రివ్యూస్
How was the movie?
తారాగణం
విక్రాంత్ రెడ్డి
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Mehreen_Kaur_Pirzada_250_250.jpeg)
మెహ్రీన్ కౌర్ పిర్జాదా
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Rukshar_Dhillon_21oBKyUcK4IlWeFk_250_250.jpeg)
రుక్సార్ ధిల్లాన్
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Vennela_Kishore_250_250.jpeg)
వెన్నెల కిషోర్
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Guru_Somasundaram_250_250.jpeg)
గురు సోమసుందరం
సిబ్బంది
విక్రాంత్ రెడ్డిదర్శకుడు
డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్నిర్మాత
విక్రాంత్ రెడ్డిరచయిత
కథనాలు
![This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్సిరీస్లు ఇవే!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/11/13150659/Untitled-design-2023-11-13T150645.665.jpg)
This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్సిరీస్లు ఇవే!
గత వారంలాగే ఈ వారం కూడా పెద్ద సినిమాలు లేకపోవడంతో థియేటర్లను ఆక్రమించేందుకు చిన్న సినిమాలు సిద్ధమవుతున్నాయి. నవంబర్ మూడో వారంలో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఆసక్తికర సినిమాలు రాబోతున్నాయి. నవంబర్ 13 నుంచి 19 తేదీల మధ్య ఆ చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్సిరీస్లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.
థియేటర్లో రిలీజయ్యే చిత్రాలు
మంగళవారం
‘RX 100’ డైరెక్టర్ అజయ్ భూపతి రూపొందించిన మరో ఆసక్తికర చిత్రం ‘మంగళవారం’ (Mangalavaaram). ఇందులో పాయల్ రాజ్పూత్ (Payal Rajput), అజ్మల్ అమిర్ ప్రధాన పాత్రలు పోషించారు. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్ వర్మ ఈ మూవీని నిర్మించారు. నవంబరు 17న (శుక్రవారం) తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.
మై నేమ్ ఈజ్ శృతి
ప్రముఖ హీరోయిన్ హన్సిక నటించిన లేటేస్ట్ మూవీ ‘మై నేమ్ ఈజ్ శృతి’ (My Name Is Shruthi) సినీ ప్రియులను థ్రిల్ చేసేందుకు ఈ వారమే వస్తోంది. ఆమె లీడ్ రోల్లో చేసిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీనివాస్ ఓంకార్ తెరకెక్కిస్తున్నారు. బురుగు రమ్య ప్రభాకర్ నిర్మిస్తున్నారు. ఊహకందని మలుపులతో సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. తన మనోభావాలను ధైర్యంగా వెల్లడించే యువతిగా ఇందులో హన్సిక కనిపిస్తుందని పేర్కొన్నాయి. నవంబరు 17న (శుక్రవారం) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
స్పార్క్ లైఫ్
విక్రాంత్ హీరోగా నటించి.. స్వయంగా తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘స్పార్క్ లైఫ్’ (Spark The Life). డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ మూవీని నిర్మించింది. మెహరీన్, రుక్సర్ థిల్లాన్ కథానాయికలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 17న థియేటర్లలో విడుదల కానుంది.
సప్త సాగరాలు దాటి సైడ్-B
కన్నడ నటుడు రక్షిత్ శెట్టి (Rakshit Shetty) కీలక పాత్రలో నటించిన ప్రేమకథా చిత్రం ‘సప్త సాగరాలు దాటి సైడ్-B’ (Sapta Sagaralu Dhaati Side B). రుక్మిణీ వసంత్ కథానాయిక. హేమంత్ ఎం. రావు దర్శకత్వం వహించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన (Sapta Sagaralu Dhaati Side A) సినిమాకు కొనసాగింపుగా కొత్త చిత్రాన్ని తీసుకొస్తున్నారు. నవంబర్ 17న కన్నడతోపాటు తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.
అన్వేషి
విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అన్వేషి’ (Anvesh). వి.జె.ఖన్నా దర్శకత్వం వహించారు. టి.గణపతిరెడ్డి నిర్మాత. అడవి నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కిందని చిత్ర యూనిట్ తెలిపింది. కథానాయిక అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషించిందని చెప్పింది. ఆమె చుట్టూ సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయని, చైతన్ భరద్వాజ్ మరోసారి తన సంగీతంతో ఆకట్టుకుంటాడని చెబుతోంది. నవంబరు 17న ఈ సినిమా విడుదల కానుంది.
ఓటీటీలో స్ట్రీమింగ్కానున్న చిత్రాలు/వెబ్సిరీస్లు
TitleCategoryLanguagePlatformRelease DateTwin LoveWeb SeriesEnglishAmazon PrimeNov 17ApurvaMovieHindiDisney + HotstarNov 15Chinna MovieTamil/TeluguDisney + HotstarNov 17Kannur SquadMovieMalayalamDisney + HotstarNov 17How to Become a Mob BossWeb SeriesEnglishNetflixNov 14Best. Christmas. Ever!MovieEnglishNetflixNov 16The crownWeb SeriesEnglishNetflixNov 16Believer 2MovieEnglishNetflixNov 17The DadsDocumentaryEnglishNetflixNov 17SukheeMovieHindiNetflixNov 18The RailwaymenMovieHindiNetflixNov 18
APP: సినీ అభిమానులను అలరించేందుకు ఈ వారం కూడా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 5 తేదీల మధ్య థియేటర్లు, OTTలో విడుదలై సందడి చేయనున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు ఏంటో తెలుసుకోవాలంటే YouSay Web లింక్పై క్లిక్ చేయండి.
నవంబర్ 13 , 2023
![త్వరలో ఒక్కటి కానున్న సమంత - విజయ్ దేవరకొండ! ఇద్దరి టార్గెట్ ఒక్కటే.. ఇదిగో సాక్ష్యాలు](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/08/31144351/Untitled-design-15.jpg)
త్వరలో ఒక్కటి కానున్న సమంత - విజయ్ దేవరకొండ! ఇద్దరి టార్గెట్ ఒక్కటే.. ఇదిగో సాక్ష్యాలు
సమంత - విజయ్ దేవరకొండ వీరిద్దరు తెలుగు తెరపై అనతి కాలంలోనే స్టార్స్గా ఎదిగారు. పెద్దఎత్తున ఫ్యాన్ బేస్ను సంపాదించారు. విజయ్ -సామ్ సినీ కెరీర్ పక్కన పెడితే ఇద్దరూ తమ పర్సనల్ లైఫ్లో ఒకేరకంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. వీరి ఆలోచనల్లో కొన్ని ఒకేరకంగా ఉండటం యాధృచ్చికమే అయినా.. కెరీర్ పరంగా ఒకే దారిలో అడుగులు వేస్తూ ఒకే టార్గెట్ వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో వస్తున్న ఖుషీ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
టాలీవుడ్లో తొలి సినిమాతో యూత్లో విపరీతమైన క్రేజ్ సంపాందించి రౌడీ బాయ్గా ఫ్యాన్స్కు దగ్గరయ్యాడు విజయ్ దేవరకొండ. తన యాటిట్యూడ్, టాకింగ్ నెస్తో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం మూవీలతోనే కాకుండా సొంతంగా బిజినెస్లు ప్రారంభిస్తూ అందులోనూ రాణిస్తున్నాడు. ఇదే దారిలో సమంత కూడా పయనిస్తోంది.
సినిమాల్లోకి వచ్చిన తొలిరోజుల్లోనే సమంత తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుసగా అవకశాలు కొల్లగొడుతూ అగ్రహీరోయిన్ స్థాయికి ఎదిగింది. తెలుగు, తమళంలో దాదాపు అందరు అగ్రహీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.
విజయ్ దేవరకొండ ఓవైపు సినిమాలు చేస్తూనే వ్యాపారాలపై దృష్టి పెట్టాడు. యూత్లో క్రేజ్ సంపాదించిన విజయ్.. ఆ క్రేజ్ను తన వ్యాపారానికి పెట్టుబడిగా మార్చుకున్నాడు. రౌడీ బ్రాండ్ పేరుతో టెక్స్ టైల్ బిజినెస్ ప్రారంభించి ఈ రంగంలోనూ సక్సెస్ సాధించాడు.
సొంత బ్రాండ్ కావడంతో తానే ప్రకటనల్లో నటిస్తూ ప్రమోట్ చేస్తున్నాడు. ఈ రౌడీ బ్రాండ్ మెన్స్వేర్కి యూత్లో మంచి డిమాండ్ ఉంది.
ఇక సామ్ గురించి చెప్పాలంటే.. ఫ్యాషన్ రంగంపై తనకున్న ఇంట్రెస్ట్తో 'సాకీ' అనే పేరుతో ఓ ఆన్లైన్ వస్త్ర వ్యాపారాన్ని స్టార్ట్ చేసింది సమంత. ఈ ఆన్ లైన్ స్టోర్ కోసం సొంతంగా ప్రమోషన్స్ చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతోంది.
తన బ్రాండ్ ప్రమోషన్స్ కోసం వ్యాపార ప్రకటనల్లో పాల్గొనడం సామ్, విజయ్లో ఉన్న కామన్ పాయింట్. వీటితో పాటు బడా వ్యాపార సంస్థల ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు.
కేవలం వ్యాపారం, డబ్బు సంపాదించడమే కాకుండా సామాజిక స్పృహతో సమాజ సేవలో కూడా పాల్గొంటున్నారు ఇద్దరు స్టార్స్. ఈ క్రమంలో దేవరకొండ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను రౌడి స్టార్ ప్రారంభించాడు. దీని ద్వారా నిరుద్యోగులకు జాబ్ స్కిల్స్, ఇంగ్లిష్ వంటి వాటిలో ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు.
అలాగే కోవిడ్ టైంలో విజయ్ ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేదవాళ్లకు నిత్యవసర సరకులను ఉచితంగా అందించి పెద్ద మనసు చాటుకున్నాడు.
ఇక లెడీ బాస్ సమంత ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సేవలందిస్తోంది. ఈ ఫౌండేషన్ తరఫున ప్రాణాపాయంలో ఉన్న మహిళలు, చిన్నారులను సామ్ ఆదుకుంటోంది.
అయితే వీరిద్దరు కలిసి ఓ కామన్ బ్రాండ్ ద్వారా తమ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్. ఇప్పటికే రౌడీ బ్రాండ్తో విజయ్, సాకీ బ్రాండ్తో సమంత సొంత వ్యాపారాలు చేస్తుండగా ఈ రెండింటిని కలపడం లేదా , మరొ కొత్త బ్రాండ్తో వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారట.
ఇక సినిమాల విషయానికొస్తే.. వీరిద్దరు జంటగా నటించిన ఖుషి మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఖుషి మూవీ పాటలు, ప్రచార కార్యక్రమాలు ప్రేక్షకుల్లో మంచి హైప్ను క్రియేట్ చేశాయి. వీరిద్దరి ఆన్స్క్రీన్ రోమాన్స్ అదిరిపోయింది. ఈ సినిమా విజయం ఇద్దరి స్టార్స్ కెరీర్కు కీలకం కానున్నాయి. వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న విజయ్- సమంతలు ఈ చిత్రం సక్సెస్పై గంపెడు ఆశలు పెట్టుకున్నారు.
ఆగస్టు 31 , 2023
![iQOO Neo 8 Review: ఐక్యూ నుంచి మరో అధునాతన ఫోన్.. ఆకట్టుకుంటున్న ఫీచర్లు!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/05/17125458/Fv0XEwVagAAr7bD.jpeg)
iQOO Neo 8 Review: ఐక్యూ నుంచి మరో అధునాతన ఫోన్.. ఆకట్టుకుంటున్న ఫీచర్లు!
ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQOO) కొత్తగా మరో ఫోన్ను లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. మే 23న iQoo Neo 8 అనే కొత్త స్మార్ట్ ఫోన్ను మోడల్ను తీసుకురానున్నట్లు తెలిపింది. అయితే దీన్ని మెుదట చైనాలో తీసుకొస్తామన్న ఐక్యూ.. ఆ తర్వాత భారత్లోనూ లాంచ్ చేస్తామని స్పష్టం చేసింది. ఐక్యూ ఫోన్లకు మార్కెట్లో మంచి బ్రాండ్ ఉండటంతో కొత్తగా రాబోయే స్మార్ట్ఫోన్పై అందరికీ ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో iQoo Neo 8 ప్రత్యేకతలు ఏంటీ? అడ్వాన్స్డ్ ఫీచర్లు ఇందులో ఏమున్నాయి? ధర ఎంత ఉండవచ్చు? వంటి అంశాలను ఇప్పుడు చూద్దాం.
