

ధనుష్ వయసు ఎంత?
ధనుష్ ముద్దు పేరు ఏంటి?
ధనుష్ ఎత్తు ఎంత?
ధనుష్ అభిరుచులు ఏంటి?
ధనుష్ ఏం చదువుకున్నారు?
ధనుష్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
ధనుష్ రిలేషన్లో ఉంది ఎవరు?
ధనుష్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?
ధనుష్ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?
ధనుష్ In Sun Glasses
ధనుష్ With Pet Dogs
ధనుష్ అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్


- Nayanthara: ధనుష్తో వివాదం.. చిరు, రామ్చరణ్ను ఆకాశానికెత్తిన నయనతార! తమిళ హీరోయిన్ నయనతార (Nayanthara) లేడీ సూపర్స్టార్గా గుర్తింపు సంపాదించింది. తెలుగు, తమిళం, హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఆమె జీవితంపై రూపొందిన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond the Fairy Tale) డాక్యుమెంటరీ ఇటీవల నెట్ఫ్లిక్స్లోకి వచ్చింది. అయితే ఈ డాక్యుమెంటరీకి సంబంధించి తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush)పై ఇటీవల నయన్ తీవ్ర విమర్శలు చేసింది. అది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా అదే డాక్యుమెంటరీకి సంబంధించి టాలీవుడ్ స్టార్ హీరోలు, తండ్రి కొడుకులైన మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్చరణ్లపై ప్రశంసల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈ అంశం సినీ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది. ‘వారంటే నాకెంతో గౌరవం’ లేడీ సూపర్ స్టార్కు సంబంధించిన 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' (Nayanthara: Beyond the Fairy Tale) నవంబర్ 18న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు వచ్చింది. ఈ డాక్యుమెంటరీ రూపకల్పనకు, తన 20 ఏళ్ల సినీ కెరీర్లో సపోర్ట్గా నిలిచిన వారికి తాజాగా నాయనతార ధన్యవాదాలు తెలిపారు. చిరంజీవి (Chiranjeevi), రామ్చరణ్ (Ram Charan) ప్రత్యేక థ్యాంక్స్ చెప్పారు. అటు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) పేరును సైతం ప్రస్తావిస్తూ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. వీరితో పాటు షారుక్ భార్య గౌరీ ఖాన్, తెలుగు, మలయాళ, తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల పేర్లను ప్రస్తావించారు. తన డాక్యుమెంటరీ కోసం వారిని సంప్రదించినప్పుడు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని నయన్ అన్నారు. నిర్మాతలు వారి వద్దకు వెళ్లినప్పుడు చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారని తెలిపారు. వారందరికీ తన హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. వీరంతా అత్యంత విలువైన క్షణాలను అందించారని కొనియాడారు. వీరిందరిపై తనకెంతో గౌరవం ఉందని నయన్ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఇన్స్టా పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) ధనుష్తో గొడవ ఎందుకుంటే? 2015లో నయనతార (Nayanthara) చేసిన 'నానుమ్ రౌడీ' (తెలుగులో నేను రౌడీనే) చిత్రానికి ఆమె భర్త విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ధనుష్ (Dhanush) నిర్మాత. 