
UATelugu
పార్థ గ్రూప్కి చెందిన ఇద్దరు వ్యక్తులు హత్యకు గురవుతారు. దీని వెనక టీచర్ అక్షిక (అనసూయ), జర్నలిస్టు ఫాజిల్ (మాగంటి శ్రీనాథ్) ఉన్నట్లు నిర్ధారించి పోలీసులు అరెస్టు చేస్తారు. అయినప్పటికీ పార్థ గ్యాంగ్లోని మరో వ్యక్తి హత్యకు గురవుతాడు. అసలు ఆ హత్యలకు కారణం ఏంటి? పార్థ మనుషులనే ఎందుకు హత్య చేస్తున్నారు? వీటితో మ్యాన్ పురుషోత్తం రెడ్డి (జగపతి బాబు)కి సంబంధం ఏంటి? అన్నది స్టోరీ.
ఇంగ్లీష్లో చదవండి
మూవీ & ఓటీటీ అప్డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Ahaఫ్రమ్
ఇన్ ( Telugu )
Watch
రివ్యూస్
YouSay Review
Simbaa Movie Review: ‘సింబా’ ఇచ్చిన సందేశం బాగుంది.. కానీ!
జగపతిబాబు (Jagapathi Babu), అనసూయ (Anasuya Bharadwaj) కీలక పాత్రల్లో మురళీ మనోహర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సింబా’ (Simbaa). సూపర్ నేచురల్ క్రైమ...read more
How was the movie?
తారాగణం

దివి వడ్త్యా

జగపతి బాబు

వశిష్ట ఎన్. సింహ
రమేష్ కోనంభొట్ల

అనసూయ భరద్వాజ్

కబీర్ దుహన్ సింగ్

కేశవ్ దీపక్

అనీష్ కురువిల్లా
మాగంటి శ్రీనాథ్
రాజీవ్ కుమార్ అనేజా
సిద్ధార్థ్ గొల్లపూడి
కమల్ తేజ నార్ల
సిబ్బంది
మురళీ మనోహర్ రెడ్డిదర్శకుడు
సంపత్ నంది
నిర్మాతరాజేందర్ రెడ్డినిర్మాత
ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు

Simbaa Movie Review: ‘సింబా’ ఇచ్చిన సందేశం బాగుంది.. కానీ!
నటీనటులు : జగపతి బాబు, అనసూయ భరద్వాజ్, వశిష్ట ఎన్. సింహ, దివి వడ్త్యా, కబిర్ దుహన్ సింగ్, శ్రీనాథ్ మాగంటి
డైరెక్టర్ : మురళి మనోహార్
సంగీతం : కృష్ణ సౌరభ్
నిర్మాత : సంపత్ నంది, డి. రాజేందర్ రెడ్డి
విడుదల: 09-08-2024
జగపతిబాబు (Jagapathi Babu), అనసూయ (Anasuya Bharadwaj) కీలక పాత్రల్లో మురళీ మనోహర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సింబా’ (Simbaa). సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ఈ సినిమా రూపొందింది. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది, దాసరి రాజేందర్రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.
కథేంటి
హైదరాబాద్లో పార్థ గ్రూప్కి చెందిన కీలక వ్యక్తి హత్యకు గురవుతాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే అదే గ్రూప్నకు చెందిన మరో వ్యక్తిని కూడా చంపేస్తారు. అయితే ఈ హత్యల వెనక స్కూల్ టీచర్ అక్షిక (అనసూయ), ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు ఫాజిల్ (మాగంటి శ్రీనాథ్) ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వస్తారు. వాళ్లని అరెస్టు కూడా చేస్తారు. ఈ క్రమంలో ఈసారి అందరు చూస్తుండగానే మరో హత్య జరుగుతుంది. ఆ హత్యలో ప్రముఖ డాక్టర్ పాలుపంచుకోవడంతో కథ పోలుసులు అయోమయంలో పడతారు. అసలు ఆ హత్యలకు కారణం ఏంటి? పార్థ (కబీర్సింగ్) మనుషులనే ఎందుకు హత్య చేస్తున్నారు? ఈ మర్డర్స్కు ఫారెస్ట్ మ్యాన్ పురుషోత్తం రెడ్డి (జగపతి బాబు)కి ఉన్న సంబంధం ఏంటి? పార్థతో అతడికి ఉన్న విభేదాలు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
పురుషోత్తం రెడ్డి పాత్రలో జగపతి బాబు ఆకట్టుకున్నారు. ఓ వైపు చక్కటి హావా భావాలను పలికిస్తూనే యాక్షన్ సీక్వెన్స్లో అదరగొట్టారు. ఇక టీచర్ అక్షిక పాత్రలో అనసూయ తనదైన నటనతో మెప్పించింది. ఏమాత్రం తడబాటు లేకుండా తనకిచ్చిన పాత్రలో జీవించింది. అటు దివి, మాగంటి శ్రీనాథ్, వశిష్ఠ సింహా పాత్రలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా విశిష్ఠ సింహా నటన మెప్పిస్తుంది. సీనియర్ నటీమణులు గౌతమి, కస్తూరి ద్వితీయార్థంలో సందడి చేశారు. ప్రతినాయకుడిగా నటించిన కబీర్ పర్వాలేదనిపించాడు. మిగిలిన నటీనటులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు మురళి మనోహర్ క్రైమ్ & ఇన్వెస్టిగేటివ్ స్టోరీకి పర్యావరణ అంశాలను జోడించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అనసూయ పాత్ర పరిచయం, దివి-మాగంటి శ్రీనాథ్ లవ్ ట్రాక్, రెండు హత్యల తాలుకూ సంఘటనలతో తొలి భాగాన్ని ఆసక్తిగా నడిపించారు డైరెక్టర్. అయితే ఈ మధ్యలో వచ్చే పోలీసు ఇన్వెస్టిగేషన్ రొటిన్గా అనిపిస్తుంది. అసలు లాజికల్గా ఉండదు. ఇక సెకండాఫ్లో ఫారెస్ట్ మ్యాన్గా జగపతిబాటు ఎంట్రీ, చెట్లని రక్షించడం, చెట్లను ప్రేమించడం వంటి సందేశంతో వచ్చే సన్నివేశాలు ఆలోచింపజేస్తాయి. కానీ, హృదయాలను హత్తుకునే సంభాషణలు లేకపోవడంతో దర్శకుడు ఇచ్చిన సందేశం ఆడియన్స్పై పెద్దగా ప్రభావం చూపలేదు. బయోలాజికల్ మెమెురీ కాన్సెప్ట్ మాత్రం సినిమాలో ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఫారెస్ట్ మ్యాన్ ఎపిసోడ్ను ఇంకాస్త బెటర్గా ప్రెజంట్ చేసి ఉంటే బాగుండేది. మూవీ కాన్పెప్ట్ బాగున్నా సమర్థవంతంగా ఆడియన్స్లోకి తీసుకెళ్లడంతో మాత్రం దర్శకుడు విఫలమయ్యాడు.
సాంకేతికంగా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే కృష్ణ సౌరభ్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. కొన్ని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. కృష్ణప్రసాద్ కెమెరా పనితనం మెప్పిస్తుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
జగపతిబాబు, అనసూయ నటనసందేశంద్వితియార్థం
మైనస్ పాయింట్స్
ఆసక్తిలేని కథనంసాగదీత సన్నివేశాలు
Telugu.yousay.tv Rating : 2.5/5
ఆగస్టు 09 , 2024

Mokshagna Teja: మోక్షజ్ఞ తేజ సినిమాకు ముహోర్తం ఫిక్స్! శ్రీకృష్ణుడి గెటప్లో బాలయ్య గెస్ట్ రోల్?
నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. నందమూరి మూడో తరం వారసుడ్ని వెండితెరపై చూసుకునేందుకు కళ్లు కాయలు కాచేలా నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ తేజ తెరంగేట్రానికి సంబంధించి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు అప్డేట్స్ బయటకొచ్చాయి. ఇది చూసిన నందమూరి అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. ఇన్నాళ్ల తమ ఎదురుచూపులకు సరైన ఫలితం దక్కబోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
మోక్షజ్ఞ కోసం స్పెషల్ పోస్ట్!
‘హనుమాన్’తో టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఆకర్షించారు. మోక్షజ్ఞ తెరంగేట్రం చిత్రాన్ని అతడే డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రశాంత్ నీల్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా ఓ సింహం తన పిల్లను ఎత్తుకొని చూపుతోన్న పోస్ట్ పెట్టిన ప్రశాంత్ వర్మ ‘నా యూనివర్స్ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది’ అని రాశారు. దీనికి ‘సింబా ఈజ్ కమింగ్’ అనే హ్యాష్ట్యాగ్ పెట్టారు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీని ఉద్దేశించే ప్రశాంత్ ఈ పోస్ట్ పెట్టారని అందరూ అనుకుంటున్నారు. ఇటీవల ప్రశాంత్ వర్మ పెట్టిన మరో పోస్ట్ కూడా నెట్టింట వైరల్గా మారింది. ఒక ఫొటో షేర్ చేస్తూ ‘ఛాలెంజ్ని స్వీకరిస్తున్నా’ అని రాశారు. ఇది కూడా మోక్షజ్ఞ సినిమా కోసం పెట్టిన పోస్టు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
https://twitter.com/PrasanthVarma/status/1830839179716239368
https://twitter.com/PrasanthVarma/status/1830473835046461471
ముహోర్తం ఫిక్స్..!
మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్ వర్మ సినిమాకు సంబంధించి పూజా వేడుక డేట్ ఖరారైనట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. మోక్షజ్ఞ బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ 6న ఈ సినిమాను అధికారికంగా లాంచ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఆ రోజున పూజా కార్యక్రమాలు నిర్వహించాలని డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో పాటు నందమూరి బాలకృష్ణ నిర్ణయించినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా మెుదలైనట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యే అవకాశమున్నట్లు సమాచారం. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సమయం మరో మూడు రోజుల్లో వస్తుండటంతో నందమూరి అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.
శ్రీకృష్ణుడిగా బాలయ్య!
మోక్షజ్ఞ సినిమాను మైథలాజికల్, సోషియో ఫాంటసీ చిత్రంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ కూడా ఫైనల్ అయినట్లు సమాచారం. మహాభారతం స్ఫూర్తితో ఈ సినిమా కథను సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వస్తోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం ఇందులో శ్రీకృష్ణుడి పాత్రలో బాలయ్య కనిపిస్తారని సమాచారం. హనుమాన్ తరహాలోనే ఈ సినిమాలో సూపర్ హీరో, మైథలాజికల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటాయని, చివర్లో బాలయ్య శ్రీకృష్ణుడిగా ఎంట్రీ ఇవ్వడంతో కథ మరో మలుపు తిరుగుతుందని సమాచారం. మరోవైపు అర్జునుడి పాత్రలో బాలకృష్ణ కనిపిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రశాంత్ వర్మ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా?
మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్ వర్మ కాంబోలో రానున్న చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బాలయ్య చిన్న కుమార్తె తేజస్వినీ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు టాక్. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం బాలయ్య స్వయంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ (Khushi Kapoor) హీరోయిన్గా తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే జరిగితే మోక్షజ్ఞ-ఖుషీ కపూర్ జోడీ మరో ట్రెండ్ సెట్టర్గా మారుతుందని నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మోక్షజ్ఞ లుక్స్ వైరల్..
నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రం ఖాయమైన వేళ ఇటీవల ఆయన ఫొటోలు కూడా వైరలయ్యాయి. ఓ సినిమా వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ మోక్షజ్ఞ ఈ ఏడాదే కెమెరా ముందుకొస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం మోక్షజ్ఞ అందుకు సంబంధించిన సన్నాహాల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన ఓ ఫొటోషూట్లో పాల్గొనగా, అందులోని కొన్ని లుక్స్ బయటికొచ్చాయి. అప్పటినుంచి సామాజిక మాధ్యమాల్లో అవి తెగ వైరల్ అవుతోన్నాయి. దీంతో త్వరలోనే ఈ నందమూరి వారసుడు తెరపై సందడి చేయడం ఖాయమని అభిమానులు అనుకుంటున్నారు.
సెప్టెంబర్ 03 , 2024