ఫోన్ డిస్ప్లే
iQoo నియో 8 స్మార్ట్ఫోన్ 6.78 అంగుళాల స్కీన్తో రానుంది. దీనిని 1.5K AMOLED డిస్ప్లేతో తీసుకొస్తున్నారు. 144Hz రిఫ్రెష్ రేటుతో పాటు ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్తో ఫోన్ పనిచేస్తుంది.
ఫోన్ స్టోరేజ్
iQoo నియో 8 స్మార్ట్ఫోన్ను 16GB RAMతో తీసుకొస్తున్నారు. ర్యామ్ కేపాసిటీ అధికంగా ఉండటంతో ఈ ఫోన్ చాలా ఫాస్ట్గా పనిచేయనుంది. అలాగే ఫోన్ 256GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. Micro SD కార్డుకు కూడా ఇది సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ Qualcomm Snapdragon 8 Plus Gen 1 ప్రొసెసర్ వర్క్ చేస్తుంది.
కెమెరా
iQoo నియో 8 స్మార్ట్ఫోన్లో ప్రైమరీ కెమెరా 50MPతో వస్తోంది. ఈ ఫోన్ అల్ట్రావైడ్, డెప్త్ సెన్సార్లతో బ్యాక్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. ఇక ఫ్రంట్ వైపు 16MP కెమెరాను ఫిక్స్ చేశారు. దీనితో క్వాలిటీ సెల్ఫీ కెమెరాలు, వీడియోలు తీసుకోవచ్చు. బ్యాక్ కెమెరాకు ఫ్లాష్ లైట్ను కూడా జోడించారు.
బ్యాటరీ
iQoo నియో 8 స్మార్ట్ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్టు చేస్తుంది. అధిక బ్యాటరీ సామర్థ్యం వల్ల ఫోన్ ఛార్జింగ్ లైఫ్ ఎక్కువగా ఉండనుంది.
5G సపోర్ట్
iQoo నియో 8 స్మార్ట్ఫోన్ను 5Gతో తీసుకొస్తున్నారు. అలాగే డ్యూయల్ 4G VoltE, Wi-Fi, 3.5mm ఆడియో జాక్, USB టైప్-సి పోర్ట్తో సహా అనేక కనెక్టివిటీ సపోర్ట్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ఫోన్ తక్కువ బరువుతో విడుదల చేయనున్నట్లు సమాచారం.
కలర్స్
iQoo నియో 8 స్మార్ట్ఫోన్ రెండు వర్షన్లలో తీసుకుస్తున్నారు. ఈ ఫోన్ iQoo నియో 8, iQoo నియో 8 proగా రానుంది. బ్లాక్, గోల్డ్ కలర్స్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ధర ఎంతంటే?
iQOO Neo 8 ఫోన్ భారత్లో ఎక్కువగానే ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిని రూ. 44,990కు విక్రయించవచ్చని అభిప్రాయపడుతున్నాయి. దీనిపై మే 23న క్లారిటీ రానుంది.
మే 17 , 2023
![Rashmika Mandanna: ‘నీ యబ్బ.. నువ్వు నా ఫ్యామిలీరా’.. రష్మిక క్లారిటీ ఇచ్చిందోచ్!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/05/28142729/Rashmika-Feature-Image.jpg)
Rashmika Mandanna: ‘నీ యబ్బ.. నువ్వు నా ఫ్యామిలీరా’.. రష్మిక క్లారిటీ ఇచ్చిందోచ్!
వెండితెరపై మంచి జోడీగా పేరున్న జంటల్లో విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న ముందు వరుసలో ఉంటారు. ‘గీతా గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట.. అతి తక్కువ సమయంలోనే బెస్ట్ ఫ్రెండ్స్గా మారిపోయారు. అయితే వీరి మధ్య స్నేహానికి మించి ఇంకేదో ఉన్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. విజయ్ - రష్మిక డీప్ లవ్లో ఉన్నట్లు మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. తాము కేవలం స్నేహితులమేనని పలు సందర్భాల్లో వీరు స్పష్టం చేసిన్పపటికీ ఈ రూమర్లకు బ్రేక్ పడలేదు. అయితే తాజాగా రష్మిక మందన్న చేసిన వ్యాఖ్యలు విజయ్, ఆమెకు మధ్య ఏదో ఉందన్న సంకేతాలు ఇచ్చాయి.
‘నీ యబ్బ.. నువ్వు నా ఫ్యామిలీరా’
విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన 'గం గం గణేశా'.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మిక మందన్న ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ వేడుకలో రష్మికను ఆనంద్ పలు ప్రశ్నలు అడిగాడు. ఇటీవల రష్మిక పోస్టు చేసిన పెట్ డాగ్ ఫొటోల్లో విజయ్ పెట్ కూడా ఉంది. ఆ ఫొటోలు చూపించి వాటిలో ఏది నీ ఫేవరేట్ అని అడగ్గా రష్మిక.. ఆరా (రష్మిక పెట్ డాగ్) నా ఫస్ట్ బేబీ, స్మార్ట్ (విజయ్ పెట్ డాగ్) నా సెకండ్ బేబీ అని చెప్పింది. తర్వాత నీ ఫేవరేట్ కో-స్టోర్ ఎవరు అని ఆనంద్ ప్రశ్నించాడు. అప్పుడు రష్మిక మైక్ పక్కన పెట్టి నీ యబ్బ అని సరదాగా తిట్టింది. వెంటనే మైక్ తీసుకొని “ఆనంద్ నువ్వు నా ఫ్యామిలిరా.. ఇలా స్పాట్లో పెడితే ఎలా” అని చెప్పడంతో అక్కడి వారంతా కేకలు పెట్టారు. ఫ్యాన్స్ వెంటనే రౌడీ, రౌడీ స్టార్ అని అరడవంతో రౌడీ బయ్ నా ఫేవరేట్ అని విజయ్ను ఉద్దేశించి చెప్పింది. ప్రస్తుతం రష్మిక - ఆనంద్ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
https://youtu.be/LGt6bCE2ZMo?si=uV2RIkLzfv8Kjj_p
క్లారిటీ ఇచ్చేసినట్లేనా?
రష్మిక లేటెస్ట్ కామెంట్స్తో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తమ హీరోతో ఉన్న రిలేషన్పై ఇన్నాళ్లకు రష్మిక నోటి నుంచి ఓ క్లారిటీ వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. ఆనంద్ దేవరకొండతో ‘మనం ఓ ఫ్యామిలీ’ అంటూ చెప్పడం ద్వారా విజయ్తో తన ప్రేమయాణాన్ని రష్మిక రివీల్ చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో విజయ్, రష్మిక విడివిడిగా పోస్టు ఫొటోలు ఒకే లోకేషన్వి కావడంతో వారు డేట్లో ఉన్నట్లు వార్తలు పుకార్లు మెుదలయ్యాయి. ఇందులో వాస్తవమేదో తెలియక అటు విజయ్ ఫ్యాన్స్, ఇటు రష్మిక ఫ్యాన్స్ తలలు బాదేసుకునేవారు. ఇన్నాళ్లకు తమకు కావాల్సిన సమాధానం వచ్చిందని ఇరువురు ఫ్యాన్స్ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. విజయ్ - రష్మిక రీల్ లైఫ్లోనే కాదు.. రియల్ లైఫ్లోనూ చూడముచ్చటగా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.
మెంటల్ క్యారెక్టర్ చేయాలి: రష్మిక
ఆనంద్ దేవరకొండకు 'బేబీ' (Baby) ద్వారా బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ సాయి రాజేష్ (Sai Rajesh) కూడా ఈ ఈవెంట్కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన గురించి రష్మిక మాట్లాడుతూ 'నేను బేబీ సినిమా చూశాను. ఆ సినిమా చూశాక మీతో సినిమా చేయాలని అనుకున్నాను. అలాంటి సినిమా చేయడం అంటే అంత ఈజీ కాదు. మీ హార్డ్ వర్క్, డెడికేషన్ నాకు తెలుసు. మెుదటిసారి బేబీ చూసినప్పుడు ఏడ్చేశా. ఒక నటిగా ఆ సినిమా చూశాక.. ఒక మెంటల్ క్యారెక్టర్ అయినా మీ డైరెక్షన్లో చేయాలనిపించింది' అని రష్మిక వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://twitter.com/i/status/1795146872748728505
‘గం గం గణేశా’ రిలీజ్ ఎప్పుడంటే?
ఇక గం గం గణేశా చిత్రానికి వస్తే.. ఈ మూవీకి ఉదయ్ శెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో ఆనంద్ దేవరకొండ సరసన ప్రగతి శ్రీవాత్సవ, నయన్ సారిక నటించారు. ఈ సినిమాలో జబర్దస్త్ ఫేమ్ ఇమ్మాన్యుయేల్, బిగ్ బాగ్ ఫేమ్ ప్రిన్స్ యావర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే ‘గం గం గణేశా’ సినిమా నుంచి రిలీజయిన టీజర్, ట్రైలర్స్తో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మే 31న ఈ సినిమా గ్రాండ్గా విడుదల కానుంది.
మే 28 , 2024
![Rashmika Mandanna: విజయ్, రష్మిక దొరికిపోయారుగా..ఇవిగో సాక్ష్యాలు!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/01/18181229/Untitled-design-2024-01-18T181151.437.jpg)
Rashmika Mandanna: విజయ్, రష్మిక దొరికిపోయారుగా..ఇవిగో సాక్ష్యాలు!
టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఏదోక రూపంలో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. వారిద్దరూ ప్రేమలో ఉన్నారా లేదా అనే విషయంపై క్లారిటీ లేకపోయినా.. సహజీవనం మాత్రం చేస్తున్నారంటూ తాజాగా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. వారం రోజుల వ్యవధిలో విజయ్, రష్మికలు షేర్ చేసుకున్న సోషల్ మీడియా పోస్టులే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాయి.
https://twitter.com/middaygujarati/status/1746832311000400204?s=20
విజయ్, రష్మికలు సీక్రెట్గా వియత్నాం వెకేషన్కు వెళ్లినట్లు తెలుస్తోంది. వారిద్దరూ విడివిడిగా తమ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్టులను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఒకే బ్యాక్గ్రౌండ్తో వీరిద్దరూ పలుమార్లు విడివిడిగా ఫోటోలను షేర్ చేశారు. దీంతో వీరు లివింగ్ రిలేషన్షిప్ (సహజీవనం) చేస్తున్నారంటూ నేషనల్ మీడియా కోడై కూస్తోంది. అందుకే వారు పెళ్లికి ఆసక్తి చూపడం లేదని చెప్పుకొస్తోంది.
విజయ్, రష్మిక ఎంగేజ్మెంట్ గురించి వార్తలు కూడా ఇటీవల తెగ వైరల్ అయ్యాయి. ఫిబ్రవరిలో వీరి నిశ్చితార్థం ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై విజయ్, రష్మిక ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అయితే విజయ్ టీమ్ మాత్రం అవి కేవలం రూమర్స్ మాత్రమేనని ఇందులో నిజం లేదని కొట్టిపారేసింది.
అయితే విజయ్, రష్మిక రిలేషన్లో ఉన్న మాట వాస్తవమేనని వారి సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం వారు చాలా హ్యాపీగా ఉన్నారని ఇప్పట్లో ఎంగేజ్మెంట్ చేసుకునే ఆలోచన వారికి లేదని తెలిపారు. ఈ జంట ఫోకస్ ప్రస్తుతం కెరీర్పై ఉందని, సినిమాల్లో నటిస్తూ బిజీగా వారు ఉన్నారని గుర్తుచేశారు.
ఇక సినిమాల విషయానికొస్తే ఇటీవల రష్మిక.. రణబీర్ కపూర్తో జోడీకడుతూ ‘యానిమల్’ సినిమాతో బ్లాక్బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. సందీప్ రెడ్డి వంగా క్రియేట్ చేసిన ‘యానిమల్’ వరల్డ్లో గీతాంజలి పాత్రలో రష్మిక నటన చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.
యానిమల్ సినిమాకు ఎంత నెగిటివిటీ వచ్చినా ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పాపులారిటీ మాత్రం సంపాదించుకుంది. ప్రస్తుతం రష్మిక చేతిలో ‘పుష్ప ది రూల్’తో పాటు ‘రెయిన్బో’, ‘ది గర్ల్ఫ్రెండ్’, ‘ఛావ’ అనే సినిమాలు ఉన్నాయి.
ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే.. గతేడాది సమంతతో చేసిన ఖుషి చిత్రం పాజిటివ్ టాక్ను తెచ్చుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది.
విజయ్ ప్రస్తుతం ‘గీతా గోవిందం’ డైరెక్టర్ పరశురామ్తో ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమా చేస్తున్నాడు. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో మరో ప్రాజెక్ట్ లైన్లో పెట్టాడు.
జనవరి 18 , 2024
![Fahadh Faasil: ‘పుష్ప’ సినిమాపై ఫహాద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్.. ఒరిగిందేమి లేదని అసంతృప్తి!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/05/07135749/Untitled-design-2024-05-07T135725.194.jpg)
Fahadh Faasil: ‘పుష్ప’ సినిమాపై ఫహాద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్.. ఒరిగిందేమి లేదని అసంతృప్తి!
టాలీవుడ్ ఖ్యాతిని పాన్ ఇండియా లెవల్కు తీసుకెళ్లిన చిత్రాల్లో పుష్ప ఒకటి. ఇందులో బన్నీ కెరీర్ బెస్ట్ నటనతో ఆకట్టుకున్నాడు. ఇందులో విలన్గా చేసిన మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్తెలుగుతో పాటు జాతీయ స్థాయిలో అందరికీ పరిచయమయ్యాడు. బన్నీ తర్వాత ఆ స్థాయిలో పుష్పలో ఆకట్టుకున్నాడు ఫహాద్ ఫాసిల్. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్యూలో ఫాహాద్ ఫాజిల్ పుష్ప చిత్రంపై సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.
‘పుష్ప నాకు చేసిందేమీ లేదు’
తాజాగా ఫిల్మ్ కంపానియన్కు ఇచ్చిన ఇంటర్యూలో కేరళ నటుడు ఫహాద్ ఫాజిల్ మాట్లాడాడు. ‘పుష్ప’ సినిమాపై యాంకర్ అడిగిన ప్రశ్నలకు షాకింగ్ రిప్లై ఇచ్చాడు. ‘పుష్ప’ తర్వాత ఫహాద్.. కేరళ హద్దులు దాటి పాన్ ఇండియా నటుడిగా మారారని అనుకుంటున్నట్లు యాంకర్ అన్నారు. ఇందుకు అందుకు ఫహాద్ బదులిస్తూ.. ’అలాంటిదేమీ లేదు. పుష్ప నాకు చేసిందేమీ లేదు. ఇదే విషయం సుక్కు సర్కు కూడా చెప్పాను. అందులో దాచుకోవాల్సిందేమీ లేదు. నేను ఇక్కడ మలయాళంలోనే సినిమాలు చేస్తున్నాను. ఎవరినీ అగౌరవపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. కానీ ఇది నిజం. పుష్పతో నా నుంచి ప్రేక్షకులు మ్యాజిక్ ఆశిస్తారని అనుకోవడం లేదు’ అని అన్నారు.
‘సుకుమార్ కోసమే ఒప్పుకున్నా’
ఓ సందర్భంలో మీతో పాటు కూర్చోడానికి బాలీవుడ్ నటుడు కాస్త వెనకడుగు వేశాడని.. మీ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిందని యాంకర్.. ఫహాద్తో అన్నారు. పుష్ప వల్లనే మీరు ఈ స్థాయికి చేరారని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. అప్పుడు ఫహాద్ స్పందిస్తూ.. ‘పుష్ప కేవలం సుకుమార్పై ఉన్న ప్రేమతో మాత్రమే చేశా. ఇప్పుడు మలయాళం తెలియని ప్రేక్షకులు కూడా మలయాళ సినిమాలు చూస్తున్నారు. అది నాలో ఉత్సాహం నింపుతోంది. అంతే తప్ప పుష్ప నన్ను ఎక్కడికో తీసుకెళ్లింది అని మాత్రం నేను అనుకోవడం లేదు’ అని ఫహాద్ స్పష్టం చేశాడు.
నా ఫేవరేట్ స్టార్స్ వారే: ఫహాద్
యాంకర్ అడిగిన మరో ప్రశ్నకు సమాధానమిస్తూ తాను పాన్ ఇండియా స్టార్ను కాదని కేవలం నటుడిని మాత్రమేనని ఫహాద్ తేల్చి చెప్పాడు. ఇక తనకు రాజ్ కుమార్ మంచి నటుడని తెలిపాడు. రణ్బీర్ కపూర్ దేశంలోనే అత్యుత్తమ యాక్టర్ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల ఫహాద్ నటించిన ఆవేశం చిత్రం బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఫహాద్ పుష్ప 2 సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కానుంది.
మే 07 , 2024
![17 Years for POKIRI: ఇండస్ట్రీ హిట్ ట్రెండ్ సెట్టింగ్ సినిమాలో అసలు ప్రత్యేకత ఏంటి?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/04/28153654/17-Years-for-POKIRI-min-scaled.jpg)
17 Years for POKIRI: ఇండస్ట్రీ హిట్ ట్రెండ్ సెట్టింగ్ సినిమాలో అసలు ప్రత్యేకత ఏంటి?
తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరో…! సింపుల్ స్టోరీ లైన్… ! చివర్లో చిన్న ట్విస్ట్…! కానీ, ఇందులో పాత్రలు మాట్లాడాయి. డైలాగులు గుర్తిండిపోయేలా పేలాయి. పాటలు మార్మోగాయి. ఇన్నీ జరిగాయి కనుకే ఇండస్ట్రీ హిట్ అనే కొత్త ట్రెండ్ సెట్ చేసింది. దాదాపు మూడేళ్ల పాటు ఆ సినిమా కలెక్షన్లను కొట్టే చిత్రమే రాలేదంటే నమ్ముతారా? ఏం సినిమా అనుకుంటున్నారా ! మహేశ్ బాబు నటించిన “పోకిరి”. చిత్రం విడుదలై నేటికి సరిగ్గా 17 ఏళ్లు అయ్యింది. ఈ సమయంలో మరొక్కసారి అలా ఓసారి సినిమాను గుర్తు చేసుకుందాం.
మాస్ టచ్
“ గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. కడప కింగ్ అని తీయ్ 200 సెంటర్స్ 100 డేస్”. ఈ సినిమాకు సరిగ్గా సరిపోయే మాట ఇది. లేకపోతే మహేశ్ బాబు లాంటి హీరోను పెట్టి “పోకిరి” అనే టైటిల్ పెట్టి ఏకంగా రికార్డులు తిరగరాశాడంటే పూరి జగన్నాథ్ గట్స్ను మెచ్చుకోవాలా? వద్దా?. మాస్ ఆడియన్స్ మెుత్తం థియేటర్లకు క్యూ కట్టారంటే టైటిల్ వల్లే కదా.
స్టైల్ సాలా
సినిమాలో హీరో ఓ గ్యాంగ్స్టర్. డిఫరెంట్గా కనిపించాలి కదా మరి. అందుకే ఇద్దరూ కలిసి అలా కాసేపు మాట్లాడుకొని నిర్ణయించుకున్నారు. ఏంటంటే? షర్ట్ మీద షర్ట్ వేసేద్దాం గురూ అని. ఇంకేముంది అదో ట్రెండ్ సెట్ అయ్యింది.
మాటల తూటాలు
పూరీ జగన్నాథ్ అంటే మాస్ డైలాగులే. పోకిరి చిత్రంలో వాటికి కొదవ లేదు. ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను ఇలా పవర్ ప్యాక్డ్ డైలాగులు ఒక్కటేమిటీ బోలేడున్నాయి. సినిమా ఆ స్థాయిలో ఉండటానికి కారణం అయ్యాయి.
స్వాగ్ సాంగ్స్
పోకిరి సినిమాలో పాటలు ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డోలే డోలే దిల్ జర జర అంటూ మహేశ్ కుర్చీలో కూర్చొని వేసిన ఓ స్వాగ్ స్టెప్ ఎవరైనా మర్చిపోతారా? అంతేనా..ఇందులో ఉన్న 6 పాటలు సూపర్ హిట్టే.
https://www.youtube.com/watch?v=obUCNoFPG1Y
https://www.youtube.com/watch?v=Cuzj7kbftwU
కృష్ణమనోహర్ IPS
గ్యాంగ్స్టర్ పండుగాడు శత్రువులపై బుల్లెట్స్ వర్షం కురిపించి ఒక్కసారిగా కృష్ణ మనోహర్ IPSగా పోలీస్ గెటప్లో కనిపిస్తే ఆ సీన్ గుర్తొస్తేనే గూస్బంప్స్ వస్తాయి కదా ! పూరీ మార్క్ మరి ఆ మాత్రం లేకుండా ఎలా ఉంటుంది.
ఇండస్ట్రీ హిట్
సినిమా తీశాక ఇందులో ఏముంది అనుకున్నారంటా? అస్సలు ఆడదని కొందరు చెప్పారంటా? ఒక్కసారి విడుదలయ్యాక వాళ్లే ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది. దెబ్బకి కొడితే ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఈ పదాన్ని అప్పుడే సృష్టించారంటే నమ్మండి. పక్కా కమర్షియల్ చిత్రానికి కావాల్సిన మాటలు, పాటలు అన్నీ ఉన్నాయి కనుకే బాక్సాఫీస్ను షేక్ చేసింది. రూ.10 కోట్ల బడ్జెట్తో తీస్తే.. ఏకంగా రూ. 66 కోట్లు వసూలు చేసింది. అప్పుడు రూ 66 కోట్లు అంటే ఇప్పుడు రూ. 1000 కోట్లకు సమానమే అవుతుంది కదా. రీరిలీజ్లోనూ పోకిరి చిత్రం రూ. 1.7 కోట్లు వసూలు చేసింది.
ఎందరిని దాటుకుని మహేశ్ దగ్గరికి వచ్చిందో తెలుసా?
పూరి సినిమా తీస్తున్నాడంటే మూడు నెలల్లో అయిపోవాల్సిందే. అస్సలు సమయం వృథా చేయడు. ఓ హీరోకి కథ చెప్పి ఎక్కువ ఆలస్యం అవుతుందనిపిస్తే ఇంకో హీరోతో తీసేస్తాడంతే. పోకిరి కూడా మహేశ్బాబుకి అలా వచ్చిందే. సినిమా స్టోరీని మెుదట పవన్ కల్యాణ్కు చెప్పాడు పూరీ. కానీ, పవన్ పెద్దగా ఆసక్తి చూపలేదు. తర్వాత రవితేజకు వినిపించాడు. ఓకే చెప్పినప్పటికీ కొన్ని కారణాల వల్ల పట్టాలెక్కలేదు. అనంతరం సోనూసూద్ని పెట్టి తీసేద్దాం అనుకున్నాడట. ఇది కూడా మూలన పడింది. తర్వాత మహేశ్ ఓకే చెప్పడంతో ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది.
పోకిరి సినిమాకు ముందు అనుకున్న టైటిల్
పోకిిరి సినిమాకు ముందు ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్య నారాయణ అనే టైటిల్ పెట్టాడు జగన్. కానీ, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్చాలని సూచించాడు మహేశ్. దానికి ఒప్పుకున్న పూరి పోకిరి అనే ఖరారు చేశాడు.
ఏప్రిల్ 28 , 2023
![Jhanvi Kapoor: నా కళ్లు కాదు.. అబ్బాయిలు ఇంకేదో చూస్తారు.. జాన్వీ అఫిషియల్ లీక్!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/01/04161248/Untitled-design-2024-01-04T161219.065.jpg)
Jhanvi Kapoor: నా కళ్లు కాదు.. అబ్బాయిలు ఇంకేదో చూస్తారు.. జాన్వీ అఫిషియల్ లీక్!
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ లేటెస్ట్ గ్లామర్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో సోదరి ఖుషీతో కలిసి పాల్గొన్న ఆమె రెడ్ డ్రెస్లో మెరిసిపోయింది. ఎద అందాలను చూపిస్తూ కుర్రకారుని అలరించింది.
ఈ షోలో జాన్వీ పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఏ హీరో అయినా కొంటెగా మెసేజ్ చేశాడా? అని కరణ్ జోహర్ ప్రశ్నించగా.. నీ బాడీలోని బ్యూటీ స్పాట్స్ చెప్తావా అంటూ ఓ హీరో తనకు టెక్స్ట్ చేసినట్లు జాన్వీ సమాధానం ఇచ్చింది.
