

కార్తీ
జననం : మే 25 , 1977
ప్రదేశం: మద్రాసు, తమిళనాడు, భారతదేశం
కార్తీక్ శివ కుమార్ తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరో. 1977 మే 25న తమిళ నటుడు శివకుమార్ దంపతులకు జన్మించాడు. 2007లో 'పరుత్తివీరన్' సినిమా ద్వారా సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు సూర్య, శకుని, ఖాకీ, ఖైదీ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలతో స్టార్ హీరోగా మారిపోయాడు. కెరీర్లో ఇప్పటివరకూ 29 చిత్రాలు చేశాడు.
కార్తీ వయసు ఎంత?
కార్తీక్ వయసు 48 సంవత్సరాలు
కార్తీ ముద్దు పేరు ఏంటి?
అసలు పేరు కార్తిక్ శివకుమార్. ముద్దుగా కార్తి అని పిలుస్తారు.
కార్తీ ఎత్తు ఎంత?
5' 10'' (178cm)
కార్తీ అభిరుచులు ఏంటి?
ట్రావెలింగ్, ట్రెక్కింగ్, ప్లేయింగ్ గిటార్
కార్తీ ఏం చదువుకున్నారు?
బీటెక్ (మెకానికల్ ఇంజనీర్)
కార్తీ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
బీ.ఎస్. అబ్దుల్ రెహమాన్ క్రిసెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చెన్నై
కార్తీ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?
కార్తీ In Sun Glasses
కార్తీ Childhood Images
కార్తీ అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్

List of Telugu Horror Movies: మిమ్మల్ని భయపెడుతూ నవ్వించే చిత్రాలు ఇవే!
- Satyadev: ‘జీబ్రాను అలా కానివ్వకండి’.. తెలుగు ఆడియన్స్ను వేడుకున్న సత్యదేవ్ సత్యదేవ్ (Satyadev) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'జీబ్రా' (Zibra). 'పుష్ప'లో జాలిరెడ్డి పాత్రలో ఆకట్టుకున్న కన్నడ ధనంజయ ఇందులో కీలక పాత్ర పోషించాడు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో హీరోయిన్లుగా చేశారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తొలిరోజు మోస్తరు రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ మౌత్ టాక్తో రెండో రోజు నుంచి మంచి ఆదరణ సంపాదించింది. రీసెంట్గా సక్సెస్ మీట్ను సైతం చిత్ర బృందం నిర్వహించింది. ఇదిలాఉంటే నటుడు సత్యదేవ్ ప్రేక్షకులను ఉద్దేశించి తాజాగా బహిరంగ లేఖ రాశారు. గతంలో చేసిన ‘బ్లఫ్ మాస్టర్’ గురించి ప్రస్తావిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సత్యదేవ్ ఏం రాశారంటే? ‘జీజ్రా’ (Zibra) చిత్రానికి వస్తోన్న విశేష ఆదరణ చూసి సత్యదేవ్ (Satyadev) సంతోషం వ్యక్తం చేశాడు. అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో ఓ నోట్ రిలీజ్ చేశాడు. 'ఇది మీరిచ్చిన విజయం. మీరు ఈ సినిమా బాగుందన్నారు. ఇంతకన్నా నాకేం కావాలి. ఇలాంటి హిట్ కోసం 5 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నా. మీకు నచ్చే సినిమా చేయడానికి, మీతో హిట్ కొట్టావ్ అని అనిపించుకోవడానికి ఎంతో ఎదురుచూశాను. నేను హిట్ కొడితే, మీరు ఆనందిస్తున్నారు. నాకెంతో సంతోషంగా ఉంది. బ్లఫ్ మాస్టర్ సినిమాని మీరు థియేటర్లో చూడలేకపోయారు. తర్వాత ఓటీటీ, యూట్యూబ్లో చూసి ఎంతో ఆదరించారు. జీబ్రా విషయంలో అలా జరగకూడదని కోరుకుంటున్నా. దయచేసి ఈ చిత్రాన్ని థియేటర్లో చూడండి. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అని రాసుకొచ్చారు. https://twitter.com/ActorSatyaDev/status/1861276550337073501 ప్రతీ సినిమాకు ఎదురీతే టాలెంట్ ఉన్న సరైన గుర్తింపునకు నోచుకోని హీరోలలో సత్యదేవ్ (Satyadev) ఒకరు. ప్రతీ పాత్రకు 100 శాతం న్యాయం చేసే సత్యదేవ్ జీబ్రాతో తన రాత మారుతుందని భావించారు. పాజిటివ్ టాక్ రావడంతో సంబరపడిపోయాడు. అయితే ఆ ప్రభావం కలెక్షన్స్లో కనిపించకపోవడంతో సత్యదేవ్ కొంత ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి సత్యదేవ్కు కొత్తేమి కాదు. అతడి తొలి ఫిల్మ్ నుంచి ఇదే పరిస్థితిని ఫేస్ చేస్తూ వస్తున్నాడు. హీరోగా తన ఫస్ట్ ఫిల్మ్ 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' కొవిడ్ కారణంగా ఓటీటీలోకి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత చేసిన 'తిమ్మరుసు'పై కూడా కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం పడింది. 50 శాతం మందినే థియేటర్లలోకి అనుమతించడంతో అనుకున్న సక్సెస్ రాలేదు. అనంతరం చేసిన ‘బ్లఫ్ మాస్టర్’ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత చేసిన 'కృష్ణమ్మ' రెండేళ్ల పాటు ఆగిపోయింది. ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చినా వారం వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చేసింది. ‘గాడ్ఫాదర్’లో చిరంజీవికి ప్రతినాయకుడిగా చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో సత్యదేవ్కు అవకాశాలు దక్కలేదు. ఇలా ఎదురుదెబ్బలు తింటూ వస్తోన్న సత్యదేవ్ ‘జీబ్రా’ విషయంలో మళ్లీ రిపీట్ కాకూడదని భావించారు. ఈ నేపథ్యంలో అభిమానులకు థ్యాంక్స్ చెబుతూనే తన సినిమాను ఆదరించాలని రిక్వెస్ట్ చేసుకున్నారు. 