• TFIDB EN
  • పంజా వైష్ణవ్ తేజ్
    పంజా వైష్ణవ్‌ తేజ్‌ తెలుగు సినిమా నటుడు. ఉప్పెన(2020) సినిమా ద్వారా హీరోగా తెరంగేట్రం చేశాడు. ఈ చిత్రానికి కంటే ముందు వైష్ణవ్ తేజ్‌.. జానీ, శంకర్ దాదా MBBS, ‘అందరివాడు’ చిత్రాల్లో బాలనటుడిగా నటించాడు. ప్రముఖ తెలుగు నటుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు. ఉప్పెన చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిడంతో వైష్ణవ్ తేజ్‌కు అవకాశాలు క్యూకట్టాయి. ఈ చిత్రంలో అతని నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కొండపొలం(2021), రంగ రంగవైభవంగా(2023) వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. వైష్ణవ్ తేజ్ హైదరాబాదులోని నలంద పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు సెయింట్ మేరీస్ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు


    @2021 KTree