మరో ప్రశ్న కింద అబ్బాయిలు నీలో మెుదట చూసేది ఏంటని కరణ్ జోహార్ అడగ్గా.. తన కళ్లు బాగుంటాయని, చాలామంది వాటికి ఆకర్షితులవుతారని జాన్వీ చెప్పింది. అదేంటో వాళ్ల చూపులు మాత్రం కళ్ల మీదకు కాకుండా ఇంకెక్కడికో వెళ్తుంటాయని నవ్వుతూ తెలిపింది.
ఈ ఎపిసోడ్లో జాన్వీ తన ప్రియుడు శిఖర్ పహారియా గురించి మాట్లాడారు. శిఖర్తో డేటింగ్ నిజమా? అబద్ధమా? అన్న కరణ్ జోహార్ ప్రశ్నకు శిఖర్ తన ఫ్యామిలీలో అందరికీ ఇష్టమని జాన్వీ సమాధానం ఇచ్చింది.
శిఖర్ చాలా నిస్వార్థంగా, గౌరవప్రదంగా ఉండే వ్యక్తి అని.. తనలాంటి వ్యక్తిత్వం ఉన్న మగవారిని తాను ఇప్పటివరకు చూడలేదని జాన్వీ చెప్పారు. తన తండ్రి బోనీ కపూర్, చెల్లెలు (ఖుషి) అందరికీ మంచి స్నేహితుడిలా ఉన్నాడని పేర్కొంది.
ప్రస్తుతం జాన్వీ తెలుగులో 'దేవర' చిత్రంలో నటిస్తోంది. న్యూయర్ సందర్భంగా దేవర పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. జనవరి 8న సినిమా గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ గ్లింప్స్ కోసం తెగ ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాలో జాన్వీ కపూర్ మత్స్యకారుని కూతురిగా కనిపించనున్నట్లు ఆమె పోస్టర్లను బట్టి అర్థమవుతోంది. జాన్వీ లుక్ చాలా వరకూ లంగా ఓణీలో ఉంటుందని టాక్. ఇక తారక్ ఈ మూవీలో ట్రైబల్ లుక్లో కనిపించనున్నారని, ఈ సినిమాలో అతడి పాత్ర పేరు తంగం అని తెలుస్తోంది.
ఇక దేవర సినిమాను రెండు పార్ట్లుగా ప్రకటించగా తొలి భాగం ఏప్రిల్ 5న విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే తెలిపారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్, మలయాళం స్టార్ టామ్ చాకోలు విలన్స్గా కనపడబోతున్నారు.
ఇక జాన్వీ సినిమాల విషయానికి వస్తే.. దేవరతో పాటు ఆమెకు మరో తెలుగు సినిమాలో అవకాశం వచ్చినట్లు లేటెస్ట్ టాక్. ఏజెంట్ తర్వాత అఖిల్ చేయబోతున్న మూవీలో ఆమెకు అవకాశం ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
ఈ సినిమాలతో పాటు జాన్వీకి తెలుగులో మరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. చాలా పేర్లు పరిశీలించిన టీమ్ చివరకు జాన్వీని ఓకే చేసినట్లు టాక్.
ఇక జాన్వీ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. ఆమె హిందీలో ఒక్కో సినిమాకు రూ.3.5 కోట్ల వరకూ తీసుకుంటుందట. అయితే తెలుగులో మాత్రం రూ.5 కోట్లు డిమాండ్ చేస్తుందని అంటున్నారు. జాన్వీ ముంబైలోని జుహు ప్రాంతంలో రూ.39 కోట్ల రూపాయలతో ఓ ఖరీదైన ఇంటిని సొంతం చేసుకుందని బాలీవుడ్ వర్గాల్లో టాక్.
జనవరి 04 , 2024
![బ్యాచిలర్ న్యూఇయర్ సెలెబ్రేషన్స్కు 8 బెస్ట్ స్పాట్స్](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/02/14100004/cropped-ws_image-130.png)
బ్యాచిలర్ న్యూఇయర్ సెలెబ్రేషన్స్కు 8 బెస్ట్ స్పాట్స్
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్సైట్ చూడండి.
YouSay యాప్
డౌన్లోడ్ చేసుకోండి.Download Our App
ఫిబ్రవరి 14 , 2023
![Tollywood comedians: వీరు మాట్లాడితే నవ్వులే.. తెలుగులో హాస్యాన్ని పండిస్తున్న కామెడీ స్టార్స్..!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/04/07100936/Featured-image-44.jpg)
Tollywood comedians: వీరు మాట్లాడితే నవ్వులే.. తెలుగులో హాస్యాన్ని పండిస్తున్న కామెడీ స్టార్స్..!
దశాబ్దాల కాలంగా వేలాది సినిమాలు ప్రజలను అలరిస్తున్నాయి. సినీ ప్రియులు కూడా తమ ప్రధాన వినోద మార్గంగా సినిమాలను చూస్తున్నారు. అయితే థియేటర్లకు వచ్చే ఆడియన్స్ను కడుప్పుబ్బా నవ్వించి ఇంటికి పంపడంలో హాస్యనటులు కీలకపాత్ర పోషిస్తారు. గత కొన్నేళ్లుగా ఎంతో మంది హాస్యనటులు ప్రేక్షకులను నవ్వించి వారి మన్ననలు పొందారు. ఈతరంలోనూ కొందరు కమెడియన్లు కడుపుబ్బా నవ్విస్తూ విశేష ఆదరణ పొందుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో మంచి హాస్యనటులుగా గుర్తింపు పొందిన 10 మంది నటుల గురించి ఇప్పుడు తెలుసుకుందా.
బ్రహ్మానందం
టాలీవుడ్ దిగ్గజ కమెడియన్లలో బ్రహ్మానందం ఒకరు. తన కామెడితో హాస్య బ్రహ్మగా బ్రహ్మీ గుర్తింపు పొందారు. వెయ్యికి పైగా చిత్రాల్లో కమెడియన్గా చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. ఇటీవల రంగమార్తండ సినిమాలో నటించిన బ్రహ్మనందం ఇప్పటివరకూ చేసిన పాత్రలకు పూర్తిగా భిన్నంగా నటించారు. ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ ఉండే బ్రహ్మీ.. ఈ సినిమాతో ప్రేక్షకులను కంటతడి పెట్టించారు.
ఆలీ
టాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఆలీ కూడా ఒకరు. ఆలీ కూడా బ్రహ్మీ లాగే 1000కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు. యాంకర్గా, బుల్లితెర వ్యాఖ్యాతగా కూడా ఆలీ రాణించాడు. కామెడి అంటే ఆలీదే అనే స్థాయికి ఎదిగాడు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే పలు సేవా కార్యక్రమాల్లోనూ ఆలీ చురుగ్గా వ్యవహిస్తున్నాడు. తన తండ్రి మహ్మద్ బాషా పేరుమీద ట్రస్టు ఏర్పాటు చేసి పేదలకు సేవ చేస్తున్నాడు. ఇటీవల ఆలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ఏపీ ప్రభుత్వం నియమించింది.
వెన్నెల కిషోర్
వెన్నెల చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన వెన్నెల కిషోర్ ఆ సినిమాతోనే స్టార్ కమెడియన్గా మారిపోయారు. కోపిష్టిగా ఎన్నో పాత్రల్లో నటించి ప్రేక్షకులకు కితకితలు పెట్టాడు. వెన్నెల కిషోర్ ఉంటే ఇక ఆ సినిమా హిట్టే అన్నంత రేంజ్కు ఎదిగాడు. దూకుడు, దేనికైనా రెడి, బిందాస్ వంటి చిత్రాల్లో వెన్నెల కిషోర్ కామెడీ ఆకట్టుకుంటుంది.
సునీల్
టాలీవుడ్ టాప్ కమెడియన్స్లో సునీల్ కూడా ఒకరు. తన విభిన్నమైన భాష, నటనతో సునీల్ ఎంతో పేరు సంపాదించాడు. కెరీర్ పీక్స్లో ఉండగా సునీల్ హీరోగా మారి అందరికీ షాక్ ఇచ్చాడు. హీరోగా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ప్రస్తుతం మళ్లీ సపోర్టింగ్ రోల్స్లో సునీల్ కనిపిస్తున్నాడు. తన సెకండ్ ఇన్నింగ్స్లో విలన్ పాత్రల్లో కూడా నటిస్తూ ఆదరణ పొందుతున్నాడు. ఇటీవల పుష్ప సినిమాలో విలన్గా కనిపించి మెప్పించాడు.
పృథ్వీ
థర్టీ ఇయర్స్ అనగానే నటుడు పృథ్వీ ఠక్కున గుర్తుకువస్తాడు. తనదైన కామెడి టైమింగ్తో ఎన్నో సినిమాల్లో పృథ్వీ మెప్పించాడు. ముఖ్యంగా బాలయ్యను ఇమిటేట్ చేస్తూ ఆయన చేసి కామెడీ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది.
ప్రియదర్శి
పెళ్లిచూపులు చిత్రం ద్వారా నటుడు ప్రియదర్శి అందరి దృష్టిని ఆకర్షించాడు. తనదైన కామెడీతో ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ప్రియదర్శి జాతిరత్నాలు చిత్రంతో మంచి కమెడియన్గా ఇండస్ట్రీలో స్థిరపడ్డాడు. ఓ వైపు హాస్యనటుడిగా చేస్తూనే మధ్య మధ్యలో హీరోగా కనిపించి మెప్పిస్తున్నాడు. ఇటీవల ప్రియదర్శి చేసిన బలగం సినిమా ఘన విజయం సాధించింది.
సప్తగిరి
పరుగు సినిమా ద్వారా సప్తగిరి టాలీవుడ్కు పరిచయమయ్యాడు. ఆ తర్వాత గణేష్, సాధ్యం, కందిరీగ, నిప్పు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. వెంకటాద్రి సినిమాలో సప్తగిరి కామెడీనే హైలెట్ అని చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన ప్రేమకథా చిత్రంతో సప్తగిరి స్టార్ కమెడియన్లలో ఒకరిగా మారిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు పలు సినిమాల్లో నటించిన సప్తగిరి ప్రేక్షకులను తనదైన కామెడితో అలరిస్తున్నాడు.
సత్య అక్కల
టాలీవుడ్లో మంచి కమెడియన్గా సత్య అక్కాల ఎదుగుతున్నాడు. హీరో ఫ్రెండ్ పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. పల్లెటూరు నేపథ్యంలో సాగే సినిమాల్లో సత్యం అక్కాల తప్పనిసరిగా ఉండాల్సిందే. పల్లెటూరు వ్యక్తిగా, కోపిష్టిగా సత్యం చేసే కామెడి ప్రేక్షకులను ఫిదా చేస్తుంది.
శ్రీనివాస రెడ్డి
హాస్యనటుడిగా తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన నటుల్లో శ్రీనివాస రెడ్డి ఒకరు. ఇష్టం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇడియట్ సినిమాతో గొప్ప కమెడియన్గా పేరు తెచ్చుకున్నాడు. హాస్యనటుడిగా చేస్తూనే పలు సినిమాల్లో హీరోగా కూడా శ్రీనివాసరెడ్డి కనిపించాడు. గీతాంజలి, జంబలకిడిపంబ, జయమ్ము నిశ్చయమ్మురా చిత్రాల్లో కథానాయకుడిగా నటించి అలరించాడు.
షకలక శంకర్
జబర్దస్త్ షో ద్వారా కెరీర్ ఆరంభించిన షకలక శంకర్ సినిమాల్లోకి కమెడియన్గా ఎంట్రీ ఇచ్చాడు. శ్రీకాకుళం యాసలో మాట్లాడుతూ చేసే శంకర్ కామెడీ తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. దీంతో కమెడియన్గా శంకర్కు వరుస అవకాశాలు వస్తున్నాయి. రాజుగారి గది సినిమాలో తన అద్భుతమైన కామెడితో శంకర్ ఆకట్టుకున్నాడు.
ఏప్రిల్ 07 , 2023
![Varun Tej Reception: వైభవంగా వరుణ్-లావణ్య రిసెప్షన్.. సందడి చేసిన సినీ ప్రముఖులు..! ](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/11/06161722/Untitled-design-55.jpg)
Varun Tej Reception: వైభవంగా వరుణ్-లావణ్య రిసెప్షన్.. సందడి చేసిన సినీ ప్రముఖులు..!
