![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/Virata_Parvam.jpeg)
UATelugu2h 30m
వెన్నెల (సాయి పల్లవి) మావోయిస్ట్ దళ నాయకుడు రవన్న( రానా) గురించి పుస్తకాల్లో చదివి ఇష్టపడుతుంది. ఇంట్లోవారు ఇంకొకరితో పెళ్లి ఫిక్స్ చేయడంతో రవన్నను వెతుక్కుంటూ ఇంట్లో నుంచి పారిపోతుంది. రవన్నను చేరుకునే క్రమంలో వెన్నెల ఎన్ని ఇబ్బందులు పడింది? ఆమె ప్రేమను రవన్న ఒప్పుకున్నాడా? అనేది కథ.
ఇంగ్లీష్లో చదవండి
మూవీ & ఓటీటీ అప్డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Netflixఫ్రమ్
Watch
రివ్యూస్
YouSay Review
Rana’s ‘Virata Parvam’ movie Review
రానా, సాయిపల్లవి జంటగా నటించిన మూవీ ‘విరాట పర్వం’. వేణు ఉడుగుల దర్శకత్వం వహించాడు. కరోనా కారణంగా సినిమా గత రెండు సంవత్సరాలుగా వాయిదాపడు...read more
How was the movie?
తారాగణం
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Sai_Pallavi_250_250.jpeg)
సాయి పల్లవి
వెన్నెల![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Rana_Daggubati.jpeg)
రానా దగ్గుబాటి
డాక్టర్ రవిశంకర్ అకా కామ్రేడ్ రావన్న మరియు అరణ్య![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Priyamani_250_250.jpeg)
ప్రియమణి
కామ్రేడ్ భరతక్క![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Nandita_Das_250_250.jpeg)
నందితా దాస్
శకుంతల![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Naveen_Chandran_250_250.jpeg)
నవీన్ చంద్రన్
కామ్రేడ్ రఘు![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Zarina_Wahab_250_250.jpeg)
జరీనా వహాబ్
రవి తల్లి![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Easwari_Rao_250_250.jpeg)
ఈశ్వరి రావు
వెన్నెల తల్లిసాయి చంద్
వెన్నెల తండ్రిరాహుల్ రామకృష్ణ
వెన్నెల బంధువు![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Nivetha_Pethuraj_250_250.jpeg)
నివేదా పేతురాజ్
నక్సలైట్ (అతి అతిథి పాత్ర)సిబ్బంది
వేణు ఊడుగులదర్శకుడు
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Rana_Daggubati.jpeg)
రానా దగ్గుబాటి
నిర్మాతసుధాకర్ చెరుకూరినిర్మాత
శ్రీకాంత్ చుండినిర్మాత
సురేష్ బొబ్బిలిసంగీతకారుడు
ఎ. శ్రీకర్ ప్రసాద్
ఎడిటర్కథనాలు
![<strong>Sai Pallavi Record: సాయిపల్లవి సరికొత్త రికార్డు.. ఏకైక హీరోయిన్గా అరుదైన ఘనత!</strong>](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/07/13170552/Untitled-design-2024-07-13T170537.364-1-1.jpg)
Sai Pallavi Record: సాయిపల్లవి సరికొత్త రికార్డు.. ఏకైక హీరోయిన్గా అరుదైన ఘనత!
మలయాళ బ్యూటీ సాయి పల్లవి (Actress Sai Pallavi) అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. చేసింది తక్కువ సినిమాలే అయిన్పపటికీ తనదైన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. బికినీ, ముద్దు సీన్లతో రెచ్చిపోతున్న ఈ కాలంలో సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తూ నటన, డ్యాన్స్తోనే ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా 68వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ (Filmfare Awards South 2023) ప్రకటించగా అందులో సాయిపల్లవి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఏ హీరోయిన్కు సాధ్యం కాని అరుదైన ఘనతను సాధించింది.
ఏకైక హీరోయిన్గా ‘సాయిపల్లవి’
దక్షిణాది సినిమా పరిశ్రమలో ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డ్స్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో 2022, 2023 చిత్రాలను పరిగణలోకి తాజాగా 68వ ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డులను ప్రకటించారు. తమిళంలో వచ్చిన 'గార్గీ' (Gargi) చిత్రానికి గాను సాయి పల్లవికి ఉత్తమ నటి పురస్కారం లభించింది. అటు తెలుగులో చేసిన 'విరాట పర్వం' (Virataparvam) సినిమాకు సైతం క్రిటిక్స్ విభాగంలో బెస్ట్ ఫీమేల్ యాక్టర్గా అవార్డు దక్కించుకుంది. ఇలా రెండు భాషల్లో ఒకే ఏడాదిలో అవార్డు దక్కించిన ఏకైక హీరోయిన్గా సాయిపల్లవి చరిత్ర సృష్టించింది. దీంతో సాయిపల్లవిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
ఆరు ఫిల్మ్ఫేర్ అవార్డులు
తమిళ చిత్రం 'ప్రేమమ్' (Premam)తో సినీరంగంలోకి అడుగుపెట్టిన సాయిపల్లవి (Sai Pallavi) యూత్కు బాగా కనెక్ట్ అయ్యింది. ఆ తర్వాత తెలుగులో 'ఫిదా' (Fidaa) చేసి భానుమతి పాత్రలో తనదైన ముద్ర వేసింది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఇప్పటివరకూ 19 చిత్రాలు చేసిన సాయిపల్లవి ఆరు ఫిల్మ్ఫేర్ అవార్డులను దక్కించుకుంది. దక్షిణాదిలో ఇంత తక్కువ కాలంలో ఆ ఫీట్ సాధించిన హీరోయిన్గానూ సాయిపల్లవి నిలిచింది.
సాయి పల్లవి అవార్డులు అందుకున్న సినిమాలు
ప్రేమమ్ (2015) – ఉత్తమ నటి (డెబ్యూ)ఫిదా (2017) – ఉత్తమ నటిలవ్ స్టోరీ (2021) – ఉత్తమ నటిశ్యామ్ సింగరాయ్ (2021) – ఉత్తమ నటి (క్రిటిక్స్)గార్గి (2022) – ఉత్తమ నటివిరాటపర్వం (2022) – ఉత్తమ నటి (క్రిటిక్స్)
ప్రేమ చిత్రాలకు చిరునామా
‘ప్రేమమ్’ (Premam) తర్వాత నుంచి సాయిపల్లవి ఆచితూచి సినిమాలు చేసింది. స్కిన్ షోకు పూర్తి వ్యతిరేకంగా, కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. కంటెంట్ ఉన్న చిత్రాలనే ఎంపిక చేసుకుంది. ఈ క్రమంలో హృదయాలకు హత్తుకునే ప్రేమకథా చిత్రాల్లో నటించింది. ‘ప్రేమమ్’ సహా ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’ వంటి చిత్రాలు ఈ అమ్మడికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆమెకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేశాయి. ఆ తర్వాత రానాతో చేసిన ‘విరాట పర్వం’ సినిమాలో చక్కటి నటన కనబరిచి సాయిపల్లవి నటిగా మరో మెట్టు పైకెక్కింది.
ఫుల్ స్వింగ్లో సాయిపల్లవి
ప్రస్తుతం సాయి పల్లవి.. సినిమాల పరంగా ఫుల్ స్వింగ్లో ఉంది. ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్య (Naga Chaitanya)తో కలిసి ‘తండేల్’ (Thandel) చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అటు తమిళంలో శివకార్తికేయన్ (Sivakarthikeyan)తో కలిసి ‘అమరన్’ (Amaran) అనే సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. వీటితో పాటు బాలీవుడ్లోనూ రెండు భారీ ప్రాజెక్టులకు సాయిపల్లవి ఓకే చెప్పింది. ఇందులో ప్రతిష్టాత్మంగా రూపొందుతున్న 'రామయణం' కూడా ఉంది. ఈ మూవీలో రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. ఇటీవలే విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్గా ఎంపికైనట్లు కూడా వార్తలు వచ్చాయి.
జూలై 13 , 2024
![Vijay Deverakonda - Sai Pallavi: విజయ్ దేవరకొండతో సాయిపల్లవి రొమాన్స్!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/06/06155129/123.-2024-06-06T154804.523.jpg)
Vijay Deverakonda - Sai Pallavi: విజయ్ దేవరకొండతో సాయిపల్లవి రొమాన్స్!
నేచురల్ బ్యూటీ సాయి పల్లవికి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఈ భామ సినిమాకు ఓకే చెప్పిందంటే అది కచ్చితంగా కంటెంట్ ఉన్న మూవీనే అయి ఉంటుందని అభిమానులు భావిస్తుంటారు. గ్లామర్ షోకు ఆమడ దూరం ఉండే సాయి పల్లవి.. తన నటన, మెస్మరైజింగ్ డ్యాన్స్తోనే కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగులో ఆమె నటించిన చిత్రాలు తక్కువే అయినా అవి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశాయి. అటువంటి సాయి పల్లవి.. రొమాంటిక్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ కాంబో త్వరలోనే సెట్స్పైకి వెళ్లనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.
క్రేజీ లవ్స్టోరీ..
రౌడీ భాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. దర్శకుడు రవికిరణ్ కోలా (Ravi Kiran Kola)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీకి దిల్ రాజు (Dil Raju) నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇది అందమైన, సరికొత్త ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హీరోయిన్గా సాయిపల్లవిని తీసుకుంటే బాగుంటుందని మేకర్స్ భావించారట. ఇప్పటికే చిత్ర యూనిట్ సాయిపల్లవిని కలిశారని, ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు ఫిల్మ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని అంటున్నారు. ఇది నిజమైతే విజయ్ - సాయి పల్లవి జోడీ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్గా నిలుస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.
లవ్ స్టోరీలకు కేరాఫ్
తమిళంలో వచ్చిన ‘ప్రేమమ్’ (Premam) చిత్రంతో కుర్రకారును ఎంతగానో ఆకట్టుకున్న సాయిపల్లవి (Sai Pallavi).. ఆ తర్వాత నుంచి ఆచితూచి సినిమాలు చేసింది. స్కిన్ షోకు పూర్తి వ్యతిరేకమైన ఈ భామ.. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. కంటెంట్ ఉన్న చిత్రాలనే ఎంపిక చేసుకుంది. ఈ క్రమంలో హృదయాలకు హత్తుకునే ప్రేమకథా చిత్రాల్లో ఆమె నటించింది. ‘ప్రేమమ్’ సహా ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’ వంటి చిత్రాలు ఈ అమ్మడికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆమెకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేశాయి. ఆ తర్వాత రానాతో చేసిన ‘విరాట పర్వం’ సినిమాలో చక్కటి నటన కనబరిచి సాయిపల్లవి నటిగా మరో మెట్టు పైకెక్కింది.
ఫుల్ స్వింగ్లో సాయిపల్లవి
ప్రస్తుతం సాయి పల్లవి.. సినిమాల పరంగా ఫుల్ స్వింగ్లో ఉంది. ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్య (Naga Chaitanya)తో కలిసి ‘తండేల్’ (Thandel) చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అటు తమిళంలో శివకార్తికేయన్ (Sivakarthikeyan)తో కలిసి ‘అమరన్’ (Amaran) అనే సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. వీటితో పాటు బాలీవుడ్లోనూ రెండు భారీ ప్రాజెక్టులకు సాయిపల్లవి ఓకే చెప్పింది. ఇందులో ప్రతిష్టాత్మంగా రూపొందుతున్న 'రామయణం' కూడా ఉంది. ఈ మూవీలో రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా మెుదలైంది.
పోలీసు ఆఫీసర్గా విజయ్
'ఫ్యామిలీ స్టార్' చిత్రం తర్వాత ప్రస్తుతం విజయ్.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. విజయ్ కెరీర్లో 12వ మూవీగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో ఇంతకు ముందు ఎన్నడూ చూడని సీరియస్ పోలీసు ఆఫీసర్గా విజయ్ కనిపించనున్నాడు. హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri)ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా, తాజాగా ఈ సినిమాలో ప్రముఖ నటుడు సత్యదేవ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇటీవల అతడు నటించిన 'కృష్ణమ్మ' ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో సత్యదేవ్ కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారట.
జూన్ 06 , 2024
![Nivetha Pethuraj: పోలీసులతో గొడవ పెట్టుకున్న హీరోయిన్ నివేదా పేతురాజ్.. వీడియో వైరల్!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/05/30155214/Untitled-design-2024-05-30T154654.156.jpg)
Nivetha Pethuraj: పోలీసులతో గొడవ పెట్టుకున్న హీరోయిన్ నివేదా పేతురాజ్.. వీడియో వైరల్!
టాలీవుడ్లో అతి కొద్ది సినిమాలతోనే మంచి ఫేమ్ తెచుకున్న హీరోయిన్లలో 'నివేదా పేతురాజ్'. మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. ఆ మూవీ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇదిలా ఉంటే నివేతాకు గత కొంతకాలంగా ఏదీ కలిసిరావడం లేదు. ఇటీవల ఆమె ఓ సీఎం కొడుకుతో రిలేషన్లో ఉన్నారంటూ తమిళనాట పెద్ద ఎత్తున దుమారం రేగింది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలు ఏం జరిగిందంటే?