Mufasa: The Lion King Review: మహేష్ ప్రాసలు, పంచ్లు అదరహో.. ‘ముఫాసా’ ఎలా ఉందంటే?
నటులు: మహేష్ బాబు, సత్యదేవ్, బ్రహ్మానందం, అలీ (డబ్బింగ్ చెప్పినవారు)
దర్శకత్వం: బబ్యారీ జెన్ కిన్స్
సినిమాటోగ్రఫీ: జేమ్స్ లక్ట్సాన్
ఎడిటింగ్: జోయ్ మెక్మిలన్
సంగీతం: డేవ్ మెట్జర్, నికోలక్ బ్రిటెల్, లిన్ మాన్యుల్ మిరాండ
నిర్మాతలు: అడెలె రొమన్స్కీ, మార్క్ కారియాక్
నిర్మాణ సంస్థ: డిస్నీ
విడుదల: డిసెంబర్ 20, 2024
హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ తెరకెక్కిస్తోన్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King Review In Telugu) ఒకటి. ఇందులో కీలకమైన ‘ముఫాసా’ పాత్రకు తెలుగులో మహేష్బాబు (Mahesh babu) డబ్బింగ్ చెప్పాడు. అలాగే సత్యదేవ్, బ్రహ్మానందం, అలీ వంటి స్టార్స్ కూడా పలు తమ స్వరాన్ని అందించారు. భారీ బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ఈనెల 20న ఇంగ్లీషుతో పాటు తెలుగు, తమిళం, హిందీలో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? మహేష్ డబ్బింగ్ ఆకట్టుకుందా? యానిమేషన్ వర్స్క్ మెప్పించాయా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
ముఫాసా (మహేష్ బాబు వాయిస్ ఓవర్) చిన్నతనంలో అమ్మ చెప్పిన కథలు వింటూ పెరుగుతాడు. దూరంగా ఉండే మిలేలే అనే స్వర్గం లాంటి రాజ్యం గురించి తరచూ వింటూ ఉండేవాడు. ఈ క్రమంలో ఓరోజు వరదల రావడంతో ముఫాసా కొట్టుకుపోతాడు. అలా టాకా (సత్యదేవ్ వాయిస్ ఓవర్) ఉన్న రాజ్యానికి వస్తాడు. ముఫాసా రాకను టాకా తండ్రి ఒప్పుకోడు. కానీ టాకా తన అన్నలా పెంచుకుందామని పట్టుబడతాడు. టాకా తల్లి కూడా సపోర్ట్ చేయడంతో ముఫాసా వారి ఫ్యామిలీలో భాగమవుతాడు. ఓ రోజు టాకా తల్లిపై తెల్ల సింహాలు దాడి చేయగా ముఫాసా ధైర్యంగా ఎదుర్కొంటాడు. తెల్ల సింహాల యువరాజును చంపేస్తాడు. అది తెలిసిన తెల్ల సింహాల రాజు కిరోస్ ముఫాసా ఉంటున్న రాజ్యంపై దాడి చేస్తాడు. ఆ దాడి నుంచి తప్పించుకొని ముఫాసా, టాకాలు చిన్నప్పుడు విన్న మిలేలే రాజ్యం వైపు పయనమవుతారు. ఈ ప్రయాణంలో వాటికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ముఫాసాను చంపడానికి కిరోస్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ముఫాసాకు టాకా ఎందుకు ఎదురు తిరిగాడు? చివరకూ ముఫాసా ఎలా రాజయ్యాడు? అన్నది స్టోరీ.
డబ్బింగ్ ఎలా ఉందంటే
ముఫాసా: ది లయన్ కింగ్ (Mufasa: The Lion King Review) లైవ్ యానిమేషన్ చిత్రం. ఇందులో నటీనటులు కనిపించరు వారు చెప్పిన వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. డబ్బింగ్ గురించి మాట్లాడాల్సి వస్తే తెలుగులో ముఫాసా పాత్రకు మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఫాసా పాత్రకు మహేష్ డబ్బింగ్ బాగా సెట్ అయ్యింది. తెరపై సింహాం ప్లేస్లో మహేష్ను ఊహించుకునేంతలా అతడు తన వాయిస్తో మెస్మరైజ్ చేశాడు. సెటైర్లు, పంచ్లు, గంభీరమైన డైలాగ్స్తో మహేష్ అదరగొట్టాడు. టాకా పాత్రకు నటుడు సత్యదేవ్ వాయిస్ బాగా సెట్ అయ్యింది. మంచి సోదరుడిగా, ఆ తర్వాత విలన్లతో చేతులు కలిపిన వెన్నుపోటు దారుడిగా వాయిస్లో మంచి వేరియేషన్స్ ప్రదర్శించాడు. అటు పుంబా పాత్రకు బ్రహ్మీ డబ్బింగ్ చెప్పగా, టిమోన్ రోల్కు అలీ గాత్ర దానం చేశారు. వారిద్దరు తమ వాయిస్తో కామెడీని బాగా పండించారు. మిగిలిన పాత్రలకు డబ్బింగ్ చెప్పినవారు కూడా తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
https://twitter.com/DisneyStudiosIN/status/1867064334456615039
డైరెక్షన్ ఎలా ఉందంటే
2019లో వచ్చిన 'ది లయన్ కింగ్' చిత్రానికి ప్రీక్వెల్గా దర్శకుడు బ్యారీ జెన్ కిన్స్ ఈ చిత్రాన్ని రూపొందించారు. అందులో ముఫాసా రాజు కాగా అతడి కొడుకు సింబా చుట్టూ కథ తిరిగింది. తాజా చిత్రంలో ముఫాసా ఎలా రాజు అయ్యాడు? టాకా అలియాస్ స్కార్ ఎవరు? అనేది చూపించాడు. స్టోరీ పరంగా చూస్తే పెద్దగా మెరుపులు కనిపించవు. కానీ విజువల్స్, స్క్రీన్ ప్లే పరంగా ఆడియన్స్లో ఆసక్తి రగిలించాడు దర్శకుడు. ముఖ్యంగా మిలేలే అనే స్వర్గం లాంటి ప్రపంచంలో ప్రేక్షకులను లీనం చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగున్నాయి. ముఫాసా, టాకా సోదరుల కథ ప్రస్తుత సమాజాన్ని అద్దం పట్టేలా ఉండటం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అయితే రొటీన్ స్టోరీ, ఊహాజనీతమైన కథనం మైనస్గా చెప్పవచ్చు. పెద్దలు, మాస్ ఆడియన్స్ సంగతి ఏమోగానీ, చిన్నారులకు మాత్రం ముఫాసా పక్కా ఎంటర్టైన్ చేస్తుందని చెప్పవచ్చు. రెండున్నర గంటల పాటు కొత్త ప్రపంచంలోకి వెళ్లి వస్తారు.
టెక్నికల్గా..
టెక్నికల్గా హాలీవుడ్ స్టాండర్డ్స్ (Mufasa: The Lion King Review) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సంగీతం, సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవల్లో ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ టాప్ నాచ్ పనితీరు కనబరిచింది. నిజమైన సింహాలను తెరపై చూస్తున్నట్లుగా భ్రమను కల్పించడంలో వారు పూర్తిగా సక్సెస్ అయ్యారు. నిర్మాణ విలువలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో డిస్నీ ఎక్కడా రాజీపడలేదు. చాలా నాణ్యమైన గ్రాఫిక్స్ను అందించారు.
ప్లస్ పాయింట్స్
మహేష్బాబు డబ్బింగ్గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ మాయజాలంసంగీతం, సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
ఊహాజనితంగా సాగే కథనంట్విస్టులు లేకపోవడం
Telugu.yousay.tv Rating : 3/5
డిసెంబర్ 20 , 2024

Mufasa: The Lion King: మహేష్ బాబు వాయిస్ ఇచ్చిన ‘ముఫాసా’ గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
వరల్డ్ మోస్ట్ వాంటెడ్ యానిమేషన్ చిత్రం 'ముఫాసా: ది లయన్ కింగ్' (Mufasa: The Lion King) మరో రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్గా విడుదల కాబోతోంది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు సహా పలు దక్షిణాది భాషల్లో ఈ సినిమా డిసెంబర్ 20న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు అదిరిపోయాయన్న కామెంట్స్ గట్టిగానే వినిపిస్తున్నారు. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో పిల్లలతో సహా ఈ యానిమేటెడ్ చిత్రాన్ని చూసేందుకు పేరెంట్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ‘ముఫాసా: ది లయన్ కింగ్’ సినిమాకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సినిమా చూసేముందుకు వాటి గురించి తప్పక తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే అసలైన మజాను ఎంజాయ్ చేయగలుగుతారు. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
‘ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King) చిత్రాలకు హాలీవుడ్ సహా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ తొలుత దీనిని ‘ది లయన్ గార్డ్’ పేరుతో టీవీ సిరీస్గా రూపొందించింది.
అప్పటికే బాగా పాపులర్ అయిన ‘ది లయన్ గార్డ్’ కామిక్ బుక్లోని కథలను తీసుకొని కార్టూన్స్ రూపంలో ఈ టెలివిజన్ సిరీస్ను డిస్నీ నిర్మించడం గమనార్హం.
టెలివిజన్లో ‘ది లయన్ గార్డ్’ (The Lion Guard) సిరీస్కు విశేష ఆదరణ లభించడంతో దానిని ‘ది లయన్ కింగ్’ పేరుతో 1994లో కార్టూన్ యానిమేషన్ చిత్రంగా డిస్నీ తీసుకొచ్చింది. అప్పట్లో ఆ మూవీకి మంచి ఆదరణ లభించింది.
ఆ తర్వాత 2016లో ‘ది లయన్ కింగ్’ (1994)కు రీమేక్గా అత్యాధునిక గ్రాఫిక్స్ హంగులతో కొత్త చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు డిస్నీ ప్రకటించింది. అందుకు అనుగుణంగా 2019లో అదే పేరుతో ‘ది లయన్ కింగ్’ చిత్రాన్ని రిలీజ్ చేసింది.
'ది లయన్ కింగ్' (2019) వరల్డ్ వైడ్గా విశేష స్పందన వచ్చింది. $250 - 260 మిలియన్ డాలర్లతో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా $1.657 బిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్య పరిచింది.
ఇప్పుడు ది లయన్ కింగ్కు సీక్వెల్గా ముఫాసా: ది లయన్ కింగ్ చిత్రం వస్తుండటంతో సహజంగానే అందరిలోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
‘ది లయన్ కింగ్’ (2019), ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (2024) చిత్రాల్లో యానిమేటెడ్ జంతువులే తెరపైకి కనిపించినప్పటికీ వాటి వెనక ఎంతోమంది హాలీవుడ్ స్టార్స్ వర్క్ చేశారు.
అరోన్ పీరే (ముఫాసా), డొనాల్డ్ గ్లోవర్ (సింబా), బియాన్స్ (నాలా), బ్లూ ఇవి కార్టర్ (కియారా), జాన్ కాని, (రఫీకీ), టిఫాని బూనే (సరాబి) వంటి స్టార్స్ అందులోని పాత్రలకు తమ గాత్రాన్ని అందించారు.
ముఫాసా స్టోరీ విషయానికి వస్తే.. ముఫాసా (సింహం) ఓ అనాథ. చిన్నప్పుడు తనను రక్షించడంతో టాకా (సింహం) బ్రదర్గా దత్తత తీసుకుంటాడు. పెద్దయ్యాక వారు చేసిన సాహసాలు ఏంటి? ప్రైడ్ ల్యాండ్లోని తెల్ల సింహాల నుంచి వాటికి ఎధురైన సమస్యలు ఏంటి? అన్నది కథ.
‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King) చిత్రాన్ని బారీ జెంకిన్స్ డైరెక్ట్ చేశాడు. ఈ యానిమేషన్ చిత్రం నిర్మాణానికి దాదాపు 200 మిలియన్ డాలర్లు ఖర్చు అయ్యింది. భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.1700 కోట్లు ఖర్చు అయ్యింది. 118 నిమిషాల నిడివితో ఈ సినిమా రాబోతోంది.
‘ముఫాసా: ది లయన్ కింగ్’ భారత్లోనూ గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. హిందీలో వెర్షన్లో బాలీవుడ్ బాద్ షా ఫ్యామిలీ భాగస్వామ్యం అయ్యింది. షారుఖ్ ఖాన్తో పాటు ఆయన కుమారులు ఆర్యన్ ఖాన్, అబ్రామ్ ఖాన్ వాయిస్ ఇచ్చారు.
2019లో విడుదలైన ‘ది లయన్ కింగ్’ మూవీలో ముఫాసా పాత్రకు షారుఖ్ ఖాన్ వాయిస్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన కుమారులు కూడా గాత్ర దానం చేయడంతో హిందీలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ముఫాసా తెలుగు వెర్షన్ ఈసారి మరింత హైలేట్ కాబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ‘ముఫాసా’ పాత్రకు డబ్బింగ్ చెప్పారు. దీంతో మహేష్ అభిమానులు ఈ మూవీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
https://twitter.com/urstrulyMahesh/status/1859107736920969300
‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రంలో స్టార్ కమెడియన్స్ బ్రహ్మానందం, అలీ కూడా డబ్బింగ్ చెప్పారు. పుంబా పాత్రకు బ్రహ్మీ డబ్బింగ్ చెప్పగా, టిమోన్ రోల్కు అలీ గాత్ర దానం చేశారు.
https://twitter.com/thetalkenti/status/1866815051316785331
2019లో వచ్చిన ‘ది లయన్ కింగ్’ చిత్రంలోనూ అలీ, బ్రహ్మీ డబ్బింగ్ చెప్పారు. దానికి సీక్వెల్గా వస్తోన్న ముఫాసాలోనూ పుంబా, టిమోన్ పాత్రలకు వారు డబ్బింగ్ చెప్పడం విశేషం.
తమిళ వెర్షన్కు సైతం పలువురు స్టార్స్ డబ్బింగ్ చెప్పారు. అర్జున్ దాస్ (ముఫాసా), అశోక్ సెల్వన్ (టాకా), నాజర్ (కిరోస్), వీటీవీ గణేష్ (యంగ్ రఫీకీ), సింగం పులి (టిమన్) డబ్బింగ్ చెప్పారు.
https://twitter.com/DisneyStudiosIN/status/1868564630416855209
హైదరాబాద్లో ‘ముఫాసా’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో 2D, 3D వెర్షన్స్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ప్రస్తుతానికి ఐదు స్క్రీన్స్లో మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.
డిసెంబర్ 18 , 2024