టాలీవుడ్ స్టార్స్ వరుణ్తేజ్ (Varun Tej Konidela), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) మ్యారెజ్ రిసెప్షన్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఆదివారం రాత్రి హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వేడుకలో పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. #VarunTejReception హ్యాష్ట్యాగ్తో రిసెప్షన్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుకేద్దాం.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఈ రిసెప్షన్లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బ్లాక్ కలర్ కోటులో మనవరాలితో కలిసి వేడుకకు హాజరయ్యారు. నవ దంపుతులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేష్ కూడా రిసెప్షన్లో సందడి చేశారు. వరణ్-లావణ్యలకు శుభాకాంక్షలు తెలిపి వారితో ఫొటోలు దిగారు.
యంగ్ హీరో నాగ చైతన్య కూడా రిసెప్షన్లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బియర్డ్ లుక్లో పెళ్లి కొడుకు, కూతురితో ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు
యంగ్ హీరోలు సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్లతో పాటు నాగబాబు దంపతులు, నిహారిక ఈవెంట్లో హల్చల్ చేశారు.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ దంపతులు సైతం రిసెప్షన్కు హజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి ఫొటో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు దంపతులు కూడా రిసెప్షన్ ఈవెంట్లో సందడి చేశారు.
యువ హీరో అల్లు శిరీష్ ఈవెంట్లో అందరి దృష్టిని ఆకర్షించాడు. వైట్ అండ్ బ్లాక్ కోటులో వరుణ్, లావణ్య జంటతో ఫొటో దిగారు.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దంపతులు, మరో డైరెక్టర్ సంపత్ నంది కూడా రిసెప్షన్కు హాజరయ్యారు.
బెల్లంకొండ ఫ్యామిలీ కూడా ఈ వేడుకలో తళుక్కుమంది. నిర్మాత బెల్లంకొండ సురేష్ దంపతులు వారి పెద్ద కుమారుడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్, చిన్న కుమారుడు రిసెషన్షన్కు వెళ్లారు.
యంగ్ హీరో కార్తికేయ, నటుడు నవదీప్ కూడా యువ జంటతో కలిసి ఫొటోలు దిగారు.
టాలీవుడ్ యువ హీరోలు సాయి సజ్జ, అడవి శేషు, సందీప్ కిషన్ నవ దంపతులతో ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం వీరి ఫొటోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి.
సీనియర్ నటుడు జగపతి బాబు సైతం వేడుకకు హాజరై కొత్త జంటకు ఆశీర్వచనాలు అందజేశారు.
నవంబర్ 06 , 2023
![Varun Tej Marriage: పెళ్లి బంధంతో ఒక్కటైన వరుణ్- లావణ్య.. వివాహ వేడుక ఇటలీలోనే ఎందుకంటే?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/11/01163538/Untitled-design-47.jpg)
Varun Tej Marriage: పెళ్లి బంధంతో ఒక్కటైన వరుణ్- లావణ్య.. వివాహ వేడుక ఇటలీలోనే ఎందుకంటే?
టాలీవుడ్ స్టార్స్ వరుణ్తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇటలీ (Italy)లోని టస్కనీ (Tuscany)లో కుటుంబ సభ్యులు, అత్యంత ఆత్మీయుల మధ్య వీరు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మ. 2.48 నిమిషాలకు వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్చరణ్-ఉపాసన, బన్నీ దంపతులు సందడి చేశారు.
అంతకుముందు పెళ్లి వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి కాక్టేల్ పార్టీ (Cocktail party) నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక మంగళవారం రాత్రి హల్దీ, మెహందీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో వధూవరులిద్దరూ పసుపు వర్ణం దుస్తుల్లో మెరిసిపోయారు. ఇక మెగా, అల్లు కుటుంబ సభ్యులంతా ఈ వేడుకలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు #VarunLav హ్యాష్ట్యాగ్తో ట్రెండ్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే వరుణ్ లావణ్య జంట ఇటలీనే పెళ్లి వేదికగా ఎందుకు ఎంచుకుందన్న సందేహం చాలా మందిలో ఉంది. ఎన్నో డెస్టినేషన్ వెడ్డింగ్ పాయింట్స్ ఉండగా ఇటలీనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారని చాలా మంది ప్రశ్న. అయితే దీనికి ఓ ప్రధాన కారణమే ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
వివరాల్లోకి వెళితే.. 2017లో వచ్చిన 'మిస్టర్' సినిమాతో వరుణ్ తేజ్ - లావణ్య మధ్య పరిచయం ఏర్పడింది. ఆ సినిమా షూటింగ్లోనే ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు. కాలక్రమేణా ఇద్దరూ ప్రేమికులుగా మారిపోయారు. అయితే ఆ సినిమా ఇటలీలోని షూటింగ్ జరుపుకోవడం విశేషం. అలా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ప్రేమకు తొలి అడుగు ఇటలీలోనే పడింది.
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠికి తన ప్రేమను ఇటలీలోనే వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఆ విధంగా తమ ప్రేమకు మూలమైన ఇటలీని, తాము పెళ్లి చేసుకోవడానికి వేదికగా మార్చుకున్నారు ఈ జంట. అంతేకాదు సుందరమైన ప్రాంతాలతో ఇటలీలోని టస్కనీ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు ఎంతో ప్రసిద్ధిగాంచింది.
ఇక వీరిద్దరి పెళ్ళికి వరుణ్ తేజ్ సన్నిహితులలో ఒకరైన యువ హీరో నితిన్ దంపతులు, నిహారిక, లావణ్య త్రిపాఠికి సన్నిహితురాలైన రీతూ వర్మ కూడా హాజరయ్యారు. సమంత, నాగచైతన్య, రష్మిక మందాన, పూజ హెగ్డే కూడా వీరి పెళ్లికి హాజరైనట్లు తెలిసింది.
నవంబర్ 01 , 2023
![సోషల్ మీడియాలో #RC15 vs #JrNTR ఫ్యాన్ వార్… ట్రెండింగ్లో పోటా పోటీ ](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/03/09153519/dsfsdafaFFGSGggdgsSgfsfDf.jpg)
సోషల్ మీడియాలో #RC15 vs #JrNTR ఫ్యాన్ వార్… ట్రెండింగ్లో పోటా పోటీ
ప్రస్తుతం సోషల్ మీడియా స్టార్స్ అంటే రామ్ చరణ్, ఎన్టీఆర్. ఎందుకంటే గత రెండు నెలలుగా దాదాపు వీరిద్దరి పేరు ట్విటర్లో మార్మోగుతుంది. ఇద్దరి హీరోల అభిమానుల మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. పోటాపోటీగా హ్యాష్ ట్యాగ్స్ను ట్రెండ్ చేస్తున్నారు. నిన్నటి వరకు jrNTR పేరు ట్రెండింగ్లోకి రాగా.. ఇప్పుడు RC15 ట్రెండ్ నడుస్తోంది. టైటిల్ ప్రకటన చరణ్ పుట్టినరోజు ప్రకటిస్తామని దిల్ రాజు చెప్పటంతో అభిమానులు జోష్లో ఉన్నారు.
ట్విటర్ వార్
గత కొన్ని నెలలుగా రామ్ చరణ్ ఏదో విధంగా ట్విటర్లో ట్రెండ్ అవుతున్నారు. HCA అవార్డ్ వచ్చినప్పటి నుంచి చరణ్, ఎన్టీఆర్ మధ్య ఫ్యాన్ వార్ నడుస్తోంది. పోటాపోటీగా ట్వీట్లు పెడుతూ ఇద్దరిని ట్రెండ్ చేస్తున్నారు. నిన్నటి వరకు jrNTR హ్యాష్ ట్యాగ్ దూసుకెళ్లగా.. ఇప్పుడు RC15పై రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆస్కార్ ముంగిట ఇద్దరి హీరోల అభిమానులు హంగామా సృష్టిస్తున్నారు.
హ్యాష్ట్యాగ్స్తో హల్చల్
ఎన్టీఆర్ 30లో జాన్వీ కపూర్ను ఎంపిక చేయటంతో ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లుగా వీడియోను సృష్టించారు అభిమానులు.
https://twitter.com/i/status/1632680528578228224
అభిమాన నటుడితో నటిస్తున్నట్లు జాన్వీ ట్వీట్ చేయగా… ఆమెను స్వాగతిస్తూ జూనియర్ ఎన్టీఆర్ విషెస్ చెప్పిన స్క్రీన్ షాట్లు తీసి తెగ షేర్ చేశారు.
(1) Fukkard on Twitter: "On Cards ? #Dhanush - #JrNTR - #Vetrimaaran https://t.co/UXMEORDP78" / Twitter
షారుఖ్ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నట్లు ఓ వార్తను ట్విటర్లో ట్రెండ్ చేయగా.. వెట్రీమారన్ దర్శకత్వంలో ఎన్టీఆర్, ధనుష్ కాంబినేషన్లో సినిమా వస్తుందని తారక్ అభిమానులు ట్వీట్ల వర్షం కురిపించారు.
https://twitter.com/Fukkard/status/1633109919753805826?s=20
యంగ్ టైగర్ అమెరికాలో బిజీబిజీగా గడుపుతూ ఫ్యాన్స్తో సమావేశాలు ఏర్పాటు చేసుకున్న వీడియోలు. అందులో కొన్ని ఫ్యాన్ మూమెంట్స్ వైరల్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1633007975412400132
టైటిల్పై రచ్చ
మరోవైపు శంకర్ కాంబినేషన్లో వస్తున్న RC15 సినిమా గురించి నెట్టింట్లో పెద్ద చర్చ నడుస్తోంది. చిత్రానికి C.E.O అనే టైటిల్ పెట్టారని టాక్ రావటంతో చెర్రీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక చరణ్ పుట్టిన రోజున టైటిల్ ప్రకటిస్తామని నిర్మాత దిల్ రాజు చెప్పేశాడు. దీంతో ట్విటర్లో RC15 హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
క్రేజీ కాంబినేషన్
RRR తర్వాత రామ్ చరణ్ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. భారీ చిత్రాల దర్శకుడు చరణ్తో సినిమా తీస్తుండటమే ఇందుకు కారణం. దిల్ రాజు నిర్మాతగా వస్తున్న ఈ సినిమా ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కియారా అద్వాణీ హీరోయిన్గా నటిస్తుండటంతో పాటు ఎస్జే సూర్య, సునీల్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
భారీ అంచనాలు
RC15కు శంకర్ దర్శకత్వం వహిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొనటం సహజం. విభిన్న చిత్రాలు రూపొందించే ఆయన చరణ్తో పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉన్న కథను ఎంచుకొని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందులో IAS అధికారిగా చరణ్ కనిపిస్తాడని తెలుస్తోంది. దీంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
టైటిల్ ఇదేనా?
సినిమా టైటిల్ గురించే ఇప్పుడే అతిపెద్ద చర్చ. చిత్రానికి CEO అనే టైటిల్ ఖరారు చేశారని సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి. బయటకు వినిపిస్తున్న కథకు… టైటిల్ కూడా సెట్ కావటంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. హిట్ ఖాయమని కామెంట్లు పెడుతున్నారు.
https://twitter.com/i/status/1633351074508845058
బర్త్డే కానుక
చరణ్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ ప్రకటిస్తామని నిర్మాత దిల్రాజు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దర్శకుడు శంకర్ లోగోను తీర్చిదిద్దుతున్నారని మార్చి 27 బర్త్డే రోజున విడుదల చేస్తామని వెల్లడించారు. సినిమా విడుదలపై కూడా అటు ఇటుగా ఓ స్పష్టత వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ ప్రకారం సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
https://twitter.com/i/status/1633737854919606273
ఫ్యాన్స్ నిరాశ
సినిమా ప్రకటించిన తర్వాత షూటింగ్ జరుగుతున్నా చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్లు లేవు. ఏ పండగకి కూడా ఎలాంటి పోస్టర్ విడుదల చేయలేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. ఒక్కోసారి దిల్రాజు హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ సర్ప్రైజ్ ఇస్తుండటం అభిమానుల్లో జోష్ నింపింది.
మార్చి 09 , 2023
![This Week OTT Movies: ఈవారం ఓటీటీ/ థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/04/01163122/Untitled-design-2024-04-01T163116.664.jpg)
This Week OTT Movies: ఈవారం ఓటీటీ/ థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు
కాలేజీ విద్యార్థుల పరీక్షలు ముగిశాయి. ఎండకాలం స్టార్ట్ అయిపోయింది. ఈ ఎండల వేడిని తగ్గించి చల్లని వినోదం అందించి ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTTలో సైతం పలు ఆసక్తికర చిత్రాలు ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్సిరీస్లు ఎంటో ఇప్పుడు చూద్దాం.
