అయేషా ఖాన్
అయేషా ఖాన్.. టాలీవుడ్కు చెందిన ప్రముఖ నటి. మహారాష్ట్రలోని ముంబయిలో పుట్టిన అయేషా.. తెలుగులో వచ్చిన ముఖచిత్రం (2022) ద్వారా తెరంగేట్రం చేసింది. సినిమాల్లోకి రాకముందు ఆమె మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్లెయన్సర్గా గుర్తింపు పొందింది. హిందీ బిగ్బాస్లో పాల్గొని చాలా ఫేమస్ అయ్యింది. తద్వారా హిందీలో 'కసౌతి జిందగీ కే', 'బల్వీర్ రిటర్న్స్' సీరియల్స్లో చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం టాలీవుడ్లో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘లక్కీ భాస్కర్’ చిత్రాల్లో అయేషా చేస్తోంది.