ప్రీతి ముకుందన్
ప్రీతి ముకుందన్.. తమిళనాడుకు చెందిన నటి. తెలుగు సినిమా ‘ఓం భీమ్ బుష్’తో తెరంగేట్రం చేసింది. ప్రీతికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. తన ఐదో ఏట నుంచే భరతనాట్యంకు శిక్షణ తీసుకుంది. కెరీర్ ప్రారంభంలో మోడల్గా చేసిన ప్రీతి.. నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చింది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లోనూ ప్రీతి నటిస్తోంది. అటు తమిళంలో ‘స్టార్’ అనే మరో చిత్రంలో ప్రీతి హీరోయిన్గా చేస్తోంది.