'జీబ్రా' నిజంగానే బాగుందా? దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ బ్యాంకింగ్ వ్యవస్థలోని ఆర్థిక నేరాల్ని ఆధారంగా చేసుకొని జీబ్రాను రూపొందించారు. గ్యాంగస్టర్ ప్రపంచంతో స్టోరీని ముడిపెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. బ్యాంక్ ఉద్యోగి సూర్య పాత్రలో సత్యదేవ్ (Satyadev) ఆకట్టుకున్నాడు. తన సెటిల్డ్ నటనతో మెప్పించాడు. రూ.5 కోట్ల ఫ్రాడ్ విషయంలో గ్యాంగ్స్టర్ అయిన విలన్ చేతికి హీరో చిక్కడం, ఆ డబ్బు సంపాదించేందుకు హీరో పడే కష్టాలు ఆకట్టుకుంటాయి. అయితే దేశ రాజకీయాలనే శాసించే అపరకుభేరుడైన విలన్ కేవలం రూ.5 కోట్ల కోసం హీరో వెంటపడటమే కాస్త సిల్లీగా అనిపిస్తుంది. కిక్కిచ్చే మూమెంట్స్ పెద్దగా లేకపోవడం కూడా మైనస్గా మారింది. కథలో కొత్తదనం కోరుకునేవారికి, థ్లిల్లింగ్ సినిమాలను ఇష్టపడేవారికి జీబ్రా తప్పక నచ్చుతుందని చెప్పవచ్చు. స్టోరీ ఏంటంటే? మిడిల్ క్లాస్కు చెందిన సూర్య (సత్యదేవ్) బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్లో రిలేషన్ షిప్ మేనేజర్గా పని చేస్తుంటాడు. తోటి ఉద్యోగిని స్వాతి (ప్రియ భవానీ శంకర్)ని ఇష్టపడతాడు. ఓ రోజు స్వాతి తప్పుడు అకౌంట్కు రూ.4 లక్షల డబ్బును ట్రాన్ఫర్ చేస్తుంది. సదరు వ్యక్తిని సంప్రదించగా డబ్బు వాడేసుకున్నట్లు చెబుతాడు. దీంతో ఆ సమస్య నుంచి స్వాతిని కాపాడేందుకు సూర్య రంగంలోకి దిగుతాడు. సమస్యను పరిష్కరించే క్రమంలో అనుకోకుండా రూ.5 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్లో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలతో రాష్ట్రంలోనే ఎంతో ప్రమాదకారి అయిన ఆది (ధనంజయ్)ని సూర్య ఢీ కొట్టాల్సి వస్తుంది. సూర్య అతడ్ని ఎలా ఎదుర్కొన్నాడు? సూర్య లైఫ్లోకి ఆది ఎలా వచ్చాడు? రూ.5 కోట్ల ఫ్రాడ్ కేసు సూర్యను ఇంకెంత పెద్ద సమస్యలోకి నెట్టివేసింది? ఈ సమస్యల నుంచి చివరికీ బయటపడ్డాడా? లేదా? అన్నది స్టోరీ.నవంబర్ 26 , 2024
- Brahmaji vs Sathyadev: సత్యదేవ్పై బ్రహ్మాజీ అనుచిత వ్యాఖ్యలు.. బెడిసికొట్టిన ప్రమోషన్స్!సత్యదేవ్ (Satyadev) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'జీబ్రా' (Zebra Movie). ‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్’ అన్నది ఉపశీర్షిక. ఈశ్వర్ కార్తీక్ (Eshwar Karthik) దర్శత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 22న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar), జెన్నిఫర్ (Jenniffer) హీరోయిన్లుగా నటిస్తున్నారు. డాలీ ధనంజయ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హాజరై సినిమాపై అంచనాలు పెంచేశారు. తాజాగా హీరో సత్యదేవ్తో ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ఇంటర్వ్యూ చేశారు. ఇందుకు సంబధించిన ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే ఇందులో సత్యదేవ్పై బ్రహ్మాజీ నోరుపారేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రోమోలో ఏముందంటే? బ్రహ్మాజీతో జరిగిన ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోను నటుడు సత్యదేవ్ తన ఎక్స్ ఖాతాలో పంచున్నారు. ఇందులో బ్రహ్మాజీ వస్తూనే 'ఈ న్యూసెన్స్ ఏంటి, గోల ఏంటి, అమ్మాయిలు ఏంటీ అని చిరగ్గా ముఖంగా పెట్టి సత్యదేవ్ను అడిగారు. నువ్వు డ్యాన్స్ చేశావా అని ప్రశ్నించగా.. ఏదో హుక్ స్టెప్ వేశాను అని సత్యదేవ్ అంటాడు. 'హుక్కా.. బొక్కా' అల్లు అర్జున్ అయితే డ్యాన్స్ కోసం వెయిట్ చేస్తారు, నీకోసం ఎవరు చూస్తారు అని బ్రహ్మాజీ విసుక్కుంటాడు. జిబ్రా అనగానే థియేటర్లు బద్దలు కొట్టుకొని ప్రేక్షకులు వచ్చేస్తారా అంటు మండిపడ్డాడు. సలార్, కేజీఎఫ్ చిత్రాలకు సంగీతం అందించిన రవి బస్రూర్ జిబ్రాకు వర్క్ చేశారని సత్యదేవ్ చెప్పగానే బ్రహ్మాజీ బిగ్గరగా నవ్వుతాడు. అలా అని పేర్లు వేసేసుకుంటున్నారా? అని ప్రశ్నించాడు. అప్పుడు సత్యదేవ్ నీలాగా పోస్టులు పెట్టి డిలీట్ చేయను అంటూ కౌంటర్ ఇచ్చారు. ప్రోమోను మీరు ఓసారి చూసేయండి. https://twitter.com/i/status/1857340000733720861 మరీ ఓవర్ చేశారా? ప్రస్తుతం తమ సినిమాలను వినూత్నంగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో 'జిబ్రా' టీమ్ ఇలా బ్రహ్మాజీ, సత్యదేవ్ మధ్య వాగ్వాదం జరుగుతున్నట్లు ఇంటర్వ్యూను ప్లాన్ చేసింది. అయితే ఈ ప్లాన్ బెడిసికొట్టినట్లు కనిపిస్తోంది. ఎవరైన సినిమాను ప్రమోట్ చేయడానికి ఇలాంటి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంటారు. కానీ ప్రోమోను పరిశీలిస్తే ప్రతీ దశలోనూ బ్రహ్మాజీ 'జిబ్రా' మూవీని ఏకిపారేయడం చూడవచ్చు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అయినప్పటికీ చూడటానికి కాస్త ఎబ్బెట్టుగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సత్యదేవ్ను చాలా పర్సనల్గా అటాక్ చేసినట్లు అనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్తో పోలుస్తూ నీ స్థాయి ఇంతే అన్నట్లు ఇండైరెక్ట్గా పంచ్లు వేసినట్లు ఉందన్నారు. అలాగే ‘జిబ్రా’ అనేది బ్రహ్మాండమైన సినిమా అనుకోవాలా? జనాలు ఎగబడిపోవాలా? అంటూ చేసిన కామెంట్స్ సినిమాపై నెగిటివిటీని పెంచేలా ఉందని చెబుతున్నారు. https://twitter.com/powerstarp1/status/1857413471135998113 https://twitter.com/ganeshmunju11/status/1857355491401154992 https://twitter.com/Rohit_RC_/status/1857383353298600053 బ్రహ్మాజీ అలా.. చిరు ఇలా 'జిబ్రా' సినిమా రిలీజ్ నేపథ్యంలో మంగళవారం (నవంబర్ 12)న చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించింది. దీనికి హాజరైన మెగాస్టార్ చిరంజీవి ఇందులో హీరోగా చేసిన సత్యదేవ్పై ప్రశంసలు కురిపించాడు. తనకు మూడో తమ్ముడు అంటూ ఆకాశానికి ఎత్తాడు. కల్మషం లేని స్వచ్ఛమైన ప్రేమ, నిజాయితీ, నిజమైన ఎమోషన్ అతడిలో ఉన్నాయని చెప్పారు. మంచి నటుడు అయినప్పటికీ సరైన సినిమాలు పడదలేన్నారు. అందుకే తన 'గాడ్ ఫాదర్' సినిమాకు రిఫర్ చేసినట్లు చెప్పారు. అతడి చేసిన 'జిబ్రా' సూపర్ హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పాడు. https://twitter.com/i/status/1856606401709162891నవంబర్ 16 , 2024