'నానుమ్ రౌడీ'తో నయన్కు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. నటిగా మంచి పేరు రావడంతో పాటు ఎంతో విలువైన ప్రేమ సైతం ఆ సినిమా ద్వారానే దక్కింది. ఈ నేపథ్యంలో తన ‘బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond the Fairy Tale)ను హైలెట్ చేయాలని నయనతార భావించింది. ఆ సినిమాకు సంబంధించిన కంటెంట్ను వినియోగించుకునేందుకు ధనుష్ అనుమతి కోరింది. అయితే రెండేళ్ల నుంచి ధనుష్ను అడుగుతున్నా ఆయన స్పందించకపోవడం, పైగా డాక్యుమెంటరీ ప్రోమోలో 3 సెకన్ల 'నానుమ్ రౌడీ దాన్' కంటెంట్ను వాడటంపై ధనుష్ లీగల్ నోటీసులు పంపడం నయనతారను తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి. దీంతో ధనుష్ను విమర్శిస్తూ బహిరంగ లేఖ రాసింది. ధనుష్ చర్యలతో తన హృదయం ముక్కలైందని పేర్కొంది. మీ మంచి తనాన్ని మాటల్లోనే కాకుండా చేతల్లోనూ చూపించాలని మండిపడింది. https://twitter.com/NayantharaU/status/1857680582773551362 నయనతారకు మద్దతుగా మహేష్! ధనుష్ - నయనతార మధ్య వివాదానికి కారణమైన డాక్యుమెంటరీ (Nayanthara: Beyond the Fairy Tale)పై సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఇటీవల స్పందించాడు. డాక్యుమెంటరీ చూసిన మహేష్ అందులో నయన్ - విఘేష్ లవ్ ఎపిసోడ్ చూసి చాలా ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా నయన్, విఘ్నేష్, ఇద్దరు పిల్లలతో ఉన్న డాక్యుమెంటరీ పోస్టర్ను మహేష్ ఇన్స్టా స్టేటస్గా పెట్టాడు. మూడు లవ్ సింబల్స్ను దానికి జత చేశాడు. ఇది ఒక్కసారిగా నెట్టింట వైరల్గా మారింది. ధనుష్ - నయనతార (Nayanthara Vs Dhanush) మధ్య వివాదం కొనసాగుతున్న వేళ మహేష్ రియాక్షన్ చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే నయనతార- మహేష్ బాబు కాంబోలో ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా రాలేదు. వీరి జోడిని తెరపై చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో ఆశపడ్డారు. మరి భవిష్యత్లోనైనా వారి కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి. https://twitter.com/GulteOfficial/status/1858556384079761643 దూకుడు ప్రదర్శిస్తున్న లేడీ సూపర్ స్టార్! ప్రస్తుతం ఫిల్మ్ కెరీర్ పరంగా నయనతార దూసుకుపోతోంది. గతేడాది షారుక్ ఖాన్తో 'జవాన్' చిత్రం చేసి తొలిసారి రూ.1000 కోట్ల క్లబ్లో ఈ అమ్మడు అడుగుపెట్టింది. అదే ఏడాది 'అన్నపూర్ణి'గా లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్లో కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఐదు క్రేజీ ప్రాజెక్ట్స్లో నటిస్తూ ఈ లేడీ సూపర్స్టార్ బిజీ బిజీగా ఉంది. తమిళంలో 'టెస్ట్', 'మన్నన్గట్టి సిన్స్ 1960', 'తని ఓరువన్ 2', 'ముకుతి అమ్మన్ 2' సినిమాల్లో నటిస్తోంది. అలాగే మలయాళంలో ‘డియర్ స్టూడెంట్స్’ అనే చిత్రం చేస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రాలన్ని చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ ఏడాది చివర, వచ్చే సంవత్సరంలో అవి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇదిలా ఉంటే 2022లో డైరెక్టర్ విఘ్నేశ్ను పెద్దల సమక్షంలో నయన్ వివాహం చేసుకుంది. వీరికి సరోగసి విధానంలో పుట్టిన ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. నవంబర్ 21 , 2024
