రివ్యూస్
How was the movie?
@Raju2022
good movie
avika gore acting superb
10 months ago
తారాగణం
నల్లా శ్రీధర్ రెడ్డి గబ్బర్
అవికా గోర్
మౌనిక
కంచన్ బమనే
నందు విజయ్ కృష్ణ
సురభి పద్మజ
రూప లక్ష్మి
సుభాశ్రీ రాయ్
అమ్మ రమేష్
శ్రీదేవి ఆరోజు
సురభి దీప్తి
అలీ రెజా
సిబ్బంది
శ్రీకాంత్ మోహతాదర్శకుడు
పోలూరు కృష్ణనిర్మాత
మహేంద్ర సోనినిర్మాత
కథనాలు
Varun Tej Marriage: నెట్టింట వరుణ్-లావణ్య పెళ్లి ఫొటోల సందడి.. మెగా హీరోలంతా ఒకే వేదికపై..!
మెగా ఫ్యాన్స్ ఎంతగానో వేచిచూసిన వేడుక ముగిసింది. అభిమాన హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. నవంబర్ 1వ తేదీన ఇటలీలోని టుస్కానీలో వీరి వివాహం అత్యంత ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.
పెళ్లి తర్వాత వరుణ్ లావణ్య చేసిన ఫొటోషూట్ తాజాగా వైరల్ అవుతోంది. పెళ్లి దుస్తుల్లో నవ వధువువరులు నవ్వుతూ సంతోషంగా గడిపారు. ఇద్దరు కూర్చుని రొమాంటిక్గా పోజు ఇచ్చారు.
వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి తర్వాత సరదాగా గడిపారు. చేతుల్లో చేయి వేసుకుని గార్డెన్లో ఫొటోలకు పోజులిచ్చారు.
భార్య లావణ్య సొట్టబుగ్గపై చేతి వేలితో సరదాగా టచ్ చేశాడు వరుణ్ తేజ్. మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన క్రీమ్ - గోల్డ్ షేర్వానీని వివాహా వేడుకలో వరుణ్ తేజ్ ధరించాడు.
వరుణ్ తేజ్ పెళ్లి వేడుకల్లో హీరో తండ్రి మెగా బ్రదర్ నాగబాబు ఆయన సతీమణితో కలిసి హుందాగా పోజు ఇచ్చారు. బ్లూ కలర్ డ్రెస్సులో నాగబాబు స్టైలిష్గా కనిపించారు.
వరుణ్ లావణ్య పెళ్లిలో మెగా కుటుంబం అంతా సందడి చేసింది. వధువరులతో రామ్ చరణ్, పవన్ కల్యాణ్, చిరంజీవి, అల్లు అర్జున్, సాయి తేజ్, అల్లు శిరీష్, పంజా వైష్ణవ్ తేజ్, నాగబాబు కలిసి ఫొటోకు స్టిల్ ఇచ్చారు.
వరుణ్ తేజ్ పెళ్లిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సందడి. మెగా సోదరులు చిరంజీవి, నాగబాబుతో పవన్ కల్యాణ్ ఫొటో వైరల్ అవుతోంది.
ఈ పెళ్లి వేడుకలోనే బాబాయి - అబ్బాయి ఒకే ఫ్రేమ్లో కనిపించారు. రామ్చరణ్-పవన్ నవ్వుతూ కనిపించిన ఫొటో ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఈ వేడుకల్లో వరుణ్ తేజ్ సోదరి నిహారిక స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. అన్న పెళ్లిలో తీన్ మార్ స్టెప్పులతో అదరగొట్టింది. తండ్రి నాగబాబుతో కలిసి డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
https://twitter.com/vamsikaka/status/1719756960852263315
కాగా ఇటలీలో అక్టోబర్ 30న మొదలైన పెళ్లి వేడుకలు నవంబర్ 1 వరకు కొనసాగాయి. కాగా.. ఇటలీ నుంచి వచ్చిన అనంతరం ఇండస్ట్రీ ప్రముఖల కోసం హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
ఈనెల 5న మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి రిసెప్షన్ వేడుక జరగనుంది. ఇందులో టాలీవుడ్కు చెందిన పలువురు సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు.
నవంబర్ 03 , 2023
అవికా గోర్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
అవికా గోర్ తెలుగు, హిందీ చిత్రాల్లో గుర్తింపు పొందిన నటి. ముఖ్యంగా టీవీ సీరియల్ చిన్నారి పెళ్లికూతురు ద్వారా గుర్తింపు పొందింది. ఆమె తెలుగులో ఉయ్యాల జంపాల చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. ఈచిత్రం సూపర్ హిట్ కావడంతో ఆమెకు అవకాశాలు క్యూకట్టాయి. లక్ష్మిరావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, బ్రో, థ్యాంక్యూ, పాప్ కార్న్ వంటి హిట్ చిత్రాల ద్వారా తెలుగు అభిమానులకు దగ్గరైంది. మాన్షన్24, వధువు వంటి వెబ్సిరీస్ల్లోనూ అవికా నటించింది. సినిమాల్లోకి రాకముందే ఎంతో ప్రసిద్ధి చెందిన అవికా గోర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు (Some Lesser Known Facts about Avika Gor) ఇప్పుడు చూద్దాం.
అవికా గోర్ పూర్తి పేరు?
అవికా సమీర్ గోర్
అవికా గోర్ ఎందుకు ఫేమస్
అవికా చైల్డ్ ఆర్టిస్ట్గా ప్రసిద్ధి చెందింది. ఆమె నటించిన చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ సూపర్ హిట్గా నిలిచింది.
అవికా గోర్ వయస్సు ఎంత?
1997, జూన్ 30న జన్మించింది
అవికా గోర్ తెలుగులో నటించిన తొలి సినిమా?
ఉయ్యాల జంపాల(2013)
అవికా గోర్ హిందీలో నటించిన తొలి సినిమా?
కేర్ ఆఫ్ ఫుట్ పాత్ 2(2009)
అవికా గోర్ ఎత్తు ఎంత?
5 అడుగుల 4 అంగుళాలు
అవికా గోర్ ఎక్కడ పుట్టింది?
ముంబై
అవికా గోర్ అభిరుచులు?
ఫొటోగ్రఫీ, డ్యాన్సింగ్, సింగింగ్
అవికా గోర్కు ఇష్టమైన ఆహారం?
పావుబాజి, బటర్ గార్లిక్ చిల్లీ నూడిల్స్
అవికా గోర్కు అఫైర్స్ ఉన్నాయా?
మిలింద్ చాంద్వానితో కొద్ది కాలం డేటింగ్ చేసినట్లు రూమర్స్ ఉన్నాయి.
అవికా గోర్కు ఇష్టమైన కలర్ ?
బ్లాక్, వైట్
అవికా గోర్కు ఇష్టమైన హీరో?
హృతిక్ రోషన్, షాహిద్ కపూర్
అవికా గోర్ ఎంత పారితోషికం తీసుకుంటుంది?
ఒక్కొ సినిమాకు రూ.50 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.
అవికా గోర్ తల్లిదండ్రుల పేరు?
సమీర్ గోర్, చేతన గోర్
అవికా గోర్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
అవికా గోర్ సినిమాల్లోకి రాకముందు సీరియల్స్లో నటించేది
అవికా గోర్ ఇన్స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/avikagor/?hl=en
అవికా గోర్ పెట్ పేరు?
షీరో
https://www.youtube.com/watch?v=Md7ASbr-6LQ
ఏప్రిల్ 02 , 2024
Creative Video songs In Tollywood: టాలీవుడ్లో ట్రెండ్ సెట్ చేసిన టాప్ 10 సాంగ్స్ ఇవే!
టాలీవుడ్ ప్రేక్షకులు సంగీత ప్రియులు. సినిమాలోని ఫైట్స్, కామెడీ, అడ్వెంచర్ సీన్లను ఎలాగైతే ఇష్టపడతారో అదే స్థాయిలో పాటలకు వారు పెద్ద పీట వేస్తుంటారు. అందుకే తెలుగులో చాలా సినిమాలు పాటలతోనే సూపర్ హిట్గా నిలిచాయి. ఈ కారణం చేతనే మన డైరెక్టర్లు మంచి కథతో పాటు.. అద్భుతమైన పాటలు, డ్యాన్స్ తమ సినిమాల్లో ఉండేలా జాగ్రత్తపడతారు. అయితే కొందరు డైరెక్టర్లు మరో అడుగు ముందుకేసి చాలా క్రియేటివ్గా తమ సినిమాల్లోని పాటలను చిత్రీకరించారు. అభిమానులను థ్రిల్ చేసి వారి అభిమానాన్ని సంపాదించారు. తెలుగులో ఇప్పటివరకూ వచ్చిన క్రియేటివ్ సాంగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
వివాహభోజనంబు
‘మాయాబజార్’ (1957) సినిమాలోని ‘వివాహభోజనంబు’ పాటను డైరెక్టర్ కె.వి. రెడ్డి చాలా వినూత్నంగా తెరకెక్కించారు. పెళ్లి అంటే ఎటువంటి పంచభక్ష్య పరమాన్నాలు ఉండాలో కళ్లకు కట్టాడు. వంటశాలలోకి ప్రవేశించిన నటుడు ఘటోత్కచుడు (ఎస్వీ రంగరావు) పసందైన వంటకాలను పొగుడుతూ ఆరగిస్తాడు. ఈ సాంగ్ తెలుగు వారింట్లో శుభప్రదమైన పాటగా కొనసాగుతోంది. పెళ్లిళ్లలో ఈ సాంగ్ పరిపాటిగా మారింది.
https://www.youtube.com/watch?v=dZejdBmYC3k
‘సుందరి నీవంటి’
సాధారణంగా హీరో, హీరోయిన్లతో డైరెక్టర్లు సాంగ్ ప్లాన్ చేస్తారు. కానీ ‘మాయాబజార్’ సినిమాలోని ‘సుందరి నీవంటి’ ఇందుకు విరుద్ధం. హాస్యనటుడు రేలంగి.. హీరోయిన్ సావిత్రితో కలిసి ఈ సాంగ్లే నటించాడు. ఆమె అందాలను వర్ణిస్తూ పాడతాడు. అయితే సాంగ్ను ఈ జనరేషన్ వాళ్లు కూడా అన్వయించుకోవచ్చు. పెళ్లి చూపులకు వెళ్లిన వరుడు.. వధువు అందాలను ఈ స్థాయిలో పొగిడే సాంగ్ ఇప్పటివరకూ టాలీవుడ్లో రాలేదు.
https://www.youtube.com/watch?v=ScasolQHzxs
'నిలువరా వాలు కనులవాడా'
జంబలకిడి పంబ సినిమాలోని క్లైమాక్స్ సాంగ్ చాలా క్రియేటివ్గా తెరకెక్కించారు దర్శకుడు ఈ.వీ.వీ. సత్యనారాయణ. అన్ని పాటలను స్పూఫ్ చేస్తూ తీసిన తొలి తెలుగు సాంగ్ ఇదే కావడం విశేషం. ఈ సాంగ్లో మగవారు ఆడవారిగా, ఆడవారు మగవారి వేషధారణ కనిపించి నవ్వులు పూయిస్తారు.
https://www.youtube.com/watch?v=CI4qkIdvSmA
'చెప్పమ్మా.. చెప్పమ్మా..'
