రివ్యూస్
How was the movie?
తారాగణం
బ్రీ లార్సన్కరోల్ డాన్వర్స్ / కెప్టెన్ మార్వెల్
టెయోనా ప్యారిస్మోనికా రాంబ్యూ
ఇమాన్ వెల్లనికమలా ఖాన్ / Ms. మార్వెల్
జావే అష్టన్దార్-బెన్
పార్క్ సియో-జూన్ప్రిన్స్ యాన్
శామ్యూల్ ఎల్. జాక్సన్నిక్ ఫ్యూరీ
సిబ్బంది
నియా డకోస్టాదర్శకుడు
కెవిన్ ఫీగేనిర్మాత
మేగాన్ మెక్డొన్నెల్రచయిత
ఎలిస్సా కరాసిక్రచయిత
నియా డకోస్టారచయిత
లారా కార్ప్మన్సంగీతకారుడు
సీన్ బాబిట్సినిమాటోగ్రాఫర్
క్యాట్రిన్ హెడ్స్ట్రోమ్ఎడిటర్ర్
ఇవాన్ షిఫ్ఎడిటర్ర్
కథనాలు
![This Week OTT Movies: ఈ వారం థియేటర్లు / OTTలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/11/06143251/Untitled-design-54.jpg)
This Week OTT Movies: ఈ వారం థియేటర్లు / OTTలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే!
దసరా సందర్భంగా థియేటర్లలో నెలకొన్న చిత్రాల హంగామా దీపావళికి కూడా కొనసాగనుంది. ఈసారి దీపావళి సందర్భంగా పలు డబ్బింగ్ చిత్రాలు సందడి చేయనున్నాయి. తెలుగు ప్రేక్షకులను అలరించనున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్సిరీస్లు ఎంటర్టైన్ చేసేందుకు రాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాలు ఎలా ఉన్నాయి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
టైగర్ 3
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా మనీష్ శర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘టైగర్3 ’ (Tiger 3) దీపావళి కానుకగా రాబోతోంది. నవంబరు 12న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో సల్మాన్కు జోడీగా కత్రినా కైఫ్ (Katrina Kaif) నటించింది. ‘టైగర్ జిందా హై’కు సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాను ఆదిత్య చోప్రా నిర్మించారు. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలు, సల్మాన్పై చిత్రీకరించిన ఫైట్ సీక్వెన్స్లు అదరహో అనేలా ఉన్నాయి.
జపాన్
కథనాయకుడు కార్తి (Karthi) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జపాన్’ (Japan). రాజు మరుగున్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా చేసింది. ఇందులో కార్తి ‘జపాన్’ అనే దొంగ పాత్రలో కనిపించనున్నారు. రూ.200 కోట్ల విలువైన ఆభరణాలు జపాన్ ఎలా దొంగిలించాడు? అతడిని పట్టుకునేందుకు పోలీసులు వేసిన ఎత్తుగడలు ఏంటి? వంటి ఆసక్తికర అంశాలతో ఈ మూవీ తెరకెక్కింది. దీపావళి కానుకగా నవంబరు 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
జిగర్ తండా డబుల్ ఎక్స్
రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య కీలక పాత్రల్లో రూపొందిన సినిమా ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ (Jigarthanda DoubleX). ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో నవంబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్యాంగ్స్టర్ ఆధారంగా సినిమా తీయాలనుకున్న ఓ దర్శకుడు ఆ గ్యాంగ్స్టర్నే హీరోగా పెట్టి సినిమా తీయాల్సివస్తే ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటాడనే నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘జిగర్ తండ’. ఇప్పుడు ఆ కథకే మరింత యాక్షన్ను జోడించి తెరపైకి ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ తీసుకొస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
అలా నిన్ను చేరి
దినేశ్ తేజ్ హీరోగా హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ కథానాయికలుగా తెరకెక్కిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కొమ్మాలపాటి సాయిసుధాకర్ నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ప్రేమ, కుటుంబ వినోదంతో కూడిన ఈ సినిమా ఇంటిల్లిపాదినీ మెప్పించేలా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇందులోని భావోద్వేగాలు మనసుల్ని హత్తుకుంటాయని పేర్కొంది.
ది మార్వెల్స్
అమెరికన్ సూపర్ హీరో సినిమా ‘ది మార్వెల్స్’ (The Marvels) కూడా ఈ వారమే థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో హాలీవుడ్ నటి బ్రీ లార్సన్ కెప్టెన్ మార్వెల్ పాత్రలో కనిపించనుంది. నియా డకోస్టా దర్శకత్వంలో రానున్న ఈ సినిమా నవంబరు 10న తెలుగు, హిందీ, ఇంగ్లిష్, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఇమాన్ వెల్లని, టోయోనా ప్యారిస్, సియో-జున్ పార్క్, శామ్యూల్ ఎల్. జాకన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
దీపావళి
అందమైన పల్లెటూరి కథతో ‘దీపావళి’ సినిమా రూపొందింది. రాము, వెంకట్, దీపన్ ప్రధాన పాత్రలు పోషించారు. వెంకట్ దర్శకత్వం వహిచారు. పండగకు కొత్త డ్రెస్ కావాలని అడిగిన మనవడి కోసం తాత తన మేకను బేరం పెడతాడు. ఆ మేక చుట్టూ అల్లుకున్న ఓ అహ్లాదకరమైన కథే ఈ సినిమా. దీపావళి సందర్భంగా నవంబరు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/వెబ్సిరీస్లు
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(telugu.yousay.tv/tfidb/ott)
TitleCategoryLanguagePlatformRelease DateRainbow rishtaSeriesEnglishAmazon PrimeNov 07BTS: Yet To ComeMovieEnglishAmazon PrimeNov 09PippaMovieHindiAmazon PrimeNov 10IrugapatruMovieTamilNetflixNov 06Escaping twin flamesSeriesEnglishNetflixNov 08The killerMovieEnglishNetflixNov 10The RoadMovieTamilAhaNov 10The Santa Clause 2SeriesEnglishDisney+HotstarNov 08LabelSeriesTeluguDisney+HotstarNov 10Ghoomer MovieHindiZee 5Nov 10
……………………………………………………………………………………………………………….
APP: దీపావళి సందర్భంగా సినీ అభిమానులను అలరించేందుకు ఈ వారం కూడా పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. నవంబర్ 6 నుంచి 12వ తేదీల మధ్య థియేటర్లు, OTTలో విడుదలై సందడి చేయనున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు ఏవో తెలుసుకోవాలంటే YouSay Web లింక్పై క్లిక్ చేయండి.
నవంబర్ 06 , 2023
![Kalki 2898 AD: రామ్చరణ్ కూతురికి కల్కి టీమ్ స్పెషల్ గిఫ్ట్.. డైరెక్టర్ ప్లాన్ అదేనా?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/06/03162100/Untitled-design-2024-06-03T162056.228.jpg)
Kalki 2898 AD: రామ్చరణ్ కూతురికి కల్కి టీమ్ స్పెషల్ గిఫ్ట్.. డైరెక్టర్ ప్లాన్ అదేనా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ (Nag Ashwin) డైరెక్షన్లో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రంపై దేశవ్యాప్తంగా బజ్ ఉంది. ఈ చిత్రం జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరు ఒక్కసారిగా పెంచింది. ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన AI వెహికల్.. బుజ్జిని ప్రముఖ నగరాల్లో తిప్పుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ను బుజ్జి వెహికల్ను నడపాలని కోరి వరల్డ్ వైడ్గా సినిమాపై అటెన్షన్ తీసుకొచ్చింది. ఇక తాాజాగా మరో కాన్సెప్ట్తో సరికొత్త ప్రమోషన్స్ను మేకర్స్ షురూ చేశారు.
క్లింకారకు స్పెషల్ గిఫ్ట్
సరికొత్త ప్రమోషన్స్కు కల్కి టీమ్ నాంది పలికింది. ఇందులో భాగంగా సినీ సెలబ్రిటీల పిల్లలకు గిఫ్ట్లు పంపుతోంది. తాజాగా రామ్ చరణ్ కుమార్తె క్లీంకారకు (Klinkaara) మూవీ యూనిట్ ఓ బహుమతి అందించింది. అందులో బుజ్జి - భైరవ స్టికర్స్, బుజ్జి బొమ్మ, టీషర్ట్స్ ఉన్నాయి. క్లీంకార వాటితో ఆడుకుంటున్న ఫొటోలను ఉపాసన ఇన్స్టాలో షేర్ చేశారు. కల్కి టీమ్కు థ్యాంక్స్, ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు. అలాగే మరికొంతమంది సెలబ్రిటీల పిల్లలకు కూడా వీటిని పంపనున్నట్లు తెలుస్తోంది.
చిన్నారులపై ఫోకస్
సాధారణంగా ఏ సినిమా మేకర్స్ అయినా రిలీజ్ సందర్భంగా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ను టార్గెట్ చేస్తుంటారు. అయితే కల్కి టీమ్ ఇందుకు పూర్తి భిన్నంగా ఆలోచిస్తోంది. ఓ వైపు పెద్దలను ఆకర్షిస్తూనే చిన్నారులపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం చిన్నారులపైనే ఫుల్గా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ఇటీవల కిడ్స్ను టార్గెట్ చేస్తూ 'బుజ్జి అండ్ భైరవ' (Bujji And Bhairava) పేరుతో సరికొత్త యానిమేషన్ సిరీస్ను తీసుకొచ్చారు. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వేదికగా ఈ సిరీస్ రెండు ఎపిసోడ్స్తో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది చిన్నారులను ఎంటగానో ఆకర్షిస్తోంది. అటు పెద్దల నుంచి సైతం సిరీస్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా స్పెషల్ గిఫ్ట్స్ ప్రోగ్రామ్ను కూడా పిల్లల కోసమే లాంచ్ చేశారు.
కారణం ఇదేనా!
‘కల్కి 2898 ఏడీ’ సైంటిఫిక్ అండ్ ఫ్యూచరిక్ కాన్సెప్ట్తో తెరకెక్కుతోంది. ఇటీవల విడుదల చేసిన బుజ్జి, భైరవ సిరీస్, గ్లింప్స్ను పరిశీలిస్తే కల్కి చిత్రం సూపర్ హీరోల కాన్సెప్ట్ను తలపిస్తోంది. సాధారణంగా ఈ తరహా చిత్రాలు.. పెద్దల కంటే పిల్లలనే ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంటాయి. ఇప్పటికే హాలీవుడ్లో వచ్చిన అవెంజర్స్, మార్వెల్ సిరీస్ చిత్రాలు ఈ విషయాన్నే రుజువు చేశాయి. కాబట్టి కల్కి టీమ్ కూడా ఆ పాయింట్నే పట్టుకున్నట్లు కనిపిస్తోంది. ముందుగా పిల్లల్లో కల్కి సినిమాపై ఆసక్తి రగిలిస్తే ఆటోమేటిక్గా తల్లిదండ్రులను కూడా థియేటర్లకు రప్పించవచ్చని మూవీ టీమ్ భావిస్తున్నట్లు సమాచారం. అటు యూత్, టీనేజర్స్ను ఆకర్షించడానికి ప్రభాస్ ఉండనే ఉన్నాడు. ఇవన్నీ చూస్తే అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్కు రప్పించేందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ వ్యూహాత్మంగా ముందుకు సాగుతున్నట్లు అర్థమవుతోంది.