ఫ్యామిలీ స్టార్(Family Star)
రౌడ్ బాయ్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), గ్లామర్ డాల్ మృణాల్ ఠాకూర్ జంటగా... పరుశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న థియేటర్లోకి రానుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, పరుశురామ్ కాంబోలో వచ్చిన 'గీతా గోవిందం' బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలచింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్పై పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా ప్రమోషన్లను సైతం మూవీ మేకర్స్ భారీగా చేస్తున్నారు.
భరత నాట్యం
కొత్త కుర్రాడు సూర్య తేజ ఏలే(Actor Surya Teja Aelay) హీరోగా పరిచయం అవుతున్న సినిమా భరతనాట్యం. ఓ యువకుడి జీవితాన్ని సినిమా ఎలా మార్చిందన్నది ఈ చిత్రం కథ. సూర్య తేజకు జంటగా మీనాక్షి గోస్వామి హీరోయిన్గా స్క్రీన్ షేర్ చేసుకొనుంది. హర్షవర్ధన్, అజయ్ ఘోష్, వైవా హర్ష వంటి ఇతర నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
మంజుమ్మల్ బాయ్స్
మలయాళంలో సూపర్ హిట్గా నిలిచిన మంజుమ్మల్ బాయ్ తెలుగులో డబ్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్ను దక్కించుకున్న మైత్రి మూవీ మేకర్స్ ఏప్రిల్ 6న తెలుగురాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదల చేయనున్నారు. తక్కువ బడ్జెట్తో నిర్మాణమైన ఈ చిత్రం ఏకంగా రూ.200 కోట్లు బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది.
ప్రొజెక్ట్
లావణ్య త్రిపాఠి, సందీప్ కిషన్ కాంబోలో వచ్చిన తమిళ్ చిత్రం 'మాయవన్'... తెలుగులో ప్రొజెక్ట్గా రానుంది. సైన్స్ ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్ జనర్లో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా ఏప్రిల్ 6న విడుదల కానుంది. ఈ సినిమాలో డేనియల్ బాలాజీ, జయప్రకాశ్, మైమ్ గోపి వంటి వారు నటించారు.
బహుముఖం
హర్షివ్ కార్తిక్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బహుముఖం. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో హర్షివ్ కార్తిక్ స్వీయ దర్శకత్వం వహించాడు. గుడ్ బ్యాడ్ అండ్ యాక్టర్ ట్యాగ్లైన్ను ఈ చిత్రానికి అందించారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా స్వర్ణిమా సింగ్, మార్టినోవా కథానాయికలుగా చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ వారం ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateTogetherSeriesEnglishNetflixApril 2Files Of The UnexplainedSeriesEnglishNetflixApril 3RipleySeriesEnglishNetflixApril 4ScoopSeriesEnglishNetflixApril 5MusicaMovieEnglishAmazon primeApril 5Yeh Meri FamilySeriesHindiAmazon primeApril 4How to Date Billy WalshSeriesEnglishAmazon primeApril 5FarreyMovieHindiZee5April 5LambasingiMovieTelugu Disney+ HotstarApril 2
ఏప్రిల్ 01 , 2024
![ఇన్స్టాగ్రామ్లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న టాప్-10 తెలుగు హీరోలు వీళ్లే..!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/03/30120410/Featured-image-16.jpg)
ఇన్స్టాగ్రామ్లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న టాప్-10 తెలుగు హీరోలు వీళ్లే..!
మనిషి జీవితంలో సోషల్ మీడియా కూడా ఒక భాగంగా మారిపోయింది. రోజులో కనీసం ఒకసారైన ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్ తెరవని స్మార్ట్ ఫోన్ యూజర్ లేరని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుత రోజుల్లో సమాచారం చేరవేయడానికి సోషల్ మీడియా ప్రధాన వేదికగా మారింది. సోషల్ మీడియాకు ఆదరణ పెరగడంతో సినీ హీరోలు సైతం తమను తాము ప్రమోట్ చేసుకునేందుకు దీనిని వేదికగా చేసుకున్నారు. టాలీవుడ్లో చాలా మంది హీరోలు సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో సంచలనాలు సృష్టిస్తున్నారు. కోట్ల మంది ఫాలోయర్స్తో రికార్డులు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో అత్యధిక ఫాలోవర్స్ను కలిగిన టాప్-10 తెలుగు హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
1. అల్లుఅర్జున్:
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ క్రేజ్ ‘పుష్ప’ చిత్రంతో అమాంతం పెరిగిపోయింది. పాన్ ఇండియా స్థాయిలో పుష్ప విజయం సాధించడంతో బాలీవుడ్ ప్రేక్షకులు సైతం బన్నీకి అభిమానులుగా మారిపోయారు. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ బన్నీ ఇచ్చే అప్డేట్స్ తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగు హీరోల్లో అత్యధికమంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న నటుడిగా బన్నీ ఉన్నాడు. బన్నీ ఇన్స్టా ఖాతాను 20.3 మిలియన్స్ మంది ఫాలో అవుతున్నారు. అయితే బన్నీ మాత్రం తన భార్య స్నేహరెడ్డి ఖాతాను మాత్రమే ఫాలో అవుతుండటం గమనార్హం.
2. విజయ్ దేవరకొండ:
2017లో విడుదలైన అర్జున్ రెడ్డి మూవీతో విజయ్ దేవరకొండ ఓవర్నైట్ స్టార్గా ఎదిగాడు. తన విభిన్నమైన బాడీ లాంగ్వేజ్తో యూత్ను ఆకర్షించిన విజయ్.. తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేసుకున్నాడు. ఫలితంగా ఇన్స్టాలో రెండో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న తెలుగు హీరోగా విజయ్ నిలిచాడు. ప్రస్తుతం విజయ్ ఇన్స్టాగ్రామ్ ఖాతాను 17.9 మిలియన్స్ మంది ఫాలో అవుతున్నారు. కానీ విజయ్ ఏ ఒక్కరినీ కూడా ఫాలో అవ్వడం లేదు.
3. రామ్చరణ్
RRR చిత్రంతో రామ్చరణ్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమాలో చెర్రీ నటన చూసి చాలా మంది ఆయనకు అభిమానులుగా మారిపోయారు. ప్రస్తుతం రామ్చరణ్ ఇన్స్టాగ్రామ్ ఖాతాను 13.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. దీంతో టాప్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న తెలుగు హీరోల జాబితాలో చరణ్ 3వ స్థానంలో నిలిచాడు.
4. మహేశ్ బాబు
టాలీవుడ్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో మహేశ్ ఒకరు. మహేశ్ కొత్త సినిమా రిలీజ్ అంటే ఫ్యాన్స్కు పండగే అని చెప్పాలి. సామాజిక మాధ్యమాలకు మహేశ్ కాస్త దూరం పాటిస్తున్నప్పటికీ ఆయన ఫ్యాన్స్ మాత్రం మహేశ్ను విపరీతంగా ఫాలోఅవుతున్నారు. ప్రస్తుతం మహేశ్కు ఇన్స్టాగ్రామ్లో 10.1 మిలియన్స్ మంది ఫాలోవర్స్ ఉన్నారు.
5. ప్రభాస్:
బాహుబలి ముందు వరకు టాలీవుడ్కే పరిమితమైన ప్రభాస్ క్రేజ్ ఆ సినిమా తర్వాత విశ్వవ్యాప్తమైంది. ప్రభాస్ ఆహార్యం, నటన చూసి కోట్లాది మంది సినీ ప్రేక్షకులు ప్రభాస్కు అభిమానులుగా మారిపోయారు. అంతేగాక ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ ఖాతాను తెగ ఫాలో అవుతున్నారు.
ప్రస్తుతం 9.3 మిలియన్ ఫాలోవర్స్ను సంపాదించిన ప్రభాస్ టాప్-3 తెలుగు హీరోగా నిలిచాడు.
6. జూ.ఎన్టీఆర్
RRR చిత్రం రామ్చరణ్తో పాటు తారక్కు సైతం మంచి గుర్తింపు తీసుకొచ్చింది. NTR తన మిస్మరైజింగ్ నటనతో మరింత మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఇన్స్టాలో 5.9 మిలియన్ల మంది ఎన్టీఆర్ను ఫాలో అవుతున్నారు.
7. నాని
నేచురల్ స్టార్ నాని తన సహజ సిద్దమైన నటనతో టాలీవుడ్లో మంచి హీరోగా ఎదిగాడు. ఆయన లేటెస్ట్ మూవీ దసరా మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో నాని ఇమేజ్ మరింత పెరగనుంది. ప్రస్తుతం నాని ఇన్స్టాగ్రామ్ ఖాతాను 5.9 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.
8. రామ్ పోతినేని
యంగ్ హీరో రామ్ను ఇన్స్టాగ్రామ్లో పెద్ద సంఖ్యలోనే అభిమానులు ఫాలో అవుతున్నారు. మెుత్తం 3.6 మిలియన్ల మంది రామ్ను అనుసరిస్తున్నారు.
9. వరుణ్ తేజ్
మెగా హీరోల్లో అల్లుఅర్జున్ తర్వాత వరణ్తేజ్కే అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం వరుణ్ ఖాతాను కూడా 3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
10. అఖిల్ అక్కినేని
నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని నుంచి మూడు సినిమాలు విడుదలైనప్పటికీ అందులో ఒక్కటి కూడా ఆశించిన మేర విజయం సాధించలేకపోయింది. అయితే విజయాలతో సంబంధం లేకుండా అఖిల్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. అఖిల్ను సైతం 3 మిలియన్ల మంది ఇన్స్టాలో ఫాలో అవుతున్నారు.
మార్చి 30 , 2023
![Tollywood : బాలీవుడ్ను ఏలడానికి సిద్ధమవుతున్న తెలుగు డైరెక్టర్లు.. స్టార్ హీరోలతో సినిమాలు లాక్!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/05/06154807/Untitled-design-2024-05-06T154801.196.jpg)
Tollywood : బాలీవుడ్ను ఏలడానికి సిద్ధమవుతున్న తెలుగు డైరెక్టర్లు.. స్టార్ హీరోలతో సినిమాలు లాక్!
ప్రస్తుతం టాలీవుడ్ ఖ్యాతి విశ్వవ్యాప్తం అయ్యింది. ‘బాహుబలి’, ‘బాహుబలి 2’, ‘ఆర్ఆర్ఆర్’, ‘హనుమాన్’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాల ద్వారా టాలీవుడ్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. అయితే ఆ సినిమాలకు ముందు టాలీవుడ్ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండేది. బాలీవుడ్ వర్గాలకు తెలుగు ఇండస్ట్రీ అంటే కాస్త చిన్నచూపు ఉండేదని అప్పట్లో టాక్ వినిపించింది. ఒకప్పుడు బాలీవుడ్కే పరిమితమైన పాన్ ఇండియా చిత్రాలు ఇప్పుడు తెలుగులోనూ వస్తుండటంతో ఇక్కడి డైరెక్టర్ల ప్రతిభ హిందీ స్టార్లను ఆకర్షిస్తోంది. దీంతో వారు టాలీవుడ్ డైరెక్టర్లతో సినిమా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కొందరు టాలీవుడ్ డైరెక్టర్లతో బాలీవుడ్ స్టార్స్ సినిమాలు కూడా ఓకే అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ తెలుగు డైరెక్టర్లు ఎవరు? ఏ బాలీవుడ్ స్టార్తో వారు సినిమా చేయబోతున్నారు? ఈ కథనంలో చూద్దాం.
రణ్వీర్ - ప్రశాంత్ వర్మ
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma).. 'హనుమాన్' (Hanu Man) చిత్రంతో రాత్రికి రాత్రే స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు. ప్రశాంత్ అంటే బాలీవుడ్ వర్గాల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే అతడికి బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ (Ranveer Singh)తో సినిమా చేసే అవకాశం దక్కింది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఇతిహాసాలతో ముడిపడి ఉన్న పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంట్లో రణ్వీర్ ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషించనున్నట్లు ప్రచారం సాగుతోంది. అంతే కాదు దీనికి ‘రాక్షస్’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది.