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. కారులో ప్రయాణిస్తున్న నివేదాను పోలీసులు అడ్డగించారు. ఆపై డిక్కీ ఓపెన్ చేయాలని ఆమెను కోరారు. దీనికి అంగీకరించని నివేద.. పోలీసులపై కోపం తెచ్చుకుంది. 'రోడ్డు వరకు వెళ్తున్నాను. నా దగ్గర పేపర్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. కావాలంటే చెక్ చేసుకోండి. డిక్కీలో ఏం లేవు. అర్థం చేసుకోండి. ఇది పరువుకు సంబంధించిన విషయం. ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. నేను డిక్కీ ఓపెన్ చేయలేను' అని కోపంగా చెప్పారు. ఇదంతా ఓ వ్యక్తి తన కెమెరాలో రికార్డు చేస్తుండగా అతడిపైనా నటి మండిపడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
https://twitter.com/Karthikkkk_7/status/1795883722673135776
నివేదా ప్రాంక్ చేసిందా?
నివేదా పేతురాజ్ వైరల్ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. డిక్కీ ఓపెన్ చేస్తే సరిపోయేది కదా ఇలా పోలీసులతో వాగ్వాదం చేయడం ఎందుకు అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు ఈ వీడియోను ఓ ప్రాంక్గా అభిప్రాయపడ్డారు. వీడియో నేచురల్గా లేదని.. స్క్రిప్టెడ్లా కనిపిస్తోందని పోస్టులు పెడుతున్నారు. ఏదైనా ప్రమోషన్స్లో భాగంగా నివేదా ఇలా చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పైగా ఈ వీడియోలో పోలీసులు షూస్కి బదులు చెప్పులు వేసుకొని కనిపించారని అంటున్నారు. కాబట్టి ఇది పక్కా ప్రమోషనల్ వీడియోనేనని నెటిజన్లు తేల్చేస్తున్నారు. ఏది ఏమైనా దీనిపై నివేదా క్లారిటీ ఇచ్చేవరకూ ఈ ప్రశ్నలకు ముగింపు రాదు.
సీఎం కొడుకుతో ఎఫైర్ అంటూ పుకార్లు
కొన్ని నెలల క్రితం తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్ - నివేదా పేతురాజ్కు మధ్య ఏదో నడుస్తోందంటూ ఆ రాష్ట్ర మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఆమె కోసం ఉదయనిధి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని, రూ.50 కోట్లతో ఇంటిని కూడా కొనుగోలు చేశాడని ప్రచారం జరిగింది. దీనిపై నివేదా ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ తప్పుడు వార్తల వల్ల తాను, తన కుటుంబం ఒత్తిడికి లోనయ్యామని పేర్కొంది. మరోమారు తన ఆత్మగౌరవాన్ని కించపరిస్తే చట్టపరమైన చర్యలకు దిగుతానని వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఆ రూమర్లకు చెక్ పడింది.
https://twitter.com/Nivetha_Tweets/status/1764949757116735550
విష్వక్తో హ్యాట్రిక్ చిత్రాలు
తెలుగులో తన తొలి చిత్రం ‘మెంటల్ మదిలో’ తర్వాత నివేదా.. 'చిత్రలహరి'తో మరో హిట్ తన ఖాతాలో వేసుకొంది. ఆ తర్వాత శ్రీవిష్ణుతో చేసిన 'బ్రోచేవారెవరురా' మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘దాస్ కా ధమ్కీ’, ‘పాగల్’, ‘బూ’ అనే మూడు సినిమాల్లో నివేదా నటించింది. ఇవే కాకుండా రానా-సాయి పల్లవిల ‘విరాట పర్వం’ మూవీలోనూ అలరించింది. ఇటీవల ‘బ్లడ్ మేరీ’ అనే సినిమాతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఏ ప్రాజెక్ట్స్ లేవు. దీంతో అందరి దృష్టిని ఆకర్షించేందుకు నివేదా ఇలా ప్రాంక్ చేసి ఉండొచ్చన వాదన కూడా నెట్టింట వినిపిస్తోంది.
మే 30 , 2024
![EXCLUSIVE: తెలుగు రాష్ట్రాల్లోని ఊళ్లకు ప్రాతినిధ్యం వహించిన టాలీవుడ్ చిత్రాలు ఇవే!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/05/03181733/Untitled-design-2024-05-03T181728.945.jpg)
EXCLUSIVE: తెలుగు రాష్ట్రాల్లోని ఊళ్లకు ప్రాతినిధ్యం వహించిన టాలీవుడ్ చిత్రాలు ఇవే!
సినిమా అనేది ఒక విస్తృతమైన మాద్యమం. దానికి ఎటువంటి హద్దులు లేవు. సాధారణంగా సినిమాలు అనేవి వాస్తవ పరిస్థితులకు అద్దం పడతాయి. సమాజంలోని స్థితిగతులను కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తాయి. అయితే మరికొన్ని సినిమాలు స్థానికతను బేస్ చేసుకొని వచ్చి మంచి ఆదరణ పొందాయి. స్థానిక ప్రజల భాష, మనుషుల వ్యక్తిత్వాలు, చుట్టుపక్కల పరిస్థితులను ఆడియన్స్కు తెలియజేశాయి. టాలీవుడ్లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ జిల్లాలను ప్రతిబింబించేలా ఇప్పటివరకూ చాలా సినిమాలే వచ్చాయి. వాటిలో ముఖ్యమైన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
పుష్ప (Pushpa)
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం.. ప్రధానంగా తిరుపతిలోని శేషాచలం అడవుల చుట్టు తిరుగుతుంది. అంతేకాదు చిత్తూరు దాని పరిసర ప్రాంతాల ప్రభావం కూడా సినిమాలో కనిపిస్తుంది. ఇందులో బన్నీ చిత్తూరు శ్లాంగ్లో మాట్లాడి అక్కడి ప్రజలను రిప్రజెంట్ చేశాడు.
గుంటూరు కారం (Guntur Karam)
మహేష్ బాబు (Mahesh Babu) రీసెంట్ చిత్రం.. ‘గుంటూరు కారం’ పేరుకు తగ్గట్లే ఏపీలోని ఆ ప్రాంతాన్ని రిప్రజెంట్ చేసింది. ఈ సినిమాలో గుంటూరు దాని పరిసర ప్రాంతాలను చూపించారు. ఇందులో మహేష్ది గుంటూరు కావడంతో పదే పదే ఆ ఊరి పేరు సినిమాలో వినిపించడం గమనార్హం.
బలగం (Balagam)
ప్రియదర్శి (Priyadarsi) హీరోగా జబర్దస్త్ ఫేమ్ వేణు యెల్దండి డైరెక్షన్లో వచ్చిన ‘బలగం’ చిత్రం గతేడాది ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తెలంగాణ గ్రామాలకు అద్దం పట్టింది. ఊర్లో ప్రజల మధ్య ఉండే అనుబంధాలను తెలియజేసింది. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల్లో అనుసరించే విధానాలను కళ్లకు కట్టింది
రంగస్థలం (Rangasthalam)
రామ్చరణ్-సుకుమార్ కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం 1980ల నాటి గోదావరి పరివాహక గ్రామాలను గుర్తు చేస్తుంది. ఇందులో రామ్చరణ్ చిట్టిబాబు పాత్రలో గోదావరి జిల్లాల అబ్బాయిగా కనిపించాడు. తన యాస, భాషతో ఆకట్టుకున్నాడు.
దసరా (Dasara)
హీరో నాని నటించిన దసరా సినిమాను గమనిస్తే.. తెలంగాణలోని పెద్దపల్లి/రామగుండం ఏరియాల ప్రభావం కథపై కనిపిస్తుంది. నాని కూడా స్థానిక భాషలో డైలాగ్స్ చెప్పి మెప్పించాడు. సింగరేణి బొగ్గుగనుల సమీపంలో జీవించే వారి జీవితాలకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరరూపం ఇచ్చారు. ఈ సినిమాను చూసి ఆ ప్రాంత వాసులు అప్పట్లో సంతోషం వ్యక్తం కూడా వ్యక్తం చేశారు.
కలర్ఫొటో (Colour Photo)
కరోనా కాలంలో ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం.. మంచి విజయాన్ని సాధించింది. స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రంగా గుర్తింపు పొందింది. అయితే ఈ సినిమా కథ మెుత్తం కోనసీమ చుట్టూ తిరుగుతుంది. అక్కడి అందాలను డైెరెక్టర్ తెలుగు ఆడియన్స్కు చూపించారు. ఈ సినిమా ద్వారానే హాస్య నటుడు సుహాస్ హీరోగా మారాడు.
ఉప్పెన (Uppena)
యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaishnav Tej), డైరెక్టర్ బుచ్చిబాబు (Buchi Babu) కాంబోలో వచ్చిన ఉప్పెన చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కాకినాడ తీర ప్రాంతాల్లో జీవించే మత్స్యకారుల జీవన స్థితులను డైరెక్టర్ కళ్లకు కట్టాడు. చేపల వేటకు వెళ్లినప్పుడు వారు ఎంత కష్టపడతారో చూపించారు.
కొత్త బంగారు లోకం (Kotha Bangaru Lokam)
వరుణ్ సందేశ్ (Varun Sandesh) హీరోగా శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) దర్శకత్వంలో రూపొందిన ‘కొత్త బంగారు లోకం’ సినిమాను 50 శాతానికి పైగా రాజమండ్రి, దాని పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించారు. ఆ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎంతగా ప్రేమిస్తారో దర్శకుడు చూపించారు. అక్కడ వారి మనసులు ఎంత స్వచ్చంగా ఉంటాయో తెలియజేశారు.
విరాట పర్వం (Virata parvam)
హీరో రానా, సాయిపల్లవి జంటగా నటించిన ‘విరాట పర్వం’.. నక్సల్ ప్రభావిత ప్రాంతాల చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా 1990-92 ప్రాంతంలో మలుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఎలా జీవించారో తెలియజేస్తుంది. రాజకీయ నాయకులు, మావోయిస్టులు, పోలీసులు ప్రభావం అప్పట్లో ఎలా ఉండేదో చూపించారు.
ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar)
రామ్పోతినేని, పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ను పరిశీలిస్తే.. ఇందులో హీరో ఓల్డ్ సిటీని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. తన మాటలు, హావ భావాలు కూడా ఆ ప్రాంత వాసులను గుర్తుచేస్తాయి. ఇందులో హీరోయిన్గా చేసిన నభా నటేష్.. వరంగల్ పోరీ అంటూ పదే పదే చెప్పుకోవడం గమనార్హం.
కేర్ ఆఫ్ కంచరపాలెం (C/o కంచరపాలెం)
మహా వెంకటేష్ (Maha Venkatesh) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్లో రూపొందింది. పాత్రల మాటతీరు కూడా విజయనగరం జిల్లా యాసను పోలి ఉంటాయి. కార్తిక్ రత్నం, రాజు, రాధా బెస్సీ, ప్రణీ పట్నాయక్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించారు.
రాజావారు రాణివారు (Raja Vaaru Rani Gaaru)
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా చేసిన 'రాజావారు రాణిగారు'.. ఒక అహ్లాదకరమైన సినిమాగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఉభయ గోదావరి జిల్లాలను ప్రతిబింబిస్తుంది. అక్కడి గ్రామాల్లో ఉండే కల్మషంలేని వాతావరణాన్ని పరిచయం చేస్తుంది. గోదావిరి నేటివిటీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
గోదావరి ఆధారంగా వచ్చిన చిత్రాలు
టాలీవుడ్ చాలా సినిమాలు ఉభయ గోదావరి జిల్లాలను ఆధారంగా చేసుకొని వచ్చాయి. గల గలపారే గోదావరి నది ఆయా చిత్రాల్లో చాలవరకూ సన్నివేశాల్లో ప్రతింబింబిస్తుంది. ‘సితారా’, ‘లేడీస్ టైలర్’, ‘అత్తిలి సత్తిబాబు’, ‘బెండు అప్పారావు’, ‘శతమానం భవతి’ తదితర చిత్రాలన్నీ గోదావరి బ్యాక్డ్రాప్తో వచ్చినవే.
.
మే 03 , 2024
![Tollywood Trend: తెలంగాణం పెట్టు.. బ్లాక్బస్టర్ కొట్టు!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/04/01131831/Featured-image-25.jpg)
Tollywood Trend: తెలంగాణం పెట్టు.. బ్లాక్బస్టర్ కొట్టు!
టాలివుడ్ ట్రెండ్ మారుతోంది. ఒకప్పుడు కామెడీ పాత్రలు, విలన్ రోల్స్కు మాత్రమే పరిమితమైన తెలంగాణ భాష, యాస ఇప్పుడు లీడ్ రోల్స్కు చేరింది. తెలంగాణ సంస్కృతి, యాస ఉంటే చిన్న సినిమాలు కూడా బ్లాక్బస్టర్లు అవుతున్నాయి. భారీ సినిమాలో పాత్రలకు తెలంగాణ పల్లె యాస ఉందంటే సెన్సేషనల్ అవుతోంది. స్టార్ హీరోలు సైతం సినిమాలోనే గాక వేదికలపై తెలంగాణ యాసలో మాట్లాడుతున్నారు. తెలంగాణ యాస, కట్టూ, బొట్టూ వెండితెరపై వెలుగులీనుతున్నాయి.