కల్కి రన్టైమ్ లాక్?
'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) రన్ టైమ్ ఫిక్స్ అయినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. రీసెంట్ సోషల్ మీడియా బజ్ ప్రకారం.. ఈ సినిమా నిడివిని 3.10 గం.లుగా మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు దగ్గరకు వెళ్లి ఏమైన కత్తెరలు పడినా కూడా నిడివి 3 గం.లకు తగ్గే పరిస్థితి ఉండదని ప్రచారం జరుగుతోంది. అయితే రన్టైమ్పై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ హీరోయిన్లుగా చేశారు. దిగ్గజ నటులు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలు పోషించారు.
జూన్ 03 , 2024
![The Kerala Story : రచ్చ రేపుతున్న ‘ది కేరళ స్టోరీ’.. వివాదానికి ప్రధాన కారణం అదేనా?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/05/03152856/FvIHdR9XgAIWcxC.jpg)
The Kerala Story : రచ్చ రేపుతున్న ‘ది కేరళ స్టోరీ’.. వివాదానికి ప్రధాన కారణం అదేనా?
'ది కేరళ స్టోరీ ' చిత్రం విడుదలకు ముందే తీవ్ర దుమారం రేపుతోంది. మే 5న ఈ సినిమా విడుదల కానుండగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయోద్దంటూ కేరళ ప్రభుత్వం సహా కాంగ్రెస్, సీపీఐ, ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ‘ది కేరళ స్టోరీ’ విద్వేషపూరితంగా చిత్రీకరించారని, సినిమా విడుదల చేస్తే మత సామరస్యం దెబ్బతింటుందని పలువురు ఏకంగా సుప్రీకోర్టునే ఆశ్రయించారు. ఈ స్థాయిలో వివాదం రాజుకోడానికి కారణమేంటి? ఈ చిత్రంపై సుప్రీంకోర్టు ఎలా స్పందించింది? కేరళ కంటే తమిళనాడు ఎందుకు ఎక్కువగా ఆందోళన చెందుతోంది? అసలు ఈ సినిమా సెన్సార్ క్లియర్ చేసుకుందా? వంటి ప్రశ్నలకు ఈ ప్రత్యేక కథనంలో సమాధానం చూద్దాం.
వివాదానికి బీజం:
సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ‘ది కేరళ స్టోరీ’ అదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలో నటించారు విపుల్ అమృత్లాల్ షా నిర్మాతగా వ్యవహరించారు. కేరళలో 2016-17 మధ్య 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడ అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఓ నలుగురు యువతులు మతం మారి ఉగ్రవాద సంస్థ ఐసిస్లో చేరతారు. ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో కథ చూపించడం వివాదానికి దారితీసింది. ‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఏప్రిల్ 26న విడుదలవ్వగా అప్పటి నుంచే దీనిపై రాజకీయ రగడ మొదలైంది.
కేరళ సీఎం ఆగ్రహం
'ది కేరళ స్టోరీ' ట్రైలర్.. కేరళ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై ఆ రాష్ట్ర సీఎం స్పందించారు. ‘రాష్ట్రంలో మతపరమైన విభజన, ద్వేషాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఈ చిత్రం నిర్మించినట్లు అర్థమవుతుంది. ‘లవ్ జిహాదీ’ అంశాన్ని దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, హోం మంత్రిత్వశాఖ కూడా తిరస్కరించినా.. కేరళను ప్రపంచం ముందు అవమానించేందుకే మరోసారి దీన్ని తెరపైకి తీసుకొచ్చారు’ అంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శించారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ఈ ప్రయత్నాలు చేస్తున్నాయని.. వారి రాజకీయాలు ఇక్కడ సాగవని పరోక్షంగా భాజపా, RSSలకు చురకలు అంటించారు.
సినిమాను బ్యాన్ చేయాలి
‘ది కేరళ స్టోరీ’ చిత్రం విడుదలను కేరళ అధికార పార్టీతోపాటు విపక్ష కాంగ్రెస్ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. సమాజంలో విషం చిమ్మేందుకు భావప్రకటనా స్వేచ్ఛ ఓ లైసెన్సు కాదంటూ మండిపడింది. రాష్ట్రంలో చిత్రం విడుదలకు అనుమతి ఇవ్వకూడదని కాంగ్రెస్, డీవైఎఫ్ఐ, ఐయూఎంఎల్ వంటి యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. అంతర్జాతీయ స్థాయిలో కేరళను అవమానించే రీతిలో ఈ చిత్రం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీశన్ పేర్కొన్నారు. మత విశ్వాసాలను దెబ్బతీసేందుకు ఓ వర్గం యత్నిస్తోందని ఐయూఎంఎల్ జాతీయ కార్యదర్శి పీకే ఫిరోజ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా సినిమాను వ్యతిరేకిస్తూ ట్విట్ చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛను తప్పుగా చిత్రీకరించారని మండిపడ్డారు.
తమిళనాడు అలెర్ట్
ది కేరళ స్టోరి రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో తమిళనాడు ప్రభుత్వాన్ని ఇంటెలిజెన్స్ బృందాలు అలెర్ట్ జారీ చేశాయి. తమిళనాడులో మూవీ విడుదలైతే రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు, నిరసనలు చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. ‘కేరళ స్టోరీ’ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకోవాలని ప్రభుత్వానికి నిఘా వర్గాలు సూచించాయి. అయితే ఇప్పటి వరకు తమిళనాడులో సినిమాను విడుదల చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని రాష్ట్ర పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అన్ని థియేటర్లలో పొన్నియన్ సెల్వన్-2 నడుస్తున్నట్లు చెప్పాయి. ధియేటర్ యాజమానులు ‘ది కేరళ స్టోరీ’ని ఇప్పట్లో రిలీజ్ చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదని పేర్కొన్నాయి.
సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలు
‘ది కేరళ స్టోరీ’ ఇటీవలె సెన్సార్ పూర్తి చేసుకుంది. వివాదస్పదంగా మారిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘A సర్టిఫికేట్’ ఇచ్చింది. అంతేగాక సినిమాలోని వివిధ సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దేవుళ్లకు సంబంధించిన డైలాగులు కొందరి మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని తెలిపింది. మరికొన్ని పదాలను సవరించాలని కోరింది. మొత్తం 10 సన్నివేశాలు వివాదాస్పదంగా ఉన్నాయని పేర్కొంది. వాటిని డిలీట్ చేయాలని చెప్పింది. పలు సవరణలతో మే 5న చిత్ర విజయానికి అనుమతించింది.
సుప్రీంకోర్టు స్పందన
‘ది కేరళ స్టోరీ’ సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన అభ్యర్థనను ధర్మాసనం నిరాకరించింది. ‘ది కేరళ స్టోరీ’లో విద్వేషపూరితమైన ప్రసంగాలు, వీడియోలు ఉన్నాయని దాఖలైన పిటీషన్పై కోర్టు స్పందించింది. ‘ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ పొందింది. మీరు దీని విడుదలను సవాల్ చేయాలనుకుంటే ఆ సర్టిఫికెట్తో తగిన ఫోరంను సంప్రదించండి’ అని సుప్రీంకోర్టు పిటిషనర్లకు సూచించింది.
మే 03 , 2023
![Deviyani Sharma: “సేవ్ ది టైగర్స్” ఫేమ్ దేవియాని శర్మ గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/04/04125435/123.-68.jpg)
Deviyani Sharma: “సేవ్ ది టైగర్స్” ఫేమ్ దేవియాని శర్మ గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
‘సేవ్ ద టైగర్స్’ (Save The Tigers S1 & S2)సిరీస్తో అందరి దృష్టిని ఆకర్షించిన నటి ‘దేవియాని శర్మ’ (Deviyani Sharma). ఇందులో చైతన్య కృష్ణ (Chaitanya Krishna)కు జోడీగా నటించిన ఈ భామ.. తన గ్లామర్తో ఆకట్టుకుంది. నటిగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఈ బ్యూటీ గురించి తెలుసుకునేందుకు తెలుగు ఆడియన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు (Some Lesser Known Facts about Deviyani Sharma) సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
దేవియాని శర్మ ఎవరు?
టాలీవుడ్కు చెందిన ప్రముఖ యువ నటి.
దేవియాని శర్మ ఎక్కడ పుట్టింది?
న్యూఢిల్లీ
దేవియాని శర్మ పుట్టిన తేది?
మే 30, 1993
దేవియాని శర్మ వయసు ఎంత?
ఈ భామ వయసు ప్రస్తుతం 31 సంవత్సరాలు (2024)
దేవియాని శర్మ తల్లిదండ్రులు ఎవరు?
సునీల్ శర్మ, నీనా శర్మ
దేవియాని శర్మ తోబుట్టువులు ఉన్నారా?
ఈ బ్యూటీకి ఒక సోదరి ఉంది. ఆమె పేరు సోనం శర్మ
దేవియాని శర్మ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది?
ఈ నటి విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే జరిగింది.
దేవియాని శర్మ ఏం చదివింది?
ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసింది.
దేవియాని శర్మ ఎత్తు ఎంత?
165 సెం.మీ
దేవియాని శర్మ ప్రస్తుతం ఎక్కడ ఉంటోంది?
2019 నుంచి ఆమె హైదరాబాద్లోనే నివసిస్తోంది.
దేవియాని శర్మ సినిమాల్లోకి రాకముందు ఏం చేసింది?
కెరీర్లో ప్రారంభంలో ఈ బ్యూటీ మోడల్గా చేసింది. కొన్ని వాణిజ్య ప్రకటనల్లో సైతం నటించింది.
దేవియాని శర్మ తొలి చిత్రం?
2020లో వచ్చిన ‘భానుమతి & రామకృష్ణ’ (Bhanumathi & Ramakrishna)సినిమాలో ఓ అతిధి పాత్రతో తొలిసారి తెరంగేట్రం చేసింది.
దేవియాని శర్మ తొలి వెబ్సిరీస్?
2020లో జీ5లో స్ట్రీమింగ్లోకి వచ్చిన 'అనగనగా' (Anaganaga).. ఆమె చేసిన తొలి సిరీస్. ఇందులో లీడ్ రోల్లో కనిపించి దేవియాని గుర్తింపు పొందింది.
దేవియాని శర్మ ఇప్పటివరకూ చేసిన చిత్రాలు/ సిరీస్లు?
‘భానుమతి & రామకృష్ణ’, 'రొమాంటిక్' (Romantic), సైతాన్ (Shaitan), సేవ్ ద టైగర్స్ 1 & 2 (వెబ్సిరీస్)
దేవియాని శర్మకు పాపులారిటీ తీసుకొచ్చిన చిత్రం/ వెబ్సిరీస్?
హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్లోకి వచ్చిన ‘సేవ్ ద టైగర్స్’ ఆమెకు తెలుగులో మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ సిరీస్ ద్వారా అందం, అభినయంతో దేవియాని యూత్ను ఆకర్షించింది.
దేవియాని శర్మ హామీలు ఏంటి?
దేవియానికి ట్రావెలింగ్, పెయింటింగ్ అంటే చాలా ఇష్టమట.
దేవియాని శర్మకు ఇష్టమైన పెంపుడు జంతువు?
డాగ్
దేవియాని శర్మ పేవరేట్ హీరో, హీరోయిన్ ఎవరు?ఈ విషయాన్ని దేవియాని శర్మ ఏ ఇంటర్యూలోనూ పంచుకోలేదు.
దేవియాని శర్మ ఇన్స్టాగ్రామ్ ఖాతా?
https://www.instagram.com/deviyyani/?hl=en
https://www.youtube.com/watch?v=4ZnkBGYa4Gg
ఏప్రిల్ 04 , 2024
![This Week Movies: ఈ వారం థియేటర్లలోకి ‘టిల్లు స్క్వేర్’, ‘ది గోట్ లైఫ్’.. అటు ఓటీటీలో ఏవంటే? ](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/03/25143308/Untitled-design-2024-03-25T143302.484.jpg)
This Week Movies: ఈ వారం థియేటర్లలోకి ‘టిల్లు స్క్వేర్’, ‘ది గోట్ లైఫ్’.. అటు ఓటీటీలో ఏవంటే?
ఎప్పటిలాగే ఈ వారం (This Week Movies) కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్సిరీస్లు ఎంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లో రిలీజయ్యే చిత్రాలు
ది గోట్లైఫ్
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) హీరోగా, అమలా పాల్ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘ది గోట్లైఫ్’. సర్వైవల్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ‘ఆడు జీవితం’ (Aadujeevitham) పేరుతో మార్చి 28న విడుదల కానుంది. దీనికి బ్లెస్సీ దర్శకత్వం వహించారు. ‘గోట్ డేస్’ నవల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. కేరళ నుంచి పని కోసం మధ్య ప్రాశ్చ్యానికి వెళ్లిన ఓ యువకుడు బానిసగా ఎలా మారాడు? అక్కడి నుంచి తప్పించుకుని ఎలా బయటపడ్డాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది ఈ సినిమా కథాంశమని చిత్ర యూనిట్ తెలిపింది.
టిల్లు స్క్వేర్
సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square). బ్లాక్ బాస్టర్ సినిమా ‘డీజే టిల్లు’కు సీక్వెల్గా ఇది రూపొందింది. మల్లిక్ రామ్ దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 29న థియేటర్లలోకి రానుంది. ఇటీవల విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి.
గాడ్జిల్లా vs కాంగ్: ది న్యూ ఎంపైర్
మరో విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ సిద్ధమైంది. ఆడమ్ విన్గార్డ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘గాడ్జిల్లా vs కాంగ్: ది న్యూ ఎంపైర్’ (Godzilla x Kong: The New Empire) ఈ వారం వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయబోతోంది. ప్రపంచం మీద విరుచకుపడుతున్న గాడ్జిల్లాకు కాంగ్ ఎలా చెక్పెట్టిందనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగు సహా పలు భారతీయ భాషల్లో మార్చి 29న విడుదల కానుంది.
కలియుగం పట్టణంలో
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’ (Kaliyugam Pattanam Lo). కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న రాబోతోంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్లు
సుందరం మాస్టర్
వైవా హర్ష (Harsha Chemudu) ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘సుందరం మాస్టర్’ (Sundaram Master OTT Release). ఫిబ్రవరిలో బాక్సాఫీసు ముందుకొచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు వినోదం పంచింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ (aha)లో స్ట్రీమింగ్ కానుంది.
ఏం చేస్తున్నావ్?
విజయ్ రాజ్కుమార్, నేహా పటాని జంటగా భరత్ మిత్ర తెరకెక్కించిన చిత్రం ‘ఏం చేస్తున్నావ్?’ (Em chesthunnav OTT Release). నవీన్ కురవ, కిరణ్ కురవ సంయుక్తంగా నిర్మించారు. ఈ యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గతేడాది ఆగస్టు 25న విడుదలైంది. ఇప్పుడీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. మార్చి 28 నుంచి ఈటీవీ విన్ (ETV Win) వేదికగా ప్రసారం కానుంది.
ట్రూ లవర్
జై భీమ్, గుడ్నైట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు కె.మణికందన్ (manikandan). ఆయన నటించిన తాజా చిత్రం ‘ట్రూ లవర్’ (True Lover OTT Release) ఇటీవల తెలుగులో రిలీజై పాజిటివ్ తెచ్చుకుంది. ఇందులో హీరోయిన్గా గౌరీ ప్రియ ఆకట్టుకుంది. ప్రభురామ్ తెరకెక్కించిన ఈ చిత్రం ‘ట్రూ లవర్’.. మార్చి 27న డిస్నీ+హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateTestamentSeriesEnglishNetflixMarch 27Heart Of The Hunter MovieEnglishNetflixMarch 29The Beautiful GameMovieEnglishNetflixMarch 29The Great Indian Kapil ShowSeriesHindiNetflixMarch 30Tig NotaroSeriesEnglishAmazon primeMarch 26The BoxtersSeriesEnglishAmazon primeMarch 28Patna ShuklaMovieHindiDisney + HotstarMarch 29Renegade NellSeriesEnglishDisney + HotstarMarch 29The HoldoversMovieEnglishBook My ShowMarch 29A Gentle Man In MaskSeriesEnglishJio CinemaMarch 29
మార్చి 25 , 2024
![The Goat Life Review: పృథ్వీరాజ్ సుకుమారన్ కెరీర్ బెస్ట్ నటన.. ‘ది గోట్ లైఫ్’ సినిమా ఎలా ఉందంటే?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/03/28130909/Movie-Review-18.jpg)
The Goat Life Review: పృథ్వీరాజ్ సుకుమారన్ కెరీర్ బెస్ట్ నటన.. ‘ది గోట్ లైఫ్’ సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు: ప్రృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, జిమ్మీ జీన్ లూయీస్, లీనా, సంతోష్ కీఝాత్తూర్, అకేఫ్ నజీం, శోభా మోహన్ తదితరులు
దర్శకుడు : బ్లెస్సీ
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
సినిమాటోగ్రఫీ : సునీల్ కే.ఎస్
నిర్మాతలు: బ్లెస్సీ, జిమ్మీ జీన్ లూయీస్, స్టీవెన్ ఆడమ్స్, కే.జీ అబ్రహం
విడుదల తేదీ : 28-03-2024
‘సలార్’తో (Salaar) తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). అంతకుముందు అతడు చేసిన మలయాళ చిత్రాలు తెలుగులో డబ్ అయినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. సలార్లో ప్రభాస్ ఫ్రెండ్గా నటించి తాజాగా మంచి పేరు గుర్తింపు సంపాదించాడు. తాజాగా అతడు నటించిన ‘ది గోట్ లైఫ్ : ఆడు జీవితం’ (The Goat Life : Aadujeevitham) మలయాళంతో పాటు తెలుగులోనూ ఇవాళ రిలీజైంది. బెన్యామిన్ రచించిన ‘గోట్ డేస్’ నవల ఆధారంగా దర్శకుడు బ్లెస్సీ ఈ సినిమాను తెరకెక్కించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది (The Goat Life Review In Telugu)? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఇప్పుడు చూద్దాం.
కథేంటి
ది గోట్ లైఫ్ చిత్ర కథ విషయానికి వస్తే.. కుటుంబ అవసరాల కోసం నజీబ్ అహ్మద్ (పృథ్వీరాజ్ సుకుమారన్) వలస కూలీగా సౌదీ అరేబియా వెళతాడు. అనుకోకుండా నజీబ్ సౌదీ అరేబియాలో తప్పిపోతాడు. గల్ఫ్లో పని చేసి డబ్బులు సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలనుకున్న నజీబ్ కల చెదిరిపోతుంది. ఏడారిలో బానిసగా మారి గొర్రెల కాపరిగా దుర్భరమైన జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతడు పడ్డ కష్టాలేంటి? బానిస సంకెళ్ళ నుండి నజీబ్ ఎలా బయటపడ్డాడు? తిరిగి ఇండియాకు వచ్చి తన కుటుంబ సభ్యులను నజీబ్ కలుసుకున్నాడా? లేదా? అనేది మిగతా కథ.
ఎవరెలా చేశారంటే?
‘ది గోట్ లైఫ్’ చిత్రాన్ని పృథ్విరాజ్ సుకుమారన్ అన్నీ తానై నడిపించాడు. ఆయన నటన, షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అబ్బురపరుస్తాయి. నజీబ్ పాత్రలో పృథ్వీరాజ్ను తప్ప మరో నటుడ్ని ఊహించుకోలేము. అంతగా ఆ పాత్రలో లీనమై నటించాడు పృథ్వీ. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన జీవించేశాడు. కెరీర్ బెస్ట్ నటనతో అదరగొట్టాడు. నటి అమలా పాల్ కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించింది. ఆమె తన పరిధి మేరకు నటించి మెప్పించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
దర్శకుడు బ్లెస్సీ ఈ సినిమాకు మనసులను హత్తుకునే కథను ఎంచుకున్నాడు. బానిసల జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో కళ్లకు కట్టాడు. ఫస్టాఫ్లో పృథ్వీ సౌదీకి రావడం.. అతడి పాస్పోర్టును లాక్కొని బానిసగా మార్చడం వంటివి చూపించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్కు ముందు వచ్చే సీన్ హృదయాలను బరువెక్కిస్తుంది. సౌదీలో ఎలాంటి దారుణాలు జరుగుతాయో కూడా దర్శకుడు ఈ సినిమాలో చూపించాడు. సెకండాఫ్లో ఆ బానిస సంకెళ్ల నుంచి హీరో తప్పించుకోవడం, కనుచూపు మేర కనిపించే ఏడారిలో అతడు పడే కష్టాలను తెరకెక్కించాడు. ముఖ్యంగా ఇసుక తుఫాను సీక్వెన్స్ను చాలా బాగా తెరకెక్కించాడు డైరెక్టర్. అయితే సినిమాలో సింహాభాగం అంతా పృథ్వీరాజ్ పడే కష్టాలే చూపించడం ఆడియన్స్కు బోర్ కొట్టిస్తుంది. పైగా సినిమా స్లో నేరషన్తో మరి నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. సుదీర్ఘమైన సినిమాను చూసినట్లు ఆడియన్స్ ఫీలవుతారు. కమర్షియల్ చిత్రాలను ఇష్టపడే వారికి ‘ది గోట్ లైఫ్’ అంతగా రుచించకపోవచ్చు.