- HBD Priyanka Mohan: ‘నన్ను తీసుకొని తొందరపడ్డారేమో’.. నేరుగా డైరెక్టర్నే అడిగేసిన ప్రియాంక మోహన్!దక్షిణాదికి చెందిన ప్రముఖ హీరోయిన్లలో ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఒకరు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు పడిన ఆమె ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. సూర్య, ధనుష్, నాని, శివ కార్తికేయన్, జయం రవి వంటి స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం పవన్ పక్కన 'ఓజీ' సినిమాలో నటిస్తూ అందరి కళ్లు తనవైపు తిప్పుకుంది. కాగా, ఇవాళ ప్రియాంక మోహన్ పుట్టిన రోజు (HBD Priyanka Mohan). 29వ సంవత్సరంలోకి ఈ అమ్మడు పెట్టింది. ఈ సందర్భంగా ఆమె కెరీర్లోని ఆసక్తికర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1995 నవంబర్ 20న కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రియాంక మోహన్ (HBD Priyanka Mohan) జన్మించింది. ఆమె అక్కడే విధ్యాబ్యాసం చేసింది. బయలాజికల్ ఇంజనీర్గా పట్టా అందుకుంది. ప్రియాంక అమ్మ కన్నడిగ కాగా ఆమె తండ్రిది తమిళ నేపథ్యం. దీంతో కన్నడతో పాటు తమిళ భాషపైనా ప్రియాంకకు పట్టు వచ్చింది. ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే ప్రియాంక పలు నాటకాలు వేసింది. ఆ సమయంలోనే రెండు, మూడు ప్రకటనల్లోనూ నటించింది. ఆ సమయంలోనే ఫ్రెండ్స్ అంతా కలిసి డబ్బులు వేసుకొని మరి తనతో సినిమా తీసేందుకు సిద్ధమయ్యారని ప్రియాంక ఓ ఇంటర్వూలో రివీల్ చేసింది. అలా చేసిన తన ఫస్ట్ కన్నడ సినిమా 'ఒందు కథే హెళ్లా' అని ప్రియాంక (HBD Priyanka Mohan) స్పష్టం చేసింది. అయితే ఈ సినిమా చేస్తున్న సంగతి ఇంట్లో అస్సలు చెప్పలేదట. రిలీజయ్యాక అందులో ప్రియాంకను చూసి కుటుంబ సభ్యులు చాలా షాకయ్యారట. కానీ ఒక్క మాట కూడా అనలేదని, పైగా ప్రోత్సహించారని ప్రియాంక చెప్పింది. నటనపై ఆసక్తి ఉనప్పటికీ సినిమాల్లోకి రావాలని ప్రియాంక ఎప్పుడు అనుకోలేదట. మంచి ఉద్యోగంలో స్థిరపడాలని కలలు కన్నదట. ఇండస్ట్రీలోకి రాకపోయుంటే ఈపాటికి మంచి కార్పోరేట్ సంస్థలో పని చేస్తూ ఉండేదానిని ప్రియాంక (HBD Priyanka Mohan) చెప్పింది. నాని 'గ్యాంగ్ లీడర్స్' సినిమాతోనే ప్రియాంక తెలుగు తెరపై అడుగుపెట్టింది. తొలి రోజు షూటింగ్లో లక్ష్మీ, శరణ్య వంటి దిగ్గజ నటులను చూసి ప్రియాంక చాలా టెన్షన్కు గురైందట. పెద్ద నటులతో చేసేంత అర్హత తనకు ఉందా అని ఆలోచించిందట. వెంటనే దర్శకుడు విక్రమ్ వద్దకు వెళ్లి 'బాగా ఆలోచించే నన్ను తీసుకున్నారా.. తొందరపడ్డారేమో' అని అనేసినట్లు ప్రియాంక తెలిపింది. చిన్నప్పటి నుంచి ప్రియాంకకు సూర్య అంటే చాలా ఇష్టం. హీరో సూర్యతో కలిసి 'ఈటీ'లో నటించే ఛాన్స్ రావడంతో ఎంతో సంతోషించినట్లు ఈ అమ్మడు తెలిపింది. షూటింగ్ పూర్తయ్యాక సూర్య గిఫ్ట్ పంపిస్తే దానిని ఇన్స్టాలో పోస్టు చేసి మరి ఈ భామ మురిసిపోయింది. ప్రియాంక చాలా మృధుస్వభావి. ఎక్కడకు వెళ్లినా చాలా తక్కువగా మాట్లాడతారు. దీని వల్ల ఆమెకు స్నేహితులు కూడా చాలా తక్కువ మందే ఉన్నారు. హీరోయిన్లు నిత్యా మీనన్, అనుష్క, నజ్రియా అంటే ప్రియాంకకు ఎంతో అభిమానం. వారి నటన తనకు ఎంతో ఇష్టమని పలు సందర్భాల్లో ప్రియాంక చెప్పింది. సాధారణంగా షూటింగ్ గ్యాప్ దొరికితే ఏ హీరోయిన్ అయినా వెంటనే విహారానికి వెళ్లిపోతారు. కానీ ప్రియాంక (HBD Priyanka Mohan) అలా కాదు. తీరిక సమయాల్లో ఇంట్లోనే హాయిగా విశ్రాంతి తీసుకుంటుందట. లేదంటే నచ్చిన పనులు చేస్తూ ఫ్రీ టైమ్ను పూర్తిగా ఆస్వాదిస్తుందంట. అప్పుడప్పుడు విహారయాత్రకు వెళ్తుంది. పొద్దున్నే లేవాలంటే ప్రియాంకకు చాలా కష్టంగా ఉంటుందట. కెరీర్ తొలినాళ్లలో వ్యాయమం చేయడానికి కూడా చాలా బద్దకించేదానినని ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక చెప్పింది. View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) చికెన్ వంటకాలను ప్రియాంక (HBD Priyanka Mohan) బాగా చేస్తుందట. ఏ టైప్ చికెన్ డిష్ కావాలన్న చాలా రుచికరంగా చేసేస్తానని ఓ సందర్భంలో ఈ అమ్మడు తెలిపింది. ఇక పొద్దున్నే కప్పు కాఫీ పడాల్సిందేనని ఈ అమ్మడు (HBD Priyanka Mohan) చెప్పింది. కాఫీ లేకుండా తన డే అస్సలు స్టార్ట్ కాదని చెపుకొచ్చింది. తెర వెనుక తాను ఎలా ఉంటుందో సినిమాల్లోనూ అలాగే ఉండేందుకు ఈ అమ్మడు ప్రయత్నిస్తోంది. స్కిన్షోలకు దూరంగా సంప్రదాయ పాత్రలకే ప్రాధాన్యం ఇస్తోంది. తెలుగులో ఇప్పటివరకూ ‘గ్యాంగ్ లీడర్’తో పాటు ‘శ్రీకరం’, రీసెంట్గా ‘సరిపోదా శనివారం’ చిత్రాలు చేసింది. ప్రస్తుతం పవన్తో 'ఓజీ'లో నటిస్తోంది. అటు తమిళంలో శివకార్తికేయన్తో చేసిన 'డాక్టర్', 'డాన్'.. ధనుష్తో చేసిన ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రాలు తెలుగులోనూ డబ్ అయ్యాయి.నవంబర్ 20 , 2024
- Nayanthara: ‘మీరు చేసిన పనికి నా హృదయం ముక్కలైంది’.. ధనుష్పై నయనతార ఫైర్తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి నయనతార (Nayanthara) లేడీ సూపర్స్టార్గా గుర్తింపు సంపాదించింది. తెలుగు, తమిళం, హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఆమె జీవితంపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీని సైతం రూపొందిస్తుండటం విశేషం. అయితే ఈ డాక్యుమెంటరీకి కోలీవుడ్ స్టార్ ధనుష్ సమస్యలు సృష్టించినట్లు తెలుస్తోంది. ధనుష్ వల్లే డాక్యుమెంటరీ రిలీజ్ ఆలస్యమవుతోందని టాక్ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ధనుష్కు ఓ బహిరంగ లేఖ రాసిన నయనతార అందులో అతడిపై విరుచుకుపడింది. ఈ వ్యవహారం కోలీవుడ్ సహా భారతీయ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది. అసలేం జరిగిందంటే? 2015లో నయనతార చేసిన 'నానుమ్ రౌడీ' (తెలుగులో నేను రౌడీనే) చిత్రానికి ఆమె భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నటిగా ఆమెకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమాను అప్పట్లో ధనుష్ నిర్మించడం గమనార్హం. ప్రస్తుతం రూపొందుతున్న నయనతార డాక్యూమెంటరీ ‘బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond the Fairy Tale)లో 'నానుమ్ రౌడీ దాన్' పాటలు, ఫొటోలు, వీడియోలను వినియోగించుకోవాలని నయనతార చాలా ఆశపడింది. ఇందుకోసం ధనుష్కు పలుమార్లు విజ్ఞప్తులు పంపినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు ధనుష్ ససేమీరా అన్నారట. దీంతో కెరీర్లో ఎంతో కీలకమైన సినిమాను తన డాక్యూమెంటరీలో చూపించలేకపోతుండటంతో నయనతార కోపం కట్టలు తెచ్చుకుంది. ధనుష్ను ఏకిపారేస్తూ బహిరంగ లేఖ రాసింది. ‘నా హృదయాన్ని ముక్కలు చేశారు’ నటుడు ధనుష్ (Nayanthara Vs Dhanush)పై రాసిన బహిరంగ లేఖలో నటి నయనతార బహిరంగ విమర్శలు చేశారు. ముఖ్యంగా 'నానుమ్ రౌడీ దాన్' పాటలు వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం నేను మాత్రమే కాదు సినీప్రియులు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మా జీవితంలో ఎంతో ముఖ్యమైన ‘నానుమ్ రౌడీ దాన్’ మాత్రం ఇందులో భాగం కాకపోవడం చాలా బాధాకరం. ఎన్వోసీ (NOC) కోసం దాదాపు రెండేళ్ల నుంచి మీతో ఫైట్ చేస్తున్నాం. మీరు పర్మిషన్ ఇవ్వకపోవడం నా హృదయాన్ని ముక్కలు చేసింది. డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసిన వెంటనే మీరు పంపించిన లీగల్ నోటీస్ నన్ను షాక్కు గురిచేసింది. అందులో మూడు సెకన్ల క్లిప్స్ వాడుకున్నందుకు దాదాపు రూ.10 కోట్లు డిమాండ్ చేయడం విచారకరం. ఇక్కడే మీ క్యారెక్టర్ ఏమిటనేది తెలిసిపోతుంది. దేవుడే దీనికి సమాధానం చెబుతాడు’ అని రాసుకొచ్చింది. https://twitter.com/NayantharaU/status/1857680582773551362 ‘ఆసూయ పడకండి’ 'నానుమ్ రౌడీ' సినిమాను (Nayanthara Vs Dhanush) ప్రస్తావిస్తూ మరిన్ని విషయాలను లేఖలో నయన్ పంచుకుంది. ‘సినిమా విజయం సాధించిన తర్వాత మీ అహం బాగా దెబ్బతిందని సినీవర్గాల నుంచి తెలుసుకున్నా. ఈ లేఖతో నేను ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నా. తెలిసిన వారు విజయాలు అందుకుంటే అసూయ పడకుండా దానిని కూడా సంతోషంగా తీసుకోండి. ఈ ప్రపంచం అందరిది. ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేని సాధారణ వ్యక్తులు ఇండస్ట్రీలో పైకి వచ్చినా తప్పు లేదు. ఈ విషయంలో కొన్ని కట్టుకథలు అల్లి, పంచ్ డైలాగులు చేర్చి తదుపరి ఆడియో విడుదలలో మీరు మాట్లాడవచ్చు. కానీ దేవుడు చూస్తున్నాడు. ఇతరుల స్టోరీల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చనే ఉద్దేశంతో మా కథను డాక్యుమెంటరీగా రూపొందించాం. మీరు కూడా దీనిని చూడండి. మీ మంచి తనాన్ని మాటల్లోనే కాకుండా చేతల్లోనూ చూపించాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా’ అని నయనతార పేర్కొంది. నవంబర్ 18న స్ట్రీమింగ్.. నయనతార జీవితాన్ని ఆధారంగా చేసుకొని ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond the Fairy Tale) అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ను నెట్ఫ్లిక్స్ రూపొందించింది. నవంబరు 18న నెట్ఫ్లిక్ వేదికగా ఇది విడుదల కానుంది. ఇటీవల ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ను రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు స్టార్ హీరో నాగార్జునతో పాటు రానా, ఉపేంద్ర, రాధిక, డైరెక్టర్ అట్లీ వంటి వారు నయనతారతో తమకున్న బంధాన్ని, ఆమెపై ఉన్న అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ డాక్యుమెంటరీలో నయనతార ఫిల్మ్ జర్నీతో పాటు డైరెక్టర్ విఘ్నేష్ శివన్తో ఆమె ప్రేమ, పెళ్లి గురించి చూపించనున్నారు. ఇదిలా ఉంటే నయనతార - విఘ్నేష్ కలిసి తొలిసారి ‘నానుమ్ రౌడీ దాన్’ చిత్రానికి పనిచేశారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకున్నారు. డాక్యుమెంటరీలో ఎంతో ముఖ్యమైన ఈ సినిమా విశేషాలు చూపించాలని వీరు భావించగా చిత్ర నిర్మాత అయిన ధనుష్ దానికి అంగీకరించలేదు. ఫుల్ స్వింగ్లో నయనతార ప్రస్తుతం ఫిల్మ్ కెరీర్ పరంగా నయనతార (Nayanthara Vs Dhanush) దూసుకుపోతోంది. గతేడాది షారుక్ ఖాన్తో 'జవాన్' చిత్రం చేసి తొలిసారి రూ.1000 కోట్ల క్లబ్లో ఈ అమ్మడు అడుగుపెట్టింది. అదే ఏడాది 'అన్నపూర్ణి'గా లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్లో కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఐదు క్రేజీ ప్రాజెక్ట్స్లో నటిస్తూ ఈ లేడీ సూపర్స్టార్ బిజీ బిజీగా ఉంది. తమిళంలో 'టెస్ట్', 'మన్నన్గట్టి సిన్స్ 1960', 'తని ఓరువన్ 2', 'ముకుతి అమ్మన్ 2' సినిమాల్లో నటిస్తోంది. అలాగే మలయాళంలో ‘డియర్ స్టూడెంట్స్’ అనే చిత్రం చేస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రాలన్ని చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ ఏడాది చివర, వచ్చే సంవత్సరంలో అవి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇదిలా ఉంటే 2022లో డైరెక్టర్ విఘ్నేశ్ను పెద్దల సమక్షంలో నయన్ వివాహం చేసుకుంది. వీరికి సరోగసి విధానంలో పుట్టిన ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. నవంబర్ 16 , 2024











.jpeg)

ధనుష్ తల్లిదండ్రులు ఎవరు?