- Rahasyam Idham Jagath Review: తెలుగు ఫస్ట్ మల్టీ యూనివర్స్ ఫిల్మ్.. ‘రహస్యం ఇదం జగత్’ మెప్పించిందా?నటీనటులు: రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం, కార్తీక్ ఖండాల, ఆది నాయుడు, శివ జుటూరి తదితరులు డైరెక్టర్ : కోమల్ ఆర్. భరద్వాజ్ సంగీతం: గ్యానీ సినిమాటోగ్రాఫర్ : టేలర్ బ్లూమెల్ ఎడిటిర్: ఛోటా కె. ప్రసాద్ నిర్మాత: హిరణ్య, పద్మ, కోమల్ ఆర్. భరద్వాజ్ విడుదల తేదీ: నవంబర్ 8, 2024 రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం, కార్తీక్ పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘రహస్యం ఇదం జగత్’ (Rahasyam Idham Jagath Review). సింగిల్ సెల్ యూనివర్స్ ప్రొడక్షన్ బ్యానర్పై పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల నిర్మాణంలో కోమల్ ఆర్ భరద్వాజ్ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా నేడు (నవంబర్ 8)న థియేటర్స్లోకి వచ్చింది. టైం ట్రావెల్, మల్టీ యూనివర్స్ కథాంశాలతో ఈ సినిమాని తెరకెక్కించారని ప్రమోషన్స్లో ప్రచారం చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఈ రివ్యూలో చూద్దాం. కథేంటి కథ అమెరికా (Rahasyam Idham Jagath Review)లో జరుగుతుంటుంది. అకీరా (స్రవంతి), ఆమె లవర్ అభి (రాకేష్) ఇండియా వెళ్లాలని ఫిక్స్ అవుతారు. వెళ్లేముందు పాత ఫ్రెండ్స్ (విశ్వ, కల్యాణ్, అరు)తో ఓ ట్రిప్కు వెళ్తారు. అలా ఓ అడవిలో ఉండే చిన్న ఊరుకు వెళ్తారు. అక్కడికి అకీరా మాజీ లవర్ విశ్వ కూడా వస్తాడు. మంచు కారణంగా బుక్ చేసుకున్న హోటల్లోనే వారంత రాత్రి స్టే చేయాల్సి వస్తుంది. అకీరా స్నేహితుల్లో ఒకరైన సైంటిస్ట్ అరు మల్టీ యూనివర్స్పై రీసెర్చ్ చేస్తుంటుంది. ఇదిలా ఉంటే ఓ విషయమై గొడవ జరిగి అకీరా, కల్యాణ్ను అభి చంపేస్తాడు. అదే సమయంలో మల్టీ యూనివర్స్కి వెళ్లే దారి తాము ఉన్న ఊళ్లోనే ఉందని అరు చెబుతుంది. దీంతో ఫ్రెండ్స్ను మళ్లీ బ్రతికించడం కోసం అభి మల్టీ యూనివర్స్లోకి తీసుకెళ్లే వామ్ హోల్ కోసం అన్వేషణ ప్రారంభిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వామ్ హోల్ను అభి కనిపెట్టాడా? ఫ్రెండ్స్ను బతికించుకున్నాడా? అభి, అకీరా ఇండియాకు వెళ్లారా? లేదా? అన్నది స్టోరీ. ఎవరెలా చేశారంటే గతంలో అనేక సూపర్ హిట్ షార్ట్ ఫిలిమ్స్తో (Rahasyam Idham Jagath Review) మెప్పించిన రాకేష్ ఈ సినిమాలో మెయిన్ లీడ్గా నటించాడు. వామ్ హోల్లోకి ట్రావెల్ చేసే వ్యక్తిగా అదరగొట్టాడు. అకీరా పాత్రలో స్రవంతి మెప్పించింది. సైంటిస్ట్ పాత్రకు అరు బాగా సూట్ అయ్యింది. భార్గవ్ అక్కడక్కడా కామెడీతో మెప్పించాడు. నెగిటివ్ పాత్రలో కార్తీక్ కూడా బాగా చేసాడు. షూటింగ్ మెుత్తం అమెరికాలో జరగడం, అక్కడే నటనలో ట్రైనింగ్ తీసుకోవడంతో హాలీవుడ్ చిత్రాల ప్రభావం నటీనటుల్లో స్పష్టంగా కనిపించింది. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు నటించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు కోమల్ ఆర్. భరద్వాజ్ హాలీవుడ్ చిత్రాలైన ’ఇన్సెప్షన్’ (Inception), ‘ఇంటర్స్టెల్లార్’ (Interstellar)ను స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమాను రూపొందించినట్లు కనిపిస్తుంది. అయితే ఇక్కడి జనాలకు కనెక్ట్ కావడానికి మన పురణాల్లోని కొన్ని సంఘటనలను ఉదాహరణ చూపించడం ఆకట్టుకుంది. శ్రీ చక్రానికి, మల్టీ యూనివర్స్కు దారితీసే వామ్ హోల్తో లింకప్ చేసిన విధానం ఆసక్తి రేపుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఫ్రెండ్స్ ట్రిప్, అక్కడ వారి మధ్య గొడవలు చూపించిన దర్శకుడు ఇంటర్వెల్కు ముందు మల్టీయూనివర్స్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సెకండ్ హాఫ్లో వామ్ హోల్ కోసం అభి అన్వేషణ, దాని ద్వారా టైం ట్రావెల్ చేసి ఫ్రెండ్స్ను కాపాడటం చూపించారు. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అమెరికన్ ఆర్టిస్టులు ఎక్కువగా ఉండటం, కొన్ని సీన్లపై హాలీవుడ్ చిత్రాల ప్రభావం, డైలాగ్స్ మన నేటివిటీకి దూరంగా ఉండటం మైనస్లుగా నిలిచాయి. టెక్నికల్గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే (Rahasyam Idham Jagath Review) సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఫారెస్ట్ లొకేషన్స్ను చాలా అద్భుతంగా చిత్రీకరించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా చోట్ల డైలాగ్స్ని డామినేట్ చేసే విధంగా ఉంది. పాటలు పర్వాలేదనిపిస్తాయి. డబ్బింగ్ కూడా ఇంకొంచెం పర్ఫెక్ట్గా చెప్పిస్తే బెటర్గా ఉండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ మల్టీ యూనివర్స్ కథపురాణాలతో లింకప్సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్ హాలీవుడ్ చిత్రాల ప్రభావంఫస్టాఫ్కమర్షియల్ హంగులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 2.5/5 నవంబర్ 08 , 2024

Japan Movie Review: దొంగగా ‘కార్తీ’ నటన అదుర్స్.. మరి ‘జపాన్’ హిట్టా? ఫట్టా?