టెక్నికల్గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే (The Goat Life Review In Telugu).. ప్రతీ విభాగం మంచి పనితీరు కనబరిచింది. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా ఆయన అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. అటు సినిమాట్రోగ్రాఫర్ కూడా చక్కటి ప్రతిభను కనబరిచాడు. సౌదీలోని ఎడారి పరిస్థితులను ఆ తన కెమెరా కళ్లతో అద్భుతంగా చూపించాడు. ప్రేక్షకులకు మంచి విజువల్ ట్రీట్ అందించాడు. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
ప్రృథ్వీరాజ్ సుకుమారన్ నటనభావోద్వేగ సన్నివేశాలుసంగీతం
మైనస్ పాయింట్స్
స్లో నారేషన్కమర్షియల్ హంగులు లేకపోవడం
Telugu.yousay.tv Rating : 3/5
మార్చి 28 , 2024
![అవతార్-2 కోసం ఎదురుచూస్తున్నారా? ఆలోపు ఈ 10 Sci-Fi సినిమాలు చూసేయండి](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/02/14101128/cropped-ws_images-9.jpg)
అవతార్-2 కోసం ఎదురుచూస్తున్నారా? ఆలోపు ఈ 10 Sci-Fi సినిమాలు చూసేయండి
]గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ vol.1 (2014 )2001: ఏ స్పేస్ ఒడిస్సే ( 1968 )
ఫిబ్రవరి 14 , 2023
![Pushpa 2 Second Single: శ్రీవల్లితో పుష్ప గాడి డ్యూయెట్.. రేపు ఎప్పుడంటే?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/05/22155508/Untitled-design-2024-05-22T155456.880.jpg)
Pushpa 2 Second Single: శ్రీవల్లితో పుష్ప గాడి డ్యూయెట్.. రేపు ఎప్పుడంటే?
టాలీవుడ్లో రానున్న మోస్ట్ అవెయిటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ (Pushpa : The Rule) ఒకటి. 2021లో విడుదలైన ‘పుష్ప ది రైజ్’కు కొనసాగింపుగా రానున్న దీని కోసం సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. ఇటీవలే ‘పుష్ప 2 ‘టైటిల్ సాంగ్ రిలీజ్ చేయగా అది పాన్ ఇండియా స్థాయిలో అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇదే ఊపులో రెండో సింగిల్కు కూడా చిత్ర యూనిట్ ముహోర్తం ఖరారు చేసింది.
రిలీజ్ ఎప్పుడంటే!
‘పుష్ప 2’ సెకండ్ సింగిల్ను రేపు (మే 23) ఉదయం 11:07 నిమిషాలకి రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. ఇందులో రష్మిక మందనతో బన్నీ చిందేయబోతున్నట్లు చెప్పింది. ఈ రొమాంటిక్ సాంగ్ ఆడియన్స్ను ఫిదా చేస్తుందని చెప్పుకొచ్చింది. ‘పుష్ప పుష్ప..' సాంగ్తో ఇటీవల పుష్ప రాజ్ దుమ్మురేపాడు. ఇప్పుడు శ్రీవల్లి తన సామితో కలిసి మన మనసులు కొల్లగొట్టబోతుంది అంటూ మేకర్స్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్గా మారింది. #Pushpa2SecondSingle హ్యాష్ట్యాగ్తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
ఆ పాటను మరిపిస్తుందా!
పుష్ప సినిమాలోని 'నా సామీ రారా సామీ' సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రొమాంటిక్ మెలోడీగా వచ్చిన ఈ పాట అప్పట్లో యూత్ను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో రష్మిక నడుమును బెండ్ చేసి వేసే హుక్ స్టెప్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ స్టెప్ను అప్పట్లో యూత్ రీల్స్ చేసి తెగ ట్రెండ్ చేశారు. ఇప్పుడు ‘పుష్ప 2’ నుంచి రాబోతున్న సెకండ్ సింగిల్.. రొమాంటిక్ సాంగ్ కావడంతో ఇప్పటినుంచే అంచనాలు మెుదలయ్యాయి. ‘నా సామి రారా సామీ’ రేంజ్లోనే ఈ పాట ఆకట్టుకుంటుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.
https://www.youtube.com/watch?v=vdY5SFZBgnk
ఐటెం సాంగ్పై ఫోకస్! (Pushpa 2 Item Song)
‘పుష్ప 2’ టైటిల్ సాంగ్ ఇప్పటికే విడుదలవ్వగా.. రొమాంటిక్ పాట రేపు (మే 23) ఫ్యాన్స్ను అలరించనుంది. దీంతో ప్రస్తుతం ఫ్యాన్స్ దృష్టి ఐటెం సాంగ్ వైపు మళ్లింది. పుష్ప సినిమాలోని 'ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా' సాంగ్ ఏ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిందే అందరికీ తెలిసిందే. ఇందులో సమంత (Samantha)తో అల్లు అర్జున్ వేసిన స్టెప్పులకు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. దీంతో 'పుష్ప 2' అదే రేంజ్లో ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఈ మూవీలో ఐటెం సాంగ్ చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇప్పటివరకూ ధ్రువీకరించలేదు. అదే సమయంలో మరో నటిని తీసుకుంటున్నట్లు కూడా ప్రకటించలేదు. అయితే ఆగస్టు 15న సినిమా రిలీజ్ కానుండటంతో త్వరగా సాంగ్ను రూపొందించాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిసింది.
మే 22 , 2024
![అశ్లీలత, బూతులకు OTT కేరాఫ్గా మారుతోందా? స్టార్లకు ఎందుకు నచ్చట్లేదు?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/04/08144445/Featured-image-50.jpg)
అశ్లీలత, బూతులకు OTT కేరాఫ్గా మారుతోందా? స్టార్లకు ఎందుకు నచ్చట్లేదు?
డిజిటల్ విప్లవంలో భాగంగా వచ్చిన కీలక మార్పు ఓవర్ ది టాప్(OTT). ఒకప్పుడు సినిమాలు థియేటర్లు, టీవీల్లోనే ప్రసారమయ్యేవి. కానీ, OTT వచ్చాక ఈ సంప్రదాయం పూర్తిగా మారిపోయింది. స్మార్ట్ఫోన్ వినియోగంతో ఓటీటీ వినియోగం ఊపందుకుంది. అయితే, ఓటీటీల్లో ప్రసారమయ్యే కంటెంట్పై ఎప్పటినుంచో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ వ్యతిరేకత మరింత పెరిగింది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఓటీటీపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో చర్చ ఊపందుకుంది.
ఓటీటీ ప్లాట్ఫాంలు ఎప్పటినుంచో అందుబాటులో ఉన్నాయి. కానీ, విస్తృతంగా ప్రజలకు చేరువయ్యింది మాత్రం కరోనా కాలంలోనే. థియేటర్లు మూత పడటంతో సినీ ప్రేక్షకులకు వినోదం దూరమైంది. దీంతో ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో టీవీల్లో, ఫోన్లలో సినిమాలు, సిరీస్లు చూడటానికి చాలామంది అలవాటు పడ్డారు. ఒక్కసారిగా యూజర్ బేస్ పెరిగిపోవడంతో ఓటీటీ ప్లాట్ఫాంలు ప్రేక్షకుడిని మరింత ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. అయితే, ఈ మార్కెట్ బిజినెస్ పెంచుకునే క్రమంలో కంటెంట్ పరంగా కొన్ని సంస్థలు దిగజారాయి. యూజర్లను త్వరగా అట్రాక్ట్ చేయడానికి బూతు పదాలు, బోల్డ్ సన్నివేశాలను ఎంకరేజ్ చేశాయి.
ఓటీటీలో ప్రసారమయ్యే కంటెంట్కు సెన్సార్షిప్ లేదు. దీంతో విచ్చలవిడి తనం పెరిగిపోయింది. ఫిల్మ్ మేకర్స్కి పూర్తిగా రెక్కలొచ్చాయి. జనాలు ఆదరిస్తుండటం వీరికి మరింత ఉత్సాహాన్నిచ్చింది. నటీనటులు కూడా ఇందుకు తగ్గట్టు నడుచుకోవాల్సి వచ్చింది. చిలికి చిలికి గాలివాన అయినట్లు క్రమంగా అసభ్యకర సన్నివేశాలు, బూతులు, అశ్లీలత, హింస తీవ్రత పెరిగిపోయింది. బహిరంగ ప్రదేశాల్లో ఉపయోగించని పదజాలాన్ని వాడేలా వ్యూయర్స్పై ఓటీటీ సిరీస్లు తీవ్ర ప్రభావం చూపాయి. తాజాగా వచ్చిన ‘రానానాయుడు’ ఇందుకు ఉదాహరణ అని పలువురు చెబుతున్నారు.
ఈ సిరీస్పై ఒకప్పటి స్టార్ హీరోయిన్, బీజేపీ నేత విజయశాంతి కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.
సెన్సార్షిప్ ఎందుకు లేదు?
ఓటీటీలకు సెన్సార్షిప్ ఇవ్వడం ఒకరకంగా కాస్త కష్టతరమే. ఇదే విషయమై గతేడాది సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఓటీటీల్లో ప్రసారమయ్యే కంటెంట్కి సెన్సార్షిప్ ఉండాలనేది పిటిషన్ సారాంశం. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం సాధ్యాసాధ్యాలను వెల్లడించింది. వెబ్సిరీస్లు ఎక్కువ డ్యురేషన్ ఉండటం సమస్యకు ప్రధాన కారణమని కోర్టు అభిప్రాయపడింది. అన్ని గంటల సేపు కూర్చుని ఓ వెబ్సిరీస్ని సెన్సార్ చేయడం కాస్త ఇబ్బందికరమేనని తేల్చిచెప్పింది. పైగా, ఒక్కో దేశంలో ఒక్కో సెన్సార్షిప్ నిబంధనలు ఉంటాయని గుర్తు చేసింది. ఓటీటీ పరిధి ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది గనుక సెటాఫ్ రూల్స్ని డిజైన్ చేయలేమని తెలిపింది.
సెన్సార్ ఇస్తే ప్రయోజనకరమేనా?
రెచ్చగొట్టే ప్రసంగాలకు ప్రజలు సులువుగా ఆకర్షితులవుతారు. పైగా ఓటీటీ అందరికీ అందుబాటులో ఉండటం కారణంగా ఇలాంటి కంటెంట్కి తర్వగా అట్రాక్ట్ అవుతారు. ఫలితంగా ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఊహించలేం. అందుకే సెన్సార్ ఇవ్వడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. విద్వేశ పూరిత ప్రసంగాలకు అడ్డుకట్ట వేయొచ్చు. దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించే కంటెంట్ని నివారించవచ్చు. ఓటీటీ కంటెంట్కి సెన్సార్ షిప్ ఇవ్వడం వల్ల హానికర కంటెంట్ నుంచి చిన్నపిల్లలను దూరంగా ఉంచవచ్చు.
ఎందుకు వద్దంటున్నారు?