Mokshagna Teja: యాక్షన్కు సిద్ధమా? సినిమా లాంచ్ ఎప్పుడంటే?
నట సింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) సినిమా ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ‘హనుమాన్’తో యావత్ దేశాన్ని అలరించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అతడు ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీకి సింబ’ (Simba) అనే సాలిడ్ పేరును సైతం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని నిర్మించనుంది. ప్రస్తుతం ఈ మూవీ కోసం తన లుక్ను మార్చుకునే పనిలో మోక్షజ్ఞ ఉన్నాడు. ఈ క్రమంలోనే అతడికి సంబంధించిన తాజా లుక్ బయటకు వచ్చింది. ఇది చూసిన నందమూరి ఫ్యాన్స్ అతడి మేకోవర్ చూసి ఆశ్చర్యపోతున్నారు.
లుక్ ఎలా ఉందంటే?
ఒకప్పుడు మోక్షజ్ఞ (Mokshagna Teja)ను చూస్తే చాలా బొద్దుగా హీరో మెటీరియల్ లాగానే అనిపించేవాడు కాదు. అయితే సినిమా ఎంట్రీకి రంగం సిద్ధమైన నేపథ్యంలోనే ఈ యంగ్ నట సింహం తన మేకోవర్పై దృష్టి పట్టింది. ఫిట్నెస్ పెంచుకోవడంతో పాటు హ్యాండ్సమ్గా కనిపించేందుకు తీవ్రంగా శ్రమించాడు. ఈ క్రమంలోనే ఇటీవల మోక్షజ్ఞ సంబంధించిన నయా మేకోవర్ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. హీరో అంటే ఇలా కదా ఉండాని అనేంతలా అతడు మారిపోయాడు. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఫొటోనే మోక్షజ్ఞకు సంబంధించి నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో మోక్షజ్ఞ గత ఫొటోల్లోకంటే మరింత హ్యాండ్సమ్గా కనిపించాడు. లుక్స్లో తనకు సాటి ఎవరు రాలేరు అన్న విధంగా మెస్మరైజ్ చేశాడు.
‘యాక్షన్కు సిద్ధమా?’
టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) మోక్షజ్ఞకు సంబంధించిన నయా ఫొటోను తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశాడు. అది క్షణాల్లో నెట్టింట వైరల్ మారింది. మోక్షజ్ఞ ఫొటోను షేర్ చేస్తూ 'యాక్షన్ కోసం సిద్ధమా?' అంటూ ప్రశాంత్ వర్మ క్యాప్షన్ ఇచ్చాడు. 'సింబా ఈజ్ కమింగ్' అనే హ్యాష్ ట్యాగ్ను దానికి జోడించారు. దీంతో ‘సింబా’ సినిమాలో మోక్షజ్ఞ ఈ లుక్లోనే కనిపిస్తాడని స్పష్టమవుతోంది. ఇక టాలీవుడ్లో మరో ప్రిన్స్ అడుగుపెట్టబోతున్నారంటూ నందమూరి ఫ్యాన్స్ ఇప్పటి నుంచే కామెంట్స్ చేస్తున్నారు. నందమూరి కుటుంబం నుంచి మరో అందగాడు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడంటూ పోస్టులు పెడుతున్నారు. బాలయ్య కుమారుడు అంటే ఆ మాత్రం గ్లామర్ తప్పనిసరి అంటూ ఆకాశానికెత్తుతున్నారు.
https://twitter.com/PrasanthVarma/status/1862361623903486423
ఇతిహాసాల స్ఫూర్తితో..
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా 'సింబా' ప్రాజెక్ట్ రూపొందనుంది. లెజెండ్ ప్రొడక్షన్స్తో కలిసి S.L.V. సినిమాస్ పతాకంపై సుధారర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సమర్పిస్తున్నారు. ఇతిహాసాల ఆధారంగా రూపొందనున్న సోషియో ఫాంటసీ చిత్రమిదని గతంలోనే ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చేసారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆఖరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మూవీ లాంచ్ గురించి ఏర్పాట్లు కూడా మెుదలుకానున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్లో పక్కాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. 'యాక్షన్ కోసం సిద్ధమా?' అంటూ ప్రశాంత్ పెట్టిన లేటెస్ట్ పోస్టును బట్టే ఈ సినిమా పట్టాలెక్కేందుకు ఎక్కువ రోజుల సమయం లేదని స్పష్టమవుతోంది.
విలన్, హీరోయిన్ ఫిక్స్!
మోక్షజ్ఞ (Mokshagna Teja) సినిమాలో హీరోయిన్, విలన్ సైతం ఫిక్సయినట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు రాషా థడాని (Rasha Thadani) ఇందులో కథానాయికగా చేయబోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమెను ఆడిషన్ సైతం చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వచ్చింది. మరోవైపు విలన్ పాత్రను కూడా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫైనల్ చేశారని అంటున్నారు. రానా (Rana Daggubati) పేరును విలన్ క్యారెక్టర్కు పరిశీలిస్తున్నారని, త్వరలోనే ఆయన సంప్రదిస్తారని ప్రచారం జరుగుతోంది. రానా ఓకే చెప్పేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ సైతం మోక్షజ్ఞ సినిమాలో స్పెషల్ రోల్ చేసే ఛాన్స్ ఉందని తొలి నుంచి ప్రచారం జరుగుతోంది. దీంతో సినిమా పట్టాలెక్కకముందే మోక్షజ్ఞ ప్రాజెక్ట్పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
నవంబర్ 29 , 2024

HBD Mokshagna Teja: ‘జై హనుమాన్’తో మోకజ్ఞ సినిమా లింకప్.. ఏం ప్లాన్ చేశావ్ ప్రశాంత్ మామా!
నందమూరి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. నట సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) అధికారికంగా సినీ రంగ ప్రవేశం చేశాడు. టాలెంటెడ్ డైరెక్టర్ ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ అరంగేట్ర చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇవాళ (సెప్టెంబర్ 6) మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇదే సమయంలో మోక్షజ్ఞ సినిమాకు సంబంధించి ఎగిరిగంతేసే న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
మోక్షజ్ఞ పోస్టర్ ఎలా ఉందంటే
నందమూరి మోక్షజ్ఞ తేజ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో రానున్న చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా విడుదలైంది. ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు గొప్ప సంతోషంగా ఉందంటూ మూవీలోని ఆయన లుక్ను రిలీజ్ చేశారు. ఇందులో మోక్షజ్ఞ హ్యాండ్స్మ్ లుక్లో స్మైలింగ్ ఫేస్తో కనిపించారు. అంతేకాదు పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించి పక్కా హీరో మెటీరియల్గా అనిపిస్తున్నారు. మోక్షజ్ఞ లుక్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ మోక్షజ్ఞకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
https://twitter.com/PrasanthVarma/status/1831921862609154407
తారక్ స్పెషల్ విషెస్
నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ బర్త్డేతో పాటు ఆయన డెబ్యూ ఫిల్మ్ పోస్టర్పై జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) స్పందించారు. మోక్షజ్ఞను విష్ చేస్తూ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ‘సినిమా ప్రపంచంలోకి ప్రవేశించినందుకు అభినందనలు! నీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేటప్పుడు తాతగారితో పాటు అన్ని దైవ శక్తులు నీపై ఆశీస్సులు కురిపించాలని కోరుకుటుంన్నాను! హ్యాపీ బర్త్డే మోక్షూ’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. మరోవైపు నందమూరి హీరో కల్యాణ్ రామ్ కూడా తన తమ్ముడు మోక్షజ్ఞకు స్పెషల్ బర్త్డే విషెస్ తెలిపారు. ‘టిన్సెల్ టౌన్కు నీకు స్వాగతం మోక్షూ. తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్ చూసి నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అన్నతమ్ముల అనుబంధం అంటే ఇలానే ఉండాలని అంటున్నారు.
రెండ్రోజులుగా వరుస హింట్స్
రెండు రోజులుగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వరుస పోస్ట్లతో మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) ఎంట్రీ గురించి హింట్స్ ఇస్తూనే వచ్చారు. ‘నా యూనివర్స్ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది’ అని తొలుత అతడు పెట్టిన పోస్టు నెట్టింట వైరల్గా మారింది. ఆ తర్వాత ‘వారసత్వాన్ని ముందుకుతీసుకెళ్లే అద్భుత క్షణం’ అంటూ పెట్టిన మరో పోస్టు కూడా నందమూరి అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా మోక్షజ్ఞ లుక్ను పంచుకొని తన తర్వాత సినిమా హీరో అంటూ బాలయ్య వారసుడిని పరిచయం చేశారు ప్రశాంత్ వర్మ.
https://twitter.com/PrasanthVarma/status/1830839179716239368
https://twitter.com/PrasanthVarma/status/1831604468355391886
‘జై హనుమాన్’తో లింకప్!
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా మోక్షజ్ఞ ఫస్ట్ ఫిల్మ్ రూపొందనుంది. ప్రస్తుతం 20 స్క్రిప్ట్లు సిద్ధమవుతున్నాయని తొలి ఫేజ్లో ఆరుగురు సూపర్ హీరోల సినిమాలు తీస్తామని గతంలో ప్రశాంత్ వర్మ వివరించారు. ఏడాదికి ఒక సినిమా కచ్చితంగా విడుదల చేస్తానని ఆయన (Prasanth Varma) స్పష్టం చేశారు. ఈ క్రమంలో తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి తొలుత హనుమాన్ను ప్రశాంత్ వర్మ రిలీజ్ చేశారు. సెకండ్ ఫిల్మ్గా మోక్షజ్ఞ ఫిల్మ్ రాబోతోంది. ఈ విషయాన్ని ‘సింబా ఈజ్ బ్యాక్’ అనే పోస్టర్లో 'PVCU 2' ప్రాజెక్ట్ అంటూ ప్రశాంత్ వర్మనే స్పష్టం చేశారు. తన సినిమాటిక్ యూనివర్స్లో రానున్న ప్రతీ చిత్రానికి తన తర్వాతి ఫిల్మ్తో లింకప్ ఉంటుందని గతంలో ప్రశాంత్ వర్మనే తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే 'PVCU 2' ప్రాజెక్ట్ తర్వాత ‘జై హనుమాన్’ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ పట్టాలెక్కిించనున్నారు. దీంతో మోక్షజ్ఞ చిత్రానికి కచ్చితంగా 'జై హనుమాన్'తో కనెక్షన్ ఉంటుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఈ లింకప్ ఎలా ఉంటుందోనని ఇప్పటి నుంచే నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ మామా ఏం ప్లాన్ చేశాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/theBuzZBasket/status/1831944240831852919
శ్రీకృష్ణుడిగా బాలయ్య!
మోక్షజ్ఞ సినిమాను మైథలాజికల్, సోషియో ఫాంటసీ చిత్రంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ కూడా ఫైనల్ అయినట్లు సమాచారం. మహాభారతం స్ఫూర్తితో ఈ సినిమా కథను సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వస్తోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం ఇందులో శ్రీకృష్ణుడి పాత్రలో బాలయ్య కనిపిస్తారని సమాచారం. హనుమాన్ తరహాలోనే ఈ సినిమాలో సూపర్ హీరో, మైథలాజికల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటాయని, చివర్లో బాలయ్య శ్రీకృష్ణుడిగా ఎంట్రీ ఇవ్వడంతో కథ మరో మలుపు తిరుగుతుందని సమాచారం. మరోవైపు అర్జునుడి పాత్రలో బాలకృష్ణ కనిపిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రశాంత్ వర్మ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా?
మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్ వర్మ కాంబోలో రానున్న చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బాలయ్య చిన్న కుమార్తె తేజస్వినీ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు టాక్. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం బాలయ్య స్వయంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ (Khushi Kapoor) హీరోయిన్గా తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే జరిగితే మోక్షజ్ఞ-ఖుషీ కపూర్ జోడీ మరో ట్రెండ్ సెట్టర్గా మారుతుందని నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సెప్టెంబర్ 06 , 2024

Mufasa Telugu Trailer: సింహం నోట మహేష్ పంచ్ డైలాగ్స్.. డబ్బింగ్ ఇరగదీశాడు భయ్యా!
ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa The Lion King) ఒకటి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రంలో ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్ తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ విడుదలైంది. ఇందులో కీలకమైన ‘ముఫాసా’ పాత్రకు మహేశ్బాబు (Mahesh babu) డబ్బింగ్ చెప్పి అదరగొట్టాడు. సింహానికి మహేష్ సూపర్బ్గా డబ్బింగ్ చెప్పారంటూ సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇంతకీ ట్రైలర్ ఎలా ఉంది? అందులో మహేష్ చెప్పిన డైలాగ్స్ ఏంటి? ఇప్పుడు చూద్దాం.
మహేష్ వాయిసే హైలేట్
‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa The Lion King) తెలుగు ట్రైలర్ను నిర్మాణ సంస్థ డిస్నీ సోమవారం (ఆగస్టు 26) విడుదల చేసింది. నీకు ఒక కథ చెప్పే సమయం వచ్చింది. నీలాగే ఉండే చిట్టి సింహాల కథ అంటూ ట్రైలర్ ప్రారంభమైంది. పుట్టుకతోనే అన్నదమ్ములు కాకపోయినా ముఫాసా, స్కార్ అనే పేరుతో పిలువబడిన టాకాల కథ ఇది అంటూ కథలోకి వెళ్లారు. ఆ తర్వాత బాల్యంలో ముఫాసా, టాకాల మధ్య అనుబంధాన్ని, స్నేహాన్ని చూపించారు. ‘అప్పుడప్పుడు ఈ చల్లని గాలి, నా ఇంటి నుంచి జ్ఞాపకాల్ని గుర్తుచేస్తున్నట్లు అనిపిస్తుంది’ అంటూ మహేష్బాబు చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ‘మనం ఒక్కటిగా పోరాడాలి, నేను ఉండగా నీకు ఏం కాదు టాకా, భయపడకు’ అంటూ మహేష్ బాబు చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ ట్రైలర్కు హైలైట్గా నిలిచాయి. ‘ఇందాకా ఏదో అన్నావే’ అంటూ చివరలో తన కామెడీ టైమింగ్తో అలరించాడు మహేష్. ముఫాసా ది లయన్ కింగ్ ట్రైలర్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. మహేష్ వాయిస్ కోసమైనా సినిమాను థియేటర్లలో చూస్తామంటూ ఫ్యాన్స్తో పాటు తెలుగు సినీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/urstrulyMahesh/status/1827943721280631129
‘ఇది నాకెంతో ప్రత్యేకం’
ముఫాసా తెలుగు ట్రైలర్ను మహేష్ తన ఎక్స్ ఖాతాలో స్వయంగా పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మనకు తెలిసిన, ఇష్టపడే పాత్రకు కొత్త అంకం. తెలుగులో ముఫాసాకు వాయిస్ని అందించినందుకు చాలా సంతోషిస్తున్నా. ఈ క్లాసిక్కి నేను విపరీతమైన అభిమానిని కావడంతో ఇది నాకెంతో ప్రత్యేకంగా ఉంది’’ అని రాసుకొచ్చారు. అంతకుముందు కూడా డబ్బింగ్ చెప్పడంపై మహేష్ మాట్లాడారు. ‘డిస్నీ అంటే నాకెంతో గౌరవం. ముఫాసా తన కుమారుడిని నడిపించే తండ్రిగానే కాకుండా అడవికి గొప్ప రాజుగా అందరినీ ఆకర్షిస్తాడు. డిస్నీతో కలిసి వర్క్ చేయడం నాకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమైనది. దీన్ని నా పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తాను. డిసెంబర్ 20న ముఫాసాను నా కుటుంబంతో, అభిమానులతో కలిసి చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ ఆనందం వ్యక్తంచేశారు.
తెలుగులో మహేష్.. హిందీలో షారుక్
‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King) హిందీ వెర్షన్ ట్రైలర్ సైతం ఇటీవల విడుదలైంది. ఇందులో చిట్టి ముఫాసా పాత్రకు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) కుమారుడు అబ్రం (Abram) వాయిస్ అందించారు. ఇదే చిత్రంలో ముఫాసా (పెద్దయ్యాక) పాత్రకు షారుక్ ఖాన్, సింబా పాత్రకు షారుక్ పెద్ద తనయుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) వాయిస్ ఇవ్వడం విశేషం. ఈ సినిమా గురించి షారుక్ మాట్లాడుతూ ‘ముఫాసాకు అద్భుతమైన వారసత్వం ఉంది. అడవికి అతడే రారాజుగా నిలుస్తాడు. ఒక తండ్రిగా ఆ పాత్ర నా మనసుకు చేరువైంది. బాల్యం నుంచి రాజుగా ఎదగడం వరకూ ముఫాసా జీవితం ఎలా సాగిందనే విషయాన్ని ఈ సినిమా తెలియజేస్తుంది. 2019లో వచ్చిన ది లయన్ కింగ్ తర్వాత మరోసారి ఈ పాత్ర కోసం వర్క్ చేయడం ప్రత్యేకంగా ఉంది. మరీ ముఖ్యంగా నా పిల్లలతో కలిసి వర్క్ చేయడం ఆనందంగా అనిపిస్తోంది’ అని అన్నారు. కాగా, ముఫాసా చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీషుతో పాటు తమిళంలోనూ భారీగా రిలీజ్ చేయనున్నారు.
https://www.youtube.com/watch?v=oelsxH0orHI
మహేష్కు డబ్బింగ్ కొత్త కాదు.. కానీ!
ముఫాస పాత్రకు డబ్బింగ్ చెప్పడం మహేష్ బాబుకు ఇదే తొలిసారి కాదు. ఆయన గతంలో రెండు చిత్రాలకు తన వాయిస్ అందించారు. పవన్ కల్యాణ్ నటించిన 'జల్సా', తారక్ హీరోగా చేసిన 'బాద్షా' చిత్రాలకు బ్యాక్గ్రౌండ్లో మహేష్ తన వాయిస్ను ఇచ్చారు. అయితే అవి ఒక పాత్రకు చెప్పినవి కాదు. పాత్రను ఎలివేట్ చేసే క్రమంలో మహేష్ వాయిస్ ఇచ్చారు. అయితే మహేష్ ఒక పాత్రకు పూర్తిగా డబ్బింగ్ చెప్పడం ఇదే తొలిసారి. మరి తన వాయిస్తో ఏమేరకు ప్రేక్షకులను మహేష్ ఆకట్టుకుంటారో చూడాలి.
'SSMB29'తో బిజీ బిజీ
దర్శక ధీరుడు రాజమౌళితో ఓ అడ్వెంచరస్ యాక్షన్ మూవీని మహేష్ చేయబోతున్నాడు. ఇందులో మహేష్ కొత్త లుక్లో కనిపించబోతున్నాడు. ఇందుకోసం లాంగ్ హెయిర్, గడ్డంతో మహేష్ మేకోవర్ అవుతున్నాడు. త్వరలోనే మహేష్బాబు, రాజమౌళి మూవీ ఆఫీషియల్గా లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం పలువురు హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేయబోతున్నట్లు సమాచారం.
ఆగస్టు 26 , 2024

Mahesh Babu Voice To Mufasa: మహేష్ గొంతుతో గర్జించనున్న హాలీవుడ్ సింహాం ‘ముఫాసా’..!
టాలీవుడ్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు వరుసలో ఉంటాడు. దర్శకధీరుడు రాజమౌళితో అతడి తర్వాతి ప్రాజెక్ట్ ఉండటంతో ‘SSMB29’పై ఇప్పటినుంచే భారీ అంచనాలు మెుదలయ్యాయి. అయితే రాజమౌళితో సినిమా అంటే అది ఏ స్థాయిలో ఉంటుందో, ఎంత టైమ్ తీసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఇప్పట్లో మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్ను చూడలేమన్న బాధలో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్కు మహేష్ బాబు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. ఓ హాలీవుడ్ మూవీ తెలుగు వెర్షన్కు వాయిస్ ఓవర్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
సింహానికి మహేష్ డబ్బింగ్
ప్రముఖ హాలీవుడ్ నిర్మాణసంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King) ఒకటి. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాను ఇండియాలో భారీగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ నటులతో ముఫాసా అనే సింహం పాత్రకు డబ్బింగ్ చెప్పించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో తాజాగా డిస్నీ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఇందులో ముఫాసా పాత్ర తెలుగు వెర్షన్కు స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) డబ్బింగ్ చెప్పనున్నట్లు తెలిపింది. దీని తెలుగు ట్రైలర్ ఈనెల 26న ఉదయం 11. 07 గంటలకు విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఆ ట్రైలర్ కోసం మహేష్ ఫ్యాన్స్తో పాటు సినీ లవర్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
https://twitter.com/taran_adarsh/status/1826142693149327810
డబ్బింగ్పై మహేష్ ఏమన్నారంటే?
‘ముఫాసా: ది లయన్ కింగ్’ యానిమేషన్ చిత్రంలో మెయిన్ లీడ్కు డబ్బింగ్ చెప్పడంపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించాడు. ‘డిస్నీ అంటే నాకెంతో గౌరవం. ముఫాసా తన కుమారుడిని నడిపించే తండ్రిగానే కాకుండా అడవికి గొప్ప రాజుగా అందరినీ ఆకర్షిస్తాడు. డిస్నీతో కలిసి వర్క్ చేయడం నాకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమైనది. దీన్ని నా పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తాను. డిసెంబర్ 20న తెలుగులో ‘ముఫాసా: ది లయన్ కింగ్’ను బిగ్ స్క్రీన్పై నా కుటుంబంతో, అభిమానులతో కలిసి చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ ఆనందం వ్యక్తంచేశారు. కాగా ఈ మూవీలో ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్ తదితరులు నటిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.
హిందీలో డబ్బింగ్ ఎవరంటే?
‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King) హిందీ వెర్షన్ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఇందులో చిట్టి ముఫాసా పాత్రకు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) కుమారుడు అబ్రం (Abraham) వాయిస్ అందించారు. ఇదే చిత్రంలో ముఫాసా (పెద్దయ్యాక) పాత్రకు షారుక్ ఖాన్, సింబా పాత్రకు షారుక్ పెద్ద తనయుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) వాయిస్ ఇవ్వడం విశేషం. తన పిల్లలతో కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేయడంపై షారుక్ ఇటీవల ఆనందం వ్యక్తం చేశారు. ‘ముఫాసా' తనకు ఎంతో ప్రత్యేకమైనదని చెప్పుకొచ్చారు. కాగా, ముఫాసా చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీషుతో పాటు తమిళంలోనూ భారీగా రిలీజ్ చేయనున్నారు.
https://www.youtube.com/watch?v=oelsxH0orHI
మహేష్కు డబ్బింగ్ కొత్త కాదు.. కానీ!
ముఫాస పాత్రకు డబ్బింగ్ చెప్పడం మహేష్ బాబుకు ఇదే తొలిసారి కాదు. ఆయన గతంలో రెండు చిత్రాలకు తన వాయిస్ అందించారు. పవన్ కల్యాణ్ నటించిన 'జల్సా', తారక్ హీరోగా చేసిన 'బాద్షా' చిత్రాలకు బ్యాక్గ్రౌండ్లో మహేష్ తన వాయిస్ను ఇచ్చారు. అయితే అవి ఒక పాత్రకు చెప్పినవి కాదు. పాత్రను ఎలివేట్ చేసే క్రమంలో మహేష్ వాయిస్ ఇచ్చారు. అయితే మహేష్ ఒక పాత్రకు పూర్తిగా డబ్బింగ్ చెప్పడం ఇదే తొలిసారి. మరి తన వాయిస్తో ఏమేరకు ప్రేక్షకులను మహేష్ ఆకట్టుకుంటారో చూడాలి.
ఆగస్టు 21 , 2024

New Telugu Movies on OTT: థియేటర్లలో సందడంతా చిన్న చిత్రాలదే.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న బిగ్ ఫిల్మ్!
'కల్కి 2898 ఏడీ', 'భారతీయుడు 2' తర్వాత టాలీవుడ్లో చిన్న సినిమాల హవా మళ్లీ మెుదలైంది. గత వారం లాగే ఆగస్టు సెకండ్ వీక్లోనూ చిన్న హీరోల సినిమాలే విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలో ఆసక్తికర చిత్రాలు, వెబ్ సిరీస్లు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.
థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు
కమిటీ కుర్రోళ్ళు
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన తాజా చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu). సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషించారు. సాయికుమార్, గోపరాజు రమణ ఇతర ముఖ్య రోల్స్లో కనిపించనున్నారు. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. యూత్ను ఆకట్టుకునే ఎన్నో అంశాలు ఈ చిత్రంలో ఉంటాయని చిత్ర బృందం తెలిపింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి.
సింబా
జగపతిబాబు (Jagapathi Babu), అనసూయ (Anasuya Bharadwaj) కీలక పాత్రల్లో మురళీ మనోహర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సింబా’ (Simbaa). సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ఈ సినిమా రూపొందింది. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది, దాసరి రాజేందర్రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రకృతిని నాశనం చేస్తే, పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటాయో ఆగస్టు 9న థియేటర్లలో చూడబోతున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది.
తుఫాన్
‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోని హీరోగా రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘తుఫాన్’ (Toofan Movie 2024). విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు. కమల్ బోరా, డి.లలిత, బి.ప్రదీప్, పంకజ్ బోరా సంయుక్తంగా నిర్మించారు. ఆగస్టు 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవానికి ఆగస్టు 2న ఈ మూవీ విడుదల కావాల్సి ఉంది. అనివార్య కారణాలతో వాయిదా పడి ఈ వీక్ థియేటర్లలోకి రాబోతోంది.
భవనమ్
సప్తగిరి (Sapthagiri), ధనరాజ్ (Dhanraj), షకలక శంకర్ (Shakalaka Shankar), అజయ్ (Ajay), మాళవిక సతీషన్, స్నేహ ఉల్లాల్ ప్రధాన పాత్రలు పోషించిన ‘భవనమ్’ (Bhavanam) చిత్రం కూడా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలాచారి కూరెళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 9న థియేటర్లలో విడుదల కానుంది. సూపర్ గుడ్ ఫిలింస్ సమర్పణలో ఆర్.బి.చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర సీర్వి ఈ చిత్రాన్ని నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలకు, వినోదాన్ని జోడించి ఈ సినిమాను తీసుకొస్తున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, వెబ్సిరీస్లు
భారతీయుడు 2
కమల్ హాసన్ (Kamal Hassan), శంకర్ (Director Shankar) కాంబోలో రూపొందిన 'భారతీయుడు 2' (Bharateeyudu 2) చిత్రం ఈ వారమే ఓటీటీలోకి రానుంది. నెట్ఫ్లిక్స్ వేదికగా ఆగస్టు 9 నుంచి స్ట్రీమింగ్లోకి రానుంది. తమిళం, తెలుగు, మలయాళం కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. జులై 12 థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్గా నిలిచింది. అంతేకాకుండా పలు విమర్శలను సైతం మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ఓటీటీ ప్రేక్షకులను 'భారతీయుడు 2' ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateKingsman Golden CircleMovieEnglishNetflixAugust 9The Umbrella AcademySeriesEnglishNetflixAugust 8Bharateeyudu 2MovieTeluguNetflixAugust 9Phir Aaye Haseena DilrubaMovieHindiNetflixAugust 9Romance In the HiceMovieKorean/EnglishNetflixAugust 10TurboMovieTelugu/MalayalamSonyLIVAugust 9Bheema : Andhkaar se Adhikaar TakMovieHindiZee 5August 5Amar SanghiMovieBengaliZee 5August 5Gaharah GaharahMovieHindiZee 5August 9ManorathangalSeriesTelugu DubZee 5August 15The Zone : Survival MissionMovieKorean/EnglishHotstarAugust 7AAAMovieHindiHotstarAugust 8Are You SureMovieKorean/EnglishHotstarAugust 8Life Hill GayeeMovieHindiHotstarAugust 9Darling MovieTeluguHotstarAugust 13Veeranjaneyulu Vihara YatraMovieTeluguETV WinAugust 14
ఆగస్టు 05 , 2024