ధనుష్ తల్లిదండ్రులు ఏం చేస్తారు?
ధనుష్ సోదరుడు/సోదరి పేరు ఏంటి?
ధనుష్ పెళ్లి ఎప్పుడు అయింది?
ధనుష్ కు పిల్లలు ఎంత మంది?
ధనుష్ Family Pictures
ధనుష్ ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
ధనుష్ లీడ్ రోల్లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
రూ.100 కోట్ల క్లబ్లో చేరిన ధనుష్ తొలి చిత్రం ఏది?
ధనుష్ కెరీర్లో అత్యత్తుమ పాత్ర ఏది?
ధనుష్ బెస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ వీడియోలు?
ధనుష్ బెస్ట్ డైలాగ్స్ వీడియోలు ఏవి?
ధనుష్ రెమ్యూనరేషన్ ఎంత?
ధనుష్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?
ధనుష్ కు ఇష్టమైన నటుడు ఎవరు?
ధనుష్ కు ఇష్టమైన నటి ఎవరు?
ధనుష్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?
ధనుష్ ఫెవరెట్ సినిమా ఏది?
ధనుష్ ఫేవరేట్ కలర్ ఏంటి?
ధనుష్ ఫేవరేట్ క్రీడ ఏది?
ధనుష్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?
ధనుష్ ఆస్తుల విలువ (నెట్వర్త్) ఎంత?
ధనుష్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
ధనుష్ సోషల్ మీడియా లింక్స్
ధనుష్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?
నేషనల్ అవార్డ్ - 2011
'ఆడుకలం చిత్రానికి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు
నేషనల్ అవార్డ్ - 2019
'అసురన్' చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్గా అవార్డు అందుకున్నాడు
ఫిల్మ్ఫేర్ అవార్డ్ - 2014
'రాంఝనా' చిత్రానికి ఉత్తమ తెరంగేట్ర నటుడిగా హిందీలో అవార్డ్ తీసుకున్నాడు
ఫిల్మ్ఫేర్ అవార్డ్ సౌత్ - 2011
'ఆడుకలం చిత్రానికి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు
ఫిల్మ్ఫేర్ అవార్డ్ సౌత్ - 2012
'3' సినిమాలో పాడిన 'వై దిస్ కొలవరి' పాటకు ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్గా అవార్డు అందుకున్నాడు
ఫిల్మ్ఫేర్ అవార్డ్ సౌత్ - 2013
'మర్యన్' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా క్రిటిక్స్ విభాగంలో అవార్డు అందుకున్నాడు
ఫిల్మ్ఫేర్ అవార్డ్ సౌత్ - 2014
'వేలైయిల్లా పట్టతారి' చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకున్నాడు
ఫిల్మ్ఫేర్ అవార్డ్ సౌత్ - 2018
'వడ చెన్నై' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు
సైమా అవార్డ్స్ - 2011
'ఆడుకలం చిత్రానికి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు
సైమా అవార్డ్స్ - 2012
'3' సినిమాకు గాను ఉత్తమ నటుడిగా అవార్డ్ తీసుకున్నాడు
సైమా అవార్డ్స్ - 2012
'3' సినిమాలో పాడిన 'వై దిస్ కొలవరి' పాటకు ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్గా అవార్డు అందుకున్నాడు
సైమా అవార్డ్స్ - 2013
'మర్యన్' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా క్రిటిక్స్ విభాగంలో అవార్డు అందుకున్నాడు
సైమా అవార్డ్స్ - 2014
'వేలైయిల్లా పట్టతారి' చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకున్నాడు
సైమా అవార్డ్స్ - 2018
'వడ చెన్నై' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు
సైమా అవార్డ్స్ - 2019
'అసురన్' చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్గా అవార్డు అందుకున్నాడు