ఓటీటీ కంటెంట్కి సెన్సార్షిప్ ఉండకకూదనే వాదన ఉంది. కొన్ని విషయాలపై ప్రజలకు సినిమాల ద్వారా పూర్తిగా అవగాహన కల్పించలేకపోవచ్చు. మరికొన్నింటిని విడమరచి చెప్పాల్సిన అవసరం ఉండవచ్చు. అలాంటి వాటికి విఘాతం కలిగే అవకాశం ఉందనేది ప్రధాన వాదన. అలాగే ఫిల్మ్ మేకర్ల క్రియేటివిటీని అణచివేసే ముప్పు ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. సెన్సార్ ఇస్తే విభిన్నంగా సిరీస్లు తీసే ఫిల్మ్ మేకర్లను ఆలోచనలో పడేలా చేస్తుందని చెబుతున్నారు.
మంచి కన్నా చెడు ఎక్కువ..!
ఓటీటీల్లో ప్రసారమయ్యే కంటెంట్తో ప్రేక్షకుడికి మంచి కన్నా ఎక్కువగా చెడు జరుగుతుందని పలువురు వాదిస్తున్నారు. బూతు పదాలకు ప్రభావితమై వాటినే ప్రేక్షకులు ఉచ్చరిస్తున్నారని అంటున్నారు. ఫలితంగా ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెబుతున్నారు. ఇదే విషయమై బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, అలనాటి నటి విజయశాంతి ఇటీవల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటీటీ కంటెంట్కు సెన్సార్షిప్ ఉండాలనేది వారి వాదన.
ఈ ప్లాట్ఫాంలలో అధికంగా..
కొన్ని ఓటీటీ ప్లాట్ఫాంలో అడల్ట్ కంటెంట్కి కేరాఫ్గా నిలుస్తున్నాయి. ఆల్ట్ బాలాజీ, ఉల్లు యాప్, గప్చుప్, ఫనియో మూవీస్, హాట్షాట్, 8షాట్స్, ఫిజ్ మూవీస్ తదితర యాప్లు అడల్ట్ కంటెంట్ని పెద్దఎత్తున ప్రసారం చేస్తున్నాయి.
టాప్ అడల్ట్ ఓటీటీ సిరీస్లు(ఇండియా)..
క్లాస్ ఆఫ్ 2020
విద్యార్థుల చుట్టూ తిరిగే కథ ఇది. స్నేహితులే సరదాగా డ్రగ్స్ తీసుకోవడం, శృంగారం చేసుకోవడం, రిలేషన్షిప్ మెయింటేన్ చేయడం చుట్టూ కథ తిరుగుతుంది. మొత్తం 32 ఎపిసోడ్లు ఉంటుంది.
ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్
జీవితంలో నిలబడటానికి నలుగురు అమ్మాయిలు ఏం చేయాల్సి వచ్చిందనేది సిరీస్ సారాంశం. అమెజాన్ ప్రైమ్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయింది.
మేడ్ ఇన్ హెవెన్
నేటి సమాజంలో పెళ్లిళ్లు జరుగుతున్న తీరు గురించి ఉంటుందీ వెబ్సిరీస్. 2019లో రిలీజైంది.
గందీబాత్
అడల్ట్ సిరీస్లలో దేశంలోనే గందీబాత్ ఫేమస్. చాలా బోల్డ్ సీన్లు ఇందులో ఉన్నాయి. ఐఎండీబీ రేటింగ్ కూడా నాసిరకంగా ఉంది.
మాయా: స్లేవ్స్ ఆఫ్ హర్ డిజైర్
మీరు కాస్త బలహీనులైతే ఈ సిరీస్ అస్సలు చూడొద్దు. గతం మర్చిపోయిన ఓ మహిళను తిరిగి మామూలు మనిషిని చేయడానికి సెక్స్ని ఓ కారకంగా చూపెడతారు.దీనికి ఐఎండీబీ రేటింగ్ 5.5 ఇచ్చింది.
వర్జిన్ భాస్కర్
రచయిత అయిన ఓ వ్యక్తి, అమ్మాయి మధ్య జరిగే ప్రేమకథే ఇది. ఏక్తాకపూర్, శోభాకపూర్ నిర్మించారు.
ఆశ్రమ్
ఆశ్రమాల్లో జరిగే వాటి గురించి ఆశ్రమ్ సిరీస్ తెలుపుతుంది. ఆశ్రమాల పేరిట జరిగే కార్యకలపాల గురించి చెబుతుంది.
రాత్రి కీ యాత్రి
2021లో ఈ సిరీస్ విడుదలైంది. రెడ్ లైట్ ఏరియా గురించి ఈ సిరీస్ వివరిస్తుంది.
మీర్జాపూర్
అమెజాన్ ప్రైమ్లో అప్పట్లో సంచలనంగా మారిందీ వెబ్సిరీస్. క్రైం, అశ్లీలం ఇందులో అధికంగా ఉంటుంది.
రానానాయుడు
ఇటీవల విడుదలైన ఈ సిరీస్లో అశ్లీలత అధికంగా ఉంది. తండ్రి, కొడుకుల మధ్య జరిగే కథ గురించి తెలుపుతుంది. వీటితో పాటు తదితర సిరీస్లు అధికంగా అశ్లీలత, బూతు కంటెంట్ని కలిగి ఉన్నాయి.
ఏప్రిల్ 08 , 2023
![RRR సినిమాకు ఆస్కార్ రావడంపై బాలీవుడ్ అక్కసు… మేకప్ ఆర్టిస్ట్ వ్యాఖ్యలు దుమారం](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/03/15161136/rrr2_2023-3-13-11-56-34_thumbnail.jpg)
RRR సినిమాకు ఆస్కార్ రావడంపై బాలీవుడ్ అక్కసు… మేకప్ ఆర్టిస్ట్ వ్యాఖ్యలు దుమారం
భారతీయ చిత్రాలు RRR, ది ఎలిఫెంట్ విస్పరర్ సినిమాలకు రెండు ఆస్కార్ అవార్డులు వచ్చాయి. దేశం మెుత్తం గర్వించింది. ఇలాంటి సమయంలో ఆస్కార్ను కూడా కొన్నారంటూ ఓ మేకప్ ఆర్టిస్ట్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు మేకప్ చేసే షాన్ ముట్టాత్తిల్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో నెటిజన్లు అతడిపై విరుచుకుపడుతున్నారు.
తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఆర్ఆర్ఆర్లోని నాటు నాటు పాటకు ఆస్కార్ ఇవ్వటం పట్ల అక్కసు వెళ్లగక్కడా షాన్.
నాటునాటుకు ఆస్కార్ ఇవ్వటం చాలా హాస్యాస్పదం. భారత్లో అవార్డులు కొంటారని అనుకున్నా. కానీ, ఇప్పుడు ఏకంగా ఆస్కార్స్. మనదగ్గర డబ్బుంటే ఏదైనా వస్తుంది. ఆస్కార్తో సహా” అన్నాడు.
View this post on Instagram A post shared by viral.fta (@viral.fta)
షాన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. నీ మాటల్లో ఈర్ష్య స్పష్టంగా కనిపిస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు.
తెలుగు సినిమాకు ఆస్కార్ రావటం బాలీవుడ్లో చాలామందికి నచ్చలేదనే వాదన లేకపోలేదు. ఎందుకంటే, బాహుబలి నుంచి ఆర్ఆర్ఆర్ వరకు టాలీవుడ్ సినిమాలు అక్కడ ఏలుతున్నాయి.
నిఖిల్ నటించిన కార్తికేయ 2 బాలీవుడ్లో రూ. 100 కోట్ల వసూళ్లు సాధించడం ఇందుకు నిదర్శనం. ఈ కారణంగానే కొంతమంది నాటునాటుకి ఆస్కార్ రావటాన్ని ఓర్వలేక పోతున్నారని వినికిడి.
నాటునాటుకి ఆస్కార్ రావటం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మంది శుభాకాంక్షలు తెలిపారు. కానీ, బాలీవుడ్ నుంచి పెద్దగా స్పందన రాలేదు.
ఈ క్రమంలో మేకప్ ఆర్టిస్ట్ షాన్ చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని పెంచాయి. దీంతో ట్రోలర్స్ చేతికి పనిదొరికనట్లయ్యింది.
మార్చి 15 , 2023
![Andrea Jeremiah: కనిపించి కనిపంచని సొగసులతో ఆండ్రియా అందాల దాడి.. చూడకుండా వెళ్లగలరా?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/02/14132131/123.-7.jpg)
Andrea Jeremiah: కనిపించి కనిపంచని సొగసులతో ఆండ్రియా అందాల దాడి.. చూడకుండా వెళ్లగలరా?
తమిళ్ హాట్ బ్యూటీ ఆండ్రియా జర్మియా తన తాజా హాట్ఫోటోలు షేర్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. విలక్షణ నటనకు పెట్టింది పేరుగా ఉన్న ఆండ్రియా ఒంపుసొంపులతో కుర్రకారు హార్ట్ బీట్ అమాంతం పెంచేసింది.
పింక్, బ్లాక్ కలర్ డ్రెస్లో ఫొటో షూట్లో ఆండ్రింగా హాట్ లుక్స్లో కనిపించింది. ఎద అందాలు కనిపించి కనిపించకుండా చూపిస్తూ కవ్విస్తోంది.
ఆండ్రియా జర్మియా తమిళ్తో పాటు తెలుగు, మలయాళం సినిమాల్లో నటించి మెప్పించింది. కార్తి హీరోగా నటించిన 'యుగానికి ఒక్కడు' సినిమాతో పాపులారిటీ సంపాదించింది.
ఆ తర్వాత తెలుగులో సునీల్, నాగ చైతన్య కాంబోలో వచ్చిన తడాఖా చిత్రంలో మెరిసింది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే ఆండ్రియా తన పరువాల విందుతో కుర్రకారుకు కైఫెక్కిస్తుంటుంది.
తాజా ఫొటో షూట్లో ఇంపైన బ్యాక్ షోతో సొగసుల విందు చేసింది. బ్లాక్ కలర్ డ్రెస్లో అందాల ఎర వేసింది
పొట్టి షార్ట్లో నడుము అందాలను చూపిస్తూ ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి
సోషల్ మీడియాలో తరుచూ యాక్టివ్ ఉండే ఈ తమిళ్ తెగింపు.. అందాల ప్రదర్శనతో రచ్చ చేస్తుంటుంది
గతంలో ధనుష్, అనిరుధ్ రవిచందర్, ఫహాద్ ఫాజిల్ వంటి సెలబ్రెటీలతో ఆఫైర్స్ నడిపి వార్తల్లో నిలిచింది.
ఆండ్రియా తన తొలి చిత్రం 'కందా నల్ల ముదల్'(2005)తో సినిమాల్లోకి ఆరంగేట్రం ఇచ్చింది. స్టైలిష్గా కనిపిస్తూ, మంచి నటన కనబరుస్తూ గుర్తింపు తెచ్చుకుంది.
ఆండ్రియా జర్మియా ఇండస్ట్రీలోకి రాకముందు సింగర్గా కొనసాగింది. ఆండ్రియా పదేళ్ల వయసు నుంచే మంచి యాక్టివ్ పిల్ల. 'యంగ్ ఇసాదర్సు' ర్యాప్ బృంందంలో సాంగ్స్ పాడేది. కాలేజీలోనూ స్టేజ్ పర్ఫామెన్స్ చేస్తూ నటనపై తన అభిరుచిని చాటుకుంది.