Anasuya Bharadwaj: 'ఇంత చేతగాని వాళ్లలాగా ఉంటే ఎలా'.. అనసూయ భరద్వాజ్ పోస్ట్ వైరల్!
బుల్లితెర యాంకర్, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ షో ద్వారా కెరీర్ ప్రారంభించిన అనసూయ ‘రంగస్థలం’, ‘పుష్ప’ వంటి చిత్రాలతో స్టార్ నటిగా మారిపోయింది. అయితే గత కొంతలంగా అనసూయ ఏమాట్లాడిన నెటిజన్లు ఆమెను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అనసూయ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వాటికి సోషల్ మీడియా వేదికగా పలుమార్లు దీటుగా సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా మరోమారు అనసూయ ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడింది. ఓ హీరో ఫ్యాన్స్ను టార్గెట్ చేస్తూ పోస్టు పెట్టారు. ప్రస్తుతం అది హాట్ టాపిక్గా మారింది.
అనసూయ షాకింగ్ పోస్టు
బుల్లితెరపై ప్రయాణం ప్రారంభించి వెండి తెరపై ఓ వెలుగు వెలుగుతున్న అనసూయ మరోమారు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. తాజాగా ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టిన అనసూయ కొందరిని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో మండిపడింది. ‘మరీ ఇంత చేతకానివాళ్లలా ఉంటే ఎలా? నేను ఏం మాట్లాడినా అది ట్రోల్స్ చేస్తుంటారు. ఆ టాపిక్ గురించే మాట్లాడుతారు. మీకు దమ్ముంటే వారిపైన చూపించండి. నా మీద కాదు. కానీ, మీరు అలా చేయరు కదా. ఎందుకంటే మీకు అది చేతకాదు. మీ హీరోలా ఆడవారిని ఉద్దేశించి గొడవ పడటం మాత్రమే వచ్చు కదా పాపం. మీరంతా త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా’ అంటూ రాసుకొచ్చింది. అయితే ఈ పోస్టుకు ఎవరినీ ట్యాగ్ చేయకపోవడంతో ఈ పోస్టుపై గందరగోళం ఏర్పడింది. ఆమె ఎవరినీ టార్గెట్ చేసి అన్నారో తెలియక నెటిజన్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు.
https://twitter.com/anusuyakhasba/status/1816155138421317791
విజయ్ దేవరకొండను ఉద్దేశించేనా?
అనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'సింబా'. సంపత్ నంది అందించిన కథకు మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. అయితే బుధవారం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా చిత్ర యూనిట్తో పాటు అనసూయ పాల్గొంది. ఈ సందర్భంగా ట్రైలర్లోని ఓ సీన్పై జర్నలిస్టులు అనసూయను ప్రశ్నించారు. అలాగే విజయ్ దేవరకొండతో గొడవ గురించి ప్రస్తావన వచ్చింది. దీనిపై మాట్లాడిన అనసూయ తనకు విజయ్కు మధ్య పెద్దగా గొడవలు లేవని, స్టేజ్ మ్యానర్స్ గురించే ఆ రోజు తాను మాట్లాడాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. లైమ్ టైల్లో ఉన్నప్పుడు పద్దతిగా ఉండాలని మాత్రమే చెప్పానని అంతకు మించి ఎవరి మీద తనకు వ్యక్తిగతంగా ఎటువంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలో ఇలా ఫైర్ అవుతూ పోస్టులు పెట్టడం షాక్కు గురిచేస్తోంది. ఇది విజయ్ దేవరకొండను ఉద్దేశించి పెట్టిన పోస్టు అన్న అనుమానం ఇండస్ట్రీ వర్గాల్లో కలుగుతోంది.
గతంలోనూ ఇలాగే..
అనసూయ ఈ తరహా అగ్రెసివ్ పోస్టులు పెట్టడం ఇదే తొలిసారి కాదు. తనను ఆంటీ అన్న నెటిజన్లపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ గతంలో చాలానే పోస్టులు పెట్టారు. ఆంటీ అని పిలిస్తే ఎందుకు కోపం వస్తుందని గతంలో ఓ నెటిజన్ ప్రశ్నించగా, కొందరు మాటల్లో అర్థాలు వేరుంటాయని ఆమె చెప్పుకొచ్చింది. మరో సందర్భంలో ఇన్స్టాగ్రామ్లో ఘాటైన క్యాప్షన్ పెట్టి అందరినీ షాక్ గురిచేసింది. తన గ్లామరస్ ఫోటోలోను షేర్ చేస్తూ హాట్ క్యాప్షన్ ఇచ్చింది. 'నేను మహిళని , భయం లేదు, సెక్సీగా ఉంటాను, అజేయురాలిని, సృజనాత్మకత కలిగిన మహిళని, మీకు ఏమైనా నేర్పించగలను.. నేను మిమ్మల్ని ప్రేమించగలను' అంటూ రాసుకొచ్చింది. ఇలా అనసూయ పెట్టే పోస్టులు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారడం గత కొంతకాలంగా కామన్గా మారిపోయింది.
View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)
అనసూయ ప్రస్థానం
జబర్దస్త్ షో ద్వారా అనసూయ తొలిసారి బుల్లితెరకు పరిచయమైంది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి కుర్రకారును తన మాయలో పడేసింది. కేవలం యాంకర్గానే గాక గ్లామర్ బ్యూటీగానూ పేరు తెచ్చుకుంది. తద్వారా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. తెలుగులో సోగ్గాడే చిన్ని నాయన (Soggade Chinni Nayana), క్షణం (Kshanam), విన్నర్ (Winner), గాయత్రి (Gayathri) సినిమాల్లో అనసూయ నటించింది. క్షణం చిత్రంలో ఆమె పోషించిన ప్రతినాయక పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. రంగస్థలం (Rangasthalam) సినిమా అనసూయ కెరీర్ను మలుపు తిప్పింది. ఇందులో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించింది. రంగస్థలం తర్వాత వరుస సినిమా ఆఫర్లు అనసూయను చుట్టుముట్టాయి. మీకు మాత్రమే చెప్తా, కథనం, F2, చావు కబురు చల్లగా, థ్యాంక్ యూ బ్రదర్, కిలాడీ, వాంటెడ్ పండుగాడు సినిమాల్లో అనసూయ మెరిసింది. సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ (Pushpa) సినిమాలోనూ అనసూయ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. ఇందులో దాక్షయణి పాత్ర పోషించి అలరించింది. రీసెంట్గా ‘రజాకార్’ చిత్రంలో పోచమ్మ పాత్రలో కనిపించి అనసూయ అందర్నీ అలరించింది. ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాతో పాటు తమిళంలో ఫ్లాష్ బ్యాక్ మూవీలో అనసూయ నటిస్తోంది.
జూలై 25 , 2024

Gaami Symbol: ‘గామి’ ట్రైలర్లో ఆ మిస్టరీ సింబల్ను గమనించారా?.. దాని వెనక ఇంత కథ ఉందా!
విష్వక్సేన్ (Vishwak Sen) కథానాయకుడిగా విద్యాధర్ కాగిత (Vidyadhar Kagita) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గామి’ (Gaami). వి సెల్యులాయిడ్ పతాకంపై కార్తీక్ శబరీష్ నిర్మించారు. చాందిని చౌదరి కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ టాలీవుడ్ను ఓ కుదుపు కుదిపింది. హాలీవుడ్ స్థాయిలో ఉన్న విజువల్స్ ట్రీట్ను చూసి ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఒక్క ట్రైలర్తోనే ఈ సినిమా టాలీవుడ్ అటెంషన్ మెుత్తాన్ని తన వైపునకు తిప్పుకుంది. ఇదిలా ఉంటే గామి ట్రైలర్లో చూపించిన ఓ సింబల్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ సింబల్కు, కథకు ఏమైనా సంబంధం ఉందా? అన్న ప్రశ్న ప్రతీ ఒక్కరిలోనూ మెుదలైంది. ఇంతకి ఆ సింబల్ ఏంటి? దానిపై నెటిజన్లు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు? ఈ కథనంలో చూద్దాం.
అసలేంటి ఆ సింబల్?
గామి ట్రైలర్ను గమనిస్తే మూడు ఆకులు ఒకదానికొకటి లింకప్ అయ్యి ఉన్న సింబల్ చాలా చోట్ల కనిపించింది. ట్రైలర్లో మానవ ప్రయోగాలు జరుగుతున్న ప్రాంతంలో ఈ సింబల్ను ప్రధానంగా చూడవచ్చు. అక్కడ బందీలుగా ఉన్న వ్యక్తుల శరీరాలపై కూడా ఇదే సింబల్ ముద్రించి ఉండటం గమనార్హం. తల వెనక భాగంలో మెడ కింద ఈ సింబల్ను మీరు చూడవచ్చు. మరోవైపు విశ్వక్ సేన్ కూడా హిమాలయ యాత్రకు బయలుదేరినప్పుడు మంచులో ఈ సింబల్ను రాసి దాని ముందు పెద్దగా అరవడం ట్రైలర్లో చూడవచ్చు. అంటే హ్యూమన్ ట్రైల్స్కు, అఘోర శంకర్ (విష్వక్ సేన్)కు ఏదో సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ఆ తరహా సింబల్ను వాడుక భాషలో ‘ట్రైక్యూట్రా’ అంటారు. అటువంటి ఈ సింబల్కు తీసుకొని డైరెక్టర్ విద్యాధర్.. కథలో ఎలాంటి నిర్వచనం చెప్తారో చూడాలి.
భూత- భవిష్యత్- వర్తమాన కాలంలో కథ సాగుతుందా?
‘గామి’ ట్రైలర్ను మరింత నిశితంగా పరిశీలిస్తే ఈ సినిమా.. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరిగిన సంఘటనల చుట్టూ తిరుగుతుందని అనిపిస్తోంది. ట్రైలర్లో.. 'వాళ్ల గాయాలకు నువ్వు బాధలు మోస్తున్నావ్' అంటూ ఓ అఘోరా అనడం ఇందుకు బలం చేకూరుస్తోంది. ఆ మానవ ప్రయోగాలకు హీరో శంకర్కు కచ్చితంగా ఏదో సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. శంకర్ గతంలో ఆ హ్యూమన్ ట్రైల్స్లో బాధితుడి అయి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆ చెర నుంచి తప్పించుకొని ఆ ప్రయోగాల తాలుకూ స్పర్శ సమస్య ఎదుర్కొంటూ ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. దీని బట్టి కథ శంకర్ బాల్యంలో జరిగిన మానవ ప్రయోగాలు.. తన సమస్య పరిష్కారం కోసం భవిష్యత్లో చేస్తున్న హిమాలయ యాత్ర చూపిస్తూ పార్లర్గా కథ సాగవచ్చని అంచనా.
దేవదాసితో శంకర్కు ఉన్న సంబంధం?
అఘోరా శంకర్కు.. దేవదాసికి మధ్య గల సంబంధంపై ట్రైలర్లో ఎలాంటి క్లూస్ డైరెక్టర్ ఇవ్వలేదు. రెండు పాత్రలను విభిన్న పరిస్థితుల్లో చూపించారు. దేవదాసి బిడ్డను కనడం.. ఆమెను ఊరివారు తరిమేయడం.. ఊరికి అరిష్టమని తెలిసి తిరిగి ఆమె కోసం వెతకడం వంటి దృశ్యాలు ట్రైలర్లో కనిపించాయి. ఒకవేళ దేవదాసి కూతురికి హీరోయిన్ చాందిని పాత్రకు సంబంధం ఉండే చాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చాందిని పాత్ర అఘోర శంకర్కు సాయం చేయడం వెనుక కూడా ఓ బలమైన కారణం ఉండవచ్చని అంటున్నారు. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే మార్చి 8 వరకూ ఆగాల్సిందే.
గామి టీమ్పై రాజమౌళి ప్రశంసలు
ఇక ‘గామి’ ట్రైలర్పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు మూవీ టీమ్ కృషిని అభినందిస్తూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) సైతం దీనిపై ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. ‘కఠోరమైన కృషి ఉంటే అసాధ్యమైన కలలు సాకారమవుతాయి. ‘గామి’ గురించి దర్శకుడు, నిర్మాత ఎంత కష్టపడ్డారో నాతో చెప్పినప్పుడు ఈ మాట గుర్తొచ్చింది. ఇందులోని విజువల్స్ చూస్తే నాలుగేళ్ల నుంచి వాళ్లు ఎంత కష్టపడ్డారో అర్థమైంది’ అంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
మార్చి 06 , 2024

Pushpa Pushpa Song: అల్లు అర్జున్ చేతిలో పవన్ కల్యాణ్ పార్టీ సింబల్!
తెలుగు చిత్ర పరిశ్రమలో పుష్ప (Pushpa) సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రంతో అల్లు అర్జున్ (Allu Arjun) ప్యాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. జాతీయ ఉత్తమ నటుడు పురస్కారంతో పాటు గ్లోబల్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. అటు హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna)కు కూడా ‘పుష్ప’తో మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు.
పవర్ఫుల్ టైటిల్ సాంగ్!
పుష్ప చిత్రం సూపర్ సక్సెక్ కావడంతో త్వరలో రానున్న ఈ సినిమా సీక్వెల్పై అందరి దృష్టి పడింది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ టైటిల్ సాంగ్కు సంబంధించిన లిరికల్ వీడియోను రిలీజ్ చేసి ఫ్యాన్స్కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. పుష్పలో టైటిల్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అదే రేంజ్లో ఈ సాంగ్ను రూపొందించారు. 'పుష్ప.. పుష్ప.. పుష్ప., పుష్ప రాజ్' అంటూ సాగే ఈ పాటకు చంద్రబోస్ అద్భుతమైన లిరిక్స్ను అందించారు. బన్నీ పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఈ లిరిక్స్ ద్వారా చెప్పకనే చెప్పారు. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్తో ఈ సాంగ్ చాలా క్యాచీగా మారిపోయింది.
https://youtu.be/EdvydlHCViY?si=JqZTyOOLXxhGR8nr
గాజు గ్లాస్తో స్టెప్పులు
పుష్ప 2 నుంచి రిలీజైన ఫస్ట్ లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఇందులో అల్లుఅర్జున్ తన స్టెప్పులతో అదరకొట్టాడు. ముఖ్యంగా సింగిల్ లెగ్పై వేసే హుక్ స్టెప్ ట్రెండ్ సెట్ చేసేలా కనిపిస్తోంది. కుడి కాలి చెప్పు విప్పి కాలిని ఎడమ కాలు మోకాలికి దిగువున పెట్టి వెసే స్వింగ్ స్టెప్ ఫ్యాన్స్ విపరీతంగా ఆకర్షించే అవకాశముంది. అంతేకాదు వీడియో చివర్లో గాజు గ్లాస్ చేతిలో పట్టుకుని వేసే మూమెంట్స్ కూడా అదరహో అనిపిస్తున్నాయి. జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాస్తో కావాలనే ఈ స్టెప్స్ క్రియేట్ చేశారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనా పుష్ప 2 నుంచి వచ్చిన ఫస్ట్ లిరికల్ సాంగ్ మాత్రం సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేలానే ఉంది.
రిలీజ్ ఎప్పుడంటే?
పుష్ప 2: ది రూల్ సినిమా.. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదలవుతుంది. ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. నార్త్ ఇండియా హిందీ హక్కుల్లోనూ ఇప్పటికే ఈ మూవీ రికార్డు సృష్టించింది. బాలీవుడ్ చిత్రాలను వెనక్కి తోసింది. కాగా, ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్, జగపతిబాబు, సునీల్, అనసూయ, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మే 01 , 2024