నటీనటులు: కార్తీ, అనూ ఇమ్మాన్యుయేల్, సునీల్, కెఎస్ రవికుమార్, విజయ్ మిల్టన్ తదితరులు
దర్శకత్వం: రాజు మురుగన్
ఛాయాగ్రహణం: ఎస్. రవి వర్మన్
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
నిర్మాతలు: S.R ప్రభు, S.R ప్రకాష్ బాబు
విడుదల తేదీ: నవంబర్ 10, 2023
టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న తమిళ నటుల్లో హీరో కార్తీ (Karthi) ఒకరు. స్టార్ హీరో సూర్య సోదరుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీ.. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించాడు. ఈ నేపథ్యంలోనే కార్తీ నుంచి ఏ సినిమా వచ్చిన తెలుగులో భారీ అంచనాలు ఉంటాయి. ఈ క్రమంలోనే కార్తీ కొత్త సినిమా ‘జపాన్’ (Japan) ఇవాళ (నవంబర్ 10) తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, ప్రమోషనల్ చిత్రాలు సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. మరి దీపావళి కానుకగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? కార్తీ చేసిన కొత్త ప్రయత్నం ఫలించిందా? ఇంతకీ సినిమా హిట్టా? ఫట్టా?. ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ
హైదరాబాద్లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు, ఆభరణాలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అందరూ అనుమానిస్తారు. శ్రీధర్ (సునీల్), భవాని (విజయ్ మిల్టన్) ఇద్దరి నేతృత్వంలోని రెండు బృందాలు జపాన్ కోసం వేట మొదలు పెడతాయి. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్ కోసం గాలిస్తుంటారు. దోచుకున్న డబ్బులతో సినిమాలు తీసిన జపాన్.. స్టార్ హీరోయిన్ సంజు (అనూ ఇమ్మాన్యుయేల్)ను ప్రేమిస్తాడు. ఈ క్రమంలో ఆమెను కలుసుకునేందుకు వెళ్లిన జపాన్ను పోలీసులు పట్టుకుంటారు. అయితే తాను దొంగతనం చేయలేదని చెప్పడంతో పోలీసులు అయోమయంలో పడతారు. జపాన్ కాకపోతే ఆ దొంగతనం చేసింది ఎవరు? ఈ కేసును పోలీసులు ఎలా పరిష్కరించారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
క్యారెక్టర్ కోసం కార్తీ పడిన కష్టం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా జపాన్ యాస పలకడం కోసం ఆయన శ్రమించారు. హెయిర్ స్టైల్, డ్రసింగ్ స్టైల్ ఛేంజ్ చేశారు. కార్తీ యాక్టింగ్ & ఎఫర్ట్స్ వరకు ఎటువంటి లోపం లేదు. తన పాత్ర వరకు ఆయన న్యాయం చేశారు. హీరోయిన్గా అను ఇమ్మాన్యుయేల్ యాక్టింగ్కు పెద్దగా స్కోప్ లేదు. గ్లామర్ సన్నివేశాలకు మాత్రమే ఆమె పరిమితమైంది. ఇక సునీల్ తన నటనతో సూపర్ అనిపించాడు. తన లుక్, గెటప్తోనే సగం మార్కులు కొట్టేశాడు. ఆయన కోసమే అన్నట్లు మధ్యలో కామెడీ సీన్లు కూడా ఉన్నాయి. భవాని పాత్రలో విజయ్ మిల్టన్ యాక్టింగ్ ఓకే. కెఎస్ రవికుమార్ తదితరులు పాత్రల పరిధి మేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
దర్శకుడు రాజు మురుగన్ ఓ దొంగ చుట్టూ అల్లుకొన్న సింగిల్ పాయింట్ స్టోరీని ఎమోషనల్గా మార్చడంలో విఫలమయ్యారు. జపాన్ క్యారెక్టర్పై పెట్టిన శ్రద్ద కథపై, స్క్రీన్ ప్లే, ఇతర క్యారెక్టర్లపై పెట్టలేదనే విషయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పేలవమైన సన్నివేశాలను, క్లారిటీ లేని క్యారెక్టర్లను సాగదీస్తూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్లు అనిపిస్తుంది. అయితే కార్తీ కోసం రాసుకొన్న డైలాగ్స్, కొన్ని సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి.
సాంకేతికంగా
టెక్నికల్ అంశాల పరంగా చూసినా 'జపాన్' ఆకట్టుకోవడం కష్టం. సినిమాటోగ్రఫీలో డార్క్ థీమ్, లో లైట్ ప్యాట్రన్స్ ఫాలో అయ్యారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతంలో మళ్ళీ వినాలనిపించే పాటలు లేవు. నేపథ్య సంగీతం అంతంతమాత్రంగానే ఉంది. స్క్రీన్ ప్లేలో ట్విస్ట్ అనుకున్నవి ఏవీ వర్కవుట్ కాలేదు. తర్వాత ఏం జరుగుతుందో ఊహించడం పెద్ద కష్టం కాదు. నిర్మాణ విలువలు పర్వాలేదు.
ప్లస్ పాయింట్స్
కార్తీ నటనకామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్
సాగదీత సీన్లుసంగీతంసినిమాటోగ్రఫీ
రేటింగ్: 2.5/5
నవంబర్ 10 , 2023
Karthi - Mahesh Babu: మహేష్ గురించి టాప్ సీక్రెట్ రివీల్ చేసిన కార్తీ.. సర్ప్రైజ్ అయిన ఫ్యాన్స్!