ఆండ్రియా స్వస్థలం తమిళనాడులోని అరక్కోణం. ఆమె ఆంగ్లో ఇండియన్ కుటుంబంలో 1985 డిసెంబర్ 21న జన్మించింది.
తడాఖా సినిమా ద్వారా తెలుగు తెరకు పరచయమైన ఈ సుందరాంగి ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు. అడపాదడపా తమిళ్ నుంచి తెలుగులోకి డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
తెలుగులో అవకాశాలు రాకపోతేనేం.. అందాల ఆరబోతతో తమిళ్, తెలుగు కుర్రాళ్లను ఆకర్షిస్తునే ఉంది.
ప్రస్తుతం ఈ అందాల బామకు చేతినిండ పని ఉంది. పిశాసు-2, నో ఎంట్రీ, వట్టం చిత్రాల్లో నటిస్తోంది
ఫిబ్రవరి 14 , 2024
![HBD ADAH SHARMA: ఆదాశర్మను మీరు ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. టాప్-10 రేర్ పిక్స్ వైరల్](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/05/11120259/Collages-14.jpg)
HBD ADAH SHARMA: ఆదాశర్మను మీరు ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. టాప్-10 రేర్ పిక్స్ వైరల్
ఇప్పుడు హీరోయిన్ ఆదాశర్మ పేరు దేశమంతా మార్మోగుతోంది. ది కేరళ స్టోరీలో ఆమె నటనకు గాను విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక సినీ కెరీర్ ముగుస్తుందనుకున్న తరుణంలో ది కేరళ స్టోరీ హిట్తో మంచి కమ్బ్యాక్ ఇచ్చింది. నేడు హీరోయిన్ ఆదాశర్మ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆదాశర్మ రేర్ పిక్స్తో పాటు ఆమె గురించి ప్రత్యేక విషయాలు మీకోసం..
ప్రముఖ నటి ఆదాశర్మ.. ముంబయిలోని నేవీ కుటుంబంలో జన్మించింది. చిన్ననాటి నుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకుంది.
పదో తరగతి పూర్తి చేసిన వెంటనే సినీ రంగ ప్రవేశం కోసం ఆదాశర్మ యత్నించింది. అయితే మరీ యంగ్గా ఉండటంతో పలు ఆడిషన్లలో ఆమెను రిజెక్ట్ చేశారు. 2008లో వచ్చిన ‘1920’ అనే హారర్ చిత్రంతో ఆమె సినిమాల్లోకి అడుగుపెట్టారు.
‘1920’ తర్వాత మరో రెండు సినిమాల్లో నటించిన ఆదాశర్మ.. హార్ట్ ఎటాక్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. హయాతి పాత్రలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
‘హార్ట్ ఎటాక్’ ఫ్లాప్ అయినా ఆదాశర్మకు మాత్రం అవకాశాలు క్యూ కట్టాయి. సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్, గరం, క్షణం ఇలా వరుస అవకాశాలు దక్కించుకుంది. కానీ అవేవీ ఆమెకు కలిసి రాలేదు.
తెలుగులో ఆదాశర్మ చేసిన చివరి సినిమా ‘కల్కి’. ఇందులో డాక్టర్ పద్మ అనే పాత్రలో ఈ భామ కనిపించింది. ఈ సినిమా కూడా కలిసిరాకపోవడంతో తెలుగులో అవకాశాలు మరింత సన్నగిల్లాయి.
అటు బాలీవుడ్లోనూ ఛాన్సెస్ రాకపోవడంతో ఆమె వెబ్సిరీస్లపై ఫోకస్ పెట్టింది. ‘పతి పత్ని ఔర్ పంగా’ అనే వెబ్ సిరీస్లో నటించింది. శివాని భట్నాగర్ అనే పాత్రలో మెప్పించింది.
హిందీలో ‘చుహాబిల్లి’ అనే థ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్లో కూడా ఆదాశర్మ నటించింది. అలాగే ‘పియా రే పియా’ అనే ఒక మ్యూజిక్ వీడియోలోనూ కనిపించి సందడి చేసింది.
ఇటీవల విడుదలైన ది కేరళ స్టోరీ అనే సినిమాలోనూ ఆదాశర్మ కీలక పాత్ర పోషించింది. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ది కేరళ స్టోరీ సినిమాకు భాజపా పాలిత రాష్ట్రాలు రాయితీలు ప్రకటిస్తుంటే.. మరికొన్ని స్టేట్స్ మాత్రం షరతులు విధిస్తున్నాయి.
ఇక సోషల్ మీడియాలోనూ ఆదాశర్మ ఎంతో చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ అలరిస్తోంది. ఆదాశర్మ ఇన్స్టా ఖాతాను 7.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
https://telugu.yousay.tv/the-kerala-story-review-in-telugu-adah-sharmas-performance-brought-tears-reminds-me-of-another-kashmir-files.html
మే 11 , 2023
![MRUNAL THAKUR: గ్లామర్ హద్దులు దాటేస్తున్న మృణాల్ థాకూర్… రెచ్చిపోయి అందాల ప్రదర్శన…](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/04/19155444/Untitled-design-1.jpg)
MRUNAL THAKUR: గ్లామర్ హద్దులు దాటేస్తున్న మృణాల్ థాకూర్… రెచ్చిపోయి అందాల ప్రదర్శన…
మృణాల్ థాకూర్ ఫేమ్ రోజురోజుకి పెరుగుతోంది. హిట్ సినిమాలు లేకపోయినా ఈ అమ్మడు టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తోంది.
మృణాల్ రోజురోజుకి గ్లామర్ డోస్ పెంచుతోంది. సీతారామం చిత్రంలో చీరకట్టులో పద్ధతిగా కనిపించిన ఈ సుందరి… అందాల ఆరబోతకు అవదుల్లేవ్ అనేంతలా చెలరేగుతోంది.
ఇటీవల బికినీలో దర్శనమిచ్చి కుర్రకారు మతి పోగొట్టింది ఈ వయ్యారి. మృణాల్ను అలా చూసి అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
View this post on Instagram A post shared by Shehla Khan (@shehlaakhan)
సీతారామంలో చూసిన ఆ అమ్మాయేనా ఇలా కనిపించిందని అనుకునేలోపు డోసు పెంచింది. సొగసుల వయ్యారాలు ప్రదర్శిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది మృణాల్.
ప్రస్తుతం నెట్టింట ఎక్కడ చూసిన మృణాల్ గురించే చర్చ. హాట్ అందాలతో యువతకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ అమ్మడు.
ఎద, నాభి సొగసులను మూటగట్టి మత్తెక్కించే చూపులతో రెచ్చిపోతుంది మృణాల్. ఫస్ట్ లుక్ అనే మ్యాగ్జిన్ కోసం పరువాల ప్రదర్శన చేస్తోంది.
అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న మృణాల్ థాకూర్కి ఫ్యాన్ బేస్ క్రమంగా పెరుగుతోంది. ఇన్స్టా, ట్విటర్లో ఫాలోవర్స్ పెరుగుతున్నారు.
తెలుగులో నాని 30 సినిమాలో నటిస్తుంది ఈ ముంబయి భామ. ఆంక్ మిచోలీ అనే బాలీవుడ్ చిత్రంలోనూ మెరవనుంది.
View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur)
టెలివిజన్ సీరియల్ యాక్టర్గా కెరీర్ ప్రారంభించిన ముద్దుగుమ్మ లవ్ సోనియా చిత్రంతో బాలీవుడ్లో ఆరంగేట్రం చేసింది. తెలుగు, హిందీ, మళయాలం చిత్రాల్లోనూ ఆఫర్లు కొట్టేస్తుంది చిన్నది. యువత టార్గెట్గా సినిమాలు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
ఏప్రిల్ 19 , 2023
![Pushpa 2 Latest Song: ‘పుష్ప 2’ ఐటెం సాంగ్పై ఊహించని ట్విస్ట్.. తెరపైకి ‘యానిమల్’ బ్యూటీ!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/05/23145427/Untitled-design-2024-05-23T145418.386.jpg)
Pushpa 2 Latest Song: ‘పుష్ప 2’ ఐటెం సాంగ్పై ఊహించని ట్విస్ట్.. తెరపైకి ‘యానిమల్’ బ్యూటీ!
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’ (Pushpa 2: The Rule). గతంలో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం 'పుష్ప: ది రైజ్' కి సీక్వెల్గా ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచగా.. ఇటీవల వచ్చిన ఫస్ట్ సింగిల్ వాటిని రెట్టింపు చేసింది. తాజాగా రెండో సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరోవైపు ‘పుష్ప 2’కి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది విన్న ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
తృప్తి దిమ్రితో ఐటెం సాంగ్!
బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన ‘యానిమల్’.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇందులో నటించిన బాలీవుడ్ నటి తృప్తి దిమ్రీ.. తన గ్లామర్తో యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. లేటెస్ట్ బజ్ ప్రకారం.. ‘పుష్ప 2’లో ఈ భామ ఐటెం సాంగ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాంగ్ కోసం చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించగా తృప్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేస్తుందని అంటున్నారు. పుష్పలో ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ అంటూ సమంత చేసిన మ్యాజిక్ను తృప్తి రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. బన్నీ, తృప్తి కలిసి స్టెప్పులేస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయని కామెంట్స్ చేస్తున్నారు.
ప్రోమోలో ఏముందంటే?
సెకండ్ సాంగ్ ప్రోమోలో పూర్తిగా హీరోయిన్ రష్మిక మందన్ననే కనిపించింది. సాంగ్ సెట్లో రష్మిక మేకప్ వేసుకుంటూ కనిపించింది. ఈ క్రమంలో కేశవ వచ్చి.. శ్రీవల్లి వదిన పుష్ప 2 నుంచి రెండో సాంగ్ రిలీజ్ చేస్తున్నారంటగా కదా ఆ పాటేందో చెప్తావా అని అడుగుతాడు. అప్పుడు రష్మిక ‘సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అంటూ పాట పాడుతుంది. మీరు కూడా ఈ ప్రోమోను ఓసారి చూసేయండి.
https://www.youtube.com/watch?v=sbp9M95-2rQ&t=19sv
పూర్తి సాంగ్ ఎప్పుడంటే?
పుష్ప 2లోని రెండో పాటను మే 29న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తాజా ప్రోమోలో స్పష్టం చేశారు. ఆ రోజు ఉ.11.07 గం.లకు పూర్తి లిరికల్ వీడియోను విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇది బన్నీ, రష్మిక మధ్య సాగే మెలోడీ సాంగ్ అంటూ వివరించారు. గతంలో పుష్ప సినిమాలో వచ్చిన ‘సామి.. సామి’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. దీంతో ‘సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ పాట కూడా ఆ స్థాయిలోనే అలరిస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఆ పాట కోసం బన్నీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఆ రోజున ఫ్యాన్స్కు పండగే
భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్కు ప్రత్యర్థిగా మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahad Faasil) నటిస్తున్నారు. అనసూయ, ధనుంజయ్, సునీల్, రావు రమేశ్, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ రూపొందిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే వదిలిన అప్ డేట్స్ అన్నీ కూడా సినిమాపై ఓ రేంజ్లో హైప్ క్రియేట్ చేశాయి. ఈ మూవీ రిలీజ్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 15 ఫ్యాన్స్కు పండగే అని చెప్పొచ్చు.