Mathu Vadalara 2 Movie Review: కమెడియన్ సత్య వన్ మ్యాన్ షో.. ‘మత్తు వదలరా 2’ ఎలా ఉందంటే?
నటీనటులు : శ్రీ సింహా, సత్య, ఫరియా అబ్దుల్లా, సునీల్, వెన్నెల కిషోర్, రోహిణి తదితరులు
రచన, దర్శకత్వం : రితేష్ రానా
సంగీతం : కాల భైరవ
సినిమాటోగ్రాఫర్ : సురేష్ సారంగం
ఎడిటర్: కార్తిక శ్రీనివాస్
నిర్మాత : చిరంజీవి (చెర్రీ)
విడుదల తేదీ: సెప్టెంబర్ 13, 2024
శ్రీసింహా (Sri Simha) హీరోగా దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), సత్య, వెన్నెల కిషోర్, రోహిణి, సునీల్ కీలక పాత్రలు పోషించారు. హీరో ప్రభాస్ తాజాగా సినిమా ట్రైలర్ లాంచ్ చేయడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ అంచనాలను పెంచేసింది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్ను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
బాబు (శ్రీ సింహా), యేసుబాబు (సత్య) డెలివరీ బాయ్స్గా పనిచేస్తుంటారు. చాలిచాలని జీతంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. దీంతో డబ్బులు సరిపోకా వారు స్పెషల్ ఏజెంట్స్గా మారతారు. ఓ కేసు విషయంలో చేసిన చిన్న పొరపాటు కారణంగా చిక్కుల్లో పడతారు. ఇంతకీ ఏంటా కేసు? వారు చేసిన పొరపాటు ఏంటి? దాని నుంచి ఎలా బయటపడ్డారు? అండర్ కవర్ ఏజెంట్ నిధి (ఫరియా అబ్దుల్లా) వారికి ఎలా సాయపడింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. (Mathu Vadalara 2 Movie Review)
ఎవరెలా చేశారంటే
హీరోగా శ్రీ సింహా మంచి నటన కనబరిచాడు. కామెడీ, యాక్షన్ సీక్వెన్స్లో ఆకట్టుకున్నాడు. అయితే ప్రతీ సీన్లో సత్య పక్కన ఉండటంతో అతడే హైలెట్ అయ్యాడు. ఈ సినిమాకు సత్యనే మెయిన్ హీరో అని చెప్పవచ్చు. తన పంచ్ డైలాగ్స్తో, కామెడీ టైమింగ్తో సత్య అదరగొట్టాడు. ముఖ్యంగా అతడి ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ‘సెక్సీ సైరన్’ అంటూ సినిమాలో అతడు చేసే హంగామా బాగా వర్కౌట్ అయ్యింది. హీరోయిన్ ఫరియా అబ్దుల్లాకు ఇందులో మంచి రోల్ దక్కింది. చిట్టి పాత్ర తర్వాత ఆ స్థాయిలో ఈ రోల్ గుర్తుండిపోతుంది. అటు వెన్నెల కిషోర్ సైతం తనదైన కామెడీతో గిలిగింతలు పెట్టారు. సునీల్, రోహిణి తదితర ముఖ్య తారాగారణం తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. ఇతర నటీనటులు కూడా పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు రితేశ్ రాణా కథలన్నీ కూడా సింపుల్గా డ్రగ్స్, గన్స్, డబ్బు చుట్టూనే తిరుగుతుంటాయి. ఈసారి కూడా దర్శకుడు అలాంటి స్టోరీనే ఎంచుకున్నారు. ఒక కిడ్నాపింగ్ డ్రామాకు హాస్యాన్ని జోడించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంతో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి, పవన్కళ్యాణ్, బాలకృష్ణ, మహేష్బాబుతో పాటు పలువురు స్టార్ హీరోలను రిఫరెన్స్లుగా తీసుకోవడం బాగా కలిసొచ్చింది. శ్రీ సింహా, సత్య పాత్రలను చాలా ఎంటర్టైనింగ్గా తీర్చిదిద్దడం మెప్పిస్తుంది. అలాగే తెరపై కనిపించే ప్రతీ క్యారెక్టర్ కొత్తగా, చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ప్రథమార్థం మెుత్తాన్ని ఫన్ రైడ్గా నడిపించిన దర్శకుడు ద్వితియార్థంకు వచ్చేసరికి కాస్త తడబడ్డాడు. సెకండాఫ్లోని కొన్ని సీన్స్లో ల్యాగ్ ఎక్కువైనట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా ప్రిడిక్టబుల్గా ఉండటం మైనస్గా చెప్పవచ్చు.
టెక్నికల్గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే కాల భైరవ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది. చాలా సన్నివేశాలను బీజీఎం బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టాల్సింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
శ్రీ సింహా, సత్య కామెడీ నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
అక్కడక్కడ సాగదీత సీన్స్ప్రిడిక్టబుల్ క్లైమాక్స్
Telugu.yousay.tv Rating : 3/5
సెప్టెంబర్ 13 , 2024

Razakar Movie Review: రజాకార్ల అకృత్యాలను కళ్లకు కట్టిన డైరెక్టర్.. సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు: బాబీ సింహా, వేదిక, అనసూయ, ఇంద్రజ, ప్రేమ, మకరంద్ దేశ్ పాండే, రాజ్ అర్జున్, తేజ్ సప్రు, జాన్ విజయ్, దేవీ ప్రసాద్ తదితరులు
రచన, దర్శకత్వం: యాట సత్యనారాయణ
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఛాయాగ్రహణం: కె.రమేష్ రెడ్డి
ఎడిటింగ్ : తమ్మిరాజు
నిర్మాత: గూడూరు నారాయణ రెడ్డి
విడుదల తేదీ: 15-03-2024
తెలంగాణ విముక్తి పోరాటం నేపథ్యంలో సాగే చారిత్రక కథాంశంతో రూపొందిన చిత్రం ‘రజాకార్’ (Razakar). బాబీ సింహా, వేదిక, అనసూయ, ఇంద్రజ, ప్రేమ ప్రధాన పాత్రలు పోషించారు. రాజకీయంగా ఎన్నో వివాదాలకు కారణమైన ఈ చిత్రం.. పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చింది. ఎన్నో అడ్డంకుల్ని దాటుకొని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలంగాణ పోరాట యోధుల గాథను ఎలా చూపించారు? వివాదాస్పదమైన అంశాలు ఏమైనా ఉన్నాయా? అన్నది ఇప్పుడు చూద్దాం.
కథ
దేశంలో అతిపెద్ద సంస్థానమైన హైదరాబాద్ (నైజాం)ని భారత్లో విలీనం చేయడానికి నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీఖాన్ (మకరంద్ పాండే) ఇష్టపడడు. నైజాం సంస్థానాన్ని తుర్కిస్తాన్గా మార్చి ఓ ప్రత్యేక దేశంగా పాలించాలని ప్రయత్నిస్తాడు. ఇందుకోసం ఖాసీం రజ్వీ(రాజ్ అర్జున్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రజాకార్ల వ్యవస్థను ఉపయోగించుకుంటాడు. బలవంతపు మత మార్పిడి కోసం ఖాసీం రజ్వీ ప్రజలను అతి దారుణంగా హింసిస్తాడు. ఈ క్రమంలో ఐలమ్మ (ఇంద్రజ), గూడూరు సూర్య నారాయణ, రాజి రెడ్డి (బాబీ సింహా) రజాకార్లకు వ్యతిరేకంగా ఎలాంటి పోరాటం చేశారు? ఈ సమస్యను కేంద్ర హోమంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ (తేజ్ సప్రు) ఎలా పరిష్కరించారు? రజాకార్లు చేసిన అరాచకాలు ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
ఈ సినిమాలో కనిపించినా ప్రతీ పాత్ర కీలకమే. ఫలానా పాత్రే ప్రధానమైనదని చెప్పడానికి వీల్లేదు. ఒక్కో ఎపిసోడ్కు ఒక్కో పాత్ర హీరోగా నిలిచింది. చాకలి ఐలమ్మగా ఇంద్రజ, రాజిరెడ్డిగా బాబీ సింహా, శాంతవ్వగా వేదిక, నిజాం రాజుగా మకరంద్ దేశ్ పాండే, సర్దార్ వల్లభభాయ్ పటేల్గా రాజ్ సప్రు, ఖాసీం రిజ్వీగా రాజ్ అర్జున్, లాయక్గా జాన్ విజయ్... ఇలా ప్రతిఒక్కరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అద్భుతమైన నటనతో అదరగొట్టారు. ముఖ్యంగా ఖాసీం రిజ్వీ పాత్రలో రాజ్ అర్జున్ కనబర్చిన నటన.. పలికించిన హావభావాలు.. సంభాషణలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. జాన్ విజయ్, తలైవసల్ విజయ్, అరవ్ చౌదరి, మహేష్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు యాట సత్యనారాయణ.. తాను రాసుకున్న కథను యథాతథంగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని ఎపిసోడ్స్ చాలా బాగా చూపించారు. కాకపోతే కథాంశం సాగిన తీరు ఓ వర్గం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు. ప్రథమార్ధంలో ఎక్కువగా రజాకర్ల అకృత్యాలను చూపిస్తే.. ద్వితీయార్ధంలో వారికి ఎదురుతిరిగిన ప్రజల పోరాట స్ఫూర్తిని కళ్లకు కట్టారు. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి కొత్త పాత్రని తెరపైకి తీసుకురావడం.. వారికి ఇచ్చిన ఎలివేషన్.. యాక్షన్ సీన్స్ ఇవన్నీ ఆకట్టుకుంటాయి. వెయ్యి ఉరిల మర్రి చరిత్ర, పరకాల హింసకాండ, బైరాన్పల్లి మారణహోమం లాంటి సన్నివేశాలు హృదయాలకు హత్తుకునేలా తెరకెక్కించారు. సర్ధార్ పటేల్.. ఖాసీం రిజ్వీకి ఇచ్చే వార్నింగ్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్గా నిలుస్తుంది. ఇక పతాక సన్నివేశాలు భారత ప్రభుత్వం చేపట్టే పోలీస్ చర్యతో సాగుతాయి. అయితే ఈ ఎపిసోడ్ను డైరెక్టర్ మరింత ఆసక్తికరంగా తెరకెక్కించి ఉంటే బాగుండేది.
సాంకేతికంగా
సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం భీమ్స్ సిసిరోలియో సంగీతం. తనదైన నేపథ్య సంగీతంతో అతడు అదరగొట్టేశాడు. పాటలు అద్భుతంగా ఉన్నాయి. కథలో భాగంగానే సాంగ్స్ వస్తుంటాయి. బతుకమ్మ పాటతో పాటు చివర్లో వచ్చే జోహార్లు సాంగ్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. తమ్మిరాజు ఎడిటింగ్కు వంకపెట్టనక్కర్లేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
ప్రధాన పాత్రల నటనప్రజా పోరాట ఘట్టాలుసంగీతం
మైనస్ పాయింట్స్
మితిమీరిన హింసతెలిసిన కథ కావడం..
Telugu.yousay.tv Rating : 3/5
మార్చి 15 , 2024

REVIEW: కోనసీమ థగ్స్
దుల్కర్ సల్మాన్ ‘హే సినామిక’తో దర్శకురాలిగా మారిన కొరియోగ్రాఫర్ బృందా రెండో చిత్రం ‘కోనసీమ థగ్స్’. బాబీ సింహా కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్, టీజర్లు సినిమాపై ఆసక్తి పెంచాయి. ప్రముఖ బ్యానర్ మైత్రీ ఈ సినిమాను థియేటర్లలో ఇవాళ(24 Feb) విడుదల చేసింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందా? ట్రైలర్లో ఉన్న ఇంటెన్సిటీ సినిమాలోనూ ఉందా? రివ్యూలో చూద్దాం.
చిత్రబృందం:
దర్శకత్వం: బృందా గోపాల్
సంగీతం: సామ్ CS
నటీనటులు: హ్రిదు హరూన్, అనస్వర రాజన్, బాబీ సింహా తదితరులు
ఎడిటర్: ప్రవీణ్ ఆంటోనీ
సినిమాటోగ్రఫీ: ప్రియేష్ గురుస్వామి
కథ:
శేషు( హ్రిదు హరూన్) అనుకోని పరిస్థితుల్లో జైలుకు వెళ్తాడు. అక్కడ దొర( బాబీ సింహా), మధు అనే ఇద్దరిని కలుసుకుంటాడు. వీరు ముగ్గురు జైలు నుంచి తప్పించుకోవాలని పథకం వేస్తారు. శేషు అసలు జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. శేషు జైలుకు వెళ్లేందుకు కారణమైన పెద్దిరెడ్డి కథేంటి?. దొర ఎవరు? వీరు జైలు నుంచి విజయవంతంగా తప్పించుకున్నారా? అనేదే కథ.
ఎలా ఉందంటే:
దర్శకురాలు బృందా మంచి కథను ఎంచుకున్నారు కానీ దానిని అంతే గొప్పగా అమలు చేయలేకపోయారు. ఫస్టాఫ్ చాలా నెమ్మదిగా నడుస్తుంది. పాత్రల పరిచయం, శేషు, దొర జైలుకు ఎందుకు వెళ్లారు? అనే విషయాన్ని చెప్పేందుకే ఫస్టాఫ్ మొత్తం పోయింది. అయితే ఫస్టాఫ్లోనూ జైలు పరిసరాలు, కొన్ని సీన్లు చాలా బాగున్నాయి. ఇంటర్వెల్ చక్కగా సెట్ చేశారు. సెంకడాఫ్పై ఆసక్తిని పెంచేలా ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది.
సెంకడాఫ్లో అసలు కథ మొదలవుతుంది. స్క్రీన్ప్లే కూడా బాగుంది. సీరియస్ నోట్లో సినిమా పరుగెడుతుంది. జైలు నుంచి తప్పించుకునేందుకు హీరో బృందం వేసే ప్లాన్లు, వాటిని చూపించిన విధానం బాగుంది. సహజంగా కనిపించేలా చూపడంలో దర్శకత్వం విభాగం విజయవంతమైందనే చెప్పాలి. వెట్రిమారన్ సినిమాలను తలపించేలా సీన్లు చాలా సహజంగా ఉంటాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా కథపైనే దృష్టిపెట్టిన దర్శకురాలిని మెచ్చుకోవాల్సిందే.
సాంకేతికంగా
సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. ప్రియేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ సినిమాకు బలంగా మారింది. సినిమా సహజంగా అనిపించడంలో ఆయన పాత్ర చాలా ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. సామ్ సీఎస్ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో చాలా సీన్లకు హైప్ తీసుకొచ్చాడు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా బాగున్నాయి.
నటీ,నటుల పెర్ఫార్మెన్స్
హ్రిదు హరూన్ శేషుగా అదరగొట్టాడనే చెప్పాలి. ఇంటెన్సివ్ సీన్స్లో తన బాడీ లాంగ్వేజ్తో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్లో కూడా బాగానే చేశాడు. ఫైట్లు, జైలు నుంచి ఎస్కేప్ సీన్లలో నటనలో సహజత్వం కనిపిస్తుంది. బాబీ సింహాకు ఇలాంటి పాత్రలు నల్లేరు మీద నడకే. ఎప్పటిలాగే తన పాత్రలో జీవించాడు. ఎప్పటిలాగే పాత్రకు తగ్గ యాటిట్యూడ్తో సూపర్ అనిపించుకున్నాడు. హీరోయిన్ అనస్వర రాజన్ పాత్రకు అంత నిడివి లేదు కానీ ఉన్నంత మేరలో బాగా చేసింది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు చేశారు.
బలాలు:
కథ,
సెకండాఫ్
నటీ నటుల పెర్ఫార్మెన్స్
సినిమాటోగ్రఫీ
బీజీఎం
బలహీనతలు
ఫస్టాఫ్
కథనం
సమీక్ష:
ఓవరాల్గా సినిమా లవర్స్కు ఈ వారం ‘కోనసీమ థగ్స్’ చూడదగ్గ సినిమా. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా,బోరింగ్గా అనిపించినా సెకండాఫ్ ఆ నిరాశను పోగొడుతుంది.
రేటింగ్: 2.75
ఫిబ్రవరి 24 , 2023