బలం చూపిన ‘బలగం’
వెండితెరపై తెలంగాణం చేసే అద్భుతాన్ని ఇటీవల చూపించిన సినిమా ‘బలగం’. వేణు ఎల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరెకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. తెలంగాణ పల్లెల్లో అంత్యక్రియల సంస్కృతి, పరిస్థితులు కళ్లకు కట్టినట్లు అత్యంత భావోద్వేగంగా చూపించారు. అంతర్జాతీయ వేదికపైనా సత్తా చాటింది. లాస్ ఏంజెల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్లో రెండు అవార్డులు సొంతం చేసుకుంది.
గుండు గుత్తగా బాక్సాఫీస్ కొల్లగొట్టిన ‘దసరా’
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో మార్చి 30న విడుదలైన దసరా బాక్సాఫీస్పై దండయాత్ర కొనసాగిస్తోంది. నాని కెరీర్లోనే ఎన్నడూ లేనంతగా… తొలిరోజే రూ.38 కోట్లు వసూలు చేసి ఈ సినిమా సంచలనం సృష్టించింది. సింగరేణి బొగ్గు గనుల్లో ఒక్కప్పుడు ఉన్న పరిస్థితులను శ్రీకాంత్ ఓదెల వెండితెరపై కళ్లకు గట్టాడు. తెలంగాణ భాష పరిమళంతో బ్లాక్బస్టర్ను కొట్టాడు.
చిన్న సినిమాలతో మొదలై..
అప్పట్లో వెకిలి పాత్రలకే పరిమితమై తెలంగాణ యాసను పూర్తి స్థాయిలో సినిమాలో చూపించడం చిన్న సినిమాలతోనే మొదలైంది. విజయ్ దేవరకొండ హీరోగా తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ‘పెళ్లి చూపులు’ ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. అందులో తెలంగాణ యాసలోనే మాట్లాడిన విజయ్… బయట కూడా అదే తీరుతో అందరి మనసులూ ఆకట్టుకున్నాడు. ప్రియదర్శి కూడా ఆ సినిమాలో మెప్పించాడు. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ఇండియన్ సినిమాలోనే ఓ నయా ట్రెండ్కు ‘అర్జున్ రెడ్డి’ తెరలేపింది. ఇలా తెలంగాణ యాస, సంస్కృతితో హిట్ కొట్టిన టాప్ మూవీస్ చాలానే ఉన్నాయి.
ఫిదా
లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్గా వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమా ‘ఫిదా’. సినిమా షూటింగ్ మొదలుకుని టైటిల్ దాకా అంతా తెలంగాణమే. తెలంగాణ యాసలోనే రాసిన ‘వచ్చిండే’ పాట మొత్తం యూట్యూబ్నే షేక్ చేసింది. తెలంగాణ ప్రకృతి సౌందర్యాన్ని, పల్లెల అందాన్ని తెరమీద ఆవిష్కరించిన సినిమా ఇది. తొలుత ఈ సినిమాకు ‘ ముసురు’ అనే టైటిల్ అనుకున్నారట.
ఈ నగరానికి ఏమైంది?
పెళ్లి చూపులు తర్వాత తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందనే చెప్పాలి. పక్కా హైదరాబాదీ కుర్రాళ్లు నలుగురిని తీసుకుని సింపుల్గా ఉండే ఈ సినిమా థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించింది. విశ్వక్ సేన్, అభినవ్ పాత్రలు చాలా అద్భుతంగా పండాయి.
డీజే టిల్లు
2022లో వచ్చిన డీజే టిల్లు గురించి అయితే అందరికీ తెలిసిందే. సిద్ధు జొన్నలగడ్డను స్టార్ను చేసింది. ఇందులో ప్రతి డైలాగ్ అదిరిపోయాయి. విమల్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రెండో పార్ట్ కూడా త్వరలోనే రాబోతోంది.
మల్లేశం
ఆసుయంత్రం కనిపెట్టిన చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మల్లేశం’ సినిమాలో ప్రియదర్శి తెలంగాణ మాండలికాన్ని మనసుకు హత్తుకునేలా పలికించాడు. చేనేతల జీవన స్థితిగతులను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన సినిమా ఇది.
లవ్ స్టోరీ
శేఖర్ కమ్ముల తెరకెక్కించిన మరో సినిమా ‘లవ్ స్టోరీ’. తెలంగాణ పల్లెటూరి పేదోళ్ల పరిస్థితితో పాటు కొన్ని సున్నితమైన విషయాలను స్పృశిస్తూనే శేఖర్ కమ్ముల మరోసారి తెలంగాణ పరిమళాన్నివెండితెరపై వెలుగులీనేలా చేశాడు.
ఇస్మార్ట్ శంకర్
పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ పూరీకి కమ్బ్యాక్ మూవీ అయ్యింది. రామ్ తెలంగాణ మాండలికంలో అదరగొట్టాడు. వరంగల్ పిల్లగా హీరోయిన్ నభా నటేశ్ అమితంగా ఆకట్టుకుంది.
విరాట పర్వం
నక్సలిజం ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితులను కళ్లకు కట్టిన సినిమా ‘విరాటపర్వం’. రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కూడా విమర్శకుల ప్రసంసలు అందుకుంది.
NBK108లోనూ..
నందమూరి నట సింహం బాలయ్య, అనిల్ రావుపూడి కాంబినేషన్లో వస్తున్న NBK108లోనూ.. తెలంగాణ సంస్కృతినే కథ నేపథ్యంగా తీసుకున్నట్లు తెలిసింది. ఈసారి తెలంగాణ యాసలో బాలయ్య అలరించనున్నారు.
ఆస్కార్ స్థాయికి
పెద్ద సినిమాలు, పెద్ద హీరోలు కూడా తెలంగాణ యాసలో పలుకుతున్నారంటే తెలుగు సినిమా ట్రెండ్ ఎలా మారుతుందో తెలుస్తోంది. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన RRRలో ఎన్టీఆర్ తెలంగాణ యాసలోనే మాట్లాడతాడు. ఆస్కార్ సాధించిన ‘నాటు నాటు’ సాహిత్యం కూడా తెలంగాణమే. ‘ఎర్రజొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపినట్టు’ అంటూ చంద్రబోస్ తెలంగాణ జీవన విధానాన్ని చెప్పాడు. ఒకప్పుడు ‘తొక్కు’ అంటేనే వెక్కిరించి చూసే స్థాయి నుంచి అదే మాటతో ఉన్న పాటకు ఆస్కార్ వచ్చే స్థాయికి తెలంగాణం తెలుగు సినిమాలో చేరింది. నాటు నాటు మాత్రమే కాదు ఇటీవల తెలుగు సినిమాలో తెలంగాణ సాహిత్యానికి ప్రాధాన్యత పెరిగిందనే చెప్పాలి. ‘బలగం’లో కన్నీరు పెట్టించిన పాటలన్నీ కాసర్ల శ్యామ్ రాసినవే. కాసర్ల శ్యామ్ ఇప్పుడు టాప్ లిరిసిస్ట్గా ఎదుగుతున్నాడంటే మన యాసకు పెరుగుతున్న ప్రాధాన్యతే.
ఏప్రిల్ 01 , 2023
![Underrated Telugu Movies: కథ బాగున్నా బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైన చిత్రాలు ఇవే!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/03/22111818/Untitled-design-2024-03-22T111449.759.jpg)
Underrated Telugu Movies: కథ బాగున్నా బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైన చిత్రాలు ఇవే!
సాధారణంగా ఏ సినిమాకైనా కథ తొలి ప్రాధాన్యంగా ఉంటుంది. కంటెంట్ సరిగా లేకపోతే ఎంతటి స్టార్ హీరోను పెట్టినా ఆ సినిమా విజయం సాధించదు. అయితే టాలీవుడ్లో కొన్ని చిత్రాలు ఇప్పటికీ మిస్టరీనే. అద్భుతమైన కథ, స్టార్ హీరోలు ఉన్నప్పటికీ ఆయా చిత్రాలు అనూహ్యంగా పరాజయాలను చవి చూశాయి. ఎన్నో ఆశలతో నిర్మించిన నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి. ఇప్పటివరకూ టాలీవుడ్లో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. వాటిలో బెస్ట్ కథతో వచ్చిన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
ఆరెంజ్ (Orange)
రామ్చరణ్ (Ramcharan) హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) తెరకెక్కించిన చిత్రం ‘ఆరెంజ్’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఒక యూనిక్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందో ఇప్పటికీ మిస్టరీనే. కొద్ది నెలల క్రితం ఈ సినిమాను రీరిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే ‘ఆరెంజ్’ ఆ రోజుల్లో రావాల్సిన చిత్రం కాదని.. ఇప్పుడు గనుక రిలీజై ఉంటే బ్లాక్బాస్టర్ విజయం అందుకునేదని సినిమా లవర్స్ అంటున్నారు.
అ! (Awe)
హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది. విభిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. చూసిన చాలామంది ఈ సినిమాను థియేటర్లో చూసుంటే బాగుండేదని నెట్టింట కామెంట్స్ చేశారు. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే.. మల్టిపుల్ పెర్సనాలిటీ డిసార్డర్ అనే వ్యాధితో బాధపడే కాళి అనే అమ్మాయి తనలో కలిగే ఒక్కో ఫీలింగ్కు ఒక్కో క్యారెక్టర్ను సృష్టించుకుంటూ పోతుంది. ఆ పాత్రల ద్వారా తన భావాలను చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. మూవీ ఎంత బాగున్నప్పటికీ కమర్షియల్గా విజయం సాధించలేదు.
C/o కంచరపాలెం (C/o Kancharapalem)
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ను సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువ మంది ఈ సినిమాను చూశారు. నాలుగు ప్రేమల కథల సమాహారమే ఈ సినిమా. కంచరపాలెంలో మెుదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు వారి కథలు ఎలా ముగిశాయి? అన్నది కథ. వెంకటేష్ మహా తెరకెక్కించిన ఈ చిత్రం హృదయాలకు హత్తుకుంటుంది.
అంటే సుందరానికి (Ante Sundaraniki)
నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నజ్రీయా హీరోయిన్గా వైవిధ్యమైన దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రం ‘అంటే సుందరానికి’. ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. కథలోకి వెళ్తే.. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. ఇందులో నాని నటన తన గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ సినిమా కమర్షియల్గా విజయాన్ని సాధించలేకపోయింది.
అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu)
నారా రోహిత్ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్కు కంటతడి పెట్టిస్తుంది. అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు నష్టాలు మిగిల్చింది.
కర్మ (Karma)
యంగ్ హీరో అడవి శేషు (Adivi Sesh) నటించిన తొలి చిత్రం ‘కర్మ’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ టెలివిజన్ ప్రీమియర్స్లో మంచి టీఆర్పీ రేటింగ్ను సాధించింది. ఇందులో హీరోకి అతీంద్రియ శక్తులు ఉంటాయి.
1: నేనొక్కడినే (1: Nenokkadine)
సుకుమార్ - మహేష్ బాబు కాంబినేషన్లో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులను కన్ఫ్యూజన్లో పడేసింది. ఆడియన్స్కు ఈ సినిమా అర్థమయ్యేలోపే చివరికి డిజాస్టర్గా మిగిలిపోయింది. ఈ సినిమా కథలోకి వెళ్తే.. హీరోకి బాధాకరమైన గతం ఉంటుంది. దాని వల్ల అతడ్ని కొన్ని ఆలోచనలు వెంటాడుతాయి. ఈ క్రమంలో హీరో జీవితంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు హీరో గతం ఏంటి? అన్నది సినిమా కథ. ఈ సినిమా టీవీల్లోకి వచ్చాక మంచి ఆదరణ పొందడం విశేషం.
ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindi)
ఈ సినిమా పేరు చెప్పగానే అందరికీ నవ్వు వస్తుంది. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. అయితే ఇదంతా ఓటీటీలోకి వచ్చిన తర్వాతనే. థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు. ఎప్పుడైతే ఓటీటీలోకి వచ్చిందో ఈ సినిమా అప్పట్లో ట్రెండింగ్లోకి వెళ్లిపోయింది. బోరింగ్ సమయంలో ఇప్పటికీ చాలా మంది ఈ సినిమాను చూస్తుంటారు. ఇందులోని పాత్రలు ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి.
వేదం (Vedam)
అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్గుడ్ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్గా ఈ సినిమా ఫ్లాప్ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు.. ఆర్థికంగా విజయాన్ని అందించలేకపోయారు. ప్రొడ్యుసర్లు నష్టాలను చవిచూడటంతో ఈ సినిమా థియేటర్లలో ఒక ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది.
ఖలేజా (Khaleja)
ఒక సినిమా హిట్ కావడానికి అవసరమైన అన్ని హంగులు ‘ఖలేజా’లో ఉన్నాయి. స్టార్ హీరో - హీరోయిన్లు, బలమైన కథ, మంచి సంగీతం, అద్భుతమైన డైరెక్షన్ ఇలా అన్నీ సమకూరిన కూడా ఈ చిత్రం ఫ్లాప్గా నిలిచింది. టీవీల్లో చూసిన వారంతా ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందా? అని ఇప్పటికీ ప్రశ్నించుకుంటూనే ఉంటారు. కథలోకి వెళ్తే.. ఒక గ్రామాన్ని తెలియని వ్యాధి పీడిస్తుంటుంది. ఆ వ్యాధి వల్ల అనేక మంది చనిపోతుంటారు. దేవుడే తమను కాపాడతాడు అని నమ్మిన గ్రామ ప్రజలు... క్యాబ్ డ్రైవర్ రాజులో అతీంద్రియ శక్తిని కనుగొంటారు. ఆ తర్వాత ఏమైంది? అన్నది స్టోరీ.