తమిళ స్టార్ హీరో కార్తీకి తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళంలో ఆయన చేసిన చిత్రాలన్నీ దాదాపుగా తెలుగులో రిలీజై మంచి విజయాలను అందుకున్నాయి. రీసెంట్గా వచ్చిన సత్యం సుందరం కూడా తమిళంతో పాటు తెలుగులోనూ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగు భాష, ఇక్కడి ప్రేక్షకులంటే తనకు ఎంతో ఇష్టమని కార్తీ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇదిలాఉంటే సత్యం సుందరం సక్సెస్ మీట్లో భాగంగా నిర్వహించిన ఇంటర్యూలో నటుడు కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటుడు మహేష్ బాబుతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
మహేష్ నా క్లాస్మేట్: కార్తీ
కార్తీ (Karthi), అరవింద స్వామి (Aravinda Swami) ప్రధాన పాత్రల్లో నటించిన ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) చిత్రం శనివారం (సెప్టెంబర్ 28) విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో విజయవాడలో నిర్వహించిన ప్రెస్మీట్లో కార్తీ మాట్లాడారు. సినిమాను సూపర్ హిట్ చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ క్రమంలో ఫ్యూచర్లో మహేష్తో సినిమా చేసే ఛాన్స్ ఉందా? అంటూ రిపోర్టర్ కార్తీని అడిగారు. దీనికి కార్తీ బదులిస్తూ సరైన కథ దొరికితే మహేష్తో తాను సినిమా చేయడానికి రెడీ అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు మహేష్ తాను స్కూల్లో క్లాస్మేట్స్ అంటూ పెద్ద సీక్రెట్ను రివీల్ చేశాడు. దీంతో అక్కడ ఉన్నవారంతా షాకయ్యారు. అటు ఫ్యాన్స్ కూడా కార్తీ మాటలు విని ఆశ్చర్యపోతున్నారు. ఇంతకాలం ఈ విషయం తమకు తెలియలేదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/_VardhanDHFM_/status/1840974122475532541
కథ వినగానే అనుమానించా!
సత్యం సుందరం స్టోరీ వినగానే ఇలాంటి సినిమాను ఈ రోజుల్లో చూస్తారా? అని అనుమానం కలిగిందని కార్తీ (Karthi) పేర్కొన్నారు. కానీ, కొత్త కాన్సెప్ట్తో వస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి రుజువైందని పేర్కొన్నారు. 'తెలుగు ప్రేక్షకులు చాలామంది నాకు ఫోన్ చేశారు. వారు సినిమా చూసి చాలా ఎమోషనల్గా ఫీలవ్వడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మంచి సినిమా కమర్షియల్గా కూడా విజయం సాధిస్తే నిర్మాతలకు కూడా ప్రోత్సాహకంగా ఉంటుంది. ఈ తరహా చిత్రాలు చూస్తే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది' అని కార్తీ చెప్పుకొచ్చారు.
కార్తీకి కథ చెప్పిన రాజమౌళి!
తమిళ స్టార్ హీరో కార్తీ ఇటీవల ఓ ఇంటర్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సత్యం సుందరం’ ప్రమోషన్స్లో భాగంగా డైరెక్టర్ గౌతమ్ మీనన్తో కార్తీ ఇంటర్యూ చేశారు. ఇందులో సూర్య, కార్తీ కలిసి నటించడంపై గౌతమ్ మీనన్ ప్రశ్నించగా గతంలో జరిగిన ఆసక్తికర విషయాన్ని కార్తీ పంచుకున్నాడు. 'నేను కార్తిక్ కలిసి నటిస్తాం. అందుకు తగ్గ స్క్రిప్ట్ రావాలి. గతంలో రాజమౌళి సర్ మాకు ఒక కథ వినిపించారు. అది బాగానే ఉంది కానీ ఆ సినిమా వర్కౌట్ కాలేదు' అని తెలిపాడు. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా నెట్టింట వైరల్ అయ్యాయి. రాజమౌళి చెప్పింది ‘RRR’ అయ్యి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
https://twitter.com/adarshtp_offl/status/1835533193111392319
డిసెంబర్లో ‘SSMB 29’ షూటింగ్!
మహేష్ బాబు హీరోగా రాజమౌళి సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుంచి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని ప్రతీ ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా SSMB29కి సంబంధించిన అధికారిక అప్డేట్ ఉంటుందని సమాచారం. డిసెంబర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మెుదలవుతుందని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. మెుదటి షెడ్యూల్ జర్మనీలో స్టార్ట్ అవుతుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. 18వ శతాబ్దం బ్యాక్డ్రాప్లో అరుదైన గిరిజన తెగల నేపథ్యంలో ఈ సినిమా రూపొందనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన ఉండనున్నట్లు తెలుస్తోంది.
అక్టోబర్ 01 , 2024
SS Rajamouli: సూర్య, కార్తీతోనే తొలుత ‘ఆర్ఆర్ఆర్’ ప్లాన్ చేసిన రాజమౌళి? అదే జరిగి ఉంటే!
భారతీయ చిత్ర పరిశ్రమను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli). ‘బాహుబలి’తో దేశంలోనే టాప్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న ఆయన 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో వరల్డ్ వైడ్గా పాపులర్ అయ్యాడు. ఈ చిత్రంలోని 'నాటు నాటు' పాటకు ఆస్కార్ సైతం సాధించి దేశం నలుమూలల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబుతో 'SSMB29' ప్రపంచస్థాయి చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో రాజమౌళి బిజీగా ఉన్నారు. ఇదిలాంటే దర్శకుడు రాజమౌళి గురించి క్రేజీ వార్త బయటకొచ్చింది. ఆయన గతంలో కోలీవుడ్ స్టార్స్ సూర్య, ఆయన సోదరుడు కార్తీతో సినిమా తీయాలని భావించినట్లు తెలిసింది. అది కూడా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
‘కథ చెప్పారు.. వర్కౌట్ కాలేదు’
తమిళ స్టార్ హీరో కార్తీ తాజాగా ఓ ఇంటర్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నెక్స్ట్ సినిమా ‘సత్యం సుందరం’ ప్రమోషన్స్లో భాగంగా డైరెక్టర్ గౌతమ్ మీనన్తో కార్తీ ఇంటర్యూ చేశారు. ఇందులో సూర్య, కార్తీ కలిసి నటించడంపై గౌతమ్ మీనన్ ప్రశ్నించగా గతంలో జరిగిన ఆసక్తికర విషయాన్ని కార్తీ పంచుకున్నాడు. 'నేను కార్తిక్ కలిసి నటిస్తాం. అందుకు తగ్గ స్క్రిప్ట్ రావాలి. గతంలో రాజమౌళి సర్ మాకు ఒక కథ వినిపించారు. అది బాగానే ఉంది కానీ ఆ సినిమా వర్కౌట్ కాలేదు' అని తెలిపాడు. ఇది విన్న సినీ లవర్స్ ఆశ్చర్యపోతున్నారు. రాజమౌళి కథ చెబితే ఎలా వదులుకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ సినిమా పట్టాలెక్కి ఉంటే సూర్య, కార్తీ రేంజ్ మరోలా ఉండేదని అంచనా వేస్తున్నారు.
https://twitter.com/adarshtp_offl/status/1835533193111392319
‘ఆర్ఆర్ఆర్’ స్టోరీనా!