‘మురారి’ సినిమాలోని ‘చెప్పమ్మా.. చెప్పమ్మా’ సాంగ్ ఇప్పటికీ చాలా మందికి ఫేవరేట్గా ఉంది. మహేష్.. హీరోయిన్ను వదిలి కారులో బయల్దేరగా ఆమె జ్ఞాపకాలు అతడ్ని వెంటాడుతాయి. దారి పొడవునా హీరోయిన్ కనిపిస్తూ డిస్టర్బ్ చేస్తుంది. ఇష్టమైన వారితో ఎడబాటు రాగానే యువతులకు ముందుగా ఈ పాటనే గుర్తుకు వస్తుంది. ప్రియుడు దూరంగా వెళ్తున్న క్రమంలో ఓ యువతి ఎంతగా అతడ్ని మిస్ అవుతుందో ఈ సాంగ్ కళ్లకు కడుతుంది.
https://www.youtube.com/watch?v=9qC9XGOuhaI
'బుగ్గే బంగారమా..'
‘చందమామ’ సినిమాలోని ఈ పాట.. ఒక అబ్బాయి ఎడబాటుకు అద్దం పడుతుంది. మనసుకు నచ్చిన అమ్మాయి పదే పదే కళ్లకు కనిపిస్తూ తన జ్ఞాపకాలతో మైమరిపిస్తుంటుంది. ప్రేయసి దూరంగా వెళ్లినప్పుడు అబ్బాయిలు ఆమెను గుర్తుచేసుకునేందుకు తరచూ ఈ సాంగ్ వింటూ ఉంటారు.
https://www.youtube.com/watch?v=WABcMeOf0oM
‘అసలేం గుర్తుకు రాదు’
‘అంతపురం’లోని ఈ సాంగ్.. ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్ ఆల్బమ్స్లో ఒకటిగా ఉంది. నచ్చిన వ్యక్తి తోడుంటే పెళ్లికాని యువతులకు ఇక ఏది గుర్తుకు రాదన్న కాన్సెప్ట్టో దర్శకుడు ఈ పాటను చిత్రీకరించారు. అప్పట్లో ఈ పాట ట్రెండ్ సెట్టర్. దీని తర్వాత ఈ తరహాలో ఎన్నో పాటలు టాలీవుడ్లో రావడం గమనార్హం.
https://youtu.be/sgMKZfdPads?si=8Lj2ooFdt-Q56Mss
‘ఇంకి పింకి పాంకీ’
సుడిగాలి సినిమాలోని ‘ఇంకి పింకి పాంకి’ చాలా గమ్మత్తుగా ఉంటుంది. తమ ఫ్యామిలీ సాంగ్ అంటూ అల్లరి నరేష్ పాడే ఈ సాంగ్ వినటానికి బాగుండటంతో పాటు నవ్వులు పూయిస్తుంది. మీరు ఓసారి వినండి.
https://www.youtube.com/watch?v=FusD0RVkKAk
‘ఊ అంటావా.. ఉ ఊ అంటావా’
తెలుగులో రీసెంట్గా వచ్చిన ఐటెం సాంగ్లలో ‘పుష్ప’లోని ‘ఉ అంటావా.. ఉ ఊ అంటావా’ పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. మాస్ సాంగ్స్లలో కొత్త ట్రెండ్ను సృష్టించింది. ఈ పాట లిరిక్స్ చాలా యూనిక్గా అనిపిస్తాయి. పైగా ఐటెం సాంగ్ అంటే దద్దరిల్లే మ్యూజిక్ అవసరం లేదని దేవిశ్రీ ఈ సాంగ్తో నిరూపించాడు.
https://www.youtube.com/watch?v=u_wB6byrl5k
‘ఐతే’
ఐదుగురు స్నేహితులు కలిస్తే ఎంత సరదాగా ఉంటారో.. అల్లరి చేస్తారో ‘ఐతే’ సినిమాలోని 'చిటపట చినుకులు' సాంగ్ కళ్లకు కడుతుంది. క్లోజ్ ఫ్రెండ్స్ ఒకచోట చేరితే ప్రపంచాన్ని మర్చిపోయి వారు ఎంత సంతోషంగా ఉంటారో ఈ పాట చెప్పేస్తుంది. ఫ్రెండ్స్ అంతా కలిసి ట్రిప్కు వెళ్లినప్పుడు ముందుగా వారికి ఈ పాటనే గుర్తుకు వస్తుంది.
https://www.youtube.com/watch?v=mGmYW7tp2B4
‘లైఫ్ ఆఫ్ రామ్’
ఒంటరి జీవితమని బాధ పడకుండా దాన్ని ఎంత అందంగా జీవించవచ్చో ‘జాను’ సినిమాలోని ‘లైఫ్ ఆఫ్ రామ్’ తెలియజేస్తుంది. మనకు తెలియని ప్రపంచం ఎంతో ఉందని కళ్లకు కడుతుంది. డిప్రెషన్లో ఉన్న వారు ఒక్కసారి ఈ పాట వింటే వెంటనే దాని నుంచి బయటకు వచ్చేస్తారు. ఈ తరహా సాంగ్ తెలుగులో ఇప్పటివరకూ రాలేదని చెప్పవచ్చు.
https://www.youtube.com/watch?v=2a34XyiZO14
‘చెలియా చెలియా’
ప్రేయసితో సంతోషంగా ఉన్నప్పుడు ముందుగా ‘ఖుషి’లోని ‘చెలియా చెలియా’ పాటనే గుర్తుకు వస్తుంది. నచ్చిన వ్యక్తి పక్కన ఉంటే ‘కోపాలు, తాపాలు మనకేలా.. సరదాగా కాలాన్ని గడపాలా’ అంటూ సాగే ఈ పాట మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంటుంది.
https://www.youtube.com/watch?v=-Z9jQn442Ts
మార్చి 02 , 2024
Vidya Vasula Aham Review: ఓటీటీలోకి వచ్చేసిన ‘విద్య వాసుల అహం’.. సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూప లక్ష్మి, రాజశ్రీ నాయర్, తదితరులు
దర్శకుడు: మణికాంత్ గెల్లి
సంగీత దర్శకుడు: కల్యాణి మాలిక్
సినిమాటోగ్రఫీ: అఖిల్ వల్లూరి
ఎడిటింగ్: సత్య గిడుతూరి
నిర్మాతలు: నవ్య మహేష్ ఎమ్, రంజిత్ కుమార్ కొడాలి, చందన కట్ట
ఓటీటీ : ఆహా
రాహుల్ విజయ్, శివాని జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం 'విద్య వాసుల అహం'. మణికాంత్ గెల్లి దర్శకుడు. ఈ చిత్రాన్ని ఎటర్నిటి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై లక్ష్మీ సవ్య, రంజిత్ కుమార్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రచార చిత్రాల సినిమా ఆసక్తిని పెంచాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా నేరుగా ఇవాళ ఓటీటీలోకి వచ్చింది. మే 17 నుంచి ఆహా వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది. ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
విద్య (శివానీ రాజశేఖర్) తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి కొన్ని లక్షణాలు తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. తను పెట్టిన పరీక్షల్లో నెగ్గిన వరుడినే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులను ఒప్పిస్తుంది. అలా వాసు (రాహుల్ విజయ్)ను విద్య వెళ్లి చేసుకుంటుంది. అయితే రోజులు గడుస్తున్న కొద్ది వారిలోని అహం మెుదలవుతుంది. అది వారి బంధాన్ని ప్రభావితం చేస్తుంటుంది. కొన్ని నాటకీయ పరిణామాలు.. వాసు-విద్య జీవితాల్లో ఎలాంటి మార్పులకు కారణమయ్యాయి? వారి మధ్య వచ్చిన గొడవలు ఏంటి? వాసు జాబ్ పోతే విద్య ఏం చేసింది? కొత్త జంట తమ కలహాలకు ఎలాంటి ముగింపు ఇచ్చారు? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
యువ నటుడు రాహుల్ విజయ్ కొత్త పెళ్ళి కొడుకు పాత్రలో మెప్పించాడు. ఈ జనరేషన్ యూత్ను ప్రతిబింబిస్తూ తన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ పాత్రలో శివాని రాజశేఖర్ చక్కటి నటన కనబరిచింది. నవ వధువుగా చీరలో క్యూట్గా కనిపిస్తూనే భర్తతో గొడవ పడే సీన్స్లో అదరగొట్టింది. ప్రధానంగా ఈ రెండు పాత్రల చుట్టే కథ మెుత్తం తిరిగింది. ఇక నారదుడుగా శ్రీనివాస రెడ్డి, లక్ష్మి దేవిగా అభినయ, విష్ణుమూర్తిగా అవసరాల శ్రీనివాస్ కాస్సేపు కనపడి అలరించారు. ఇతర నటీనటులు తమ పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు మణికాంత్ గెల్లి.. ఈ జనరేషన్ యూత్ను లక్ష్యంగా చేసుకొని ఈ మూవీని తెరకెక్కించారు. పెళ్లైన తర్వాత యువతీ యువకులు ఎలా ఉంటున్నారో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. సినిమాను మాముల కథలా చెప్పకుండా విష్ణుమూర్తి, లక్ష్మీ దేవి, నారదుడు మాటల ద్వారా స్టోరీని నడిపించడం కొత్తగా అనిపిస్తుంది. అయితే హీరో హీరోయిన్ల మధ్య బలమైన సన్నివేశాలను రాసుకోవడంలో డైరెక్టర్ విఫలమయ్యారు. అహం కారణంగా వారి జీవితాలు ఎలా ప్రభావితం అయ్యాయో తెరపై స్పష్టంగా చూపించడంలో తడబడ్డాడు. డైలాగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కథ మెుత్తాన్ని భార్య భర్తల మధ్యే తిప్పడం.. ఆకట్టుకునే ఇతర పాత్రలు లేకపోవడం ఆడియన్స్కు బోర్ కొట్టిస్తుంది.
సాంకేతికంగా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. కల్యాణి మాలిక్ సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రాఫర్ చక్కటి విజువల్స్ అందించాడు. ఎడిటర్ తన కత్తెరకు మరింత పని పెట్టి ఉంటే బాగుండేంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
రాహుల్, శివానీ నటనసంగీతంసినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
స్లో స్క్రీన్ప్లేఎడిటింగ్
Telugu.yousay.tv Rating : 2.5/5
మే 17 , 2024
Indian Oscar Entry 2025: ఆస్కార్ బరిలో ‘కల్కి 2898 ఏడీ’..? ‘RRR’ను ఫాలో కానున్నారా!
