మమితా బైజు
ప్రదేశం: కిడంగూర్, కొట్టాయం, కేరళ
మలయాళ నటి మమితా బైజు.. కేరళలోని కొట్టాయం జిల్లాలో జన్మించింది. పాఠశాల రోజుల నుంచి మమిత సాంస్కృతి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. దీంతో తొలి చిత్రం 'సర్వోపరి పలక్కరన్' (2017)లో అవకాశం వచ్చింది. తర్వాత ‘హనీ బీ 2: సెలబ్రేషన్స్’, ‘డాకినీ’, ‘స్కూల్ డైరీ’, ‘వికృతి’, ‘కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్’, ‘ఆపరేషన్ జావా’, ‘ఖోఖో’ వంటి విభిన్నతరహా చిత్రాల్లో మమిత నటించింది. రీసెంట్గా 'ప్రేమలు' సినిమాతో ఈ భామ స్టార్గా మారిపోయింది. తన అందం, అభినయంతో యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.