మే 23 , 2024
![Bhagyashri Borse : టాలీవుడ్ రైజింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/04/12181308/123.-82.jpg)
Bhagyashri Borse : టాలీవుడ్ రైజింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
సాధారణంగా హీరోయిన్లకు తమ మెుదటి చిత్రంతో ఇండస్ట్రీలో పేరు వస్తుంది. కానీ, నటి భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి మాత్రం తెలుగులో ఒక్క సినిమా చేయనప్పటికీ టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది. ముగ్గురు స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని ఈ అమ్మడు దక్కించుకోవడమే ఇందుకు కారణం. రవితేజ ‘మిస్టర్ బచ్చన్’, విజయ్ దేవరకొండ ‘VD 12’, నాని - సుజీత్ కాంబోలో రానున్న చిత్రాలకు భాగ్యశ్రీ లాక్ అయ్యింది. దీంతో టాలీవుడ్కు మరో కొత్త స్టార్ హీరోయిన్ దొరికేసిందంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ భామకు గురించి తెలుసుకునేందుకు తెలుగు ఆడియన్స్ను ఆసక్తికనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగ్యశ్రీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
భాగ్యశ్రీ బోర్సే ఎవరు?
బాలీవుడ్కు చెందిన యువ నటి.
భాగ్యశ్రీ బోర్సే ఎక్కడ పుట్టింది?
మహారాష్ట్ర ఔరంగబాద్లో భాగ్యశ్రీ జన్మించింది.
భాగ్యశ్రీ బోర్సే పుట్టిన తేది?
ఈ భామ తన పుట్టిన రోజును ఎక్కడ పంచుకోలేదు.
భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం ఎక్కడ ఉంటోంది?
మహారాష్ట్ర పుణేలో ఈ భామ నివసిస్తోంది.
భాగ్యశ్రీ బోర్సే తల్లిదండ్రులు ఎవరు?
తన కుటుంబ సభ్యుల వివరాలను భాగ్యశ్రీ ఎక్కడా వెల్లడించలేదు. ఈ విషయంలో ఆమె గోప్యత పాటిస్తోంది.
భాగ్యశ్రీ బోర్సేకు తోబుట్టువులు ఉన్నారా?
ఈ బ్యూటీకి ఓ సోదరి ఉన్నట్లు ఆమె ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్టును బట్టి తెలిసింది.
భాగ్యశ్రీ బోర్సే ఎత్తు ఎంత?
178 సెం.మీ (5 అడుగుల 8 అంగుళాలు)
భాగ్యశ్రీ బోర్సే ఎక్కడ చదువుకుంది?
నైజీరియాలోని లాగోస్లో ఈ భామ చదువుకుంది.
భాగ్యశ్రీ బోర్సే విద్యార్హత ఏంటి?
ఈ భామ బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేసింది.
భాగ్యశ్రీ బోర్సే ఏ మతానికి చెందిన నటి?
హిందూ
భాగ్యశ్రీ బోర్సే తన కెరీర్ను ఎలా ప్రారంభించింది?
సినిమాల్లోకి రాకముందు ఈ భామ మోడల్గా చేసింది. ఒక మోడలింగ్ ఏజెన్సీతో కలిసి పలు బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరిచింది.
భాగ్యశ్రీ బోర్సేకు ఎలా పాపులర్ అయ్యింది?
క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్ ద్వారా ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. దీని ద్వారానే ఆమెకు తొలి చిత్ర ఆఫర్ వచ్చింది.
భాగ్యశ్రీ బోర్సే తెరంగేట్ర సినిమా ఏది?
2023 అక్టోబర్లో వచ్చిన బాలీవుడ్ చిత్రం 'యారియన్ 2' ద్వారా ఈ భామ వెండితెరకు పరిచయమైంది.
భాగ్యశ్రీ బోర్సే పోషించిన తొలి సినిమా పాత్ర పేరు?
రాజ్యలక్ష్మీ
భాగ్యశ్రీ బోర్సే అప్కమింగ్ తెలుగు చిత్రాలు?
‘మిస్టర్ బచ్చన్’, ‘VD 12’, ‘Nani 32’
భాగ్యశ్రీ బోర్సే ఫేవరేట్ ఫుడ్?
తన ఆహార అభిరుచుల గురించి ఈ భామ ఎక్కడా పంచుకోలేదు.
భాగ్యశ్రీ బోర్సేకు ఇష్టమైన నటీనటులు?
ఫేవరేట్ యాక్టర్స్ గురించి భాగ్యశ్రీ ఏ ఇంటర్యూలోనూ రివీల్ చేయలేదు.
భాగ్యశ్రీ బోర్సే అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా లింక్ ఏది?
https://www.instagram.com/bhagyashriiborse/?hl=en
ఏప్రిల్ 12 , 2024
![మెహ్రీన్ పిర్జాదా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/04/03161124/123.-20.jpg)
మెహ్రీన్ పిర్జాదా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
మెహ్రీన్... 'కృష్ణ గాడి వీర ప్రేమ గాధ' సినిమాతో టాలీవుడ్లో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత మహానుభావుడు చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. రవితేజ నటించిన రాజా ది గ్రేట్ చిత్రం ఆమె కెరీర్కు మంచి బ్రేక్ ఇచ్చింది. జవాన్, F2, అశ్వథ్థామ, F3 సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మెహ్రీన్ గురించి మరిన్ని (Some Lesser Known Facts about Mehreen Pirzada) ఆసక్తికరమైన విషయాలు మీకోసం..
మెహ్రీన్ పిర్జాదా ఎప్పుడు పుట్టింది?
1995, జనవరి 5న జన్మించింది
మెహ్రీన్ పిర్జాదా తొలి సినిమా?
కృష్ణ గాడి వీర ప్రేమ గాధ (2016)
మెహ్రీన్ పిర్జాదా ఎత్తు ఎంత?
5 అడుగుల 5అంగుళాలు
మెహ్రీన్ పిర్జాదా ఎక్కడ పుట్టింది?
బతిండా, పంజాబ్
మెహ్రీన్ పిర్జాదా ఏం చదివింది?
డిగ్రీ
మెహ్రీన్ పిర్జాదా అభిరుచులు?
పుస్తకాలు చదవడం, మోడలింగ్
మెహ్రీన్ పిర్జాదాకు ఇష్టమైన ఆహారం?
చేపల వేపుడు, రాగి ముద్ద
మెహ్రీన్ పిర్జాదాకి ఇష్టమైన కలర్ ?
బ్లాక్, వైట్
మెహ్రీన్ పిర్జాదాకు ఇష్టమైన ప్రదేశం
లండన్
మెహ్రీన్ పిర్జాదాకి ఇష్టమైన హీరో?
రణబీర్ కపూర్
మెహ్రీన్ పిర్జాదాకి ఇష్టమైన హీరోయిన్?
ఐశ్వర్య రాయ్
మెహ్రీన్ పిర్జాదా పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ.80 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది
మెహ్రీన్ పిర్జాదా ఇన్స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/mehreenpirzadaa/?hl=en
మెహ్రీన్ పిర్జాదా బాయ్ ఫ్రెండ్?
హరియాణా ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్తో పెళ్లి నిశ్చయమైనప్పటికీ... వ్యక్తిగత కారణాలతో వీరు విడిపోయారు.
మెహ్రీన్ పిర్జాదా సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
మెహ్రీన్ సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేది. డవ్ ఇండియా, పియర్స్, థమ్స్అప్ యాడ్స్లో నటించింది.
https://www.youtube.com/watch?v=5VD3YejRDhk
ఏప్రిల్ 06 , 2024
![Mansi Taxak: యానిమల్లో బాబీ డియోల్ భార్యగా నటించిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/12/11165344/GA-QX53bMAA7U7r.jpg)
Mansi Taxak: యానిమల్లో బాబీ డియోల్ భార్యగా నటించిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
యానిమల్ సినిమాలో బాబీ డియోల్ మూడో భార్యగా నటించిన మాన్సి టాక్సాక్( Mansi Taxak ) ఇప్పుడో సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువైనా ప్రేక్షకులపై చాలా ఇంపాక్ట్ కలిగించింది.
యానిమల్ సినిమాలో కొత్త పెళ్లి కూతురుగా అబ్రంను (బాబీ డియోల్) పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత వెంటనే అబ్రం.. అందరూ చూస్తుండగా ఆమెపై బలత్కారం చేసి తన క్రూరత్వాన్ని చూపిస్తాడు.
ప్రస్తుతం ఆమె గ్లామర్పై సినిమా చూసిన ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మాన్సి టాక్సక్ గురించి నెట్టింట్లో సెర్చ్ చేస్తున్నారు.
ఆమె బ్యాక్గ్రౌండ్, ఏజ్, బాయ్ ఫ్రెండ్ వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు.
మాన్సి టాక్సక్ 1998 జులై 23న ముంబైలో కుల్దీప్ సింగ్ టాక్సాక్, కౌనిక టాక్సాక్ దంపతులకు జన్మించింది. ఆమె విద్యభ్యాసం అంతా గుజరాత్, ముంబైలో జరిగింది.
సినిమాల్లోకి రాకముందు మాన్సి టాక్సక్ మోడలింగ్ చేసేది. ఆమె 2019లో 'ఫెమినా మిస్ఇండియా' పోటీల్లో పాల్గొని 'మిస్ ఇండియా గుజరాత్' కిరిటం సాధించింది.
ఆ తర్వాత 2022లో ఐ ప్రామిస్ అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా వెండి తెరకు పరిచయమైమంది. ఈ చిత్రం యూట్యూ ఛానెల్ క్యూనెట్లో రిలీజైంది.
ఈ సినిమా తర్వాత బాలీవుడ్ బాద్షా నటించిన పఠాన్ మూవీలో నటించే అవకాశం దక్కింది. ఆ తర్వాత ది కేరళ స్టోరీ, గదర్ 2 సినిమాల్లోనూ కనిపించింది.
మాన్సి నటించిన సినిమాలు బ్లాక్బాస్టర్ హిట్లు సాధించడం విశేషం.
https://twitter.com/TBSTwizzle/status/1733476252290302005
ఇక మాన్సి టాక్సాక్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ఆమెకు 2 లక్షల మంది వరకు ఫాలోవర్లు ఉన్నారు. ఎప్పటికప్పుడూ గ్లామర్ ఫోటో షూట్ చేస్తూ కనువిందు చేస్తుంటుంది
మాన్సి టాక్సాక్ కాలేజీ డేస్లో స్టేట్ లెవెల్ వాలీబాల్ ప్లేయర్. అంతేకాదు జిల్లా స్థాయిలో అనేక బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొని గెలిచింది.