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరసలో ఉంటుంది. ఇక హాలీవుడ్ (Hollywood) నటీనటులకైతే జీవితంలో ఒకసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటూ ఉంటారు. ఈ ఏడాది మన దేశం తరుపున ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో నామినేట్ అవుతుందని అందరూ భావించారు. అంతర్జాతీయ స్టాండర్డ్స్తో రూపొందిన ఈ చిత్రం భారత్ తరపున ఆస్కార్ బరిలో నిలవడం లాంఛనమేనని అనుకున్నారు. అయితే అనూహ్యంగా హిందీ చిత్రం ‘లాపతా లేడీస్’ 2025 ఆస్కార్కు మన దేశం నుంచి ఎంపికైంది. దీంతో గతేడాది ‘ఆర్ఆర్ఆర్’ అనుసరించిన వ్యూహాన్నే ఫాలో కావాలని కల్కి టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
‘కల్కి’కి అన్యాయం జరిగిందా?
కిరణ్రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్’ (Laapataa Ladies For Oscars) 2025 ఆస్కార్కు మన దేశం నుంచి అధికారికంగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో 12 మందితో కూడిన జ్యూరీ ఈ సినిమాను ఆస్కార్కు ఎంపిక చేసింది. దీనికి అస్సామీ దర్శకుడు జాహ్ను బారువా నేతృత్వం వహించారు. మెుత్తం 29 చిత్రాలు భారత్ తరపున నామినేట్ అయ్యేందుకు పోటీలో నిలిచాయి. అందులో టాలీవుడ్ నుంచి ‘కల్కి 2898 ఏడీ’, ‘హనుమాన్’, ‘మంగళవారం’ చిత్రాలు ఉన్నాయి. అయితే గ్లోబల్ స్థాయిలో సక్కెస్ అయినా కల్కిని కాదని లాపతా లేడీస్ను భారత్ తరపున ఎంపిక చేయడంపై సినీ లవర్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఆస్కార్ సందర్భంగా 'ఆర్ఆర్ఆర్'కు జరిగిన అన్యాయమే ‘కల్కి’కి జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ బాటలో కల్కి!
గతేడాది ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో భారత్ తరపున ‘ఆర్ఆర్ఆర్’కు చోటుదక్కలేదు. దీంతో దర్శకధీరుడు రాజమౌళి జనరల్ కేటగిరిలో ఆస్కార్ను నామినేషన్స్ పంపించారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటులు, ఉత్తమ డైరెక్టర్ సహా 15 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్కు పంపారు. ఈ క్రమంలో ‘నాటు నాటు’ పాటకు గాను బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో షార్ట్ లిస్ట్ అయ్యి ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఇప్పుడు కల్కి టీమ్ కూడా భారత్ తరపున అధికారికంగా కాకపోయిన జనరల్ చిత్రాల కేటగిరిలో ఆస్కార్ బరిలో నిలవాలని భావిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ తరహాలోనే వివిధ కేటగిరీల కింద నామినేషన్స్ పంపాలని చిత్ర యూనిట్ యోచిస్తున్నట్లు సమాచారం. ఆస్కార్ కమిటీ కల్కి పంపిన నామినేషన్స్ను పరిగణలోకి తీసుకొని షార్ట్ లిస్ట్ చేస్తే అధికారికంగా పోటీలో నిలుస్తుంది. అటు ‘హనుమాన్’ టీమ్ కూడా జనరల్ కేటగిరీలో ఆస్కార్కు నామినేషన్స్ పంపాలని భావిస్తున్నట్లు సమాచారం.
‘లాపతా లేడీస్’ ఎంపికకు కారణం ఇదే
లాపతా లేడీస్ చిత్రాన్ని భారత్ తరపున అధికారికంగా ఆస్కార్ బరిలో నిలపడానికి గల కారణాలను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్, అస్సామి దర్శకుడు జాహ్ను బారువ వెల్లడించారు. ‘జ్యూరీ అన్ని రంగాల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే సరైన చిత్రాలను చూడాలి. ముఖ్యంగా లాపతా లేడీస్ భారతదేశ సామాజిక వ్యవస్థలు, నైతికతను చాటిచెప్పింది. భారతీయతను గొప్పగా చూపారు. అందుకే నామినేట్ అయిన 29 చిత్రాల్లో మేము దీన్ని ఎంపిక చేశాం. ఇది కేవలం ఒక్కరోజులో ఒకరు తీసుకున్న నిర్ణయం కాదు. 8 రోజుల పాటు జ్యూరీ సభ్యులందరం చర్చించుకొని లాపతా లేడీస్ను ఎంపిక చేశాం’ అని జాహ్ను బారువా తెలిపారు. ఇక ఈ సినిమా ఆస్కార్కు ఎంపిక కావడంపై దర్శకురాలు కిరణ్రావు కూడా ఆనందం వ్యక్తంచేశారు. ‘అద్భుతమైన కథకు ప్రాణం పోయడంలో ఎంతగానో శ్రమించిన టీమ్, వారి హార్డ్వర్క్కు దక్కిన గుర్తింపు ఇది. భారత్లో ప్రేక్షకులు ఏవిధంగా మా చిత్రాన్ని ఆదరించారో.. ప్రపంచస్థాయిలోనూ అదే విధంగా అభిమానిస్తారని ఆశిస్తున్నా’ అని తెలిపారు.
సౌత్ నుంచి పోటీ పడ్డ చిత్రాలు ఇవే!
ఆస్కార్ అవార్డుల రేసులో భారత్ తరపున బరిలోకి దిగేందుకు మెుత్తం 29 చిత్రాలు పోటీ పడ్డ సంగతి తెలిసిందే. అస్కార్ కోసం ఈసారి ఎక్కువగా సౌత్ ఇండియా సినిమాలే పోటీ పడ్డాయి. 29 చిత్రాల్లో టాలీవుడ్ నుంచి మూడు కాగా, కోలివుడ్ నుంచి 6 చిత్రాలు నామినేట్ లిస్ట్లో చోటు సంపాదించాయి. వాటిలో విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజా’, విక్రమ్ హీరోగా నటించిన ‘తంగలాన్’, సూరి ప్రధాన పాత్ర పోషించిన ‘కొట్టుక్కాళి’, లారెన్స్ - ఎస్.జే. సూర్య నటించిన ‘జిగర్తండా డబుల్ ఎక్స్’, మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన వాళై, పారి ఎలవళగన్ హీరోగా చేసి దర్శకత్వం వహించిన ‘జమ’ చిత్రాలు ఉన్నాయి. మలయాళం నుంచి ‘ఆట్టం’, ‘ఆడుజీవితం’ (ది గోట్ లైఫ్), ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’, ‘ఉళ్ళోజుక్కు’ వంటి చిత్రాలు ఉన్నాయి. ఇలా మొత్తంగా సౌత్ నుంచి 13 సినిమాలు ఆస్కార్ కోసం నామినేట్ అయ్యాయి. అయితే భారత్ నుంచి ‘లాపతా లేడిస్’ మాత్రమే అస్కార్లోకి ఎంట్రీ ఇచ్చింది. త్వరలో మిగిలిన సినిమాల గురించి అధికారికంగా ప్రకటన రానుంది.
లాపతా లేడీస్ ప్రత్యేకత ఏంటి?
సినిమాకి కథే హీరో అని ‘లాపతా లేడీస్’ చిత్రం మరోసారి నిరూపించింది. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు వధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారవుతారు. మరి ఆ తర్వాత వారి జీవితాలు ఎలా సాగాయి? వాళ్ల భర్తల దగ్గరికి ఎలా చేరుకున్నారు? అనేది ఇందులో చూపించారు. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను ఓ వైపు ప్రేక్షకుల్ని నవ్విస్తూనే మరోవైపు సమాజంలోని మహిళల గుర్తింపు గురించి ప్రశ్నలు లేవనెత్తేలా తీర్చిదిద్దారు. పితృస్వామ్య వ్యవస్థపై తీసిన వ్యంగ్య చిత్రమిది. 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ధోబీ ఘాట్’కు దర్శకత్వం వహించిన కిరణ్, 13 ఏళ్ల గ్యాప్ తర్వాత తెరకెక్కించిన చిత్రమిది. బాక్సాఫీసు వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమైనా ఓటీటీలో మాత్రం ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది.
సెప్టెంబర్ 24 , 2024
Varunlav: కాక్టైల్ పార్టీలో వరుణ్తేజ్ను ఆట పట్టించిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి కార్యక్రమం.. ఇటలీలో జరుగుతున్న సంగతి సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు ఇటలీకి చేరుకున్నాయి. తాజాగా కాబోయే వధువరులు వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి జంట కుటుంబ సభ్యులకు కాట్ టైల్ పార్టీ ఇచ్చింది. తాజాగా ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి.
మెగాబాబు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ త్వరలో లావణ్య త్రిపాఠితో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే.
వీరిద్దరు కొంత కాలంగా ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే.
ఈ కొత్త జంట ఇక్కడ కాదని డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకుంటోంది. వీరిద్దరు తొలిసారిగా అంతరిక్షం సినిమాలో జంటగా నటించారు. ఆ సినిమా షూటింగ్ ఇటలీలో జరిగింది. అక్కడే వరుణ్, లావణ్యలు ప్రేమలో పడ్డారు.
తమ ప్రేమ చిగురించిన ఇటలీలోనే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇటలీలోని టస్కానీలో ఈ కొత్త జంట వివాహం చేసుకోనుంది.
ఈ పెళ్లి కూడా పెద్దగా హడావుడి లేకుండా ఇరుకుటుంబాలకు చెందిన అతికొద్దిమంది కుటుంబ సభ్యుల నడుమ జరగనుంది. నవంబర్ 1న ఈ లవ్ బర్డ్స్ పెళ్లి బంధం ద్వారా ఒక్కటి కానున్నారు.
అయితే సోమవారం రాత్రి వరుణ్తేజ్- లావణ్య జంట కుటుంబ సభ్యులకు కాక్టైల్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీ బోర్గోసాన్ ఫెలిస్ రిసార్ట్లో కాక్టైల్ పార్టీ ఘనంగా జరిగింది.
ఈ పార్టీకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దంపతులు హాజరయ్యారు. అలాగే రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఉత్సాహంగా గడిపాడు. కుటుంబ సమేతంగా దిగిన ఈ పిక్స్ వైరల్గా మారాయి. ఈక్రమంలో అల్లు అర్జున్ వరుణ్ను సరదాగా ఆట పట్టించాడు. నా చెల్లిని జాగ్రత్తగా చూసుకో అంటూ ఫన్నీగా బెదిరించాడు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ ఈ పార్టీలో సందడి చేశారు. చాలా రోజుల తర్వాత అటు మెగా ఫ్యామిలీని ఇటు అల్లు ఫ్యామిలీని ఒకే ఫ్రేమ్లో చూడటంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే వరుణ్ తేజ్ తల్లిదండ్రులు నాగబాబు, పద్మజ దంపతులు పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటలీలోనే లావణ్య త్రిపాఠి పేరెంట్స్ దియోరాజ్, కిరణ్ త్రిపాఠిలతో కలిసి దగ్గరుండి పెళ్లి వేడుకకు కావాల్సిన పనులు చేస్తున్నారు.