సూర్య, కార్తీలతో కలిసి రాజమౌళి చేయాలని భావించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ అయి ఉండొచ్చని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్, తారక్ పాత్రల్లో తొలుత సూర్య, కార్తీలను రాజమౌళి ఊహించుకొని ఉంటారని అంచనా వేస్తున్నారు. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ కార్తీ, సూర్య ‘ఆర్ఆర్ఆర్’ చేసి ఉంటే ఈ స్థాయి సక్సెస్ వచ్చేది కాదని తెలుగు ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’లో యాక్షన్, డ్రామాతో పాటు డ్యాన్స్ కూడా హైలెట్గా నిలిచాయని గుర్తుచేస్తున్నారు. చరణ్, తారక్తో పోలిస్తే సూర్య, కార్తీ డ్యాన్స్ పరంగా కాస్త వెనుకంజలోనే ఉంటారని అంటున్నారు.
తారక్కు పోటీగా కార్తీ!
కార్తీ లేటెస్ట్ చిత్రం సత్యం సుందరి రిలీజ్కు సిద్ధమైంది. ఇందులో కార్తీతో పాటు ప్రముఖ నటుడు అరవింద స్వామి ముఖ్య పాత్రలో నటించాడు. ’96’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన ప్రేమ్ కుమార్.సీ (Prem Kumar C) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘దేవర’కు పోటీగా సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్గా ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజవ్వగా అది ఆకట్టుకుంటోంది. ఇక కార్తీ తన నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్ను కూడా తాజాగా అనౌన్స్ చేశాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్లో 'Karthi 29' చిత్రం ఉంటుందని ఆయన ప్రకటించారు. త్వరలోనే ఇతర తారాగాణం, టెక్నికల్ టీమ్ వివరాలు బయటకు రానున్నాయి.
డిసెంబర్లో ‘SSMB 29’ షూటింగ్!
మహేష్ బాబు హీరోగా రాజమౌళి సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుంచి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని ప్రతీ ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా SSMB29కి సంబంధించిన అధికారిక అప్డేట్ ఉంటుందని సమాచారం. డిసెంబర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మెుదలవుతుందని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. మెుదటి షెడ్యూల్ జర్మనీలో స్టార్ట్ అవుతుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. 18వ శతాబ్దం బ్యాక్డ్రాప్లో అరుదైన గిరిజన తెగల నేపథ్యంలో ఈ సినిమా రూపొందనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన ఉండనున్నట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ 17 , 2024
‘అల వైకుంఠపురంలో’ రీమేక్ ఎందుకు వర్కౌట్ కాలేదు..? డిజాస్టర్గా కార్తీక్ ఆర్యన్ ‘షెహ్జాదా’
సౌత్ సినిమాలను హిందీలోకి రీమేక్ చేసే సంప్రదాయం ఇటీవల బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే 2020లో విడుదలైన ‘అల వైకుంఠపురంలో’ సినిమాను ‘షెహ్జాదా’గా రీమేక్ చేశారు. కార్తీక్ ఆర్యన్కి జంటగా కృతి సనన్ నటించింది. రోహిత్ ధవన్ డైరెక్షన్ వహించారు. అయితే, ఫిబ్రవరి 17న విడుదలైన ఈ సినిమా బీ టౌన్ ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. ‘షెహ్జాదా’పై ఎన్నో ఆశలు పెట్టుకున్న చిత్రబృందానికి ప్రేక్షకులు గట్టి షాక్ ఇచ్చారు. అసలు ఈ సినిమా ఎందుకు ఆడలేదు? ‘అల వైకుంఠపురం’ సినిమాకి, ‘షెహ్జాదా’కి మధ్య ప్రధాన తేడా ఏంటో చూద్దాం.
స్టోరీ లైన్, అల్లు అర్జున్ నటన, తమన్ సంగీతం, స్టైలిష్ ఫైట్స్,డ్యాన్స్ కొరియోగ్రఫీ త్రివిక్రమ్ మార్క్ టేకింగ్.. ‘అల వైకుంఠపురం’ సినిమా భారీ విజయం సాధించడానికి ప్రధాన కారణాలు. ‘నాన్ బాహుబలి’ కేటగిరీలో అత్యధిక వసూళ్లను సాధించి ‘అల వైకుంఠపురంలో’ సినిమా రికార్డులు బ్రేక్ చేసింది. అంతటి విజయవంతమైన సినిమాను రీమేక్ చేయగా కనీస స్పందన రాకపోవడం నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అయితే, ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో పోలిస్తే ‘షెహ్జాదా’లో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. వీటి వల్ల మాతృక సినిమా కలిగించిన అనుభూతిని షెహ్జాదా కల్పించలేక పోయింది.
స్టోరీ లైన్లో మార్పు..
ఒరిజినల్ సినిమాలో బంటు(అల్లు అర్జున్) వాల్మీకి(మురళీ కృష్ణ) కుమారుడిగా పెరుగుతాడు. వాల్మీకి భార్య(రోహిణి) పాత్ర ఇందులో కీలకం. తల్లిగా తన మాతృత్వాన్ని ప్రదర్శించింది. అయితే, ‘షెహ్జాదా’లో వాల్మీకి భార్య పాత్రని చంపేశారు. తద్వారా హీరోకి వాల్మీకి కుటుంబాన్ని వదిలించుకోవడానికి మార్గం సులువు చేశారు. ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో పెంచిన తల్లికి ప్రాధాన్యమివ్వాలా? జన్మనిచ్చిన అమ్మ వైపు మొగ్గు చూపాలా? అనే విషయాన్ని బంటు విచక్షణకే వదిలేశారు. కానీ, షెహ్జాదాలో పెంచిన కుటుంబం నుంచి దూరం కావడానికి హీరోకు బలమైన కారణాన్ని సృష్టించారు. ఇలా పెంపుడు తల్లి పాత్రను తీసేయడం ప్రేక్షకులకు రుచించలేదు.