Akhanda 2: బాలయ్య - బోయపాటి మాస్ తాండవం షురూ.. రికార్డులన్నీ సర్దుకోవాల్సిందే!
టాలీవుడ్లో బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. వీరి కాంబోలో వచ్చిన ‘సింహా’ (Simha), ‘లెజెండ్’ (Legend), ‘అఖండ’ (Akhanda) చిత్రాలు ఏ స్థాయి విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. అయితే వీరి కాంబోలో నాల్గో సినిమా కూడా రాబోతున్నట్లు ఇటీవలే అధికారిక ప్రకటన సైతం వచ్చింది. అయితే తాజాగా ‘అఖండ 2’ ప్రాజెక్ట్ను మేకర్స్ పట్టాలెక్కించారు. ఇవాళ పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
క్లాప్ కొట్టిన బ్రాహ్మణి
బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘అఖండ 2’ (Akhanda 2). ‘తాండవం’ అనే పేరును క్యాప్షన్గా పెట్టారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. చిత్రబృందంతోపాటు బాలకృష్ణ కుమార్తెలు నారా బ్రాహ్మణి (Nara Brahmani), తేజస్విని (Tejaswini), ఇతర కుటుంబసభ్యులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ముహూర్తపు షాట్కు బ్రాహ్మణి క్లాప్ కొట్టారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇవి చూసిన నందమూరి ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
https://twitter.com/TeluguChitraalu/status/1846413204492374156
టైటిల్ థీమ్ అదుర్స్
అఖండ 2 సినిమాను గ్రాండ్గా లాంఛ్ చేసిన కాసేపటికే ఈ మూవీకి సంబంధించిన టైటిల్ థీమ్ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ టైటిల్ థీమ్కు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇది విన్న నందమూరి ఫ్యాన్స్ టైటిల్కే ఈ రేంజ్లో ఇచ్చాడంటే సినిమాకు ఏ రేంజ్లో ఇస్తాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక థియేటర్లలో పూనకాలు రావడం పక్కా అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ సినిమా క్యాప్షన్కు తగ్గట్లు థమన్ తాండవం చేయడం కన్ఫార్మ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా అఖండ్ 2 టైటిల్ను ఓ సారి వినేయండి.
https://www.youtube.com/watch?v=FdBnvmLOuiM
కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్!
బాలయ్య - బోయపాటి శ్రీను కాంబోలో గతంలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అఖండ’ (Akhanda) బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ముఖ్యంగా అఖండ సినిమాకు తమన్ అదిరిపోయే నేపథ్య సంగీతాన్ని అందించారు. థమన్ BGM దెబ్బకు థియేటర్స్లో సౌండ్ బాక్స్లు కూడా షేక్ అయిపోయాయి. ఆ సినిమా విజయంలో తమన్ అందించిన మ్యూజిక్ కీలక పాత్ర పోషించిందనడంలో ఏమాత్రం సందేహాం లేదు. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయగా హీరోయిన్గా ప్రగ్యా జైశ్వాల్ నటించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్గా ‘అఖండ 2’ వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
యానిమేషన్లో బాలయ్య ప్రోమో
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్వహించే అన్స్టాపబుల్ టాక్ షోకు బాలయ్య హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకూ మూడు సీజన్లుగా ఈ టాక్ షో ప్రసారం కాగా ఓటీటీ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. బాలయ్య హోస్టింగ్ బాగుందంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా అన్స్టాపబుల్ సీజన్ 4ను ప్రసారం చేసేందుకు ఆహా వర్గాలు రెడీ అయ్యాయి. ఇందులో భాగంగా ఇటీవల ‘బాలయ్య పండగ’ పేరుతో యానిమేషన్ ప్రోమోను రిలీజ్ చేశారు. యానిమేషన్ రూపంలో ఉన్న బాలయ్యను చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. అక్టోబర్ 24 నుంచి అన్స్టాపబుల్ 4 సీజన్ స్ట్రీమింగ్ కానుంది.
https://twitter.com/CBN_Era/status/1845061468053438745
నాన్నకు హ్యాట్సాఫ్ : తేజస్విని
బాలకృష్ణ రెండో కూతురు నందమూరి తేజస్విని అన్స్టాపబుల్ షోకి నిర్మాతగా, క్రియేటివ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఇన్నాళ్లు తెర వెనుక ఉండి అన్స్టాపబుల్ షోని నడిపించిన తేజస్విని ఇటీవల జరిగిన సీజన్ 4 లాంచింగ్ ప్రెస్ మీట్లో తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. తన తండ్రిపై పొగడ్తల వర్షం కురిపించారు. అల్లు అరవింద్ ఈ టాక్షో గురించి చెప్పినప్పుడు అందరం చేద్దామా? వద్దా? అని తెగ ఆలోచించినట్లు తెలిపారు. కానీ తన తండ్రి మాత్రం చేయాల్సిందేనని చెప్పారన్నారు. ఆ ధైర్యమే ఇవాళ అన్స్టాపబుల్ని ఈ రేంజ్కి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. IMDB రేటింగ్స్లో అన్స్టాపబుల్ షో వరల్డ్ 18వ ర్యాంక్ సాధించిందని గుర్తు చేశారు. తన తండ్రి ఫ్యామిలీ కోసం, ఫ్రెండ్స్ కోసం, ప్రజల కోసం నిలబడే వ్యక్తి అని తేజస్విని అన్నారు. హిందూపూర్లో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని గుర్తుచేశారు. నాన్నకు హ్యాట్సాఫ్ అంటూ ప్రసంగాన్ని ముగించారు. తేజస్విని వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా ట్రెండ్ అయ్యింది.
https://twitter.com/GulteOfficial/status/1845034242280956027
రాజకీయ వారసురాలిగా తేజస్విని!
బాలయ్య చిన్న కూతురు తేజస్విని తొలిసారి మీడియా ముందుకు వచ్చినప్పటికీ ఏమాత్రం బెరుకు లేకుండా మాట్లాడారు. తాను చెప్పాలనుకున్న అంశాలను ఏమాత్రం తడబడకుండా అర్ధవంతంగా తెలియజేశారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. తేజస్విని ఇంత బాగా మాట్లాడతారని తాము అసలు ఎక్స్పెక్ట్ చేయాలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఆమె మాటల్లోని స్పష్టత చూస్తుంటే రాజకీయాల్లోనూ రాణించగలదన్న నమ్మకం తమకు కలుగుతోందని పోస్టులు పెడుతున్నారు. బాలయ్యకు రాజకీయ వారసత్వంగా తేజస్విని ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. కాగా, తేజస్విని భర్త భరత్ ఇప్పటికే వైజాగ్ ఎంపీగా గెలుపొందారు. రానున్న రోజుల్లో తేజస్విని రాజకీయాల్లో చూసే అవకాశం లేకపోలేదని నందమూరి అభిమానులు భావిస్తున్నారు.
అక్టోబర్ 16 , 2024

Salaar Movie Review: యాక్షన్ సీన్లలో ప్రభాస్ ఊచకోత.. ‘సలార్’ ఎలా ఉందంటే?
నటీనటులు: ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతిహాసన్, జగపతిబాబు, బాబీ సింహా, టినూ ఆనంద్, ఈశ్వరి రావు, శ్రియారెడ్డి తదితరులు
రచన, దర్శకత్వం: ప్రశాంత్ నీల్
సంగీతం: రవి బస్రూర్
సినిమాటోగ్రఫీ: భువన్ గౌడ ఎడిటింగ్: ఉజ్వల్ కుల్కర్ణి
నిర్మాత: విజయ్ కిరంగదూర్
విడుదల: 22-12-2023
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా ‘కేజీఎఫ్’ (KGF) ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సలార్’. ఇందులో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రభాస్కు ఫ్రెండ్గా నటించారు. శ్రుతి హాసన్ హీరోయిన్గా చేసింది. ఎప్పట్నుంచో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ విశేషంగా సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది. అభిమానుల కోలహాలం మధ్య ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉంది? ప్రభాస్ కటౌట్కు తగిన హిట్ పడిందా? డైరెక్టర్ ప్రశాంత్నీల్కు ఖాతాలో మరో బ్లాక్ హిస్టర్ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం.
కథ
ఖాన్సార్ అనే సామ్రాజ్యానికి రాజ మన్నార్ (జగపతిబాబు) రూలర్. ఆ సామ్రాజ్యంలోని ప్రాంతాలను దొరలు పాలిస్తుంటారు. అయితే రాజ మన్నార్ కుర్చీ కోసం కుతంత్రాలు మొదలవుతాయి. దొరలు అంతా కలిసి సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకొని రాజమన్నార్ను అంతం చేస్తారు. అయితే తన కొడుకు వరద రాజమన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్)ని ఖాన్సార్కు రూలర్గా చూడాలనేది రాజమన్నార్ కోరిక. దీంతో వరద తన సైన్యంగా చిన్ననాటి స్నేహితుడు దేవా (ప్రభాస్)ని పిలుస్తాడు. ఆ ఒక్కడు అంతమంది దొరల సైన్యాన్ని ఎలా ఎదిరించాడు? తన ప్రాణ స్నేహితుడు వరద కోసం దేవా ఏం చేశాడు? అతనికి సలార్ అనే పేరెలా వచ్చింది? వీళ్ల జీవితంలోకి ఆద్య (శ్రుతిహాసన్) ఎలా వచ్చింది? తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
బాహుబలి తర్వాత ప్రభాస్ ఆ స్థాయిలో మెప్పించిన చిత్రం సలార్. తన కటౌట్కు తగ్గట్లు యాక్షన్ సీన్లలో అదరగొట్టాడు. తల్లి చాటు కొడుకుగా, మాట జవదాటని స్నేహితుడిగా ఆయన నటన ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పోరాట ఘట్టాల్లో ప్రభాస్ కనిపించిన తీరు, హీరోయిజం, స్టైల్ మెప్పిస్తుంది. శ్రుతిహాసన్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేనప్పటికీ ప్రథమార్ధంలో ఆమే కీలకం. పృథ్వీరాజ్ సుకుమారన్ అద్భుత నటన కనబరిచాడు. స్నేహితులుగా ప్రభాస్కీ, ఆయనకీ మధ్య మంచి కెమిస్ట్రీ కనిపించింది. ఈశ్వరీరావు, బాబీ సింహా, జగపతిబాబు, మైమ్ గోపి, శ్రియారెడ్డి, ఝాన్సీ, జాన్ విజయ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ‘సలార్’తో మరోమారు తన మార్క్ చూపించారు. ఖాన్సార్ పేరుతో ఓ కల్పిత ప్రపంచాన్ని సృష్టించి దాని చుట్టూ అద్భుతమైన కథని అల్లారు. కె.జి.యఫ్ సినిమాలతో పోలిస్తే హీరోయిజం, ఎలివేషన్ల కంటే ఇందులో డ్రామాకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. చాలా చోట్ల కె.జి.యఫ్ సినిమా గుర్తొస్తోంది. అయితే ప్రభాస్కి తగ్గట్టు మాస్, యాక్షన్ అంశాల్ని మేళవించడంలో ప్రశాంత్ ప్రతిభ కనిపిస్తుంది. అవసరమైన చోట్ల ప్రభాస్కు ఎలివేషన్లు ఇచ్చి అభిమానులకి గ్రాండ్ ట్రీట్ ఇచ్చారు ప్రశాంత్. అయితే కుర్చీ చుట్టూ అల్లిన కుతంత్రపు డ్రామా, కుటుంబ పాత్రల మధ్య వరసలు కొంచెం గజిబిజి అనిపిస్తాయి. ద్వితీయార్ధంలో సరళంగా కథని చెప్పలేకపోయారు డైరెక్టర్. ఓవరాల్గా సగటు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించేలా డ్రామాను నడిపించడంలో ప్రశాంత్నీల్ సక్సెస్ అయ్యారు.
సాంకేతికంగా
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ఖాన్సార్ ప్రపంచాన్ని ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. రవి బస్రూర్ బాణీలు, నేపథ్య సంగీతం, భువన్ గౌడ కెమెరా పనితనం చిత్రానికి ప్రధానబలం. అన్బరివ్ స్టంట్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. నిర్మాత ఎక్కడా రాజీపడినట్లు కనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
ప్రభాస్, పృథ్వీ నటనయాక్షన్ సన్నివేశాలుభావోద్వేగాలు, క్లైమాక్స్
మైనస్ పాయింట్స్
సెకండాఫ్లో కొన్ని సీన్స్
రేటింగ్: 3.5/5
డిసెంబర్ 22 , 2023