నవంబర్ 1న మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాలకు వరుణ్- లావణ్య పెళ్లి బంధం ద్వారా ఏకం కానున్నారు. అదే రోజు రాత్రి 8గంటలకు అక్కడే రిసెప్షన్ కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో 120 మంది వరకు ప్రత్యేక అతిథులు పాల్గొననున్నారు.
ఇటలీ నుంచి హైదరాబాద్కు తిరిగి వచ్చాక నవంబర్ 5న ఇక్కడ రిసెప్షన్ పెట్టనున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ పెద్దలతో పాటు రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు.
అక్టోబర్ 31 , 2023
Sai Pallavi: చిరంజీవి నుంచి విజయ్ దేవరకొండ వరకు సాయి పల్లవి వదులుకున్న సినిమాలు.. కారణం చెప్పిన హైబ్రిడ్ పిల్ల!
టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరిగా సాయి పల్లవి గుర్తింపు సంపాదించింది. మలయాళం సినిమా ‘ప్రేమమ్’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన సాయిపల్లవి ఆ సినిమాతో ఎనలేని పేరును సంపాదించింది. ఫిదా చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన సాయి పల్లవి.. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ హృదయాలను గెలుచుకుంది. అద్భుతమైన నటన, మిస్మరైజింగ్ డ్యాన్స్తో అందరిని ఆకట్టుకుంది. అయితే హీరోయిన్కు ఒక హిట్టు వస్తే అవకాశాలు క్యూ కట్టడం కామన్గా మారిపోయాయి. అందుకు తగ్గట్లే ఈ తరం హీరోయిన్లు ఎడపెడా సినిమాలు చేస్తూ ఫ్లాపులు మూటగట్టుకుంటున్నారు. అయితే ఈ ధోరణికి సాయి పల్లవి దూరంగా ఉంది. ఎంత పెద్ద సినిమా ఆఫర్ వచ్చిన కథ నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. పాత్రలో గ్లామర్ డోస్ ఎక్కువైనా, నటనకు ప్రాధాన్యం తగ్గినా సాయి పల్లవి సున్నితంగా రిజెక్ట్ చేస్తుందని ఇండస్ట్రీలో టాక్. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ ఈ మలయాళీ భామ వదులుకున్న సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
1. భోళా శంకర్ (Bhola Shankar)
చిరంజీవి హీరోగా, మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భోళాశంకర్. ఇందులో చిరంజీవి సరసన తమన్న నటిస్తుండగా చెల్లెలిగా కీర్తి సురేష్ చేస్తోంది. అయితే కీర్తి సురేష్ పాత్రకు తొలుత సాయిపల్లవిని చిత్రం బృందం సంప్రదించింది. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఈవెంట్లో సాయిపల్లవే చెప్పింది. తానే ఆ రోల్ను రిజెక్ట్ చేశానని స్పష్టం చేసింది. రీమేక్ సినిమాలపై ఉన్న భయంతోనే ఆ పాత్రను వదులుకున్నట్లు తెలిపింది. కాగా, తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన వేదాలం సినిమాకు రీమేక్గా ‘భోళా శంకర్’ వస్తోంది.
2. లియో (Leo)
తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడు అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. కానీ సాయి పల్లవి మాత్రం విజయ్ సినిమాను సున్నితంగా తిరస్కరించింది. విజయ్ లేటెస్ట్ మూవీ ‘లియో’లో హీరోయిన్గా తొలుత సాయి పల్లవినే అనుకున్నారట. ఇందుకోసం చిత్ర యూనిట్ సాయి పల్లవిని కూడా సంప్రదించింది. అయితే ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత త్రిషను సంప్రదించగా అందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
3. ఛత్రపతి (Chatrapathi)
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి సినిమాతో హిందీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తెలుగులో సూపర్ హిట్గా నిలిచిన రాజమౌళి ‘ఛత్రపతి’కి రీమేక్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ పాత్ర కోసం కూడా సాయిపల్లవినే సంప్రదించారని అప్పట్లో టాక్ వినిపించింది. గ్లామర్ షో ఎక్కువగా చేయాల్సి ఉండటంతో సాయి పల్లని ఈ ఆఫర్ రిజెక్ట్ చేశారని సమాచారం. దీంతో ఆ పాత్రకు బాలీవుడ్ నటి నుస్రత్ భరుచ్చాను ఎంపికచేశారు. కాగా, ఈ సినిమా మే 12 రిలీజ్ కానుంది.
4. వారసుడు (Varasudu)
విజయ్ రీసెంట్ మూవీ వారసుడు / వారిసు సినిమాను కూడా సాయి పల్లవి రిజెక్ట్ చేసిందట. ఇందులో కూడా హీరోయిన్ పాత్రకు ప్రియారిటీ లేకపోవడంతో సున్నితంగా నో చెప్పిందని సమాచారం. దీంతో సాయిపల్లవి చేయాల్సిన పాత్రకు రష్మిక మందన్నను ఎంపిక చేశారు.
5. సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru)
మహేష్ బాబు, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో హీరోయిన్ పాత్రను సైతం సాయిపల్లవినే చేయాల్సి ఉండగా ఆమె రిజెక్ట్ చేసింది. దీంతో ఆ అవకాశం మళ్లీ రష్మికకే దక్కింది. హీరోయిన్ పాత్రకు యాక్టింగ్ స్కోప్ ఎక్కువగా లేకపోవడంతోనే ఈ భామ తిరస్కరించినట్లు తెలుస్తోంది.
6. డియర్ కామ్రేడ్ (Dear Comrade)
విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘డియర్ కామ్రేడ్’. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం దారుణంగా ఫెయిల్ అయింది. అయితే ఈ సినిమా హీరోయిన్ ఆఫర్ కూడా ముందుగా సాయిపల్లవికే వెళ్లింది. అయితే ముద్దు సన్నివేశాలు, గ్లామర్ షో ఉన్న పాత్ర కావడంతో ఈ భామ తిరస్కరించినట్లు అప్పట్లో వార్తల్లో వచ్చాయి. తొలి నుంచి కిస్సింగ్ సీన్లకు దూరంగా ఉండే సాయిపల్లవి.. ఇందులో హీరోయిన్, హీరోయిన్ల ఘాటు రొమాన్స్ ఉండటంతో నో చెప్పింది.
7. చెలియా (Cheliya)
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంతో కనీసం ఒక సినిమాలోనైనా వర్క్ చేయాలని హీరో, హీరోయిన్లు కలకలలు కంటారు. ఒక చిన్న పాత్ర దొరికినా చాలు అని సంబరపడుతుంటారు. కానీ సాయిపల్లవి మాత్రం ఏకంగా హీరోయిన్ ఆఫర్నే తిరస్కరించింది. కార్తిక్ హీరోగా తెరకెక్కిన చెలియా సినిమా కోసం తొలుత సాయిపల్లవినే మూవీ యూనిట్ సంప్రదించింది. అయితే సినిమా కథతో సంతృప్తి చెందని ఈ భామ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించింది. దీంతో సాయిపల్లవి ప్లేసులో అదితిరావు హైదరినీ తీసుకున్నారు.
మే 09 , 2023
Yukti Thareja: టాలీవుడ్కు మరో అందాల తెగింపు.. సొగసులతో బాణాలు వదులుతున్న హర్యానా అందం
రంగబలి హీరోయిన్ యుక్తి తరేజా తాజా హాట్ లుక్స్లో అదరగొట్టింది. రంగబలి మూవీ ద్వారా ఈ ముద్దుగుమ్మ తెలుగుతెరకు పరిచయం కానుంది.
రంగబలి ట్రైలర్ లాంచ్ తర్వాత ఇలా హాట్ హాట్ లుక్స్తో ఫొటోలకు పొజులిచ్చింది
ట్రైలర్లో యుక్తి తరేజ అందం కుర్రకారును ఆకట్టుకుంది. ట్రైలర్ పట్ల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాలో హీరో నాగశౌర్యతో యక్తి తరేజ రొమాన్స్ చేయనుంది. రంగబలి మూవీ జులై 7న రిలీజ్ కానుంది
సినిమాల్లోకి రాకముందు ఈ సొగసుల సంచలనం మోడలింగ్ చేసేది
యుక్తి తరేజ స్వస్థలం హర్యానా, మాతృభాష హిందీ. ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన హర్యానా అందం... కాలేజీలో ఉన్నప్పుడే నటనపై ఆసక్తి పెంచుకుంది
ఢిల్లీ ఫ్రెష్ ఫేస్ కాంపిటీషన్లో గెలుపొందిన తర్వాత మోడలింగ్ మొదలుపెట్టి.. అనంతరం యాక్టింగ్ ఆడిషన్స్ వచ్చింది
తెలుగులో నటించేటప్పుడు భాషాపరమైన సవాళ్లు ఎదుర్కొదంట ఈ పుత్తడి బొమ్మ.. పెద్దపెద్ద పారాల డైలాగులు నేర్చుకుని చెప్పడం కొంచెం ఛాలెంజింగ్గా అనిపించిందట.
యాక్టింగ్ సమయంలో డైరెక్షన్ టీమ్ చాలా సహాయం చేశారని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది
తెలుగులో తన ఫేవరేట్ హీరో అల్లు అర్జున్ అని యుక్తి తరేజ చెప్పుకొచ్చింది.
అల్లు అర్జున్ డాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని ఐకాన్ స్టార్ పక్కన నటించేందుకు ఉబలాట పడుతోంది.
అల్లు అర్జున్ డాన్స్ను మ్యాచ్ చేయడం చాలా కష్టమని ప్రశంసలతో ముంచెత్తింది. హీరోయిన్స్లో అనుష్క శెట్టి అంటే తనకు ఇష్టమని చెప్పింది.
ప్రస్తుతానికి తెలుగులో ఇంకో ప్రాజెక్ట్ ఏదీ సైన్ చేయలేదని చెప్పిన తరేజ.. ప్రస్తుతానికి కొన్ని కథలు వింటున్నానని, ఏదైనా నచ్చితే సైన్ చేస్తానని తెలిపారు.
జూలై 04 , 2023
Jr NTR: ఎన్టీఆర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చూస్తే మతి పోవాల్సిందే.. రెండేళ్లలో 4 భారీ చిత్రాలు!
బాక్సాఫీస్కు వణుకుపుట్టించే అతికొద్ది మంది హీరోల్లో జూ.ఎన్టీఆర్ ఒకరు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే అప్పటివరకూ ఉన్న రికార్డ్స్ అన్ని సైడ్ అవ్వాల్సిందే. ఎన్టీఆర్ బిగ్ స్క్రీన్పై కనిపిస్తే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోవాల్సిందే. అటువంటి తారక్ నుంచి రెండున్నరేళ్లుగా ఒక్క సినిమా కూడా రాలేదు. ‘ఆర్ఆర్ఆర్’ (2022) తర్వాత ప్రేక్షకులను పలకరించలేదు. దీంతో ఎన్టీఆర్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అటు తారక్ సైతం సెప్టెంబర్ 27న ‘దేవర’తో రాబోతున్నాడు. అంతేకాదు నిరాశలో ఉన్న ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్ పెట్టేందుకు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేయబోతున్నాడు. అభిమానుల దాహార్తిని తీర్చేందుకు వచ్చే రెండేళ్లలో ఏకంగా నాలుగు భారీ బడ్జెట్ సినిమాలను రిలీజ్ చేయబోతున్నాడు. ఎన్టీఆర్ లైనప్లోని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే.
ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్!
2018 నుంచి 2024 ఆగస్టు మధ్య ఎన్టీఆర్ నుంచి కేవలం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మాత్రమే వచ్చింది. అయితే ఆ మూవీ భారీ సక్సెస్ గ్యాప్ను మర్చిపోయేలా చేసింది. లేటెస్ట్గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవర’ చిత్రంతో తారక్ రాబోతున్నాడు. ఇక మీదట తారక్ నుంచి వరుసగా చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వచ్చే రెండేళ్లలో ఏకంగా 4 పాన్ ఇండియా చిత్రాలతో తారక్ బిగ్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. తొలుత దేవరతో సందడి చేయనున్న తారక్ ఆ తర్వాత బాలీవుడ్ చిత్రం 'వార్ 2'తో ఫ్యాన్స్ను ఎంటర్టైన్ చేయనున్నాడు. అందులో స్టార్ హీరో హృతిక్ రోషన్తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. అలాగే 'దేవర 2' సీక్వెల్ కూడా తారక్ లైనప్లో ఉంది. తాజాగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో 'NTR 31' ప్రారంభమైంది. 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. అలాగే దీంతో పాటు 'హాయ్ నాన్న' డైరెక్టర్ శౌర్యువ్తోనూ ఎన్టీఆర్ మూవీ ఉండనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. ఇదీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. మెుత్తంగా రెండేళ్లలో కనీసం నాలుగు చిత్రాలు రిలీజ్ అయ్యేలా ఎన్టీఆర్ ప్లాన్ చేసుకున్నట్లు కనిపిస్తోంది.
‘NTR 31’ స్టోరీ ఇదేనా!
ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ శుక్రవారం (ఆగస్టు 9) పూజా కార్యక్రమంతో మెుదలైంది. NTR31 కొత్త పోస్టర్ గమనిస్తే ఈ సినిమా చైనా, ఇండియాకు మధ్య సాగే కథాంశం అని ప్రచారం జరుగుతోంది. 1969 నాటి ఓపియం మాఫియాకి రిలేటేడ్గా రానున్నట్లు సమాచారం. ఈ మాఫియాలో ఎన్టీఆర్ను డ్రగ్ లార్డ్గా చూపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 1969 రోజుల్లో కలకత్తా పోర్ట్ గోల్డెన్ ట్రయాంగిల్కి దగ్గరగా ఉండటంతో ఓపియం స్మగ్లింగ్కి అది అడ్డాగా మారింది. దాంతో ఆ పోర్టు నుంచే స్మగ్లింగ్ ఎక్కువగా జరిగేది. చైనా డ్రగ్స్ మాఫీయా కోల్కాత్తాలో యాక్టివ్గా ఉండటం అక్కడి లోకల్స్ గ్యాంగ్స్కి, వీరికి తరచూ గోడవలు జరిగేవట. ఈ లింకులు సౌత్ ఈస్ట్ ఆసియాకే కాకుండా యూరప్ వరకు విస్తరించాయని అంటారు. ఇప్పుడు ఇదే పాయింట్తో ప్రశాంత్ NTR31 ప్రాజెక్ట్ని రూపొందిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
తారక్ ద్విపాత్రాభినయం!
తారక్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రానున్న ‘NTR 31’ ప్రాజెక్ట్కు సంబంధించి ఓ క్రేజీ వార్త ఇటీవల హల్చల్ చేసింది. ఆ బజ్ ప్రకారం ఇందులో తారక్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. అందులో ఒకటి కెరీర్లో ఎప్పుడు చేయని 75 ఏళ్ల వృద్ధుడి పాత్ర అని జోరుగా ప్రచారం జరిగింది. ఇంకో పాత్రలో మాఫియా డాన్గా తారక్ కనిపిస్తారని టాక్ వినిపించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం సెప్టెంబర్లో సెట్స్పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ఫిల్మ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నట్లు సమాచారం.
ఆ టైటిల్ ఖరారు!
NTR 31 చిత్రానికి ‘డ్రాగన్’ అనే ఆసక్తికరమైన టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ టైటిల్నే దాదాపుగా ఖరారు చేసే అవకాశం కూడా ఉందట. డ్రాగన్ అంటే యూరోపియన్ భాషలో చెడుకి గుర్తు అని అర్థం. అలాగే డ్రాగన్ అంటే అలజడికి సంకేతం, నిప్పును పీల్చే గుణం కూడా దానికి ఉంటుందని అంటారు. ఇంత పవర్ఫుల్ పేరు అయినందువల్లే డ్రాగన్ టైటిల్ను ప్రశాంత్ నీల్ పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. పైగా తారక్ ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్లో ఎంతో పవర్ఫుల్గా కనిపించనున్న నేపథ్యంలో ఈ టైటిల్ అయితేనే సరిగ్గా మ్యాచ్ అవుతుందని ఆయన భావిస్తున్నారట. టైటిల్ ఖరారుపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని సమాచారం.
ఆగస్టు 10 , 2024
Deepika padukone Bday Special: డిప్రెషన్ నుంచి ప్రపంచ వేదికకు ప్రయాణం
]తెలుగులో మరికొందరి పక్కన నటించాలని ఉందంటూ మనసులో మాట చెప్పింది. ఎన్టీఆర్, అల్లు అర్జున్తో అవకాశం వస్తే వదులుకోనంటుంది.తెలుగు హీరోలంటే ఇష్టం
ఫిబ్రవరి 13 , 2023
నాగ శౌర్య(Naga Shaurya) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
ఛలో సినిమా విజయంతో లవర్ బాయ్గా పేరు తెచ్చుకున్న నాగ శౌర్య.. తక్కువ కాలంలోనే యూత్లో క్రేజ్ సంపాందించుకున్నాడు. ఊహలు గుసగుసలాడే, వరుడుకావలెను ఖుషి వంటి హిట్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గరయ్యాడు. ప్రస్తుతం యంగ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్న నాగ శౌర్య గురించి కొన్ని ఆసక్తికరమైన సంగతులు మీకోసం
నాగ శౌర్య అసలు పేరు?
నాగశౌర్య ముల్పూరి
నాగ శౌర్య ఎత్తు ఎంత?
5 అడుగుల 9 అంగుళాలు
నాగ శౌర్య తొలి సినిమా?
క్రికెట్ గర్స్ అండ్ బీర్(2011) చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.
నాగశౌర్యకు వివాహం అయిందా?
2022 నవంబర్ 20న తన ప్రియురాలు అనూష శెట్టితో వివాహం జరిగింది.
నాగ శౌర్య ఫస్ట్ క్రష్ ఎవరు?
ఐశ్వర్య రాయ్
నాగ శౌర్యకు ఇష్టమైన సినిమా?
టైటానిక్ చిత్రం తన ఫెవరెట్ చిత్రంగా నాగశౌర్య చెప్పాడు.
నాగ శౌర్య ఇష్టమైన హీరో?
తమిళ్ హీరో సూర్య
నాగ శౌర్య తొలి బ్లాక్ బాస్టర్ హిట్?
నాగ శౌర్య, రష్మిక మంధానతో కలిసి నటించిన చిత్రం ఛలో సూపర్ హిట్గా నిలిచింది. ఊహలు గుసగుసలాడే చిత్రం కూడా మంచి హిట్ అందుకుంది.
నాగశౌర్యకు ఇష్టమైన కలర్?
నీలం రంగు
నాగ శౌర్య పుట్టిన తేదీ?
1989 జనవరి 14న ఏలూరులో జన్మించారు.
నాగశౌర్య తల్లిదండ్రుల పేర్లు?
శంకర్ ప్రసాద్, ఉషా ప్రసాద్
నాగశౌర్యకు ఇష్టమైన ప్రదేశం?
హైదరాబాద్
నాగ శౌర్య ఏం చదివాడు?
బ్యాచ్లర్ ఆఫ్ కామర్స్(Bcom)
https://www.youtube.com/watch?v=GU7EJFAPxCI
నాగ శౌర్యకు ఎన్ని అవార్డులు వచ్చాయి?
చెప్పుకోదగ్గ అవార్డులు ఏమి రాలేదు
నాగ శౌర్య ఎన్ని సినిమాల్లో నటించాడు?
నాగ శౌర్య 2024 వరకు 24 సినిమాల్లో నటించాడు.
నాగశౌర్యకు ఇష్టమైన ఆహారం?
పెరుగు వడ
నాగశౌర్య ముద్దుపేరు?
నాని
నాగ శౌర్యకు ఇష్టమైన హీరోయిన్?
అనుష్క శెట్టి
మార్చి 21 , 2024
రీతు వర్మ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
రీతు వర్మ తెలుగులో పెళ్లి చూపులు (2016) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. టక్ జగదీష్, వరుడు కావలెను, ఒకే ఒక జీవితం వంటి చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్లోను చాలా చిత్రాల్లో రీతు వర్మ నటించింది. కణం, మార్క్ ఆంటోని వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. అయితే రీతు వర్మ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About ritu varma) విషయాలు ఇప్పుడు చూద్దాం.
రీతు వర్మ దేనికి ఫేమస్?
రీతు వర్మ.. పెళ్లిచూపులు, వరుడు కావలెను, కణం చిత్రాల్లో లీడ్ రోల్ చేసి గుర్తింపు పొందింది.
రీతు వర్మ వయస్సు ఎంత?
1990, మార్చి 10న జన్మించింది. ఆమె వయస్సు 33 సంవత్సరాలు
రీతు వర్మ ముద్దు పేరు?
రీతు
రీతు వర్మ ఎత్తు ఎంత?
5 అడుగుల 5 అంగుళాలు
రీతు వర్మ ఎక్కడ పుట్టింది?
హైదరాబాద్
రీతు వర్మకు వివాహం అయిందా?
ఇంకా కాలేదు
రీతు వర్మ అభిరుచులు?
యోగ, ట్రావెలింగ్, సినిమాలు చూడటం
రీతు వర్మకు ఇష్టమైన ఆహారం?
ఇటాలియన్ వంటకాలు
రీతు వర్మ ఫెవరెట్ హీరో?
మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రణ్బీర్ కపూర్
రీతు వర్మకు ఇష్టమైన హీరోయిన్?
మాధురి దీక్షిత్, శ్రీదేవి
రీతు వర్మ ఫెవరెట్ సినిమాలు?
క్వీన్, హేట్ లవ్ స్టోరీస్
రీతు వర్మ సిగరెట్ తాగుతుందా?
తెలియదు
రీతు వర్మ మద్యం తాగుతుందా?
తెలియదు
రీతు వర్మ హీరోయిన్గా నటించిన తొలి సినిమా?
పెళ్లి చూపులు
రీతు వర్మ ఏం చదివింది?
మల్లారెడ్డి కాలేజీలో ఇంజనీరింగ్ చదివింది
రీతు వర్మ పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ.కోటి వరకు ఛార్జ్ చేస్తోంది.
రీతు వర్మ తల్లిదండ్రుల పేర్లు?