‘అల వైకుంఠపురంలో’ రాజ్ మనోహర్(సుశాంత్)కి ప్రేయసిగా నందిని(నివేతా పెత్తురాజ్) పాత్రకి తగిన ప్రాధాన్యత ఉంటుంది. అమూల్య(పూజా హెగ్డే)ని పెళ్లి చేసుకోవడంలో రాజ్ పడే ఇబ్బందికి ఇదే ప్రధాన కారణం. ‘షెహ్జాదా’లో నందిని పాత్రని తీసేశారు. ‘అమూల్య’ని పెళ్లి చేసుకోవడంలో రాజ్ పాత్రకి అభ్యంతరం లేకుండా చేశారు. ఇది కూడా సినిమాకు మైనస్గా నిలిచింది. అంతేగాకకుండా ‘రాజ్ మనోహర్’ పాత్రలో చేసిన మార్పులు ప్రేక్షకులను మెప్పించలేదు.
హీరో క్యారెక్టరైజేషన్..
అల వైకుంఠపురం సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ బాగా ఎలివేట్ అయింది. అమూల్య(పూజా హెగ్డే)ని చిక్కుల్లో నుంచి విడిపించే సమయంలో తన క్యారెక్టర్కు అనుగుణంగా ప్రవర్తిస్తాడు. విలన్లకు కొట్టి బుద్ధి చెబుతాడు. కానీ, ‘షెహ్జాదా’లో ఇదే లోపించింది. ఈ సీన్లో తన క్యారెక్టర్కి విరుద్ధంగా కార్తీక్ ఆర్యన్ ప్రవర్తిస్తాడు. తనదైన శైలిలో కాకుండా సావధానంగా నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఇదే కాస్త అసహజంగా అనిపించింది.
ఫైట్స్ కొరియోగ్రఫీ
ఫైట్ సీన్లను రీక్రియేట్ చేయొచ్చు. కానీ, ఒక హీరో శైలిని రీక్రియేట్ చేయలేం. చెల్లెలి దుపట్టాను ఆకతాయిలు తీసుకెళ్లిన సమయంలో హీరో చేసే ఫైట్, తాతను రక్షించడంలో వచ్చే సీన్, క్లైమాక్స్ ఫైట్లు అల్లు అర్జున్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసినవి. స్టైలిష్గా ఈ సీన్లు సాగుతుంటాయి. ‘షెహ్జాదా’లో కార్తీక్ ఆర్యన్ ఈ సీన్లలో విఫలమయ్యాడు. సీన్లను ఉన్నది ఉన్నట్లుగా కాపీ కొట్టినా, తన పర్ఫార్మెన్స్తో కార్తీక్ ఆర్యన్ కొత్తదనాన్ని తీసుకురాలేక పోయాడు.
పాత్రలు
‘అల వైకుంఠపురంలో’ కనిపించే ప్రతి పాత్రకు నిర్దిష్టమైన ప్రాధాన్యత ఉంటుంది. ‘షెహ్జాదా’లో ఇది లోపించింది. పైగా, బంటు సహోద్యోగుల పాత్రలు శేఖర్(నవదీప్), రవీందర్(రాహుల్ రామకృష్ణ), సునీల్ క్యారెక్టర్లు రీమేక్లో లేవు. బోర్డ్ రూమ్లో జరిగే సన్నివేశం లేదు. ఇలా మార్పులు చేయడంతో ఆ మజాని ప్రేక్షకులు ఆస్వాదించలేకపోయారు. విలన్ పాత్రల్లో కూడా సహజత్వం లోపించినట్లు అనిపించింది.
సంగీతం
‘అల వైకుంఠపురం’ సినిమాకు సంగీతం పెద్ద అసెట్గా నిలిచింది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. బుట్టబొమ్మ, రాములో రాములా, సామజ వరగమన, టైటిల్ సాంగ్, క్లైమాక్స్లో వచ్చే సిత్తరాల సిరపడు, డాడీ సాంగ్.. ఇలా ఆల్బమ్ సూపర్ హిట్ అయింది. షెహ్జాదాలో చెప్పుకోదగ్గ సంగీతం లేదు. ఒకటి రెండు మినహా మిగతావి చప్పగా సాగాయి. ఫలితంగా సంగీత ప్రియులకు నిరాశే మిగిల్చింది. ఓవరాల్గా ‘అల వైకుంఠపురం’ సినిమాతో పోలిస్తే ‘షెహ్జాదా’ ఎక్కడా పోటీ పడలేక పోయింది. ఫలితంగా ‘డిజాస్టర్’ టాక్ని మూటగట్టుకుంది.
అల్లు అర్జున్ మేనియా
షెహ్జాదా సక్సెస్ సాధించకపోవడానికి అల్లు అర్జున్ మేనియా కూడా ఒక కారణమే. గతంతో పోలిస్తే దక్షిణాది సినిమాల పరిధి పెరిగింది. ‘అల వైకుంఠపురం’ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ‘పుష్ప’తో పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. దీంతో బీ టౌన్ ప్రేక్షకులు బన్నీ మునపటి సినిమాలను వీక్షించారు. ఇది కూడా ‘షెహ్జాదా’కు మైనస్గా మారింది.
రీమేక్లు వర్కౌట్ అవుతాయా?
గతేడాది ఐదు దక్షిణాది సినిమాలు హిందీలో రీమేక్ అయ్యాయి. ఇందులో హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ల ‘విక్రమ్ వేధ’, అక్షయ్ కుమార్ ‘కట్పుట్లి’ సినిమాలు ఆశించిన మేర కలెక్షన్లు సాధించలేదు. ఇక జాన్వీ కపూర్ ‘మిలీ’, రాజ్కుమార్ ‘హిట్- ద ఫస్ట్ కేస్’, రాధిక ఆప్టే ‘ఫోరెన్సిక్’ సినిమాలు బోల్తా కొట్టాయి. తాజాగా ఈ లిస్టులోకి ‘షెహ్జాదా’ చేరింది. దీంతో రీమేక్ సినిమాలు వర్కౌట్ అవుతాయా అన్న సందేహం మొదలైంది. అయితే, అజయ్ దేవ్గన్ ‘దృశ్యం2’ మాత్రం ఘన విజయం సాధించింది. మళయాలంలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కాకపోవడం, హిందీలోకి డబ్ కాకపోవడంతో అజయ్ దేవ్గన్ మూవీ హిట్ అయ్యింది.
దక్షిణాది భాషల సినిమా పరిధి పెరిగింది. ఇక్కడి కథలు బాలీవుడ్ మాస్ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఓటీటీ ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రాంతీయ భాషల్లో విడుదలైన సినిమాలకు సబ్టైటిల్స్ ఇస్తుండటంతో హిందీలోనూ వాటిని చూస్తున్నారు. దీంతో రీమేక్ సినిమాలపై ఆసక్తి కొరవడింది. అయితే, ప్రస్తుతం మరికొన్ని రీమేక్ సినిమాలు సెట్స్పై ఉన్నాయి. సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’(వీరం రీమేక్), అజయ్ దేవ్గన్ భోళా(లోకేష్ కనగరాజ్ ఖైదీ రీమేక్) ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి.