సన్నీ డియోల్ - గోపిచంద్ మలినేని
దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni)కి టాలీవుడ్లో మంచి పేరు ఉంది. కొత్త తరహా కథతో అద్భుతమైన యాక్షన్ చిత్రాలను ఆయన రూపొందిస్తుంటారు. ఇలా వచ్చి సూపర్ హిట్ సాధించినవే ‘క్రాక్’ (Krack), ‘వీరసింహా రెడ్డి’ (Veera Simha Reddy) చిత్రాలు. ఇదిలా ఉంటే అతడికి బాలీవుడ్ నుంచి సూపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ‘గదర్ 2’ (Gadar 2)సినిమాతో బ్లాక్ బాస్టర్ అందుకున్న సన్నీ డియోల్ (Sunny Deol)తో గోపిచంద్ ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇది కూడా ఆయన శైలీలోని యాక్షన్ డ్రామాగా రానున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ వచ్చేనెలలో మెుదలు కానున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది.
షాహిద్ కపూర్ - వంశీ పైడిపల్లి
టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamsi Paidipally).. గత కొంతకాలంగా తెలుగు హీరోలకంటే ఇతర ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్తో పని చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఆయన గత చిత్రం ‘వారసుడు’లో విజయ్ హీరోగా చేశాడు. ఇక తన అప్కమింగ్ చిత్రం కోసం బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ షాహిద్ కపూర్ (Shahid Kapoor)ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షాహిద్ కపూర్కు కథ చెప్పి ఒప్పించినట్లు కూడా బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తెలుగు చిత్రాలను డబ్ చేసి విడుదల చేసే గోల్డ్మైన్ సంస్థ.. ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం. తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం.
సాయి రాజేశ్
గతేడాది జులైలో రిలీజైన ‘బేబీ’ (Baby) చిత్రం టాలీవుడ్లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ద్వారా దర్శకుడు సాయి రాజేశ్ (Sai Rajesh) పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. హీరోయిన్ వైష్ణవి చైతన్య కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. యూత్కు విపరీతంగా కనెక్ట్ అయిన ఈ చిత్రాన్ని హిందీలోనూ తెరకెక్కించనున్నట్లు నిర్మాత ఎస్కేఎన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ స్టార్ కిడ్ వెండితెరకు పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. మరి దర్శకుడు సాయి రాజేశ్.. బాలీవుడ్ ప్రేక్షకులను ఏమేరకు ఆకర్షిస్తాడో చూడాలి.
సందీప్ రెడ్డి వంగా - రణ్బీర్ కపూర్
టాలీవుడ్ అగ్రెసివ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) చేసిన రీసెంట్ చిత్రం ‘యానిమల్’ (Animal).. బాక్సాఫీస్ను షేక్ చేసింది. బాలీవుడ్ లవర్ బాయ్ రణ్బీర్ కపూర్(Ranbir Kapoor)ను గతంలో ఎన్నడూ చూడనంత వైలెంట్గా ఈ సినిమాలో చూపించాడు. అయితే యానిమల్కు సీక్వెల్ కూడా భవిష్యత్లో రానుంది. రణ్బీర్ను మరింత వైలెంట్గా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చూపించనున్నారు. ప్రస్తుతం సందీప్.. ప్రభాస్ స్పిరిట్ సినిమా రూపొందించే పనిలో ఉన్నాడు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీ తర్వాత ‘యానిమల్ 2’ పట్టాలెక్కనుంది.
మే 06 , 2024
![BTS V అంత పాపులర్ మన విరాట్ అనుష్క శర్మ కన్నా పాపులర్ ఉర్ఫీ జావెద్](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/02/13163122/cropped-ws_image-95.png)
BTS V అంత పాపులర్ మన విరాట్ అనుష్క శర్మ కన్నా పాపులర్ ఉర్ఫీ జావెద్
]బిగ్బాస్ బ్యూటీ, విచిత్ర వేషధారణతో పాపులర్ అయిన ఉర్ఫీ జావెద్, తమన్నా, కాజోల్, అనుష్క శర్మ, సచిన్, సూర్య, ధనుష్ వంటి బిగ్ స్టార్స్ కంటే ముందుంది. ఆమె కోసం అంతగా వెతికారు మరి.ఉర్ఫీ జావెద్
ఫిబ్రవరి 13 , 2023
![<strong>SS Rajamouli: రాజమౌళి డాక్యుమెంటరీపై నెటిజన్లు ఫైర్.. మరీ ఇలా చేశారేంటీ!</strong>](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/07/23141647/123.-2024-07-23T141641.277.jpg)
SS Rajamouli: రాజమౌళి డాక్యుమెంటరీపై నెటిజన్లు ఫైర్.. మరీ ఇలా చేశారేంటీ!
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli)పై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్ ఓ డాక్యుమెంటరీని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ను నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. ఇందులో రాజమౌళిపై హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రసంశల వర్షం కురిపించారు. అయితే ఈ డాక్యుమెంటరీ తెలుగు వెర్షన్ ట్రైలర్పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఇలా ఎందుకు చేశారంటూ తీవ్ర స్థాయిలో నెటిజన్లు మండిపతున్నారు. వారి కోపానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఏకీపారేస్తున్న నెటిజన్లు!
దర్శకధీరుడు రాజమౌళి సాధించిన ఘనతలపై ‘మోడ్రన్ మాస్టర్స్’ (Modern Masters) పేరుతో ఓ డాక్యుమెంటరీ రూపొందింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్ఫ్లిక్స్’ (Netflix) ఆగస్టు 2 నుంచి దీనిని ప్రసారం చేయనుంది. తాజాగా ఈ డాక్యుమెంటరీకి సంబంధించి తొలుత ఇంగ్లీష్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఆపై కొన్ని గంటల వ్యవధిలో తెలుగు వెర్షన్నూ తీసుకొచ్చారు. ఇంగ్లీషు వెర్షన్పై ప్రశంసలు కురిపించిన నెటిజన్లు తెలుగు ట్రైలర్ చూసి మాత్రం షాక్కి గురవుతున్నారు. ఆంగ్ల ట్రైలర్లో ప్రభాస్, రామ్చరణ్, జూ.ఎన్టీఆర్ తమ సొంత వాయిస్తో రాజమౌళితో తమకున్న వర్క్ ఎక్స్పీరియన్స్ను పంచుకున్నారు. తెలుగుకు (SS Rajamouli Documentary) వచ్చేసరికి రాజమౌళి సహా ఆ ముగ్గురు స్టార్ హీరోలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ల చేత డబ్బింగ్ చెప్పించారు. తెలుగు సెలబ్రిటీలైన రాజమౌళి, ప్రభాస్, చరణ్, తారక్లకు వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దానికి తోడు డబ్బింగ్ క్వాలిటీ కూడా చాలా పూర్గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది తమనెంతో నిరాశకు గురిచేస్తోందని పోస్టులు పెడుతున్నారు. డబ్బింగ్ వల్ల డాక్యుమెంటరీని ఓన్ చేసుకోలేకపోతున్నట్లు ఫైర్ అవుతున్నారు. నెట్ఫ్లిక్స్ ఇప్పటికైనా తెలుగు డబ్బింగ్ విషయంలో పునరాలోచన చేయాలని సూచిస్తున్నారు.
https://www.youtube.com/watch?v=OTHKWEZilL4
డబ్బింగ్ చెప్పే సమయం లేదా?
రాజమౌళి డాక్యుమెంటరీ ట్రైలర్ ఇంగ్లీష్ వెర్షన్లో ప్రభాస్, తారక్, రామ్చరణ్ తమ ఓన్ వాయిస్తో అభిప్రాయాలు తెలిపి తెలుగులో మాత్రం చెప్పకపోవడంపై వారిపైనా నెటిజన్లు మండిపడుతున్నారు. తెలుగు డైరెక్టర్కు సంబంధించి తొలిసారి ఓ డాక్యుమెంటరీ రూపొందుతుంటే ఇలా చేయడం సమంజసం కాదని అంటున్నారు. డబ్బింగ్ చెప్పే సమయం లేదా అంటూ నిలదీస్తున్నారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తెలుగులో ఆ స్టార్స్ డబ్బింగ్ చెప్పి ఉంటే బాగుండేదని చెబుతున్నారు. అది దర్శకధీరుడికి ఇచ్చే నిజమైన గౌరవమని పోస్టులు పెడుతున్నారు. మరోవైపు కొందరు నెటిజన్లు స్టార్ హీరోలకు మద్దతు తెలియజేస్తున్నారు. డాక్యుమెంటరీ మేకర్స్ హీరోల అభిప్రాయాలను కేవలం ఇంగ్లీషులోనే కలెక్ట్ చేసి ఉండొచ్చని అంటున్నారు. తెలుగులోనూ కోరి ఉంటే అప్పుడే తెలియజేసి ఉండేవారని మద్దతుగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్పై ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో నెట్ఫ్లిక్స్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
రాజమౌళి గురించి మన స్టార్స్ ఏమన్నారంటే?
‘మోడ్రన్ మాస్టర్స్’ (Modern Masters) పేరుతో రానున్న ఈ డాక్యుమెంటరీలో (Netflix Documentary) రాజమౌళి సినీ ప్రయాణాన్ని చూపనున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళితో పనిచేసిన ప్రముఖుల అభిప్రాయాలను డాక్యుమెంటరీ మేకర్స్ అడిగి తెలుసుకున్నారు. వీడియో ప్రారంభంలో ఎన్టీఆర్, ప్రభాస్, రామ్చరణ్, రమా రాజమౌళి, కరణ్జోహార్, జేమ్స్ కామెరూన్, రమా రాజమౌళి వంటి ప్రముఖులు దర్శకధీరుడిపై ప్రశంసలు కురిపించారు. వారు ఏమన్నారంటే..
ఇప్పటివరకు ఎవరూ చూపని స్టోరీలను ప్రపంచానికి తెలియజేయడం కోసమే రాజమౌళి పుట్టారు - ఎన్టీఆర్
ఇలాంటి దర్శకుడిని నేను ఇప్పటివరకు చూడలేదు. సినిమాలంటే ఆయనకు పిచ్చి ప్రేమ - ప్రభాస్
రాజమౌళికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఎవరితోనైనా పని చేయగలరు. ఆయనంటే నాకెంతో గౌరవం - జేమ్స్ కామెరూన్
ఆయన సినిమాల్లో నన్ను నేను చూసుకొని ఎంతో ఆశ్చర్యపోతాను - రామ్చరణ్
ఈ దర్శకుడు ఓ లెజెండ్ - కరణ్ జోహార్
https://twitter.com/NetflixIndia/status/1815243072801763362
సెట్స్లో ఎన్నో మైక్స్ పగలడం చూశా: చరణ్
రాజమౌళి డాక్యుమెంటరీ ట్రైలర్లో సెలబ్రిటీలకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఆయనతో పని చేయడం ఎంత తలనొప్పో చెప్పాలంటూ ప్రశ్నించారు. అప్పుడు సెలబ్రిటీలు రాజమౌళితో తాము ఫేస్ చేసిన ఇబ్బందులను తెలియజేశారు. సెట్స్లో ఎన్నో మైక్స్ పగిలిపోవడం తాను చూశానంటూ రామ్చరణ్ చెప్పుకొచ్చారు. తాను రాజమౌళి పక్కన ఉన్నప్పుడు తన వస్తువులు పగలకుండా ఉంటే చాలు అని కోరుకునేవాడినని తెలిపారు. అటు జూ.ఎన్టీఆర్ మాట్లాడుతూ 'ఎలాంటి దయ, జాలి ఉండవు. తాను కోరుకున్నది రాబట్టుకోవడం, వెళ్లిపోవడం ఇలాగే చేస్తూ ఉంటాడు. అతను ఒక మ్యాడ్ పర్సన్' అని చెప్పుకొచ్చారు. భార్య రమా రాజమౌళి కూడా ఈ ట్రైలర్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'రాజమౌళితో పని చేసిన వారందరూ ఆయన్ని “పని రాక్షసుడని” పిలుస్తుంటారు' అని ఆమె చెప్పుకొచ్చారు.
ఆస్కార్ కమిటీకి రాజమౌళి!
