్లోకి రిమేక్ అయ్యింది. తమిళం, బెంగాలీ, భోజ్పురి, కన్నడ, ఒడియా భాషల్లోకి రిమేక్ చేయబడింది. అన్ని భాషల్లో సూపర్ హిట్గా నిలిచింది.
మార్చి 23 , 2024