విరాట పర్వం
సాయి పల్లవి (Sai Pallavi), రానా (Rana Daggubati) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘విరాటపర్వం’. ఈ సినిమా నక్సల్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నక్సల్స్ కథకు అద్భుతమైన ప్రేమను జోడించి దర్శకుడు వేణు ఉడుగుల ఈ సినిమాను వైవిధ్యంగా తెరకెక్కించారు. ఓటీటీలో మంచి ఆదరణ పొందిన ఈ సినిమా.. థియేటర్లలో మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు.
రిపబ్లిక్ (Republic)
మెగా హీరో సాయిధరమ్ తేజ్, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'రిపబ్లిక్'. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. ఈ సినిమా వీక్షకులకు బాగా నచ్చినప్పటికీ కమర్షియల్గా విజయాన్ని అందుకోలేదు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ.
మెంటల్ మదిలో (Mental Madilo)
శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన 'మెంటల్ మదిలో' (2017) సినిమా కూడా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా ఆడియన్స్ను అలరించింది. రొటిన్ లవ్ స్టోరీలకు భిన్నంగా రూపొందిన ఈ చిత్రం యూత్కు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. సినిమా ఎంత బాగున్నప్పటికీ నిర్మాతలకు కష్టాలు తప్పలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన మేర విజయాన్ని సాధించలేకపోయింది. కథలోకి వెళ్తే.. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడతాడు. వారిలో ఒకరినే ఎన్నుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అతడు ఏం చేశాడు? అన్నది స్టోరీ.
మార్చి 22 , 2024
![సాయి పల్లవి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/04/08122519/123.-77.jpg)
సాయి పల్లవి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
సాయి పల్లవి తెలుగులో ఫిదా చిత్రంతో పరిచయమైంది. ఈ సినిమాలో భానుమతి క్యారెక్టర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అంతకు ముందు ఆమె మలయాళంలో నటించిన ప్రేమమ్ సినిమాలో మలర్ క్యారెక్టర్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఎంసీఎ, పడి పడి లేచే మనసు, లవ్స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం, గార్గి వంటి చిత్రాల ద్వారా స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. మరి సాయి పల్లవి గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన (Some Lesser Known Facts about Sai Pallavi) విషయాలు ఇప్పుడు చూద్దాం.
సాయి పల్లవి ముద్దు పేరు?
మలార్
సాయి పల్లవి పేరు ఎవరు పెట్టారు?
సాయి పల్లవి పేరును పుట్టపర్తి సాయిబాబా పెట్టారు
సాయి పల్లవి వయస్సు ఎంత?
1992, మే 9న జన్మించింది
సాయి పల్లవి తెలుగులో నటించిన తొలి సినిమా?
ఫిదా
సాయి పల్లవి ఎత్తు ఎంత?
5 అడుగుల 5 అంగుళాలు
సాయి పల్లవి ఎక్కడ పుట్టింది?
కోటగిరి, తమిళనాడు
సాయి పల్లవి ఏం చదివింది?
MBBS
సాయి పల్లవి అభిరుచులు?
డ్యాన్సింగ్, సింగింగ్
సాయి పల్లవికి ఇష్టమైన ఆహారం?
చాకోలెట్స్, స్వీట్స్
పూజా హెగ్డేకి ఇష్టమైన కలర్ ?
బ్లాక్, వైట్
సాయి పల్లవికి ఇష్టమైన హీరో?
కమల్ హాసన్, మమ్మాటి
సాయి పల్లవికి ఇష్టమైన హీరోయిన్?
జ్యోతిక, సిమ్రాన్
సాయి పల్లవి పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.
సాయి పల్లవి తల్లిదండ్రుల పేరు?
సెంతమార కన్నన్, రాధ కన్నన్
సాయి పల్లవి రాకముందు ఏం చేసేది?
సాయి పల్లవి సినిమాల్లోకి రాకముందు పలు డ్యాన్స్ షోల్లో పాల్గొంది. ఈటీవీలో ప్రసారం అయ్యే ఢీ షోలో కూడా సాయి పల్లవి పార్టిసిపేట్ చేసింది.
సాయి పల్లవి ఇన్స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/saipallavi.senthamarai/
సాయి పల్లవి నికర ఆస్తుల విలువ?
రూ.30కోట్లు
https://www.youtube.com/watch?v=1OtXtXJWTVg
ఏప్రిల్ 16 , 2024
![<strong>68th Filmfare Awards South 2023: బెస్ట్ యాక్టర్స్గా రామ్చరణ్, తారక్.. ఆ చిత్రాలకు అవార్డుల పంట!</strong>](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/07/12144225/123.-2024-07-12T144220.729.jpg)
68th Filmfare Awards South 2023: బెస్ట్ యాక్టర్స్గా రామ్చరణ్, తారక్.. ఆ చిత్రాలకు అవార్డుల పంట!
దర్శకధీరుడు రాజమౌళి (S.S. Rajamouli) రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' (RRR) చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. రామ్చరణ్ (Ram Charan), తారక్ (Jr NTR) కథానాయకులుగా చేసిన ఈ మూవీ గ్లోబల్ స్థాయిలో సత్తా చాటింది. పలు అంతర్జాతీయ అవార్జులను కొల్లగొట్టింది. అంతేకాదు పలు విభాగాల్లో ఆస్కార్ బరిలో నిలిచి ‘నాటు నాటు’ పాటకు గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ పురస్కారాన్ని సైతం అందుకుంది. ఇదిలా ఉంటే గతేడాదికి గాను తాజాగా ప్రకటించిన ‘ఫిల్మ్ఫేర్ సౌత్ 2023’ (68 Filmfare Awards south 2023) అవార్డుల్లో 'ఆర్ఆర్ఆర్' మరోమారు సత్తా చాటింది. ఏకంగా ఏడు అవార్డులు కైవసం చేసుకొని అందరి ప్రశంసలు అందుకుంటోంది. అటు సీతారామం, విరాటపర్వం, భీమ్లా నాయక్ మూవీలకు సైతం అవార్డులు దక్కాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఫిల్మ్ఫేర్లో ‘ఆర్ఆర్ఆర్’ మార్క్
68వ ఫిల్మ్ఫేర్ అవార్డులను నిర్వాహకులు తాజాగా ప్రకటించారు. దక్షిణాది భాషల్లో (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం) 2022, 2023 సంవత్సరాల్లో విడుదలైన చిత్రాలను పరిగణలోకి తీసుకొని ఈ అవార్డులను ప్రకటించారు. ఇందులో 2022 మార్చి 24న విడుదలైన 'ఆర్ఆర్ఆర్' చిత్రం ఏకంగా ఏడు విభాగాల్లో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ సినిమా (ఆర్ఆర్ఆర్), ఉత్తమ దర్శకుడు (రాజమౌళి), ఉత్తమ నటుడు (రామ్చరణ్, తారక్), ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్, ఉత్తమ కొరియోగ్రాఫర్ (ప్రేమ్ రక్షిత్), ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ (సాబు సిరిల్), ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ ('కొమురం భూముడో' సాంగ్ పాడిన కాలభైరవ) విభాగాల్లో పురస్కారాలు అందుకుంది.
‘సీతారామం’కు అవార్డుల పంట
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత టాలీవుడ్ నుంచి ‘సీతారామం’ సత్తా చాటింది. వాస్తవానికి ‘ఆర్ఆర్ఆర్’, ‘సీతారామం’ మధ్యనే గట్టి పోటీ నడిచింది. రాజమౌళి మేనియాను తట్టుకొని సైతం ‘సీతారామం’ నిలబడగలిగింది. ఎక్కువ విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుంది. మెుత్తం ఐదు పురస్కారాలను తన ఖాతాలో వేసుకుంది. ఉత్తమ మూవీ (క్రిటిక్స్), ఉత్తమ నటుడు (క్రిటిక్స్), ఉత్తమ నటి (మృణాల్ ఠాకుర్), ఉత్తమ లిరిక్స్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ కేటగిరీల్లో అవార్డులు వరించాయి. అలాగే రానా, సాయిపల్లవి జంటగా నటించిన 'విరాటపర్వం' రెండు అవార్డులు, పవన్ కల్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్'కు ఓ అవార్డు లభించింది. మరి ఏఏ విభాగాల్లో ఎవరెవరికి ఈ అవార్డులు దక్కాయో ఒకసారి పరిశీలిద్దాం.
ఆర్ఆర్ఆర్ అవార్డ్స్
ఉత్తమ సినిమా - ఆర్ఆర్ఆర్
ఉత్తమ దర్శకుడు - ఎస్ఎస్ రాజమౌళి (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ నటుడు - రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ - కీరవాణి (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - సాబు సిరిల్ (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్ - నాటు నాటు పాట)
ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (మేల్) - కాల భైరవ (కొమురం భీముడో పాటకు)
సీతారామం అవార్డ్స్
ఉత్తమ మూవీ (క్రిటిక్స్) - సీతారామం (హను రాఘవపూడి)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - దుల్కర్ సల్మాన్ (సీతారామం)
ఉత్తమ నటి - మృణాల్ ఠాకుర్ (సీతారామం)
ఉత్తమ లిరిక్స్ - సిరివెన్నెల సీతారామశాస్త్రి - కానున్న కల్యాణం (సీతారామం)
ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (ఫిమేల్) - చిన్మయి శ్రీపాద (సీతారామం - ఓ ప్రేమ..)
ఇతర చిత్రాలు
ఉత్తమ నటి (క్రిటిక్స్) - సాయిపల్లవి (విరాటపర్వం)
ఉత్తమ సహాయ నటి - నందితా దాస్ (విరాటపర్వం)
ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్)
జూలై 12 , 2024
![Sai Pallavi In Bollywood: ఆమిర్ ఖాన్ కొడుకుతో సాయి పల్లవి రొమాన్స్!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/09/14113914/Untitled-design-2023-09-14T113410.538.jpg)
Sai Pallavi In Bollywood: ఆమిర్ ఖాన్ కొడుకుతో సాయి పల్లవి రొమాన్స్!
స్టార్ హీరోయిన్ సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్ అయింది. ఇన్నాళ్లు దక్షిణాది సినిమాలకే పరిమితమైన ఈ హైబ్రిడ్ పిల్ల.. బాలీవుడ్కు దారులు తెరిచింది. బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్తో నటించనున్నట్లు తెలిసింది. ఈ సినిమాను సునీల్ పాండే డైరెక్ట్ చేయనున్నారు.
పాన్ ఇండియా సినిమాల ప్రభావంతో భారత చిత్ర పరిశ్రమ ఏకమైంది. సౌత్ నార్త్ తేడా లేకుండా హీరో, హీరోయిన్లు అక్కడా ఇక్కడా నటిస్తున్నారు. ఇన్నాళ్లు హిందీ సినిమాల గురించి పెద్దగా పట్టించుకోని దక్షిణాది హీరోయిన్లు ఒక్కొక్కరుగా బాలీవుడ్ బాట పడుతున్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్సిరీస్ ద్వారా తనలోని బోల్డ్ యాంగిల్ను సమంత చూపించి అక్కడ క్లిక్ అయింది. పుష్ప క్రేజ్తో రష్మిక ఒక్కసారిగా నేషనల్ క్రష్గా మారింది. ఇప్పటికే పలు బాలీవుడ్ ప్రాజెక్టులపై ఆమె సైన్ చేసింది. తాజాగా ఈ లిస్ట్లోకి సాయి పల్లవి కూడా చేరిపోయింది.
టాలీవుడ్లో విరాటపర్వం తర్వాత సాయి పల్లవికి అవకాశాలు సన్నగిల్లిపోయాయి. ఆ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. భోళాశంకర్లో చిరంజీవి చెల్లెలుగా నటించే అవకాశం వచ్చినా.. ఈ ముద్దుగుమ్మ తిరస్కరించింది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే చేస్తానని అప్పట్లో బాహాటంగానే చెప్పింది. గ్లామర్ షోలకు తాను దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది.
కథల ఎంపికలో జాగ్రత్తలు పాటింటే సాయి పల్లవి.. మరి బాలీవుడ్లో ఏలాంటి కంటెంట్కు ఓకే చెప్పిందో అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. బాలీవుడ్ అంటేనే గ్లామర్ షోకు పెద్ద పీట వేస్తుంది. మరి సాయి పల్లవి మడి కట్టుకోకుండా అందాల ఘాటు పెంచుతుందా? లేక దక్షిణాదిలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనే నటిస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.
ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్తో సాయిపల్లవి చేసే సినిమా మంచి లవ్ స్టోరీగా సునీల్ పాండే తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్ క్యారెక్టర్కు ఇంపార్టెన్స్ ఉండటంతో సాయి పల్లవి కథ వినగానే ఓకే చెప్పిసిందని టాక్. ఈ చిత్రం ఆమిర్ ఖాన్ రేంజ్కు తగ్గట్టుగా భారీ బడ్జెట్తో నిర్మించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను చిత్ర యూనిట్ ప్రారంభించింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
ప్రస్తుతం జునైద్ ఖాన్ యాశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో వస్తున్న మహారాజా అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇదే జునైద్ ఖాన్కు ఫస్ట్ సినిమా. ఈ సినిమా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే హీరోయిన్గా నటిస్తోంది.