దిలిప్ కుమార్ వర్మ, సంగీత వర్మ
రీతు వర్మకు అఫైర్స్ ఉన్నాయా?
తెలియదు
రీతు వర్మ ఎన్ని అవార్డులు గెలిచింది?
పెళ్లి చూపులు చిత్రానికిగాను ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకుంది
రీతు వర్మ ఇన్స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/rituvarma/
రీతు వర్మ ఎన్ని లిప్ లాక్ సీన్లలో నటించింది?
ఇంతవరకు అలాంటి సీన్లలో నటించలేదు
https://www.youtube.com/watch?v=m3ldXnuR8Po
ఏప్రిల్ 08 , 2024
Brahmanandam: తెలంగాణ పిల్లను కోడలిగా చేసుకున్న బ్రహ్మానందం.. బ్యాగ్రౌండ్ మామూలుగా లేదుగా…!
బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్ధార్థ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టాడు. శ్రీ బూర వినయ్ కుమార్ – పద్మజ దంపతుల పుత్రిక ఐశ్వర్య మెడలో సిద్ధార్థ మూడు ముళ్ళు వేసి ఒక్కటయ్యారు. వీరిద్దరి పెళ్లి హైదరాబాదులోని గచ్చిబౌలిలో జరిగింది. ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చి కొత్త దంపతులను ఆశీర్వదించారు. అయితే వధూవరుల ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. దీంతో బ్రహ్మీ చిన్న కోడలు ఎవరా? అన్న ఆసక్తి ఫ్యాన్స్లో మొదలైంది. ఆమె బ్యాక్గ్రౌండ్ గురించి నెట్టింట్లో శోధించడం మొదలు పెట్టారు. ఇంతకు ఆమె ఎవరంటే?
బ్రహ్మానందం ఇంట్లోకి చిన్న కోడలుగా పెట్టిన అమ్మాయి బ్యాగ్రౌండ్ చాలా బలంగానే ఉంది. కరీంనగర్లో ప్రముఖ వైద్యులుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ పద్మజా వినయ్ల గారాల పట్టినే బ్రహ్మీ చిన్న కొడుకుకు ఇచ్చి పెళ్లి చేశారు. ఆమె పేరు ఐశ్వర్వ. డాక్టర్ చదివింది. తను కూడా గైనకాలజిస్ట్. వీరికి స్థిరచరాస్తులు కూడా భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐశ్వర్య పేరుతో ఆమె తల్లిదండ్రులు కొన్ని కోట్లరూపాయల ఆస్తులను కూడబెట్టినట్లు టాక్. కరీంనగర్తో పాటు తెలంగాణలోని పలుచోట్ల వీరికి ప్రాపర్టీస్ ఉన్నట్లు తెలిసింది. ఇక అమ్మాయి కూడా చక్కని రూపంతో హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని లావణ్యంతో మెరిసిపోయింది. అందుకే కొత్త కోడలికి ఎంగేజ్మెంట్ సమయంలో బ్రహ్మీ గారు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు. వజ్రాలు పొదిగిన నక్సెస్ను పెళ్లికానుకగా బహూకరించారు. దీని విలువ రూ.30 లక్షలకు పైనే ఉంటుందని అంచనా.
బ్రహ్మానందం ఆస్తి గురించి అందరికీ తెలిసిందే. ఇండియాలోనే రిచెస్ట్ కమెడియన్లలో ఆయనది తొలి స్థానం. రూ. 400 కోట్ల నుంచి రూ. 450 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. తన స్తోమతకు తగినట్లుగా ఉంటారని బ్రహ్మానందం భావించడంతో డాక్టర్ సంబంధానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. వీరి పెళ్లికి తెలంగాణ సీఎం కేసీఆర్తోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమకు చెందినవారు హాజరయ్యారు.
ఇక బ్రహ్మానందం పెద్ద కొడుకు రాజా గౌతమ్ గురించి అందరికి తెలిసిందే. తండ్రి బాటలో సినిమా రంగంలో నడుద్దామని ప్రయత్నించాడు. పల్లకిలో పెళ్లికూతురు – చారుశీల, బాసంతి వంటి సినిమాలలో నటించాడు. అయితే ఆ చిత్రాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో వ్యాపారంలో స్థిరపడ్డాడు. అయితే మళ్లీ ఓ వెబ్సిరీస్ ద్వారా ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు. గౌతమ్కు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
బ్రహ్మానందం చిన్నకుమారుడు సిద్ధార్థ గురించి బాహ్యప్రపంచానికి పెద్దగా తెలియదు. సిద్ధార్థ విదేశాల్లో చదివాడు. అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అయితే పెళ్లి తర్వాత ఇక్కడే స్థిరపడి వ్యాపారం చేయాలని సిద్ధార్థ్ భావిస్తున్నట్లు సన్నిహితుల దగ్గర నుంచి తెలిసింది. తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్రహ్మానందం తన ఇద్దరు కుమారులను మాత్రం సినీరంగంలోకి తీసుకురావడంలో విఫలమయ్యారు.
ఆగస్టు 19 , 2023
Venkatesh: గుట్టు చప్పుడుకాకుండా వెంకటేష్ రెండో కూతురు పెళ్లి.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ హీరో వెంకటేశ్ రెండో కుమార్తె హయ వాహిని నిశ్చితార్థం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.
విక్టరీ వెంకటేష్ ఇంట్లో త్వరలోనే పెళ్లిసందడి మొదలు కానుంది. ఆయన రెండో కూతురు హయ వాహిని ఎంగేజ్మెంట్ అతి తక్కువ మంది బంధువులు, టాలీవుడ్ ప్రముఖుల మధ్య ఘనంగా జరిగింది.
ఈ నిశ్చితార్థం వేడుక వెంకటేష్ ఇంట్లో జరగ్గా.. టాలీవుడ్కు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, రానా, నాగచైతన్యలతో పాటు ఇతర సినీ ప్రముఖులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
వెంకటేష్ రెండో కుమార్తే హయ వాహినికి విజయవాడకు చెందిన ఓ ప్రముఖ డాక్టర్ కుమారుడితో వివాహం జరగనుంది.
వెంకటేష్, నీరజ దంపతులకు మొత్తం నలుగురు సంతానం... ఆశ్రిత, హయ వాహిని, భావన, అర్జున్ ఉన్నారు. మూడో కుమార్తే భావన, కుమారుడు అర్జున్ విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారు.
వీరిలో పెద్ద కుమార్తే ఆశ్రిత వివాహం 2019లో జరిగింది. . హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో ఆశ్రిత పెళ్లి జైపూర్లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆశ్రిత దంపతులు స్పెయిన్లో సెటిల్ అయినట్లు తెలిసింది.
అయితే వెంకటేష్ రెండో అల్లుడు వివరాలు మాత్రం ఇంకా వెళ్లడించలేదు. కొంత గోప్యత పాటిస్తున్నారు. వచ్చే ఏడాదిలో తన రెండో కుమార్తె హయ వాహిని పెళ్లి చేయనున్నట్లు సమాచారం.
మంచి ముహూర్తం ఉండటంతో ఇప్పుడు నిశ్చితార్థం చేసి.. వచ్చే ఏడాదిలో పెళ్లి చేయనున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. వెంకటేష్ ప్రస్తుతం 'సైంధవ్' సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్టైనర్గా శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి. చాలా రోజుల తర్వాత వెంకటేష్ పూర్తి స్థాయి యాక్షన్ చిత్రంలో నటిస్తుండటంతో అంచనాలు ఏర్పడ్డాయి. వెంకటేష్ సరసన రుహాని శర్మ హీరోయిన్గా నటిస్తోంది.
కాగా సైంధర్ చిత్రం ద్వారా బాలీవుడ్ విలక్షణ నటుడు నవజుద్దీన్ సిద్దిఖీ టాలీవుడ్కు పరిచయం కానున్నారు. ఈ సినిమాలో నవజుద్దీన్ విలన్ రోల్లో కనిపించనున్నారు. సైంధవ్ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.
సంక్రాంతి కానుకగా సెంధవ్ చిత్రాన్ని జనవరి 13న విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
అక్టోబర్ 26 , 2023
Varun Tej Marriage: పెళ్లి బంధంతో ఒక్కటైన వరుణ్- లావణ్య.. వివాహ వేడుక ఇటలీలోనే ఎందుకంటే?
టాలీవుడ్ స్టార్స్ వరుణ్తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇటలీ (Italy)లోని టస్కనీ (Tuscany)లో కుటుంబ సభ్యులు, అత్యంత ఆత్మీయుల మధ్య వీరు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మ. 2.48 నిమిషాలకు వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్చరణ్-ఉపాసన, బన్నీ దంపతులు సందడి చేశారు.
అంతకుముందు పెళ్లి వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి కాక్టేల్ పార్టీ (Cocktail party) నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక మంగళవారం రాత్రి హల్దీ, మెహందీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో వధూవరులిద్దరూ పసుపు వర్ణం దుస్తుల్లో మెరిసిపోయారు. ఇక మెగా, అల్లు కుటుంబ సభ్యులంతా ఈ వేడుకలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు #VarunLav హ్యాష్ట్యాగ్తో ట్రెండ్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే వరుణ్ లావణ్య జంట ఇటలీనే పెళ్లి వేదికగా ఎందుకు ఎంచుకుందన్న సందేహం చాలా మందిలో ఉంది. ఎన్నో డెస్టినేషన్ వెడ్డింగ్ పాయింట్స్ ఉండగా ఇటలీనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారని చాలా మంది ప్రశ్న. అయితే దీనికి ఓ ప్రధాన కారణమే ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
వివరాల్లోకి వెళితే.. 2017లో వచ్చిన 'మిస్టర్' సినిమాతో వరుణ్ తేజ్ - లావణ్య మధ్య పరిచయం ఏర్పడింది. ఆ సినిమా షూటింగ్లోనే ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు. కాలక్రమేణా ఇద్దరూ ప్రేమికులుగా మారిపోయారు. అయితే ఆ సినిమా ఇటలీలోని షూటింగ్ జరుపుకోవడం విశేషం. అలా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ప్రేమకు తొలి అడుగు ఇటలీలోనే పడింది.
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠికి తన ప్రేమను ఇటలీలోనే వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఆ విధంగా తమ ప్రేమకు మూలమైన ఇటలీని, తాము పెళ్లి చేసుకోవడానికి వేదికగా మార్చుకున్నారు ఈ జంట. అంతేకాదు సుందరమైన ప్రాంతాలతో ఇటలీలోని టస్కనీ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు ఎంతో ప్రసిద్ధిగాంచింది.
ఇక వీరిద్దరి పెళ్ళికి వరుణ్ తేజ్ సన్నిహితులలో ఒకరైన యువ హీరో నితిన్ దంపతులు, నిహారిక, లావణ్య త్రిపాఠికి సన్నిహితురాలైన రీతూ వర్మ కూడా హాజరయ్యారు. సమంత, నాగచైతన్య, రష్మిక మందాన, పూజ హెగ్డే కూడా వీరి పెళ్లికి హాజరైనట్లు తెలిసింది.
