సత్యదేవ్ కంచరణా
ప్రదేశం: విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
సత్య దేవ్ కాంచరాన ప్రముఖ తెలుగు సినిమా నటుడు. హిందీ చిత్రాల్లోనూ గుర్తింపు పొందాడు. తొలుత విశాఖపట్నంలో షార్ట్ ఫిల్మ్ మేకర్గా కెరీర్ ఆరంభించిన సత్యదేవ్, 2011 లో మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రంలో చిన్న పాత్రతో నట ప్రస్థానాన్ని ప్రారంభిచాడు. ఆ తరువాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, ముకుంద చిత్రాలలో నటించాడు. జ్యోతి లక్ష్మి చిత్రంలో ప్రధాన పాత్ర కోసం ఆడిషన్ చేసిన 500 మందికి పైగా కళాకారుల నుండి సత్య ఎంపికయ్యాడు. ఈ చిత్రం పెద్దగా విజయం సాధించనప్పటికీ.. సత్యదేవ్కు మంచి గుర్తింపు లభించింది. 2020లో నెట్ఫ్లిక్స్లో విడుదలైన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య చిత్రం మంచి టాక్ సంపాదించింది. ఈ చిత్రం తర్వాత సత్యదేవ్కు అవకాశాలు వెల్లువెత్తాయి. గుర్తుందా శీతాకాలం, గాడ్సె, స్కైలాబ్, పిట్టకథలు, ఘాజీ, గాడ్ ఫాదర్ చిత్రాల్లో నటించాడు.