తొలి సినిమా రిలీజ్ కాకముందే బాలీవుడ్లో లవర్ బాయ్గా స్థిరపడేందుకు సాయి పల్లవితో మరో లవ్ స్టోరీకి జునైద్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ వర్గాల్లో నెలకొంది.
సెప్టెంబర్ 14 , 2023
![Bubblegum Review: హీరోగా ఆకట్టుకున్న యాంకర్ సుమ తనయుడు.. ‘బబుల్ గమ్’ ఎలా ఉందంటే?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/12/29160744/Untitled-design-2023-12-29T160553.193.jpg)
Bubblegum Review: హీరోగా ఆకట్టుకున్న యాంకర్ సుమ తనయుడు.. ‘బబుల్ గమ్’ ఎలా ఉందంటే?
నటీనటులు: రోషన్ కనకాల, మానస చౌదరి, హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అను హాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి తదితరులు
దర్శకత్వం: రవికాంత్ పేరేపు
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఛాయాగ్రహణం: సురేష్ రగుతు
నిర్మాణ సంస్థలు: మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
విడుదల తేదీ: 29-12-2023
రాజీవ్ కనకాల, సుమ దంపతుల కుమారుడు రోషన్ హీరోగా అరంగేట్రం చేసిన చిత్రం ‘బబుల్ గమ్’. రవికాంత్ పేరేపు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. చిరంజీవి, రాజమౌళి, వెంకటేష్ వంటి ప్రముఖ తారలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. టీజర్, ట్రైలర్, పాటలు యువతరాన్ని ఆకర్షించేలా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాల్ని ఈ చిత్రం అందుకుందా? హీరోగా రోషన్ తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నాడా? ఇప్పుడు చూద్దాం.
కథ
హైదరాబాదీ కుర్రాడు ఆది (రోషన్ కనకాల) డీజే కావాలని కలలు కంటాడు. ఓరోజు పబ్లో జాన్వీ(మానస చౌదరి)ని చూసి ప్రేమిస్తాడు. ఆమెని ఫాలో అవుతుంటాడు. అయితే జాన్వీ పెద్దింటి అమ్మాయి. లవ్, రిలేషన్స్ పెద్దగా నచ్చవు. అబ్బాయిల్ని ఆటబొమ్మల్లా చూస్తుంటుంది. ఇలాంటి అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో ఆదితో లవ్లో పడుతుంది. భిన్న మనస్తత్వాలు కలిగిన ఆది, జాన్వీ ఎలాంటి సమస్యలు ఫేస్ చేశారు? చివరకు ఒక్కటయ్యారా? లేదా? అనేదే కథ.
ఎవరెలా చేశారంటే
హీరోగా రోషన్ కనకాలకు ఇది తొలి సినిమా అయినప్పటికీ ఆకట్టుకున్నాడు. హైదరాబాదీ కుర్రాడి పాత్రలో ఒదిగిపోయాడు. లుక్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ.. ఇలా అన్నీ బాగున్నాయి. హీరోయిన్ మానస చౌదరి తన నటనతో మంచి మార్కులే సంపాదించింది. రొమాంటిక్ సీన్స్లో ఆమె మరింత రెచ్చిపోయింది. మిగతా సన్నివేశాల్లో పర్వాలేదనిపించింది. హీరో తండ్రి పాత్రలో చైతు జొన్నల గడ్డ మంచి కామెడీ టైమింగ్తో ఎంటర్టైన్ చేశాడు. హర్షవర్ధన్, అనుహాసన్ వంటి నటులు తమ పాత్ర పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
యువతరాన్ని లక్ష్యంగా చేసుకొని డైరెక్టర్ రవికాంత్ పేరేపు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే కథ, కథనం రొటీన్గా అనిపిస్తాయి. విరామ సన్నివేశాలు, క్లైమాక్స్ మినహా మిగతా స్టోరీ అంతా చాలా సినిమాల్లో చూసిన భావన కలుగుతుంది. జాను-ఆదిల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలను మాత్రం యూత్కు నచ్చేలా డైరెక్టర్ తెరకెక్కించారు. ముఖ్యంగా విరామ సన్నివేశాలు ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతాయి. గతంలో వచ్చిన లవ్ సినిమాలకు భిన్నంగా పతాక సన్నివేశాలను డైరెక్టర్ ప్రజెంట్ చేశారు. యువతకు మంచి సందేశమిచ్చి కథను ముగించారు.
టెక్నికల్గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. సినిమాలో 'జిలేబీ' పాట బాగుంది. శ్రీ చరణ్ పాకాల అందించిన నేపథ్యం సంగీతం ఆకట్టుకుంది. అయితే కొన్ని సీన్స్లో మ్యూజిక్ డామినేట్ చేసినట్లు అనిపించింది. సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
రోషన్, మానస నటనతండ్రి, కొడుకుల సీన్లుసెకండాఫ్, క్లైమాక్స్
మైసన్ పాయింట్స్
రొటిన్ కథ, కథనంసాగదీత సీన్స్
రేటింగ్: 2.5/5
డిసెంబర్ 29 , 2023
![Shaakuntalam Review: శకుంతలగా సమంత ఓకే.. మరి డైరెక్టర్గా గుణశేఖర్ సక్సెస్ అయ్యాడా?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/04/15164751/Review-copy61-1.jpg)
Shaakuntalam Review: శకుంతలగా సమంత ఓకే.. మరి డైరెక్టర్గా గుణశేఖర్ సక్సెస్ అయ్యాడా?
నటినటులు: సమంత, దేవ్ మోహన్, మోహన్బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ల, ప్రకాశ్రాజ్, గౌతమి, అల్లు అర్హ
దర్శకత్వం: గుణశేఖర్
సంగీతం : మణిశర్మ
సినిమాటోగ్రఫీ: శేఖర్ వి. జోసెఫ్
నిర్మాణ సంస్థ: గుణ టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరైన సమంత గతేడాది ‘యశోద’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అయితే ఆ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన కలెక్షన్స్ రాలేదు. ఈ నేపథ్యంలో సామ్ ఇవాళ (ఏప్రిల్ 14) ‘శాంకుతలం’ సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చింది. సమంత తొలిసారి పౌరాణిక పాత్రలో కనిపిస్తుండటంతో సినిమాపై అంచనాలను పెంచాయి. దానికి తోడు గుణశేఖర్ డైరెక్టర్ కావడం, దిల్ నిర్మాతగా ఉండటంతో సినిమాపై బజ్ క్రియేట్ అయింది. దీనికి తగ్గట్టుగానే పాటలు, ప్రచార చిత్రాలు, ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటంతో శాకుంతలంపై ఆసక్తి రెట్టింపు అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? సమంత, గుణశేఖర్లకు హిట్ తెచ్చి పెట్టిందా? వంటివి రివ్యూలో చూద్దాం.
కథ:
విశ్వామిత్రుడి తపస్సు భగ్నం చేయడానికి ఇంద్రుడు ఆదేశంతో మేనక (మధుబాల) భూమిపైకి వస్తుంది. తన అందంతో తపస్సును నాశనం చేయడమే కాకుండా విశ్వామిత్రుడికి శారీరకంగా దగ్గరై పాపకు జన్మనిస్తుంది. ఆ పాపకు కణ్వ మహర్షి (సచిన్ ఖడేకర్) శాంకుతల(సమంత)గా పేరు పెట్టి కన్నబిడ్డలా పెంచుతాడు. శాంకుతల పెద్దయ్యాక ఓ రోజు కణ్వ అశ్రమానికి వచ్చిన దుష్యంత మహారాజు(దేవ్ మోహన్) ఆమె అందచందాలు చూసి ఇష్టపడతాడు. గాంధర్వ వివాహంతో ఒక్కటవుతారు. త్వరలోనే తిరిగి వచ్చి రాజ్యానికి తీసుకెళ్తానని దుష్యంతుడు హామి ఇస్తాడు. ఈ క్రమంలో సమంత గర్భవతి అవుతుంది. ఈ నేపథ్యంలో దుష్యంతుడు, సమంత ఎలా కలిశారు? వారు విడిపోవడానికి దుర్వాస మహాముని (మోహన్బాబు)కి ఉన్న సంబంధం ఏంటి? అనేది అసలు కథ. ఇది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే:
శకుంతల పాత్రకు సమంత పూర్తిగా న్యాయం చేసింది. భావోద్వేగ సన్నివేశాలను బాగా పండించింది. అయితే ఈ పాత్రకు సమంత సొంతగా డబ్బింగ్ చెప్పుకోవడం మైనస్ అని చెప్పొచ్చు. పౌరాణిక పాత్ర కావడంతో సమంత వాయిస్ అతికినట్లు అనిపించదు. భరతుడి పాత్రలో అల్లు అర్హ ఆకట్టుకుంది. ఎంతో చలాకీగా నటించింది. ముద్దుముద్దు మాటలతో అలరించింది. అటు దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటన ఆకట్టుకుంటుంది. సమంత, దేవ్ మోహన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక దుర్వాస మహర్షి పాత్రకు మోహన్బాబు నిండుదనం తీసుకొచ్చారు. ఆయన తెరపై కనిపించేంది కొద్దిసేపే అయినప్పటికీ తన నటనతో అందరినీ కట్టిపడేస్తాడు. సచిన్, అనన్య, మధుబాల, జిషు సేన్ గుప్తా వంటి నటులు తెరపై చాలా మందే ఉన్నప్పటికీ నటనపరంగా వారికి పెద్దగా అవకాశం దక్కలేదు.
టెక్నికల్గా:
శాకుంతలం సినిమాను తీయడంలో డైరెక్టర్ గుణశేఖర్ తడబడినట్లు కనిపిస్తోంది. అందరికీ తెలిసిన ప్రేమ కావ్యాన్ని ఓ దృశ్య కావ్యంలా ఆవిష్కరించడంలో డైరెక్టర్ విఫలమయ్యారు. గ్రాఫిక్స్ విజువల్స్ విషయంలో మరింత శ్రద్ధ వాహించి ఉంటే బాగుండేది. దుష్యంతుడు రాజుగా కంటే కమర్షియల్ సినిమాల్లో హీరోగానే ఎక్కువగా అనిపిస్తాడు. పైగా శాంకుతలం కథ దుష్యంతుడి కోణంలో చెప్పుకుంటూపోవడం ప్రేక్షుకులకు అంతగా రుచించలేదు. అయితే మణిశర్మ సంగీతం ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. ఆయన అందించిన నేపథ్య సంగీతం, పాటలే సినిమాలో హైలెట్ అని చెప్పొచ్చు. ఇక నిర్మాణ విలువలు కూడా పర్వాలేదు.
ప్లస్ పాయింట్స్
సమంత నటనమణిశర్మ సంగీతం విరామ, పతాక సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
నెమ్మదిగా సాగే కథనంగ్రాఫిక్స్సాగదీత సన్నివేశాలు
రేటింగ్: 2/5
ఏప్రిల్ 15 , 2023
![Guntur Kaaram Review: డ్యాన్స్, మాస్ యాక్షన్తో ఇరగదీసిన మహేష్.. ‘గుంటూరు కారం’ ఎలా ఉందంటే!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/01/12104742/Untitled-design-2024-01-12T104728.324.jpg)
Guntur Kaaram Review: డ్యాన్స్, మాస్ యాక్షన్తో ఇరగదీసిన మహేష్.. ‘గుంటూరు కారం’ ఎలా ఉందంటే!
నటీనటులు: మహేశ్బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతిబాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్రాజ్, జయరాం, రావు రమేశ్, ఈశ్వరిరావు, మురళీశర్మ, సునీల్ తదితరులు
రచన, దర్శకత్వం: త్రివిక్రమ్
సంగీతం: థమన్
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాత: ఎస్.రాధాకృష్ణ
ప్రొడక్షన్ కంపెనీ: హారిక & హాసిని క్రియేషన్స్
విడుదల తేదీ: 12-01-2024
మహేష్ బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా చిత్రం 'గుంటూరు కారం' (Guntur Karam). శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలై టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. త్రివిక్రమ్-మహేష్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. మరి గుంటూరు కారం ఎలా ఉంది? మహేశ్ మాస్ అవతార్ మెప్పించిందా? శ్రీలీల అందాలతో అలరించిందా? ఇప్పుడు చూద్దాం.
