నవీన్ పొలిశెట్టి
ప్రదేశం: హైదరాబాద్, ఆంధ్ర ప్రదేశ్ (ప్రస్తుత తెలంగాణ), భారతదేశం
నవీన్ పొలిశెట్టి తెలుగు సినిమా నటుడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ(2019) చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమాకంటే ముందు నవీన్ అనేక చిత్రాల్లో సహాయ నటుడిగా మెప్పించాడు. లైఫ్ఈజ్ బ్యూటిఫుల్, డి ఫర్ దోపిడీ, నేనొక్కడినే వంటి చిత్రాల్లో నటించాడు. "చిచోర్"(2019) ద్వారా హిందీ సినిమాల్లోకి ప్రవేశించి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. ఈచిత్రంలో 'యాసిడ్' అనే పాత్రలో నటించి హిందీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నాడు. జాతిరత్నాలు(2021) చిత్రం కమర్షియల్గా పెద్ద సక్సెస్ సాధించడంతో నవీన్ పొలిశెట్టి స్టార్ డం సంపాదించాడు. ఈ చిత్రం తర్వాత స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో కలిసి "మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రంలో నటించాడు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో అతని కెరీర్ సరైన్ ట్రాక్లోకి వచ్చింది.