AKHANDA 2: టార్గెట్ AP ఎలక్షన్స్.. ప్యూర్ పొలిటికల్ డ్రామాగా బాలయ్య, బోయపాటి సినిమా!
నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి. సింహా, లెజెండ్, అఖండ.. సినిమాలతో వీరు హ్యాట్రిక్ కొట్టారు. ఈ మూడింట్లోనూ కామన్గా పొలిటికల్ టచ్ ఉంటుంది. నాటి వర్తమాన రాజకీయ పరిస్థితులకు అనువదించుకుని వచ్చే సన్నివేశాలు, డైలాగ్స్.. ఈ సినిమాల్లో ఎన్నో ఉన్నాయి. అయితే, మరోసారి వీరి కాంబో రిపీట్ కానుంది. అఖండ పార్ట్ 2 కోసం ప్లాన్ చేస్తున్నారట. ఈ సారి పొలిటికల్ డోజ్ మరింత పెంచనున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి.
స్టోరీ ఇదేనట..
రాష్ట్రంలోని ప్రముఖ హిందూ దేవాలయాల్లోని పరిస్థితుల చుట్టూ సినిమా కథ ఉంటుందని టాక్. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో జరుగుతున్న దాడులు, అధికార యంత్రాంగం ప్రవర్తనా తీరును ఎండగట్టేందుకు బాలయ్య రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఓ అన్య మతస్థుడు అధికారంలో ఉంటే రాష్ట్రంలోని ఆలయాల దుస్థితి ఎలా ఉంటుంది? వీటిని రక్షించడానికి కథానాయకుడు ఎలాంటి పోరాటం చేశాడనే అంశం ఆధారంగా చిత్రం తెరకెక్కనుందట. ప్యూర్ పొలిటికల్ బ్యాక్డ్రాప్లో తీస్తూనే మాస్ ఎలివేషన్స్ని హైలైట్ చేయనున్నట్లు సమాచారం.
ఎన్నికల నేపథ్యంలో..
రాజకీయాలే లక్ష్యంగా అఖండ పార్ట్ 2 రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ సినిమా విడుదలను కూడా పక్కాగా ప్లాన్ చేశారట. సరిగ్గా ఏపీ ఎన్నికల ముందే సినిమాను రిలీజ్ చేయాలని బాలయ్య పట్టుదలతో ఉన్నట్లు టాక్. ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అధికార పార్టీ విధానాలను సినిమా ద్వారా ఎండగట్టాలని చూస్తున్నారట. ఎన్నికల ప్రచారానికి ఈ సినిమాను ఓ ఆయుధంలా వాడుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి, ఈ సినిమాకు బాలయ్య పుట్టినరోజు నాడు శ్రీకారం చుట్టునున్నట్లు టాక్. జూన్ 10న పూజా కార్యక్రమాలు జరుపుకోనున్నట్లు సమాచారం.
లెజెండ్ కూడా..
బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన రెండో సినిమా ‘లెజెండ్’. ఈ సినిమా 2014 మార్చి 24న విడుదలైంది. సరిగ్గా ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ మూవీని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో కూడా రాజకీయ అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఇదే నేపథ్యంలో కొనసాగుతుంది. ఇందులోని డైలాగులు కూడా పొలిటికల్ టచ్తో ఉన్నాయి. నాడు ఈ సినిమా ఎలక్షన్లకు కలిసొచ్చింది. ఏప్రిల్లో ఎన్నికలు జరగ్గా బాలయ్య ప్రాతినిథ్యం వహిస్తున్న టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఈ సెంటిమెంట్ని మరోసారి వర్కౌట్ చేయాలని చూస్తున్నారట. ప్రస్తుతం ఏపీలో టీడీపీ ప్రతిపక్ష పార్టీగా ఉంది.
అఖండ టీంతోనే..
అఖండ పార్ట్ 2 సినిమాలో కూడా దాదాపు అదే టీం పనిచేయనుంది. ఈ సినిమాకు సంగీతం పెద్ద ప్లస్ పాయింట్గా నిలిచింది. ఎస్.ఎస్.థమన్ అందించిన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ థియేటర్లో దద్దరిల్లింది. దీంతో పార్ట్ 2కి సైతం థమన్నే కొనసాగించనున్నారట. ఇతర టెక్నికల్ టీం కూడా మరోసారి కలిసి పనిచేయనుంది.
వరుస సినిమాలు..
ఓ వైపు ఎమ్మెల్యేగా కొనసాగుతూనే బాలయ్య వరుస సినిమాలను చేస్తున్నారు. ఇటీవల వీరసింహారెడ్డితో మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నాడు. పక్కా తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ అనంతరం బోయపాటితో అఖండ2 కు బాలయ్య రెడీ కానున్నారు. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ సినిమాకు మేకప్ వేసుకోనున్నట్లు సమాచారం.
మే 01 , 2023

Mokshagna Teja: మోక్షజ్ఞ సరసన స్టార్ హీరోయిన్ కూతురు ఫిక్స్?
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ(Mokshagna Teja) హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. దీనికి ‘హనుమాన్’(Hanuman) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ప్రశాంత్ వర్మ(Prasanth Varma) దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఆ మూవీకి ‘సింబ’(Simba) అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నట్లు టాక్. కానీ ఇందులో నటించే నటీనటులకు సంబంధించిన విషయాలు మాత్రం వెల్లడించలేదు. అయితే ఇందులో హీరోయిన్కు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
హీరోయిన్గా స్టార్ నటి కూతురు!
మోక్షజ్ఞ సినిమా కోసం ఓ స్టార్ హీరోయిన్ కూతుర్ని హీరోయిన్గా సెట్ చేసినట్లు నెట్టింట స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ (Raveena Tandon) కుమార్తె రాషా థడానిని (Rasha thadani) కథానాయికగా ఎంపిక చేసినట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఇందుకోసం ఆమె ఆడిషన్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన స్టోరీ కూడా ప్రశాంత్ వర్మ చెప్పడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట. అలాగే డిసెంబర్ నుంచి ఈ మూవీని సెట్స్పైకి తీసుకెళ్లే యోచనలో ప్రశాంత్ వర్మ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే హీరో, హీరోయిన్ ఇద్దరూ కొత్తవారు కావడంతో వారిని ప్రశాంత్ ఏ విధంగా మ్యానేజ్ చేస్తారో చూడాలి.
విలన్గా రానా!
మోక్షజ్ఞ - ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్లో విలన్ పాత్రకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో ప్రతినాయకుడి పాత్రకు దగ్గుబాటి రానా పేరును ప్రశాంత్ వర్మ పరిశీలిస్తున్నట్లు సమాచారం. క్రూరమైన విలన్ పాత్రకు ఆయన మాత్రమే న్యాయం చేస్తాడని చిత్ర బృందం కూడా నమ్ముతోందట. దీనిపై రానాతో సంప్రదింపులు కూడా జరిపే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరోవైపు ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయినట్లు సమాచారం. దీంతో డిసెంబర్ 2న మూవీ షూటింగ్ను అధికారికంగా ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఆ రోజున సినిమాకు క్లాప్ కొట్టి రెగ్యులర్ షూటింగ్ మెుదలు పెట్టాలని ప్రశాంత్ వర్మ భావిస్తున్నారట. ఈ చిత్రానికి బాలయ్య చిన్నకూతురు ఎం. తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరించనున్నారు.
బాలయ్య స్పెషల్ రోల్!
మోక్షజ్ఞ - ప్రశాంత్ వర్మ కాంబోలో రానున్న చిత్రంలో నందమూరి బాలకృష్ణ కూడా ఓ స్పెషల్ రోల్లో కనిపిస్తారని తెలుస్తోంది. హనుమాన్ తరహాలోనే ఈ సినిమాలో సూపర్ హీరో, మైథలాజికల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటాయని అంటున్నారు చివర్లో బాలయ్య శ్రీకృష్ణుడిగా ఎంట్రీ ఇవ్వడంతో కథ మరో మలుపు తిరుగుతుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. లేదంటే అర్జునుడి పాత్రలోనైనా బాలయ్య కనిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీనిపై ప్రశాంత్ వర్మ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరోవైపు కుమారుడి ఎంట్రీ ఫిల్మ్లో బాలయ్య నటిస్తే ఆ కిక్కే వేరని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ సినిమా నందమూరి అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని కామెంట్స్ చేస్తున్నారు.
మహాకాళి ప్రాజెక్ట్
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మోక్షజ్ఞ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే తన యూనివర్స్ నుంచి మరో చిత్రాన్ని కూడా ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ‘మహా కాళీ’ పేరుతో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. మహాకాళి ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎక్స్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘మా యూనివర్స్కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించరు. మహిళా దర్శకురాలు పూజ అపర్ణ కొల్లూరు ఈ మూవీని తెరకెక్కిస్తారు.
అక్టోబర్ 26 , 2024

Bhagyashri Borse: పీకల్లోతు ప్రేమలో భాగ్యశ్రీ బోర్సే? ప్రియుడితో డేటింగ్ చేస్తున్నట్లు హింట్స్!
యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) పేరు ఇటీవల పెద్ద ఎత్తున టాలీవుడ్లో మార్మోగింది. తెలుగులో ఆమె ఫస్ట్ ఫిల్మ్ ‘మిస్టర్ బచ్చన్’ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైనప్పటికీ బాగ్యశ్రీ ప్రదర్శన మాత్రం మెప్పించింది. ఇటీవల దుల్కర్ సల్మాన్తో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ను పట్టాలెక్కించి తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. ఇదిలా ఉంటే భాగ్యశ్రీ ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రియుడితో కలిసి డేటింగ్ కూడా చేస్తున్నట్లు సమాచారం. ఈ అమ్మడు లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్టును పరిశీలిస్తే ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
భాగ్యశ్రీ ప్రేమలో పడిందా?
ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే తన ప్రియుడితో కలిసి విహార యాత్రలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే 'ప్రేమ.. ఎలాంటి హెచ్చరిక లేకుండా పుడుతుంది' అంటూ ఆమె పెట్టిన ఇన్స్టా పోస్టు ఒక్కసారిగా వైరల్గా మారింది. తనకు బాగా దగ్గరైన వ్యక్తి ఇచ్చిన పూల బొకేను షేర్ చేస్తూ దానికి లవ్ సింబల్ను కూాడా ఈ అమ్మడు జత చేసింది. మంచుతో నిండిన కొండలోయలను ఇష్టమైన వాడితో వీక్షిస్తూ ముఖం కనిపించకుండా జాగ్రత్తపడింది. తాము ప్రేమ పక్షులం అని అర్థం వచ్చేలా రెండు బర్డ్స్ ఉన్న ఫొటోను షేర్ చేసి ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చింది. ఓ వ్యక్తితో కలిసి సూర్యస్తమయాన్ని వీక్షిస్తూ అతడి ముఖం కనిపించకుండా జాగ్రత్తపడింది. చివరిగా ‘ఈ వీక్లో కొంత భాగం’ అంటూ లవ్ ఎమోజీ, ఓ పక్షి ఫొటోను పెట్టింది. దీంతో భాగ్యశ్రీ ప్రేమలో పడిపోయిందంటూ నెటిజన్లు జోరుగా పోస్టులు పెడుతున్నారు.
View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse)
ఫ్లాప్ వచ్చినా తగ్గని క్రేజ్!
‘మిస్టర్ బచ్చన్’ సినిమా టైంలో భాగ్యశ్రీ బోర్సే పేరు ఎంతగా ట్రెండ్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైన దగ్గర్నుంచి ఆమె సోషల్ మీడియా దృష్టినీ ఆకర్షిస్తూనే వచ్చింది. సినిమా నుంచి తొలి పాటను అనౌన్స్ చేసినపుడు కొన్ని విజువల్స్ చూసి కుర్రాళ్లకు మతిపోయింది. అయితే ఊహించని విధంగా ‘మిస్టర్ బచ్చన్’ డిజాస్టర్ కావడంతో భాగ్యశ్రీ అంచనాలన్నీ తలకిందులు అయ్యాయి. తొలి చిత్రమే దారుణ పరాజయాన్ని మిగిల్చడంతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన దూకుడు కాస్త తగ్గించింది. తాజాగా 'కాంత' సినిమాలో హీరోయిన్గా ఎంపికై తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. సరైన హిట్ లభిస్తే ఈ అమ్మడు స్టార్ హీరోయిన్గా మారిపోవడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
దుల్కర్కి జోడీగా భాగ్యశ్రీ
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరో, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం ‘కాంత’ (Kaantha). ‘నీలా’ ఫేమ్ సెల్వమణి సెల్వరాజ్ (Selvamani Selvaraj) దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగా ఇటీవల పూజా కార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి అందంగా చీరకట్టుకొని మరి భాగ్యశ్రీ హాజరయ్యింది. ఆమె లుక్స్కు మరోమారు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆమె మంచి ఛాన్స్ కొట్టేశారంటూ పోస్టులు పెట్టారు. వేఫరెర్ ఫిలిమ్స్, స్పిరిట్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో రానా దగ్గుబాటి ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.
https://twitter.com/DQsWayfarerFilm/status/1833013939837276196
రౌడీ బాయ్తోనూ..
విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కాంబోలో రూపొందుతున్న 'VD12' చిత్రంలోనూ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఈ అమ్మడు షూటింగ్లోనూ చురుగ్గా పాల్గొంటోంది. ఈ సినిమాలో విజయ్ పోలీసు ఆఫీసర్గా కనిపించనున్నట్లు సమాచారం. ఓ సాధారణ పోలీసు కానిస్టేబుల్ అయిన హీరో, మాఫియా లీడర్గా ఎలా ఎదిగాడన్న కాన్సెప్ట్తో 'VD12' రాబోతున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు. ఇక నేచురల్ స్టార్ నాని (Hero Nani) హీరోగా సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో రానున్న మూవీలోనూ హీరోయిన్గా భాగ్యశ్రీ పేరును పరిశీలిస్తున్నట్లు టాక్ ఉంది.
భాగ్యశ్రీ నేపథ్యం ఇదే..
భాగ్యశ్రీ బోర్సేది మహారాష్ట్రలోని పుణే. హిందీ చిత్రం 'యారియాన్ 2'తో ఆమె వెండితెరకి పరిచయమైంది. అంతకుముందు చాలా యాడ్స్లో మోడల్గా పని చేసింది. ఈమె చేసిన యాడ్స్లో క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ బాగా ఫేమ్ తెచ్చి పెట్టింది. ఇక ‘యారియాన్ 2’లో ఈ బ్యూటీ యాక్టింగ్కి ఫిదా అయిన డైరెక్టర్ హరీశ్ శంకర్ ‘మిస్టర్ బచ్చన్’లో ఛాన్స్ ఇచ్చారు. అలా టాలీవుడ్లో బజ్ క్రియేట్ చేసిన ఈ అమ్మడు మరిన్ని ఆఫర్లను దక్కించుకుంది. చూడటానికి చాలా క్యూట్గా ఉండే భాగ్యశ్రీ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా వ్యవహరిస్తుంటుంది. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్కు గ్లామర్ ట్రీట్ ఇస్తూ సినిమాలకు అతీతంగా తన క్రేజ్ను పెంచుకుంటోంది.
అక్టోబర్ 23 , 2024