కథ
జనదళం పార్టీ అధినేత వైరా సూర్య నారాయణ (ప్రకాశ్ రాజ్) కూతురు వసుంధర (రమ్యకృష్ణ) మూడోసారి ఎమ్మెల్యేగా గెలుస్తుంది. వసుంధరను మంత్రిని చేయాలని సూర్యనారాయణ భావిస్తాడు. ఎమ్మెల్యే కాటా మధు (రవిశంకర్) ఇందుకు అడ్డుతగులుతాడు. ఆ పదవి తనకు ఇవ్వకపోతే వసుంధరకు రెండో పెళ్లి అయిన విషయంతో పాటు మెుదటి భర్త సంతానం రమణ (మహేష్ బాబు) గురించి బయటపెడతానని బెదిరిస్తాడు. దీంతో సూర్యనారాయణ ముందు చూపుగా రమణను పిలిపించి వసుంధరతో ఎలాంటి సంబంధం లేదని బాండ్ పేపర్స్పై సంతకం చేయమంటాడు. కానీ రమణ నిరాకరిస్తాడు.(Guntur kaaram Review) తండ్రి రాయల్ సత్యం (జయరామ్) చెప్పినా వినకుండా గుంటూరులోనే ఉంటూ మిర్చియార్డ్ నడుపుతుంటాడు. అసలు వసుంధర తన మెుదటి భర్తకు ఎందుకు విడాకులు ఇచ్చింది? రమణను చూడటానికి కూడా ఎందుకు ఇష్టపడలేదు? అమ్ము (శ్రీలీల) రమణల లవ్ ట్రాక్ ఏంటి? మరదలు రాజి (మీనాక్షి చౌదరి) పాత్ర ఏంటి? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
మహేశ్బాబు (Mahesh babu) పాత్ర ఆయన నటనే ఈ సినిమాకి హైలైట్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా డ్యాన్స్తో మహేష్(Mahesh babu) ఇరగదీశాడు. భావోద్వేగాల్నీ తనదైన శైలీలో అద్భుతంగా పండించాడు. శ్రీలీల మరోసారి స్టెప్పులకే పరిమితమైంది. కుర్చీ మడతపెట్టి పాటలో ఆమె, మహేష్ కలిసి చేసిన హంగామా కల్ట్ మాస్ అనాల్సిందే. మీనాక్షి చౌదరి పాత్ర కూడా సినిమాలో పరిమితమే. రమ్యకృష్ణ పాత్ర, ఆమె నటన హుందాగా అనిపిస్తుంది. ప్రకాశ్రాజ్, వెన్నెల కిశోర్ పాత్రల్లో కొత్తదనం లేదు. జగపతిబాబు, రావు రమేశ్, మురళీశర్మ, సునీల్ ఇలా చాలా మంది నటులు ఉన్నా ఏ పాత్రలోనూ బలం కనిపించదు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
బలమైన భావోద్వేగాలు, పదునైన మాటలతో త్రివిక్రమ్ (Trivikram) తన చిత్రాల్లో మ్యాజిక్ చేస్తుంటారు. కానీ గుంటూరు కారం (Guntur Kaaram Review) విషయంలో ఆ మేజిక్ మిస్ అయ్యింది. పాతికేళ్లు తల్లికి దూరంగా పెరిగినా కొడుకు.. సంతకం చేస్తే తెగిపోయే బంధంతో కథ ముడి పడి ఉంటుంది. ఈ విషయం తొలి సన్నివేశాల్లోనే చెప్పేసిన త్రివిక్రమ్.. ఆ తర్వాత సినిమాను కాలక్షేప సీన్లతో నడిపించేసినట్టే అనిపిస్తుంది. కథతో సంబంధం లేకుండా పాత్రలను రాసుకున్నట్లు కనిపిస్తుంది. అవి త్రివిక్రమ్ స్థాయికి తగ్గ పాత్రలు, సన్నివేశాలు ఏమాత్రం కావు. ఓవరాల్గా మాస్ పాత్రలో మహేశ్బాబు చేసే హంగామా, ఆయన ఎనర్జీ, పాటలు, విరామ సన్నివేశాలు, పతాక సన్నివేశాల్లో కాసిన్ని భావోద్వేగాలు ఇవే ఈ సినిమాకు బలం.
టెక్నికల్గా
ఇక సాంకేతిక విషయాలకొస్తే.. తమన్ సంగీతం బాగుంది. పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతాన్ని అందించాడు. మనోజ్ పరమహంస అందించిన సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
మహేష్ నటనశ్రీలీల డ్యాన్సులుసంగీతం
మైనస్ పాయింట్స్
కథ, కథనంకొరవడిన భావోద్వేగాలుకనబపడని త్రివిక్రమ్ మార్క్
రేటింగ్ : 3/5
జనవరి 12 , 2024
![Operation Valentine OTT Date: ఆపరేషన్ వాలంటైన్ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/03/01162530/Untitled-design-2024-03-01T162335.652.jpg)
Operation Valentine OTT Date: ఆపరేషన్ వాలంటైన్ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
భారత వైమానిక దళం నేపథ్యంలో మెగాహీరో వరుణ్ తేజ్ (Varun Tej) నటించిన తాజా చిత్రం 'ఆపరేషన్ వాలంటైన్' (Operation Valentine). గతంలో పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలోకి వచ్చేసింది. తెలుగు, హిందీ భాషల్లో రిలీజైంది. ఈ సినిమాకు సంబంధించి గురువారం సాయంత్రమే ప్రీమియర్లు పడగా పాజిటివ్ టాక్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. రిలీజ్ రోజునే ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్ కావడం విశేషం.
నెల రోజుల్లో ఓటీటీలోకి!
'ఆపరేషన్ వాలంటైన్' సినిమా డిజిటల్ హక్కుల్ని భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అయితే నాలుగు వారాల డీల్ మాట్లాడుకున్నారని తెలుస్తోంది. ఏప్రిల్ తొలి వారంలో ఈ చిత్రం ఓటీటీలోకి రావొచ్చని సమాచారం. తెలుగుతో పాటు దక్షిణాది భాషలకు సంబంధించి నెల రోజుల వ్యవధిలో డబ్బింగ్ పనులు కూడా పూర్తి కావచ్చన అంటున్నారు. హిందీ వెర్షన్ మాత్రం ఎనిమిది వారాల తర్వాత ఉండనుందని సమాచారం.
కెరీర్ బెస్ట్ నటన
మరోవైపు ఆపరేషన్ వాలెంటైన్లో వరుణ్ తేజ్ నటనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. వరుణ్ కెరీర్ బెస్ట్ నటనతో ఈ సినిమాలో ఆకట్టుకున్నాడు. నిజమైన ఫైటర్ పైలెట్లా తన పాత్రలో ఒదిగిపోయాడు. భావోద్వేగ సన్నివేశాల్లోనూ మంచి పరిణితి కనబరిచి ప్రతిభ చూపించాడు. హీరోయిన్గా మానుషి చిల్లర్ ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే నటించింది. దాదాపుగా సినిమా అంతా హీరో హీరోయిన్లే తెరపై కనిపిస్తారు. వీళ్ల జంట చూడటానికి చాలా బాగుంది. మిగిలిన పాత్రలన్నీ పరిమితంగానే కనిపిస్తాయి. వారు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపించాడు.
https://telugu.yousay.tv/operation-valentine-review-in-telugu-varun-tej-who-is-popular-as-a-fighter-pilot-is-the-movie-a-hit-free.html
మార్చి 01 , 2024
![Save The Tigers 2 Review: ఓటీటీలోకి సూపర్ హిట్ సిరీస్కు సీక్వెల్.. ‘సేవ్ ద టైగర్స్ 2’ నవ్వించిందా?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/03/15123013/Movie-Review-14.jpg)
Save The Tigers 2 Review: ఓటీటీలోకి సూపర్ హిట్ సిరీస్కు సీక్వెల్.. ‘సేవ్ ద టైగర్స్ 2’ నవ్వించిందా?
నటీనటులు: అభివన్ గోమఠం, ప్రియదర్శి, చైతన్యకృష్ణ, జోర్దార్ సుజాత, దేవయాని శర్మ, పావని గంగిరెడ్డి, సీరత్ కపూర్, దర్శనా బానిక్, వేణు ఎల్డండి..
దర్శకత్వం: అరుణ్ కొత్తపల్లి
సంగీతం: అజయ్ అరసద
రచన & నిర్మాత: మహి వి రాఘవ్
స్ట్రీమింగ్ వేదిక : డిస్నీ + హాట్స్టార్
విడుదల తేదీ: 15-03-2024
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ హీరోలుగా నటించిన వెబ్సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’ (Save The Tigers). అరుణ్ కొత్తపల్లి దర్శకత్వంలో గతేడాది విడుదలైన ఈ సిరీస్.. ఓటీటీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. తాజాగా ఈ వెబ్సిరీస్కు సీక్వెల్ కూడా వచ్చింది. ‘సేవ్ ద టైగర్స్ 2’ (Save The Tigers 2) పేరుతో డిస్నీ+హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? ప్రీక్వెల్ లాగానే అందర్నీ నవ్వించిందా? అనేది ఈ (Save The Tigers 2 OTT Review) రివ్యూలో తెలుసుకుందాం.
కథ
'సేవ్ ద టైగర్స్' ఫస్ట్ సీజన్ ముగిసిన చోటు నుంచి సీజన్ 2 మొదలైంది. హీరోయిన్ హంసలేఖ (సీరత్ కపూర్ ) కనిపించకుండా పోతుంది? ఆమె కిడ్నాప్ వెనకాల గంటా రవి (ప్రియదర్శి), విక్రమ్ (చైతన్య కృష్ణ) రాహుల్ (అభినవ్ గోమఠం) ఉన్నారంటూ పోలీసులు ప్రశ్నిస్తారు. కనిపించకుండా పోయిన హంసలేఖను వీళ్లే మర్డర్ చేసారంటూ పలు న్యూస్ ఛానెల్స్ సైతం అనుమానం వ్యక్తం చేస్తూ కథనాలు ప్రసారం చేస్తాయి. ఈ నేపథ్యంలో ఏం జరిగింది? హంసలేఖతో ఈ ముగ్గురికి ఉన్న సంబంధం ఏమిటి? విక్రమ్, రవి, రాహుల్ భార్యలు తమ భర్తలను ఎందుకు అనుమానించారు? వారు స్పందన (సత్యకృష్ణ) దగ్గరకు ఎందుకు వెళ్లారు? ఆ మూడు జంటల మధ్య గొడవకు కారణం ఏంటి? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ... ముగ్గురి నటన బాగుంది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ప్రియదర్శి అద్భుతంగా నటించాడు. హావభావాలను చక్కగా వ్యక్తపరిచాడు. అటు అభినవ్ గోమఠం కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ ఎప్పటిలాగే ఇందులోనూ ఆకట్టుకుంటుంది. ఇక రాహుల్ పాత్రలో చైతన్యకృష్ణ జీవించాడు. మరోవైపు ఫీమేల్ లీడ్ పాత్రల్లో జోర్దార్ సుజాత, దేవియాని శర్మ, పావని గంగిరెడ్డి అదరగొట్టారు. తమ క్యారెక్టర్లలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించారు. హంసలేఖగా సీరత్ కపూర్ చక్కగా చేసింది. భార్యాభర్తలుగా సత్యకృష్ణ, వేణు ఎల్దండి సన్నివేశాలు నవ్విస్తాయి. దర్శనా బానిక్ పాత్ర నిడివి తక్కువే అని సిరీస్పై ఆమె ప్రభావం కనిపిస్తుంది. గంగవ్వ, ముక్కు అవినాష్, రోహిణి తదితరులు తమ పరిధి మేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
‘సేవ్ ద టైగర్స్ 2’లో మహి వి రాఘవ్ రచన.. అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం ఆకట్టుకుంటుంది. కళ్లతో చూసేది ప్రతీది నిజం కాదన్న అంతర్లీన సందేశంతో ఈ సిరీస్ సాగుతుంది. టీవీ ఛానెళ్లలో మనం రెగ్యులర్గా చూసే వైరల్ న్యూస్.. దానికి ప్రతిగా ప్రజల నుంచి వచ్చే స్పందనను డైరెక్టర్ ఎంతో సెటైరికల్గా చూపించాడు. సిరీస్లోని మెుదటి మూడు ఎపిసోడ్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. కామెడీతో పాటు ఎమోషన్స్ చక్కగా కుదిరాయి. నాలుగో ఎపిసోడ్లో 10000 BC ట్రాక్ పర్వాలేదనిపిస్తుంది. వివాహ వ్యవస్థ పుట్టుక వెనుక చెప్పిన కథ ఆకట్టుకుంది. ప్రియదర్శి - సుజాత, చైతన్యకృష్ణ - దేవియాని శర్మ మధ్య సన్నివేశాలు చాలా జంటలకు కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఓవరాల్గా 'సేవ్ ద టైగర్స్ 2'... సిరీస్ నవ్విస్తుంది. ఎన్ని సవాళ్లు ఎదురైనా వెనకడుగు వేయవద్దని డైరెక్టర్ ఈ సిరీస్ ద్వారా మంచి సందేశం ఇచ్చారు.
టెక్నికల్గా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే (Save The Tigers 2 OTT Review).. అజయ్ అరసద అందించిన సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం సన్నివేశాలకు తగ్గట్లు సరిగ్గా సరిపోయింది. కెమెరా విభాగం చక్కటి పనితీరు కనబరిచింది. ఎడిటర్ తన కత్తెరకు కాస్త పనిపెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఖర్చు దగ్గర వెనకాడినట్లు ఎక్కడా కనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
ప్రధాన తారాగణం నటనకామెడీ సమకాలిన అంశాలను ప్రతిబింబించే సీన్లు
మైనస్ పాయింట్స్
కొన్ని సాగదీత సన్నివేశాలుఎడిటింగ్
Telugu.yousay.tv Rating : 3/5
మార్చి 15 , 2024
![SUMMER HAIR STYLES: స్టైల్ స్టైల్రా ఇది సూపర్ స్టైల్రా… సూపర్ లుక్స్తో అదరగొడుతున్న ఐపీఎల్ స్టార్స్](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/04/26134357/Collages-9.jpg)
SUMMER HAIR STYLES: స్టైల్ స్టైల్రా ఇది సూపర్ స్టైల్రా… సూపర్ లుక్స్తో అదరగొడుతున్న ఐపీఎల్ స్టార్స్
వేసవికాలం వచ్చిందంటే వాతావరణ పరిస్థితుల కారణంగా కాస్త చికాకు ఉంటుంది. అసలే ఉక్కపోత ఆపై చెమటలు… ఇక తలపై జుట్టు ఎక్కువగా ఉంటే ఇంక అంతే సంగతి. ఇలాంటి సమయంలో కొన్ని సమ్మర్ హెయిర్ కట్స్ చేయించుకుంటే ఎంతో ఉపశమనంగా ఉంటుంది. మనకు తెలిసిన చాలామంది క్రికెటర్స్ కూడా ఇదే ఫాలో అవుతున్నారు. ఓసారి వాటిపై లుక్కేసి కుదిరితే ఫాలో అయిపోండి.
