![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Panja_Vaisshnav_Tej.jpeg)
పంజా వైష్ణవ్ తేజ్
పంజా వైష్ణవ్ తేజ్ తెలుగు సినిమా నటుడు. ఉప్పెన(2020) సినిమా ద్వారా హీరోగా తెరంగేట్రం చేశాడు. ఈ చిత్రానికి కంటే ముందు వైష్ణవ్ తేజ్.. జానీ, శంకర్ దాదా MBBS, ‘అందరివాడు’ చిత్రాల్లో బాలనటుడిగా నటించాడు. ప్రముఖ తెలుగు నటుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు. ఉప్పెన చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిడంతో వైష్ణవ్ తేజ్కు అవకాశాలు క్యూకట్టాయి. ఈ చిత్రంలో అతని నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కొండపొలం(2021), రంగ రంగవైభవంగా(2023) వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. వైష్ణవ్ తేజ్ హైదరాబాదులోని నలంద పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు సెయింట్ మేరీస్ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు
పంజా వైష్ణవ్ తేజ్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే పంజా వైష్ణవ్ తేజ్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్తో ఇక్కడ తెలుసుకోండి.