నవంబర్ 01 , 2023
Varun Tej Reception: వైభవంగా వరుణ్-లావణ్య రిసెప్షన్.. సందడి చేసిన సినీ ప్రముఖులు..!
టాలీవుడ్ స్టార్స్ వరుణ్తేజ్ (Varun Tej Konidela), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) మ్యారెజ్ రిసెప్షన్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఆదివారం రాత్రి హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వేడుకలో పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. #VarunTejReception హ్యాష్ట్యాగ్తో రిసెప్షన్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుకేద్దాం.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఈ రిసెప్షన్లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బ్లాక్ కలర్ కోటులో మనవరాలితో కలిసి వేడుకకు హాజరయ్యారు. నవ దంపుతులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేష్ కూడా రిసెప్షన్లో సందడి చేశారు. వరణ్-లావణ్యలకు శుభాకాంక్షలు తెలిపి వారితో ఫొటోలు దిగారు.
యంగ్ హీరో నాగ చైతన్య కూడా రిసెప్షన్లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బియర్డ్ లుక్లో పెళ్లి కొడుకు, కూతురితో ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు
యంగ్ హీరోలు సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్లతో పాటు నాగబాబు దంపతులు, నిహారిక ఈవెంట్లో హల్చల్ చేశారు.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ దంపతులు సైతం రిసెప్షన్కు హజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి ఫొటో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు దంపతులు కూడా రిసెప్షన్ ఈవెంట్లో సందడి చేశారు.
యువ హీరో అల్లు శిరీష్ ఈవెంట్లో అందరి దృష్టిని ఆకర్షించాడు. వైట్ అండ్ బ్లాక్ కోటులో వరుణ్, లావణ్య జంటతో ఫొటో దిగారు.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దంపతులు, మరో డైరెక్టర్ సంపత్ నంది కూడా రిసెప్షన్కు హాజరయ్యారు.
బెల్లంకొండ ఫ్యామిలీ కూడా ఈ వేడుకలో తళుక్కుమంది. నిర్మాత బెల్లంకొండ సురేష్ దంపతులు వారి పెద్ద కుమారుడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్, చిన్న కుమారుడు రిసెషన్షన్కు వెళ్లారు.
యంగ్ హీరో కార్తికేయ, నటుడు నవదీప్ కూడా యువ జంటతో కలిసి ఫొటోలు దిగారు.
టాలీవుడ్ యువ హీరోలు సాయి సజ్జ, అడవి శేషు, సందీప్ కిషన్ నవ దంపతులతో ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం వీరి ఫొటోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి.
సీనియర్ నటుడు జగపతి బాబు సైతం వేడుకకు హాజరై కొత్త జంటకు ఆశీర్వచనాలు అందజేశారు.
నవంబర్ 06 , 2023
వైష్ణవి చైతన్య గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
వైష్ణవి చైతన్య 'బేబి' (2023) చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమైంది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. లవ్మీ, SVCC37 వంటి అప్కమింగ్ చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తోంది. అలవైకుంటపురములో, రంగ్దే, వరుడు కావలెను, ప్రేమదేశం వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. బేబి చిత్రం ద్వారా యువత హృదయాలు గెలుచుకున్న వైష్ణవి చైతన్య గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Vaishnavi chaitanya) విషయాలు ఇప్పుడు చూద్దాం.
వైష్ణవి చైతన్య దేనికి ఫేమస్?
వైష్ణవి చైతన్య 'బేబి' చిత్రం హీరోయిన్గా నటించి గుర్తింపు పొందింది. ఈ సినిమాకంటే ముందు చాలా చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది.
వైష్ణవి చైతన్య వయస్సు ఎంత?
1994, జనవరి 30న జన్మించింది. ఆమె వయస్సు 30 సంవత్సరాలు
వైష్ణవి చైతన్య ముద్దు పేరు?
వైషు
వైష్ణవి చైతన్య ఎత్తు ఎంత?
5 అడుగుల 2 అంగుళాలు
వైష్ణవి చైతన్య ఎక్కడ పుట్టింది?
విజయవాడ
వైష్ణవి చైతన్యకు వివాహం అయిందా?
ఇంకా కాలేదు
వైష్ణవి చైతన్య అభిరుచులు?
యాక్టింగ్, సినిమాలు చూడటం
వైష్ణవి చైతన్యకు ఇష్టమైన ఆహారం?
బిర్యాని, ఐస్క్రీం
వైష్ణవి చైతన్య ఫెవరెట్ హీరో?
పవన్ కళ్యాణ్, రజనీకాంత్
వైష్ణవి చైతన్య ఇష్టమైన హీరోయిన్?
కాజల్ అగర్వాల్
వైష్ణవి చైతన్య ఇష్టమైన కలర్
రెడ్ అండ్ పింక్
వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన తొలి సినిమా?
బేబీ(2023)
వైష్ణవి చైతన్య ఏం చదివింది?
ఇంజనీరింగ్
వైష్ణవి చైతన్య పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ.కోటి వరకు ఛార్జ్ చేస్తోంది.
వైష్ణవి చైతన్య తమ్ముడి పేరు?
నితిష్ చైతన్య
వైష్ణవి చైతన్య సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
వైష్ణవి సినిమాల్లోకి రాకముందు అనేక షార్ట్ ఫిల్మ్స్లో నటించింది. సాఫ్ట్వేర్ డెవలపర్స్ అనే యూట్యూబ్ సిరీస్ ద్వారా గుర్తింపు లభించింది. టిక్టాక్ వీడియోల ద్వారా కూడా ఫేమస్ అయింది.
వైష్ణవి చైతన్య ఇన్స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/vaishnavi_chaitanya_/?hl=en
https://www.youtube.com/watch?v=VVwPCWIGFVs
ఏప్రిల్ 08 , 2024
Allu Arjun: బ్రాండ్ వాల్యూలో ‘పుష్ప’ తగ్గేదేలే.. అల్లు అర్జున్, రష్మిక, పీవీ సింధులకు టాప్ 25లో చోటు
‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన నటుడు అల్లు అర్జున్. ఈ సినిమా అనంతరం ఐకాన్ స్టార్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. దీంతో క్రమక్రమంగా బన్నీ బ్రాండ్ వాల్యూ ఎక్కువైపోయింది. తాజాగా దేశంలో బ్రాండ్ వాల్యూ పరంగా టాప్ 25 సెలబ్రిటీల జాబితాలో అల్లు అర్జున్ చోటు సంపాదించాడు. పుష్పరాజ్తో పాటు శ్రీవల్లిగా నటించిన రష్మిక బ్రాండ్ వాల్యూ కూడా పెరిగిపోయింది. ఈ కన్నడ కుట్టికి టాప్ 25లో చోటు లభించింది. తెలుగు తేజం బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధుకు ఈ జాబితాలో చోటు దక్కడం విశేషం. 2022 సంవత్సరానికి గాను కన్సల్టింగ్ సంస్థ ‘క్రోల్’(kroll) ‘సెలబ్రిటీ బ్రాండ్ వాల్యూయేషన్ స్టడీ’ని విడుదల చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశంలో టాప్ 20వ సెలబ్రిటీగా నిలిచాడు. 3.14 కోట్ల డాలర్ల బ్రాండ్ వాల్యూతో టాప్ 25లో చోటు సంపాదించాడు. ప్రస్తుతం బన్నీ ‘పుష్ప2’ సినిమా షూటింగులో బిజీబిజీగా ఉన్నాడు.
పీవీ సింధు
బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు ఈ జాబితాలో 23వ స్థానం దక్కించుకుంది. ఈ బ్యాడ్మింటన్ ప్లేయర్ బ్రాండ్ వాల్యూ 2.65 కోట్ల డాలర్లు.
రష్మిక మందన్న
పుష్ప బ్యూటీ రష్మిక మందన్న కూడా టాప్ 25 జాబితాలో చోటు సంపాదించింది. 2.53 కోట్ల డాలర్లతో 24వ స్థానంలో నిలిచింది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్లో పలు సినిమాలతో రష్మిక బిజీబిజీగా ఉంది.
రణ్వీర్ సింగ్
18.17 కోట్ల డాలర్లతో రణ్వీర్ సింగ్ తొలి స్థానంలో నిలిచాడు. ఐదేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్న విరాట్ కోహ్లీని అధిగమించాడు. 2021లో రణ్వీర్ బ్రాండ్ వాల్యూ 15.83 కోట్ల డాలర్లు ఉండగా 2022కి 18.17కోట్ల డాలర్లకు చేరుకుంది.
విరాట్ కోహ్లీ
కెప్టెన్సీ వదులుకున్నాక విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ తగ్గిపోతోంది. 2020లో కోహ్లీ బ్రాండ్ వాల్యూ 23.77 కోట్ల డాలర్లు కాగా, 2022 సంవత్సరానికి 17.69 కోట్ల డాలర్లకు పడిపోయింది. దీంతో దేశంలో సెలబ్రిటీల బ్రాండ్ వాల్యూ జాబితాలో రెండో స్థానానికి పరిమితమయ్యాడు.
అక్షయ్ కుమార్
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మూడో స్థానంలో నిలిచాడు. ఇతడి బ్రాండ్ వాల్యూ 15.36 కోట్ల డాలర్లు.
అలియా భట్
లేడీ సెలబ్రిటీల జాబితాలో దేశంలో తొలి స్థానంలో నిలిచిన నటి అలియా భట్. ఓవరాల్గా నాలుగో స్థానంలో నిలిచింది. ఈ బ్యూటీ బ్రాండ్ వాల్యూ 10.29 కోట్ల డాలర్లు.
దీపిక పదుకొణె
8.29 కోట్ల డాలర్లతో దీపిక పదుకొణె 5వ స్థానంలో నిలిచింది. 2021లో 5.16 కోట్ల డాలర్లుగా ఉండేది.
ఎం.ఎస్.ధోనీ
రిటైర్మెంట్ తర్వాత బ్రాండ్ వాల్యూ కాస్త తగ్గింది. 8.03 కోట్ల డాలర్లతో ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు.
అమితాబ్ బచ్చన్
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఏడో స్థానంలో నిలిచాడు. అమితాబ్ బ్రాండ్ వాల్యూ 7.9 కోట్ల డాలర్లుగా ఉంది.
సచిన్ తెందుల్కర్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ బ్రాండ్ వాల్యూ అదేరీతిలో కొనసాగుతోంది. 7.36 కోట్ల డాలర్లతో సచిన్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.
హృతిక్ రోషన్
7.16 కోట్ల డాలర్లతో హృతిక్ రోషన్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు.
షారూక్ ఖాన్
కింగ్ షారూక్ ఖాన్ టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు. 5.57 కోట్ల డాలర్లుతో పదో స్థానంలో నిలిచాడు.
సల్మాన్ ఖాన్
షారూక్ ఖాన్ వెంబడి సల్మాన్ ఖాన్ బ్రాండ్ వాల్యూ ఉంది. 5.45 కోట్ల డాలర్లతో 11వ స్థానం సంపాదించాడు.