ధోని
విభిన్నమైన హెయిర్ స్టైల్స్లో కనిపించడం ధోని ప్రత్యేకత. కానీ, ఈసారి పెద్దగా ప్రయోగాలు చేయలేదు. హెయిర్ షేప్ను అలాగే ఉంచి కాస్త తక్కువ జుట్టుతో కనిపిస్తున్నాడు. సైడ్లో ప్రొఫెషనల్గా కనిపించేలా మెయింటెన్ చేస్తున్నాడు MSD.
డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్టైల్ను వేసవిలో ఫాలో కావచ్చు. సైడ్స్ పూర్తిగా తగ్గించి మధ్యలో తక్కువ జుట్టును ఉంచుకుంటే బెటర్. మీసం, గడ్డం కూడా ట్రిమ్ చేసుకుంటే లుక్ అదిరిపోతుంది. దీంతో పాటు ఉక్కపోత నుంచి ఉపశమనం కలుగుతుంది.
హార్దిక్ పాండ్యా
ఐపీఎల్ గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ట్రెండ్ను ఫాలో అవుతుంటాడు. ప్రస్తుతం హార్దిక్ కూడా వార్నర్ లాంటి హెయిర్ స్టైల్ను చేయించుకున్నాడు. సైడ్స్ను పూర్తిగా తగ్గించి మధ్యలో మీడియం జుట్టుతో ఉంటే సూపర్ కూల్గా ఉంటుంది.
నితీశ్ రాణా
నితీశ్ రాణా ఫ్యాషన్ ఫ్రీక్ అని చెప్పవచ్చు. గతేడాది పర్పుల్ షేడ్ హెయిర్ స్టైల్తో కనిపించిన అతడు ఈ సారి పెద్దగా మార్పులు చేయలేదు. నితీశ్ది సమ్మర్కి సరిగ్గా సరిపోయే అండర్ కట్. ఇలాంటిది మీకు సూట్ అయితే ట్రై చేయవచ్చు.
కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్ లాంటి హెయిర్ కట్ చూడటానికి సూపర్గా ఉంటుంది. సైడ్ పూర్తిగా ట్రిమ్ చేసుకొని ఫ్రెంచ్ గడ్డం మెయింటెన్ చేస్తే వేసవిలో ఇక తిరుగుండదు. మీకు ఇలాంటి లుక్ సెట్ అయితే ఆలస్యం లేకుండా చేసుకోండి.
శిఖర్ ధావన్
వేసవి కాలానికి పర్ఫెక్ట్ కటింగ్ ధావన్ స్టైల్. అసలు జుట్టు ఉందా లేదా అనేంతలా ట్రిమ్ చేసి మధ్యలో స్టైల్ కోసం లైన్స్ పెట్టారంటే మాములు లుక్ ఉండదు. చిరాకు నుంచి కాస్తైనా తప్పించుకోవాలని అనుకుంటే ధావన్ హెయిర్ కట్ చేయించాల్సిందే.
విరాట్ కోహ్లీ
సమ్మర్లో విరాట్ కోహ్లీ హెయిర్ కట్ను కూడా ఫాలో కావచ్చు. సైడ్స్ పూర్తిగా ట్రిమ్ చేసుకొని మధ్యలో లైన్ తీసి జెల్ పెట్టారంటే ఇక అదిరిపోతుంది.
మార్క్రమ్
సన్రైజర్స్ కెప్టెన్గా ఉన్న మార్క్రమ్ సూపర్ లుక్లో కనిపిస్తున్నాడు. ఫంకీ స్లీక్ హెయిర్ స్టైల్ చేయించుకున్నాడు. సైడ్లో క్లాసీ లుక్ ఉంచి మధ్యలో బ్యాలెన్స్డ్గా జుట్టును మెయింటెన్ చేస్తే బాగుంటుంది.
ఏప్రిల్ 26 , 2023
![Shubra Aiyappa: స్లీవ్లెస్ క్రాప్ టాప్లో పరువాలు బయటపెడుతూ హద్దులు దాటిన శుభ్ర ](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/04/01182216/as.jpg)
Shubra Aiyappa: స్లీవ్లెస్ క్రాప్ టాప్లో పరువాలు బయటపెడుతూ హద్దులు దాటిన శుభ్ర
శుభ్ర అయ్యప్ప తాజాగా హాటో ఫోటోషూట్ ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది.
కంప్లీట్ క్రాప్ టాప్లో ఎద అందాలను ఎకరువు పెట్టింది. స్లీవ్ లెస్ టాప్లో నడుమందాలను చూపిస్తూ కవ్విస్తోంది.
ఈ గ్లామర్ పిక్స్ చూసిన ఆమె అభిమానులు లుకింగ్ హాట్, గార్జియస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
శభ్ర అయ్యప్ప తమిళ్ నటి. తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించింది.
శుభ్ర అయ్యప్ప 1991, జనవరి 1న బెంగళూరు సమీపంలోని కొడగులో జన్మించింది.
బెంగళూరులోని బాల్డ్విన్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసాన్ని పూర్తిచేసింది.
చిన్నప్పటి నుంచి మోడలింగ్, సినిమా రంగాలపై ఉన్న ఆసక్తితో మోడల్గా తన కెరీర్ను ప్రారంభించింది.
View this post on Instagram A post shared by Shubra Aiyappa (@shubra.aiyappa)
వై. వి. ఎస్. చౌదరి డైరెక్షన్లో వచ్చిన 'రేయ్' సినిమాలో తొలిసారిగా కనిపించింది.
ఆ తర్వాత 2014లో వచ్చిన ప్రతినిధి సినిమాలో తొలిసారిగా శుభ్ర అయ్యప్ప(Shubra Aiyappa) హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో జర్నలిస్ట్గా యాక్ట్ చేసింది.
2015లో విజయ్ కాంత్ కుమారుడు షణ్ముగపాండియన్ నటించిన సగప్తం సినిమాతో తమిళ సినిరంగంలోకి ప్రవేశించింది.
అదే ఏడాదిలో వచ్చిన 'వజ్రకాయ' అనే కన్నడ సినిమాతో కన్నడ సినిరంగంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో వెనిస్ నగరంలో చిత్రీకరించిన పాటలో నటించింది.
ఈ సినిమాలో శుభ్ర నటనకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత యవ్వనం ఒక ఫాంటసీ అనే సినిమాలో కూడా నటించింది.
శుభ్ర అయ్యప్ప గతేడాది జనవరిలో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. వ్యాపారవేత్త విశాల్ శివప్పతో ఆమె ఏడడుగులు వేసింది.
View this post on Instagram A post shared by Shubra Aiyappa (@shubra.aiyappa)
అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో….150 ఏళ్ల ప్రాచీన గృహంలో గురువారం వీరి వివాహం జరిగింది.
ప్రస్తుతం తమిళ్, తెలుగులో ఈ ముద్దుగుమ్మకు పెద్దగా అవకాశాలు లేనప్పటికీ... కన్నడలో మాత్రం దూసుకెళ్తోంది. అక్కడ తిమ్మయ్య తిమ్మయ్య, రామన అవతార వంటి చిత్రాల్లో ఛాన్స్ కొట్టేసింది.
ఏప్రిల్ 01 , 2024
![janhvi kapoor: లేత పరువాలను అడ్డు చీరలో దోపుకున్న జాన్వీ కపూర్.. కుర్రాళ్లను టెంప్ట్ చేస్తూ అందాల ప్రదర్శన](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/08/31200751/Snapinsta.app_371174858_846594923852764_8954652839152370126_n_1080-1.jpg)
janhvi kapoor: లేత పరువాలను అడ్డు చీరలో దోపుకున్న జాన్వీ కపూర్.. కుర్రాళ్లను టెంప్ట్ చేస్తూ అందాల ప్రదర్శన
బాలీవుడ్ అందాల క్వీన్ జాన్వీ కపూర్ ఒక్కసారిగా రవివర్మ కుంచె గీసిన బొమ్మగా మారిపోయింది. పరువాలను అడ్డు చీరలో దోపుతూ ఫొటో షూట్కు పొజులిచ్చింది. అచ్చం రవివర్మ గీసిన పెయింటింగ్లా ఉందంటూ సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాలను నెటిజన్ల తెగ పొగుతుతున్నారు.
కేరళ కుట్టిలా ముస్తాభై నేల మీద కూర్చోని అందాలను అమర్చింది ఈ కొంటె పిల్ల. జబ్బల అందాలు, సొగసైన ఎద అందాల అచ్చాదనను ఎకరువు పెడుతూ తళుక్కున మెరిసింది
ముగ్దమైన కళ్లు, సగం తెరుచుకున్న ఎర్రని లాలీపప్స్ వంటి పెదాలు, పొడవైన నల్లని జుట్టులో దోపిన కలువ పూల అందాల్లో జాన్వీ అందాలకే అందంగా నిలిచింది.
అతిలోక సుందరి శ్రీదేవికి తగిన తనయగా తన అందానికి మరింత హంగులు అద్దింది. చూపు తిప్పుకోలేని భంగిమలో కుర్రకారును టెంఫ్ట్ చేస్తోంది.
రాఖీ పండగ సందర్భంగా కవ్వించే సొగసులతో కుదురుగా ఉండనివ్వడం లేదంటే నమ్మండి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో రచ్చ చేస్తున్నాయి. దీంతో కుర్రాళ్లు తమ పదునై కామెంట్లకు పని చెబుతున్నారు.
ఈ ఫొటోలను ట్యాగ్ చేస్తూ ... ఇది ఆర్ట్ గొప్పతనం అంటూ పోస్ట్ చేసింది. ఇక పోస్ట్కు రిప్లే ఇస్తూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. జాన్వీ అందాలను పొగుడుతూ తమలోని కామెంట్ల కవిత్వానికి పని చెప్పారు.
లుకింగ్ గార్జియస్, డ్రీమీ, ఏంజెల్లా ఉన్నావని కొందరూ, అతిలోక సుందరిని మించిపోయావంటూ తెగ పొగుడుతున్నారు.
స్టార్ కిడ్ అయినప్పటికీ జాన్వీ బాలీవుడ్లో గొప్పగా అయితే లాంచ్ కాలేదు. చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ నటనలో పరిపక్వతను సాధిస్తోంది. తాజాగా వరుణ్ దావణ్తో `బవాల్` చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మ నటన పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఈ సినిమా ఓటీటీలో విడుదలై ప్రశంసలందుకుంది.
ఇప్పుడు ఈ సొగసుల సోయగం తెలుగులో భారీగా ఎంట్రీ ఇస్తోంది. కొరటాల శివ- జూ. ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న దేవర సినిమాలో మెయిన్ లీడ్లో నటిస్తోంది. గతంలో ఎన్టీఆర్పై తన ఇష్టాన్ని పలు ఇంటర్వ్యూలో పంచుకున్న ఈ అల్లరి పిల్ల నేరుగా ఆయన పక్కన హీరోయిన్గా ఛాన్స్ కొట్టేయడం విశేషం.
అయితే దేవర కంటే ముందుగానే జాన్వీ.. లైగర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కావాల్సి ఉంది. కానీ కుదరలేదు. అయితే ఆ సినిమాలో నటించకపొవడం జాన్వీకి మంచే చేసిందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న 'దేవర' సినిమా ఆమె కెరీర్కు మంచి బూస్టింగ్ ఇస్తుందని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తన తల్లి శ్రీదేవి లాగా పాన్ ఇండియన్ హీరోయిన్గా ఎదిగేందుకు అన్ని విధాల దేవర సినిమా అయితే ఉపయోగపడనుంది.
ఈ సినిమా ద్వారా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ జాన్వీ పరిచయం కానుంది. ప్రస్తుతం దేవర సినిమాతో పాటు హిందీలో.. మిస్టర్ అండ్ మిసెస్ మహీ, ఉలజ్ సినిమాల్లో నటిస్తోంది. అడపాదడపా చిత్రాలు చేస్తున్నా జాన్వీకి మాత్రం బిగ్ బ్రేక్ రాలేదు. మరి జూ. ఎన్టీఆర్ దేవరతో ఆ బ్రేక్ వస్తుందో చూడాలి మరి.
ఆగస్టు 31 , 2023
![<strong>Vijay Deverakonda: </strong><strong>విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్టు.. తండ్రిని గట్టిగా హగ్ చేసుకొని..! </strong>](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/06/19154719/page.jpg)
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్టు.. తండ్రిని గట్టిగా హగ్ చేసుకొని..!