మాన్సి టాక్సాక్కు భరత నాట్యం, బెల్లీ డ్యాన్స్లో మంచి ప్రావీణ్యం ఉంది.
మాన్సికి సామాజిక స్పృహా కూడా ఎక్కువే. దిలే సే ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతుంటుంది.
అంతేకాదు ఈ కుర్ర హీరోయిన్కు హిందీ, ఇంగ్లీష్తో పాటు స్పానీష్ భాషలో మంచి ప్రావీణ్యం ఉంది.
యానిమల్ సినిమాలో ఈ అమ్మడి గ్లామర్కు ఫిదా అయిన బాలీవుడ్ నిర్మాతలు తమ సినిమాల్లో అవకాశాలు ఇచ్చేందుకు క్యూ కట్టారంట.
మరోవైపు యానిమల్ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.700కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇండియా వైడ్గా రూ.438 కోట్ల వసూళ్లను రాబట్టింది.
ఇప్పటివరకు బాలీవుడ్లో షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ వంటి అగ్రహీరోల సినిమాలు మాత్రమే రూ.500 కోట్లు రాబట్టాయి. ఇప్పుడు ఆ లిస్ట్లో రణ్బీర్ కపూర్ సినిమా యానిమల్ యాడ్ అయింది.
డిసెంబర్ 11 , 2023
![RGV: షేపులు ఎలా మెయిన్టైన్ చేస్తున్నావ్..? కొంటెగా ఆన్సర్ ఇచ్చిన RGV చీర భామ!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/10/31203849/collage-6.jpg)
RGV: షేపులు ఎలా మెయిన్టైన్ చేస్తున్నావ్..? కొంటెగా ఆన్సర్ ఇచ్చిన RGV చీర భామ!
Sreelakshmi Satheesh: సంచలనాలు డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ ఈ మధ్య ఓ యువతిపై మనసు పారేసుకున్నారు. ఆమెనే శ్రీ లక్ష్మీ సతీష్. రామ్గోపాల్ వర్మ శ్రీలక్ష్మీ సతీష్ వీడియో ట్విట్టర్లో పోస్ట్ చేసిన తర్వాత ఒక్కసారిగా సెలబ్రెటీగా మారిపోయింది.
శ్రీలక్ష్మీ అందానికి దాసోహం అయ్యానని RGV చెప్పడంతో తెలుగు రాష్ట్రాలో ఈ కేరళ అందం హాట్ ఆఫ్ ది టాక్గా మారింది.
రామ్గోపాల్ వర్మ ఆమెను గుర్తించక ముందు జస్ట్ ఆమె ఇన్స్టా ఫాలోవర్లు 30 వేలు మించలేదు. ఎప్పుడైతే శ్రీలక్ష్మీ అందాన్ని ఆర్జీవీ గుర్తించాడే ఆమె ఫాలోవర్ల సంఖ్య జెట్ వేగంతో దూసుకెళ్లింది.
తాజాగా రామ్గోపాల్ వర్మ శ్రీలక్ష్మి సతీష్తో 'చీర' అనే సినిమాను తీస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆమె కూడా ఈసినిమా చేసేందుకు ఒప్పుకుంది.
శ్రీలక్ష్మీతో ఆర్జీవీ ఫోన్లో మాట్లాడటం.. ఆమె గురించి వరుస ఫోస్ట్లు పెట్టడంతో నెటిజన్లను పెద్ద పని కలిగింది.
ఇన్స్టాగ్రామ్లో తీరికలేకుండా తనకు నోటిఫికేషన్లు వస్తున్నట్లు శ్రీలక్ష్మీ సతీష్ తెలిపింది. అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చింది.
అంతేకాదు ఎలాగు క్రేజ్ వస్తోంది కదా అని … ఈ అందాల తెగింపు వరుస హాట్ ఫొటో షూట్లతో కుర్రకారుకు గిలిగింతలు పెడుతోంది.
నేరుగా నెటిజన్లతో ఇంటరాక్ట్ అవుతూ తన అభిప్రాయాలను పంచుకుంటోంది. చాలా మంది ఆమె అందాల షేపులు, సౌందర్యం, ఒంపుసొంపుల గురించి ప్రశ్నలు సంధించారు. వాటి రహస్యం ఏమిటని బహిరంగంగానే అడిగారు.
మీ కళ్లు సూదుల్లా మా గుండెల్ని గుచ్చుతున్నాయి అని ఓ నెటిజన్ అనగా… నీవు మానవ కన్యవు కావు, పైనుంచి దిగివచ్చిన దేవకన్యవు అంటూ తెగ పొగిడేశారు.
నీ ఎద షేపులు, నడుమందాలు బాగున్నాయి.. ఎలా మెయిన్టైన్ చేస్తున్నావ్ అని అడిగితే… శ్రీలక్ష్మీ సతీష్ తెగ సిగ్గుపడుతూ జవాబు చెప్పింది.
అందరిలాగే నార్మల్ వాకింగ్, టైమ్ టూ టైమ్ డైట్ తీసుకుంటాను. అదే నా సౌందర్య రహస్యం అని చెప్పుకొచ్చింది.
RGVపై ఒక్కమాటలో చెప్పండి అంటే… ఆయనపై కొండంత ప్రేమ దాగుందని ఆన్సర్ ఇచ్చింది… ఈ కొంటె కోనంగి.
అక్టోబర్ 31 , 2023
![GLOBAL STAR NTR: హాలీవుడ్ డైరెక్టర్తో NTR సినిమా… అసలు విషయం చెప్పిన జేమ్స్ గన్ ](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/04/26113211/Collages-8.jpg)
GLOBAL STAR NTR: హాలీవుడ్ డైరెక్టర్తో NTR సినిమా… అసలు విషయం చెప్పిన జేమ్స్ గన్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ మారిపోయింది. RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు ఈ హీరో. తారక్తో సినిమాలు తీసేందుకు ఇప్పటికే చాలామంది క్యూ కడుతుండగా… ఈ లిస్ట్లో హాలీవుడ్ దర్శకుడు చేరారు. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సినిమాల దర్శకుడు జేమ్స్ గన్ ఎన్టీఆర్తో కలిసి పనిచేయాలని ఉందని చెప్పాడు. ఆర్ఆర్ఆర్లో నటనకి ఫిదా అయినట్లు తెలిపాడు ఈ హాలీవుడ్ డైరెక్టర్. దీంతో తారక్ గ్లోబల్ స్టార్ అయ్యాడంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
హాలీవుడ్కు తారక్
హాలీవుడ్ చిత్రాల దర్శకుడు జేమ్స్ గన్ను ఇటీవల ఇంటర్వ్యూల్లో ఇండియన్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఏ భారతీయ నటుడితో చేయాలని ఉంది ఆయన్ని ప్రశ్నించగా… “ ఆర్ఆర్ఆర్ చిత్రంలో బోనులో నుంచి పులులతో పాటు వచ్చే యాక్టర్తో పని చేయాలని ఉంది” అన్నారు. అంతేకాదు, ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన అద్భుతమని ప్రశంసించారు. కొన్ని నెలల క్రితం RRR చిత్రం చూడాలని ఓ నెటిజన్ సూచించగా… “ నేను చూశాను. అదరగొట్టేశారు” అనే సమాధానం ఇచ్చారు జేమ్స్ గన్.
సూపర్ హీరోస్ సినిమాలో
తారక్కు సంబంధించిన రోల్ గురించి కూడా గన్ మాట్లాడారు. అతడికి గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ చిత్రంలో ఏదైనా పాత్ర ఉందో చూడాలి అన్నారు. ఒకవేళ జేమ్స్ గన్(James Gunn)కు ఏదైనా రోల్ ఉందని అనిపిస్తే కచ్చితంగా అవకాశం ఇస్తాడు. నిజంగా జరిగితే.. హాలీవుడ్లో సూపర్ హీరోస్ సినిమాలో యంగ్ టైగర్ను చూడొచ్చు.
Courtesy Twitter: ??? ??? ????????
లిస్ట్ పెరుగుతుంది
జూనియర్ ఎన్టీఆర్ దర్శకుల లిస్ట్ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే బాలీవుడ్లో వార్ 2లో నటిస్తున్న యంగ్ టైగర్… అక్కడ మరిన్ని సినిమాలు ఒప్పుకునే అవకాశం ఉంది. తమిళ్ దర్శకుడు వెట్రీమారన్ కూడా తారక్తో సినిమా చేస్తానని చెప్పాడు. తెలుగులోనూ బడా డైరెక్టర్లు తారక్ కాల్షీట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు హాలీవుడ్కు చేరడంతో స్టార్డమ్ మరింత పెరిగే అవకాశం ఉంది.
బాలీవుడ్పైనా ప్రశంసలు
బాలీవుడ్పై కూడా ప్రశంసలు కురిపించాడు దర్శకుడు జేమ్స్ గన్. గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ(Guardians of the Galaxy)లో మ్యూజికల్ ఎలిమెంట్కు బాలీవుడ్ స్ఫూర్తి అని తెలిపారు. బాలీవుడ్ చిత్రాల్లో కళ, ఎంటర్టైన్మెంట్ తనని ఆకర్షిస్తుందని వెల్లడించారు. సినిమాకి హద్దులు లేవని… ప్రతి ఇండస్ట్రీ అన్నింట్లో భాగమేనని చెప్పారు జేమ్స్.
Courtesy Twitter:NTR
ఎవరీ దర్శకుడు
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా తెరకెక్కించిన సినిమా గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ. ఇందులో ఇప్పటికే రెండు పార్ట్లు విడుదల కాగా.. మరొకటి విడుదలకు సిద్ధంగా ఉంది. క్రిస్ ప్రాట్, విన్ డీజిల్, బటిస్టా వంటి ఎంతోమంది స్టార్ నటులు నటించారు. ఇది బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. వీటికి దర్శకత్వం వహించింది జేమ్స్ గన్.
ఏప్రిల్ 26 , 2023
![2022లో మార్మోగిన పాటలు](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/02/13165646/cropped-ws_ws_collage-1.jpg)
2022లో మార్మోగిన పాటలు
]రామ్ పోతినేని నటించిన చిత్రంలో ఈ ఎనర్జిటిక్ పాటను తమిళ్ సూపర్ స్టార్ శింబు పాడాడు. శింబు వాయిస్తో పాటు రామ్ డాన్స్తో చాలా పాపులర్ అయ్యింది.12. బుల్లెట్ ( ది వారియర్ )Listen nowమరికొన్ని హిట్స్కల్యాణం ( సీతారామం )నీతో ఉంటే చాలు ( బింబిసార )మరికొన్ని హిట్స్నామది ( తిరు )మేఘం కరిగేనా ( తిరు )మరికొన్ని హిట్స్కోకా ( లైగర్ )విజిల్( ది వారియర్)మరికొన్ని హిట్స్రా రా రక్కమ్మ ( విక్రాంత్ రోణ )నాకోసం మారావా నువ్వు ( బంగార్రాజు )
ఫిబ్రవరి 13 , 2023