శ్రీదేవి
ప్రదేశం: మీనంపట్టి, మద్రాసు రాష్ట్రం, భారతదేశం (ప్రస్తుత తమిళనాడు)
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో దేవకన్యగా గుర్తింపు పొందిన శ్రీదేవి భారతీయ నటి. హిందీ, తమిళ్, తెలుగు, మలయాళ భాషా చిత్రాల్లో నటించింది. శ్రీదేవి తమిళ చిత్రం కంధన్ కరుణై (1967) లో బాల నటిగా సినిమాల్లోకి ఆరంగేట్రం చేసింది. అయితే విడుదలైన చిత్ర మాత్రం తుణైవన్. ఆమె కెరీర్ ప్రారంభంలో తమిళ, తెలుగు, మలయాళ చిత్రాల్లో నటించింది. కె బాలచందర్ డైరెక్షన్లో వచ్చిన 'మూండ్రు ముడిచు' బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఈ చిత్రంలో కమల్ హాసన్, రజనీకాంత్ సరసన నటించింది. ఈ సినిమా తర్వాత శ్రీదేవి హిట్లకు చిరునామాగా మారిపోయింది. కమల్ హాసన్తో సరస గురు, శంకర్లాల్, సిగప్పు రోజక్కల్, తాయిల్లమల్ నానిల్లాయ్, మీండుమ్ కోకిలా, వాజ్వే మాయం, వరుమైయిన్ నిరం సిగప్పు, నీలా మలార్గల్, మూండ్రామ్ పిరై, పదహారేళ్ళ వయసు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.