దర్శకధీరుడు రాజమౌళికి ఇటీవల అస్కార్ అకాడమీ నుంచి ఆహ్వానం అందింది. దర్శకుల కేటగిరిలో రాజమౌళి (SS Rajamouli), కాస్ట్యూమ్ డిజైనర్ జాబితాలో రమా రాజమౌళి (Rama Rajamouli) ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సంవత్సరం మొత్తం 57 దేశాల నుంచి 487 మంది సభ్యులకు ఆస్కార్ అకాడమీ ఆహ్వానం పంపింది. అందులో భారత్ నుంచి వీరిద్దరితో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. షబానా అజ్మి, రితేశ్ సిద్వానీ, రవి వర్మన్ తదితరులు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ ఆహ్వానం అందుకున్న వారిలో ఉన్నారు.
జూలై 23 , 2024
![<strong>Raj Tarun Case: </strong><strong>రాజ్తరుణ్ కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.. ప్రేయసికి షాకిచ్చిన పోలీసులు!</strong>](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/07/06140624/Untitled-design-2024-07-06T140617.911.jpg)
Raj Tarun Case: రాజ్తరుణ్ కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.. ప్రేయసికి షాకిచ్చిన పోలీసులు!
హీరో రాజ్తరుణ్ (Raj Tarun) తనను మోసం చేశాడంటూ అతడి మాజీ ప్రేయసి లావణ్య శుక్రవారం (జులై 5) పోలీసులకు ఫిర్యాదు చేయడం.. టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించింది. ఎఫ్ఐఆర్ కాపీలో యంగ్ హీరోపై సంచలన ఆరోపణలు చేయడం మరింత చర్చనీయాంశంగా మారింది. దీనిపై రాజ్తరుణ్ సైతం తనదైన శైలిలో స్పందించాడు. లావణ్యతో గతంలో జరిగిన వ్యవహారం మెుత్తాన్ని బయటపెట్టాడు. టాక్ ఆఫ్ టాలీవుడ్గా మారిపోయిన ఈ కేసులో శనివారం (జులై 6) ఊహించని ట్విస్టు చోటుచేసుకుంది. రాజ్తరుణ్పై కేసు పెట్టిన లావణ్యకి ఉల్టాగా పోలీసులు నోటీసులు పంపారు.
నోటీసులు ఎందుకంటే?
హీరో రాజ్తరుణ్పై మాజీ ప్రేయసి లావణ్య.. శుక్రవారం (జులై 5) నార్సింగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తను 11 ఏళ్లుగా రిలేషన్లో ఉన్నామని పేర్కొంది. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మోజులో పడి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆరోపించింది. మాల్వీ మల్హోత్ర, ఆమె బంధువులు తనను బెదిరిస్తున్నారని కూడా కంప్లైంట్లో పేర్కొంది. మరోవైపు అందులో ఎలాంటి వాస్తవం లేదని రాజ్తరుణ్ కూడా వివరణ ఇచ్చాడు. దీంతో నార్సింగి పోలీసులు లావణ్యకు ఊహించని షాక్ ఇచ్చారు. రాజ్ తరుణ్పై ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలంటూ నోటీసుల్లో కోరారు. 91 CRPC కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ నోటీసులపై లావణ్య ఇప్పటివరకూ స్పందించలేదని తెలుస్తోంది. ఆమె సమర్పించే ఆధారాలను బట్టి ఈ కేసు ముందుకు కదలనుంది.
ఫిర్యాదులోని మరిన్ని విషయాలు!
శుక్రవారం నార్సింగ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లావణ్య మరిన్ని ఆరోపణలు చేశారు. 2012 నుంచి రాజ్తరుణ్ తాను రిలేషన్లో ఉన్నట్లు చెప్పారు. ‘తిరగబడర సామీ’ సినిమా షూటింగ్ మెుదలైనప్పటి నుంచి మాల్వీ మల్హోత్రాతో రిలేషన్ స్టార్ట్ చేసినట్లు ఆరోపించింది. ఇదే విషయమై రాజ్తరుణ్ను నిలదీస్తే తనని దుర్భాషలాడాడని తెలిపింది. తనను సంబంధం లేని కేసు (డ్రగ్స్)లో ఇరికించడంతో తాను 43 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందని ఆరోపించింది. ఫిర్యాదును స్వీకరించిన నార్సింగి పోలీసులు.. దీనిపై దర్యాప్తు చేయనున్నట్లు గురువారమే స్పష్టం చేశారు. అయితే స్టార్ సెలబ్రిటీలపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. ఆధారాల కోసం ఇవాళ లావణ్యకు నోటీసులు పంపారు.
అది చూసి తట్టుకోలేకపోయా: రాజ్ తరుణ్
మాజీ ప్రేయసి లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై నటుడు రాజ్ తరుణ్ శుక్రవారమే (జులై 5) స్పందించారు. ఓ ఛానల్తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను షార్ట్ఫిల్మ్స్ చేసే సమయంలో ఆమెతో పరిచయం ఏర్పడింది. మంచి అమ్మాయే. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో సాయం చేసింది. మేం రిలేషన్షిప్లో ఉన్నామన్నది వాస్తవమే. 2014 నుంచి 2017 వరకు కలిసున్నాం. ఆ తర్వాత మా మధ్య ఎలాంటి సంబంధంలేదు. ఆమె ఫ్రెండ్స్ సర్కిల్, తను డ్రగ్స్ తీసుకోవడం చూసి తట్టుకోలేకపోయా. వదిలేసి వెళ్లిపోదామనుకుంటే.. మీడియా ముందుకెళ్తానని నన్ను బెదిరించేది. నా పరువుకు భంగం కలగకుండా ఉండేందుకు భరిస్తూ వచ్చా. ఆమెపై డ్రగ్స్ కేసు నమోదవగా దానికి నేనే కారణమని ఆరోపణలు చేస్తోంది’ అని మండిపడ్డారు.
‘తన తండ్రినీ బెదిరించింది’
ఎక్స్ గర్ల్ఫ్రెండ్ లావణ్యపై రాజ్తరుణ్ సంచలన ఆరోపణలు చేశాడు. తాను ఉండగానే ఆమె మరో యువకుడితో ఆమె రిలేషన్లో ఉన్నట్లు పేర్కొన్నాడు. 'మరో అబ్బాయితో ఆమె రిలేషన్ కొనసాగించింది. రోజూ కొడుతున్నాడంటూ ఆ వ్యక్తిపైనా కేసు పెట్టింది. మళ్లీ అతడితో కలిసి నా ఇంట్లోనే కొన్నాళ్లు ఉంది. నేనే బయటకు వచ్చేశా. తన తండ్రినీ బ్లాక్ మెయిల్ చేసింది. మాకు పెళ్లి కాలేదు. జీవితంలో నేను పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అయిన సంగతి ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు. ఆమెకూ ఆ విషయం తెలుసు. ముంబయికి చెందిన నటితో సహజీవనం చేస్తున్నట్టు ఆమె ఆరోపిస్తోంది. నేను హైదరాబాద్లో ఉంటున్నా. ఆమె ముంబయిలో నివాసముంటోంది. మేం సహజీవనం ఎలా చేస్తాం? తనను ఇంట్లోంచి నేను పంపించేస్తానన్న భయంతో ఇదంతా చేస్తోంది’ అని రాజ్తరుణ్ ఆరోపించాడు.
జూలై 06 , 2024
![My Dear Donga Review: కామెడీతో అదరగొట్టిన అభినవ్ గోమఠం.. ‘మై డియర్ దొంగ’ ఎలా ఉందంటే?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/04/20154630/Movie-Review.jpg)
My Dear Donga Review: కామెడీతో అదరగొట్టిన అభినవ్ గోమఠం.. ‘మై డియర్ దొంగ’ ఎలా ఉందంటే?
నటీనటులు: అభినవ్ గోమఠం, శాలినీ కొండేపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, శశాంక్ మందూరి, వంశీధర్ గౌడ్
దర్శకుడు: బీఎస్ సర్వజ్ఞ కుమార్
రచన: శాలినీ కొండేపూడి
సంగీతం: అజయ్ అరసాద
ఎడిటర్: సాయి మురళి
సినిమాటోగ్రఫీ: ఎస్ఎస్ మనోజ్
నిర్మాత: మహేశ్వర్ రెడ్డి గోజల
స్ట్రీమింగ్ వేదిక : ఆహా
హాస్యనటుడు 'అభినవ్ గోమఠం' ప్రధాన పాత్రలో చేసిన చిత్రం ‘మై డియర్ దొంగ’ (My Dear Donga Review). ఇందులో షాలిని కొండెపూడి (Shalini Kondepudi) మరో కీలక పాత్ర పోషించింది. కాగా, ఈ చిత్రం ఓటీటీ ఆడియన్స్ను టార్గెట్ చేస్తూ స్ట్రీమింగ్లోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’ (Aha)లో ప్రసారం అవుతోంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఓటీటీ ప్రేక్షకులను అలరించిందా? లేదా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.
కథేంటి?
సుజాత (షాలిని), డాక్టర్ విశాల్ (నిఖిల్ గాజుల) ప్రేమికులు. తొలుత బాగానే ఉన్న కొంతకాలం తర్వాత విశాల్లో మార్పు వచ్చిందని సుజాత భావిస్తుంటుంది. ఎక్కడకు పిలిచినా బిజీ అని చెబుతున్నాడనీ ఫీలవుతుంది. ఈ క్రమంలోనే సురేశ్ (అభినవ్ గోమఠం) ఆమె ఫ్లాట్లో చోరీ చేసేందుకు వెళ్తాడు. అదే సమయానికి షాలిని బర్త్డే సెల్రబేషన్ చేసేందుకు విశాల్ ఆమె ఫ్రెండ్స్తో ఇంటికి వస్తాడు. అప్పటికే విశాల్తో మాట్లాడిన సుజాత.. ఫ్రెండ్స్కు అతడ్ని బాల్య స్నేహితుడిగా పరిచయం చేస్తుంది. దొంగ అని తెలిసినా సుజాత.. సురేశ్తో ఎందుకు పరిచయం పెంచుకుంది? వారి కుటుంబ నేపథ్యాలేంటి? విశాల్ పోలీసుస్టేషన్కు వెళ్లడానికి కారణమేంటి?
ఎవరెలా చేశారంటే?
నటి షాలిని కథను ముందుండి నడిపించింది. సుజాత పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయింది. ముఖ్యంగా కొన్ని సీన్స్లో ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా అనిపిస్తాయి. ఎప్పటిలానే అభినవ్ తన కామెడీతో గిలిగింతలు పెట్టాడు. కామెడీ టైమింగ్తో అదరగొట్టాడు. సుజాతను ప్రేమించిన డాక్టర్ విశాల్ పాత్రలో నిఖిల్ ఫర్వాలేదనిపించాడు. దివ్య శ్రీపాద, ఆమె లవర్గా నటించిన శశాంక్, వెయిటర్గా నటించిన వంశీధర్ గౌడ్ తమ నటనతో ఓకే అనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
నేటి ప్రేమికుల మనస్తత్వం ఎలా ఉందో తనదైన శైలిలో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు బీఎస్ సర్వజ్ఞ కుమార్. సుజాత ఉద్యోగ ప్రస్తావన, స్నేహితులు, విశాల్తో లవ్ ఎపిసోడ్తో సినిమాను నెమ్మదిగా స్టార్ట్ చేసిన డైరెక్టర్.. సుజాత ఫ్లాట్లోకి సురేశ్ ప్రవేశించడం నుంచి కథలో వేగం పెంచారు. అభినవ్ గోమఠం చుట్టూ రాసుకున్న కామెడీ ట్రాక్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ప్రతీ ఎపిసోడ్ను ప్రేక్షకుడిని నవ్వించాలన్న లక్ష్యంతో రూపొందించినట్లు కనిపిస్తుంది. అయితే సుజాత, సురేశ్ తమ కుటుంబాల గురించి ఒకరికొకరు వివరించే తీరు కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తుంది. ఆ ఎమోషనల్ సీన్స్ను ఇంకాస్త ప్రభావవంతంగా చూపించి ఉంటే బాగుండేది. కానీ, కామెడీ పేరుతో ఎలాంటి అసభ్యతకు చోటివ్వకుండా ఫ్యామిలీతో ఎంచక్కా చూసేలా దర్శకుడు ఈ మూవీని రూపొందించడం ప్రశంసనీయం. స్లో నేరేషన్ కాస్త ఇబ్బంది పెట్టవచ్చు.
సాంకేతికంగా
సాంకేతిక విభాగానికొస్తే.. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉంది.
ప్లస్ పాయింట్స్
షాలిని, అభినవ్ గోమఠం నటనకామెడీ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
నెమ్మదిగా సాగే కథనం
Telugu.yousay.tv Rating : 3/5
ఏప్రిల్ 20 , 2024