టాలీవుడ్లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు 'విజయ్ దేవరకొండ' (Vijay Devarakonda). ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ రౌడీ బాయ్.. తనకంటూ ప్రత్యేకమైన స్టార్డమ్ను సృష్టించుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి’, ‘పెళ్లి చూపులు’, ‘గీతా గోవిందం’, ‘ట్యాక్సీవాలా’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలతో స్టార్ హీరోల సరసన నిలిచాడు. కాగా, ఇటీవల విజయ్.. తన ఫ్యామిలీతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లాడు. అక్కడ కుటుంబ సభ్యులతో దిగిన ఎమోషనల్ ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఎమోషనల్ పోస్టు
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.. తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవిలతో పాటు సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లాడు. విజయ్ తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి. గత కొంత కాలంగా వరుస షూటింగ్ షెడ్యూల్స్తో బిజీ బిజీగా గడుపుతోన్న విజయ్.. విరామం కోసం అమెరికాకు వెళ్లి కొద్ది రోజులు ఫ్యామిలీతో సరదాగా గడిపారు. తాజాగా ఇండియాకు వచ్చిన విజయ్.. అక్కడ తన ఫ్యామిలీతో దిగిన ఫొటోలను పంచుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన అమ్మనాన్న, సోదరుడితో కలిసి అమెరికా వెకేషన్ను.. విజయ్ ఎంత బాగా ఆస్వాదించారో ఈ ఫొటోల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా తండ్రి గోవర్ధన్రావును విజయ్ గట్టిగా హగ్ చేసుకున్న ఫొటో ఫ్యాన్స్ను విపరీతంగా ఆకర్షిస్తోంది.
https://www.instagram.com/p/C8W7M9Jys78/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
అసిస్టెంట్ డైరెక్టర్గా త్రివిక్రమ్ కుమారుడు!
విజయ్ దేవరకొండ తీసిన గత మూడు చిత్రాలు (లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్) బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచాయి. దీంతో విజయ్ తన తర్వాతి చిత్రంపై ఫోకస్ పెట్టాడు. ‘VD12’ ప్రొడక్షన్ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పెద్ద కుమారుడు రిషి.. ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతనిది హీరో ఫేస్ అని అభిమానులు అంటున్నా.. రిషి మాత్రం కెమెరా వెనుక నుంచి తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారట. ఇందుకు త్రివిక్రమ్ కూడా ఓకే చెప్పడంతో విజయ్ దేవరకొండ సినిమా ద్వారానే రిషి తన సినీ కెరీర్ను మెుదలుపెట్టినట్లు సమాచారం.
పోలీసు ఆఫీసర్గా విజయ్
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న VD12 చిత్రంలో విజయ్.. ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా కనిపిస్తారని సమాచారం. ఇందులో సీరియస్ పోలీసు ఆఫీసర్గా విజయ్ కనిపించనున్నాడట. హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree)ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా, ఈ సినిమాలో ప్రముఖ నటుడు సత్యదేవ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాలీవడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇటీవల అతడు నటించిన 'కృష్ణమ్మ' ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో సత్యదేవ్ కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారట.
సాయిపల్లవితో రొమాన్స్
రౌడీ భాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda).. దర్శకుడు రవికిరణ్ కోలా (Ravi Kiran Kola)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీకి దిల్ రాజు (Dil Raju) నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇది అందమైన, సరికొత్త ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా నటించనున్నట్లు కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. చిత్ర యూనిట్ సాయిపల్లవిని కలిశారని, ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు ఫిల్మ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది నిజమైతే విజయ్ - సాయి పల్లవి జోడీ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్గా నిలుస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.
జూన్ 19 , 2024
![కాజల్ అగర్వాల్ గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/04/06114043/123.-73.jpg)
కాజల్ అగర్వాల్ గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?
కాజల్ అగర్వాల్ దశాబ్దకాలం పాటు తెలుగులో స్టార్ హీరోయిన్గా వెలుగొందింది. తెలుగులో లక్ష్మీ కళ్యాణం(2007) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ ముంబై అందం... రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన మగధీర చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఈ సినిమా ఆమెకు టాలీవుడ్లో మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆర్య2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మాన్, ఖైదీ 150, నేనేరాజు నేనే మంత్రి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్లో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఈమె నటించింది. పెళ్లి చేసుకుని కొద్దికాలం సినిమాలకు విరామం ఇచ్చి తిరిగి మళ్లీ భగవంత్ కేసరి చిత్రం ద్వారా కమ్బ్యాక్ ఇచ్చింది. ఆమె సహజ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ గురించి కొన్ని(Some Lesser Known Facts About Kajal Aggarwal) ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం
కాజల్ అగర్వాల్ ఎవరు?
కాజల్ అగర్వాల్ భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
కాజల్ అగర్వాల్ దేనికి ఫేమస్?
కాజల్ అగర్వాల్ మగధీర, ఖైదీ150, బిజినెస్మ్యాన్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్గా నటించి గుర్తింపు పొందింది.
కాజల్ అగర్వాల్ వయస్సు ఎంత?
కాజల్ అగర్వాల్ 1985 జూన్ 19న జన్మించింది. ఆమె వయస్సు 38 సంవత్సరాలు
కాజల్ అగర్వాల్ మందన్న ముద్దు పేరు?
కాజు
కాజల్ అగర్వాల్ మందన్న ఎత్తు ఎంత?
5 అడుగుల 5 అంగుళాలు
కాజల్ అగర్వాల్ ఎక్కడ పుట్టింది?
ముంబాయి
కాజల్ అగర్వాల్కు వివాహం అయిందా?
2020 అక్టోబర్ 30న గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది
కాజల్ అగర్వాల్కు ఎంతమంది పిల్లలు?
కాజల్ అగర్వాల్- గౌతమ్ కిచ్లూ ఒక మగ బిడ్డను కన్నారు. అబ్బాయి పేరు నేయిల్ కిచ్లూ
కాజల్ అగర్వాల్కు ఇష్టమైన రంగు?
వైట్, రెడ్, బ్లూ
కాజల్ అగర్వాల్ అభిరుచులు?
డ్యాన్సింగ్, ట్రావెలింగ్
కాజల్ అగర్వాల్కు ఇష్టమైన ఆహారం?
ఎగ్స్, తియ్యని పండ్లు
కాజల్ అగర్వాల్ అభిమాన నటుడు?
జూ.ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్
కాజల్ అగర్వాల్ తొలి సినిమా?
లక్ష్మి కళ్యాణం(2007)
కాజల్ అగర్వాల్కు గుర్తింపు తెచ్చిన సినిమాలు?
మగధీర, బృందావనం, డార్లింగ్
కాజల్ అగర్వాల్ ఏం చదివింది?
మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ చేసింది
కాజల్ అగర్వాల్ పారితోషికం ఎంత?
కాజల్ ఒక్కొ సినిమాకు రూ.కోటి- రూ.2కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.
కాజల్ అగర్వాల్ తల్లిదండ్రుల పేర్లు?
వినయ్ అగర్వాల్, సుమన్ అగర్వాల్
కాజల్ అగర్వాల్ ఎన్ని అవార్డులు గెలుచుకుంది?
కాజల్ అగర్వాల్ తెలుగులో నేనే రాజు నేనే మంత్రి చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా అవార్డును గెలుచుకుంది. అలాగే బృందావనం చిత్రానికి గాను ఉత్తమ నటిగా సిని'మా' అవార్డును పొందింది.
కాజల్ అగర్వాల్ మోడ్రన్ డ్రెస్సులు వేస్తుందా?
కాజల్ అగర్వాల్ అన్నిరకాల డ్రెస్సులు వేస్తుంది.
కాజల్ అగర్వాల్కు సిస్టర్ పేరు?
నిషా అగర్వాల్, ఆమె కూడా హీరోయిన్గా పలు సినిమాల్లో నటించింది.
కాజల్ అగర్వాల్ ఇన్స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/kajalaggarwalofficial/?hl=en
కాజల్ అగర్వాల్ ఎంత మంది హీరోలతో లిప్ లాక్ సీన్లలో నటించింది?
కాజల్ అగర్వాల్ తొలుత బిజినెస్ మ్యాన్ చిత్రంలో మహేష్ బాబుతో లిప్ లాక్ సీన్లో నటించింది.
కాజల్ అగర్వాల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?
రామ్ చరణ్, తమన్నా భాటియా
https://www.youtube.com/watch?v=zh3DbdY0w40
ఏప్రిల్ 27 , 2024
![RAM CHARAN BIRTHDAY: గ్లోబల్ స్టార్తో ఉన్న ఫోటోలు పంచుకున్న సెలబ్రిటీలు](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/03/27141008/rc-bday.jpg)
RAM CHARAN BIRTHDAY: గ్లోబల్ స్టార్తో ఉన్న ఫోటోలు పంచుకున్న సెలబ్రిటీలు
RRRతో గ్లోబల్ స్టార్గా ఎదిగిన రామ్ చరణ్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే #RC15 టైటిల్ అప్డేట్తో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. తారలంతా చరణ్పై పుట్టిన రోజు శుభాకాంక్షలు కురిపిస్తున్నారు. మహేశ్ బాబు, జూ. ఎన్టీఆర్ సహా అందరూ రామ్ చరణ్కు శుభాకాంక్షలు చెబుతున్నారు. అందులో కొంత మంది రామ్ చరణ్తో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుని తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అలాంటి అరుదైన ఫోటోలు మీకోసం
కుమారుడు గ్లోబల్ స్టార్గా ఎదగడం..ఆస్కార్ వేదికపైకి వెళ్లడంతో పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. కొడుకుకు ముద్దు పెడుతూ ‘నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది నాన్నా’ అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.
https://twitter.com/KChiruTweets/status/1640209525277102080?s=20
మంచు ఫ్యామిలీలో ట్రోల్స్కు గురి కాని ఒకే ఒక్కడు మంచు మనోజ్. అందరితో కలుపుగోలుగా ఉంటూ వివాదాలకు దాదాపుగా దూరంగా ఉంటాడు. మోహన్ బాబు, చిరంజీవి మధ్య విబేధాలు ఉన్నట్లు చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. కానీ మనోజ్ మాత్రం…రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ మిత్రమా రియల్లీ సూపర్ డూపర్ హ్యాపీ బర్త్డే అంటూ రామ్ చరణ్తో ఉన్న ఫోటోను పంచుకున్నాడు.
https://twitter.com/HeroManoj1/status/1640258933918171136?s=20
బాలివుడ్ అందగాడు వివేక్ ఒబెరాయ్ తెలుగులోనూ పలు సినిమాల్లో నటించాడు. క్రిష్, రక్త చరిత్ర వంటి సినిమాలతో అందరికీ సుపరిచితుడు. రామ్ చరణ్తో కలిసి వినయ విధేయ రామలో నటించిన వివేక్ ఒబెరాయ్ అప్పుడు తనతో దిగిన ఫోటోను పంచుకున్నారు.
https://twitter.com/vivekoberoi/status/1640253518471913472?s=20
విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, KTR, రామ్ చరణ్తో కలిసి ఉన్న ఓ అరుదైన ఫోటోతో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.
https://twitter.com/Ganta_Srinivasa/status/1640229869257887744?s=20
మెగా ఫ్యామిలీలో హాలివుడ్ కటౌట్ ఉన్న హీరో వరుణ్ తేజ్. చిన్నప్పటి నుంచి చరణ్తో కలిసి పెరిగిన వారే. ఇక ‘ఆట మొదలైంది’ అంటూ వరుణ్ తేజ్, రామ్చరణ్తో ఉన్న ఫోటోను పంచుకున్నాడు.
https://twitter.com/IAmVarunTej/status/1640261128071835648?s=20
RRR సినిమా తెర వెనక పనిచేసిన వారిలో రాజమౌళి తనయుడు కార్తికేయ ఒకరు. కార్తికేయ గురించి సినిమా ప్రమోషన్లలోనూ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎన్నో విషయాలు పంచుకున్నారు. వీరి మధ్య మంచి బంధం కూడా ఉంది. ‘బ్రదర్ ఫ్రం అనదర్ మదర్’ అంటూ కార్తికేయ RRR సెట్లోని ఫోటో షేర్ చేశారు.
https://twitter.com/ssk1122/status/1640258402285924354?s=20
రామ్ చరణ్తో రచ్చ సినిమా చేసిన సంపత్ నంది బ్రహ్మానందంతో కలిసి ఉన్న ఓ అపురూప చిత్రాన్ని పంచుకున్నారు.
https://twitter.com/IamSampathNandi/status/1640230847315087361?s=20
యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా రామ్ చరణ్తో ఉన్న ఫోటోను పంచుకుని శుభాకాంక్షలు చెప్పాడు. ప్రస్తుతం ఈ దర్శకుడి నుంచి ‘హనుమాన్’ అనే ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.
https://twitter.com/PrasanthVarma/status/1640193538393804801?s=20
కియారా అద్వానీ, శంకర్ సహా ‘గేమ్ చేంజర్’ టీం రామ్ చరణ్కు కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు చెప్పింది. ఈ ఫోటోలతో కియారా కూడా ట్రెండింగ్లోకి వెళ్లిపోయింది.
https://twitter.com/NP_App/status/1640266153653317632?s=20
మార్చి 28 , 2023