ఫిబ్రవరి 23 , 2023

సత్యం సుందరం
28 సెప్టెంబర్ 2024 న విడుదలైంది

జపాన్
10 నవంబర్ 2023 న విడుదలైంది

మార్క్ ఆంటోనీ
15 సెప్టెంబర్ 2023 న విడుదలైంది

పొన్నియిన్ సెల్వన్: II (PS 2)
28 ఏప్రిల్ 2023 న విడుదలైంది
.jpeg)
సర్దార్
21 అక్టోబర్ 2022 న విడుదలైంది

పొన్నియిన్ సెల్వన్: I (PS 1)
30 సెప్టెంబర్ 2022 న విడుదలైంది
.jpeg)
సుల్తాన్
02 ఏప్రిల్ 2021 న విడుదలైంది
.jpeg)
దొంగ
20 డిసెంబర్ 2019 న విడుదలైంది
.jpeg)
ఖైదీ
25 అక్టోబర్ 2019 న విడుదలైంది
.jpeg)
దేవ్
14 ఫిబ్రవరి 2019 న విడుదలైంది

చిన్నబాబు
13 జూలై 2018 న విడుదలైంది

ఖాకీ
17 నవంబర్ 2017 న విడుదలైంది
కార్తీ తల్లిదండ్రులు ఎవరు?
తమిళనాడులోని చెన్నైలో 25 మే 1977న తమిళ సినీ నటుడు శివకుమార్, లక్ష్మి దంపతులకి కార్తి జన్మించాడు.
కార్తీ తల్లిదండ్రులు ఏం చేస్తారు?
సూర్య తండ్రి శివకుమార్ 250కి పైగా చిత్రాల్లో నటించారు. బుల్లితెరపై వచ్చిన 5 ప్రముఖ సీరియల్స్లో కనిపించారు. శివకుమార్ తన కెరీర్లో మూడు ఫిల్మ్ఫేర్ అవార్డులు, 2 తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులు అందుకున్నారు.
కార్తీ సోదరుడు/సోదరి పేరు ఏంటి?
కార్తీకి తమిళ స్టార్ హీరో సూర్యసోదరుడు అవుతాడు. తమిళంలో అతడు చేసిన చాలా వరకూ చిత్రాలు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. సూర్య 50 పైగా చిత్రాల్లో నటించారు. అలాగే బృందా శివకుమార్ అనే సోదరి కూడా ఉంది.
కార్తీ పెళ్లి ఎప్పుడు అయింది?
2011లో రజిని చిన్నస్వామిని కార్తి పెళ్లి చేసుకున్నారు. ఆమె ఇంగ్లీష్ లిటరేచర్లో మాస్టర్స్ చేశారు.
కార్తీ కు పిల్లలు ఎంత మంది?
కార్తీకి ఒక బాబు, పాప ఉన్నారు. అబ్బాయి పేరు కంధన్, పాప పేరు ఉమయాల్.
కార్తీ Family Pictures
కార్తీ ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
యుగానికి ఒక్కడు' సినిమాతో తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో కార్తీ పాపులర్ అయ్యాడు.
కార్తీ లీడ్ రోల్లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
తమిళ చిత్రం 'పరుత్తివీరన్' (2007)తో కార్తి హీరోగా పరిచయం అయ్యాడు.
తెలుగులో కార్తీ ఫస్ట్ హిట్ మూవీ ఏది?
పరుత్తివీరన్' (2007)
రూ.100 కోట్ల క్లబ్లో చేరిన కార్తీ తొలి చిత్రం ఏది?
కార్తీ కెరీర్లో అత్యత్తుమ పాత్ర ఏది?
కార్తీ బెస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ వీడియోలు?
కార్తీ బెస్ట్ డైలాగ్స్ వీడియోలు ఏవి?
కార్తీ రెమ్యూనరేషన్ ఎంత?
ఒక్కో సినిమాకు రూ.25-28 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.
కార్తీ కు ఇష్టమైన నటుడు ఎవరు?
కార్తీ ఎన్ని భాషలు మాట్లాడగలరు?
తెలుగు, తమిళం, ఇంగ్లీషు
కార్తీ ఫెవరెట్ సినిమా ఏది?
బిల్లా (1980), నాయకన్ (1987)
కార్తీ ఫేవరేట్ కలర్ ఏంటి?
తెలుపు, నలుపు, బ్లూ
కార్తీ ఫేవరేట్ క్రీడ ఏది?
బాడ్మింటన్
కార్తీ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?
థాయిలాండ్
కార్తీ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?
Mercedes Benz ML 350
Audi Q7 SUV
BMW R 1250 GS bike
కార్తీ ఆస్తుల విలువ (నెట్వర్త్) ఎంత?
కార్తి ఆస్తుల విలువ రూ.100 కోట్లు పైనే ఉంటుందని సమాచారం.
కార్తీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
4 మిలియన్లు
కార్తీ సోషల్ మీడియా లింక్స్
కార్తీ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?
ఫిల్మ్ఫేర్ అవార్డ్ - 2007
'పరుత్తివీరన్' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు
ఫిల్మ్ఫేర్ అవార్డ్ - 2014
'మద్రాస్' చిత్రానికి గాను క్రిటిక్స్ విభాగంలో బెస్ట్ యాక్టర్గా అవార్డు అందుకున్నాడు
సైమా అవార్డ్ - 2014
'మద్రాస్' చిత్రానికి గాను క్రిటిక్స్ విభాగంలో బెస్ట్ యాక్టర్గా అవార్డు అందుకున్నాడు
ఫిల్మ్ఫేర్ అవార్డ్ - 2017
'ఖాకీ' చిత్రానికి గాను చిత్రానికి గాను క్రిటిక్స్ విభాగంలో బెస్ట్ యాక్టర్గా అవార్డు అందుకున్నాడు
కార్తీపై ప్రచారంలో ఉన్న రూమర్లు ఏంటి?
హీరోయిన్ తమన్నాతోకార్తి రిలేషన్లో ఉన్నట్లు గతంలో రూమర్లు వచ్చాయి.
కార్తీ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?
మలబార్, ఓరియో బిస్కెట్స్, బ్రూ కాఫీ తదితర వ్యాపార ప్రకటన్లలో కార్తి నటించారు.
కార్తీ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే కార్తీ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్తో ఇక్కడ తెలుసుకోండి.