రణ్బీర్ కపూర్
సల్మాన్ ఖాన్తో సమానంగా రణ్బీర్ కపూర్ బ్రాండ్ వాల్యూ ఉంది. 5.45 కోట్ల డాలర్లతో సల్లు భాయ్తో 11వ స్థానాన్ని పంచుకున్నాడు రణ్బీర్.
రోహిత్ శర్మ
ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్రాండ్ వాల్యూ 4.95 కోట్ల డాలర్లు. కోహ్లీతో పోల్చితే చాలా తక్కువ. మొత్తంగా జాబితాలో 13వ స్థానంలో ఉన్నాడీ హిట్ మ్యాన్.
ఆయుష్మాన్ ఖురానా
ఆయుష్మాన్ ఖురానా బ్రాండ్ వాల్యూ 4.95 కోట్ల డాలర్లు. బ్రాండ్ వాల్యూ లిస్ట్లో 14వ స్థానంలో ఉన్నాడీ హీరో.
అనుష్క శర్మ
సినిమాలు తక్కువ చేసినప్పటికీ అనుష్క శర్మ బ్రాండ్ వాల్యూ ఏమాత్రం తగ్గలేదు. 4.17 కోట్ల డాలర్లతో అనుష్క 15వ స్థానంలో నిలిచింది.
కియారా అడ్వాణీ
ఇటీవలే పెళ్లి పీటలెక్కింది షేర్షా బ్యూటీ కియారా అడ్వాణీ. 3.83 కోట్ల డాలర్ల బ్రాండ్ వాల్యూతో 16వ స్థానంలో ఉంది.
కరీనా కపూర్, కార్తీక్ ఆర్యన్
కరీనా కపూర్, కార్తీక్ ఆర్యన్ల బ్రాండ్ వాల్యూ 3.65 కోట్ల డాలర్లు. వీరిద్దరూ కలిసి 17వ స్థానాన్ని పంచుకున్నారు.
హార్దిక్ పాండ్యా
భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 18వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ఆల్రౌండర్ బ్రాండ్ వాల్యూ 3.48 కోట్ల డాలర్లు.
సారా, వరుణ్..
సారా అలీ ఖాన్, వరుణ్ ధావన్ 21వ స్థానంలో ఉన్నారు. వీరిద్దరి బ్రాండ్ వాల్యూ 2.8 కోట్ల డాలర్లుగా ఉండటం విశేషం.
నీరజ్ చోప్రా
నీరజ్ చోప్రా బ్రాండ్ వాల్యూ 2.65 కోట్ల డాలర్లు. పీవీ సింధుతో సమానమైన బ్రాండ్ వాల్యూతో ఈ ఒలింపిక్ ఛాంపియన్ 23వ స్థానంలో ఉన్నాడు.
మార్చి 22 , 2023
DIRECTORS: దర్శకులుగా వచ్చి నటులుగా సెటిల్ అయిపోతున్న డైరెక్టర్లు
సినిమా వాళ్ల కెరీర్ అంతా చిత్ర విచిత్రమే. ఎందుకంటే విలన్ అవుదామనుకొని కమెడియన్గా, హీరో అవ్వాలనుకొని దర్శకులుగా, డైరెక్టన్ చేయాలని వచ్చి డాన్స్ మాష్టర్లుగా సెటిల్ అవుతుంటారు. ఇక ఇంకో కేటగిరీ కూడా ఉంది. దర్శకులుగా హిట్లు కొట్టి తర్వాత నటులుగా మారిపోతుంటారు. దండిగా వచ్చే ఆదాయమో లేదా ఇష్టమో కానీ, ఇలా మారిన దర్శకులు చాలామందే ఉన్నారు వాళ్లేవరో చూద్దామా?
సముద్రఖని
సముద్రఖని తొలుత అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చి తమిళ్లో సినిమాలకు దర్శకత్వం వహించాడు. రఘువరన్ బీటెక్ చిత్రంతో పూర్తిస్థాయి నటుడిగా మారారు సముద్రఖని. అప్పట్నుంచి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అలా వైకుంఠపురం చిత్రంతో విలన్గా మారాడు ఈ దర్శకుడు. క్రాక్, బీమ్లా నాయక్, సర్కారు వారి పాట చిత్రాలతో తనలో ఉన్న మరో కోణాన్ని వెలికి తీసి ఇప్పుడు నటుడిగా సెటిల్ అయిపోయాడు.
ఎస్జే సూర్య
పవన్ కల్యాణ్తో ఖుషీ సినిమా తీసిన ఎస్జే సూర్య తెలియనివారు ఉండరు. వివిధ చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు హీరోగానూ చేశాడు సూర్య. మహేశ్ బాబు, మురుగదాస్ కాంబోలో వచ్చిన స్పైడర్ చిత్రంలో విలన్గా విశ్వరూపం చూపించాడు. ఏడుస్తున్న వారిని చూసి నవ్వుతూ సంతోషపడే క్యారెక్టర్ బాగా పేలింది. తర్వాత మెర్సల్, మానాడు వంటి చిత్రాల్లో ఎస్జే సూర్య నటనకి ఫిదా అవ్వాల్సిందే.
గౌతమ్ మీనన్
ఘర్షణ, ఏ మాయ చేశావే, ఎటో వెళ్లిపోయింది మనసు వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన గౌతమ్ మీనన్ నటుడిగా బిజీ అయిపోయాడు. పోలీస్ పాత్రలకు సరిగ్గా సరిపోయే పర్సనాలిటీ గౌతమ్ది. కనులు కనులు దోచే సినిమాలో నెగటివ్ షేడ్ రోల్లో మెప్పించాడు. ఇక సందీప్ కిషన్ హీరోగా వచ్చిన మైఖేల్ చిత్రంలో విలన్గా కనిపించి షాకిచ్చాడు ఈ దర్శకుడు. ఎలాంటి క్యారెక్టర్ అయినా చేసేందుకు సిద్ధమని మిగతా దర్శకులకు హింట్ ఇచ్చేస్తున్నాడు.
భారతీ రాజా
శ్రేదేవితో పదహారేళ్ల వయసు చిత్రం తీసిన దర్శకుడు గుర్తున్నాడా? అంత సులభంగా లెజెండరీ దర్శకుడిని ఎలా మర్చిపోతారు. అతడే భారతీ రాజా. ఆయన ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేశారు. ధనుశ్ హీరోగా వచ్చిన తిరు చిత్రంలో తాతగా నవ్వించారు. ఇటీవల సూపర్హిట్గా నిలిచిన సార్లోనూ చివర్లో గెస్ట్రోల్లో నటించారు భారతీ రాజా.
తరుణ్ భాస్కర్
పెళ్లి చూపులు వంటి మెుదటి సినిమాతోనే హిట్ కొట్టిన దర్శకుడు తరుణ్ భాస్కర్ తర్వాత నటుడిగా అవతారమెత్తాడు. ఫలక్నామా దాస్లో మాస్ పోలీస్ ఆఫీసర్గా, నేను మీకు తెలుసా చిత్రంలో నటనతో ఆకట్టుకున్నాడు. ఏ సినిమాలో ఛాన్స్ వచ్చినా తరుణ్ భాస్కర్ వదులుకోవట్లేదు.
రిషబ్ శెట్టి
కాంతారా హీరో రిషబ్ శెట్టి తెలుసు కదా.. ఆయన మెుదట దర్శకుడు. క్లాప్ బాయ్, స్పాట్ బాయ్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా ఎదిగాడు. హీరో రక్షిత్ శెట్టితో కలిసి రిక్కీ అనే చిత్రం చేయగా.. యావరేజ్ టాక్ వచ్చింది. తర్వాత అదే హీరోతో కిర్రిక్ పార్టీ చిత్రాన్ని తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. కాంతార సినిమాతో ఏకంగా పాన్ ఇండియాను షేక్ చేశాడు రిషబ్ శెట్టి. ఈ సినిమాకు స్వీయ దర్శకత్వం వహించాడు.
ఏప్రిల్ 27 , 2023
Dimple Hayati: ‘రామబాణం’లోనూ తగ్గని డింపుల్ అందాల తెగింపు
‘ఖిలాడీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది తెలుగు గర్ల్ డింపుల్ హయతి. కెరీర్లో ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకెళ్తోంది. నటనపై ఉన్న ఆసక్తితో సినిమాల వైపు అడుగు పెట్టిన ఈ అమ్మాయి ‘రామబాణం’తో దూసుకొస్తోంది. మే 5న ఈ చిత్రం విడుదల కానుంది.
డింపుల్ హయతి పుట్టి పెరిగింది తెలుగు రాష్ట్రాల్లోనూ. విజయవాడలో డింపుల్ జన్మించింది. హైదరాబాద్లో పెరిగింది. తన ఫ్యామిలీలో అంతా నటులు, నృత్యకారులే అంటూ గతంలో చెప్పుకొచ్చింది.
గల్ఫ్ చిత్రంతో 16వ ఏటనే సినిమాల్లోకి అడుగుపెట్టింది. వాస్తవానికి తొలుత ‘డింపుల్’ అని మాత్రమే పేరుండేది. ఆ తర్వాత మరీ చిన్నగా ఉందని న్యూమరాలజీని అనుసరించి డింపుల్ హయతిగా మార్చుకుంది.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. తెలుగులో గల్ఫ్, విశాల్ సామాన్యుడు, ఖిలాడీ, రామబాణం చిత్రాల్లో మెరిసిందీ బ్యూటీ.
కెరీర్లో డింపుల్ హయతి ఒకానొక సమయంలో డిప్రెషన్కు వెళ్లిందట. ఓ పెద్ద సినిమాలో హీరోయిన్గా చేసిందట. కానీ, 90శాతం షూటింగ్ పూర్తి కాగానే సినిమా ఆగిపోయింది. ఈ క్రమంలో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ ఆఫర్ని కూడా వదులుకున్నట్లు డింపుల్ తెలిపింది.
బడా మూవీ ఆగిపోవడంతో డింపుల్ డిప్రెషన్కి వెళ్లింది. ఈ విషయం ‘గద్దలకొండ గణేశ్’ డైరెక్టర్ హరీశ్ శంకర్కి తెలియగా ఐటం సాంగ్లో ఆడిపాడే అవకాశం కల్పించాడు. అనూహ్యంగా ఈ ‘జరా జరా’ సాంగ్ డింపుల్ కెరీర్ను మలుపు తిప్పింది.
ఈ సాంగ్ హిట్ కావడంతో వరుసగా అవే ఆఫర్లు వచ్చాయట. కానీ, నటనా ప్రాధాన్యమున్న సినిమాలు చేయాలని భావించి వీటికి డింపుల్ నో చెప్పిందట. అలా ట్రై చేస్తూ ఉండగా రవితేజ ‘ఖిలాడీ’ ఆఫర్ వచ్చిందట.
ఖిలాడీ చేస్తుండగానే రామబాణం సినిమాకు సైన్ చేసిందీ బ్యూటీ. అలా ఈ సినిమాలో భైరవీగా నటించింది. ఇందులో వ్లాగర్గా కనిపించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏమీ సిద్ధమవలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
డింపుల్ హయతి స్కిన్ టోన్ కారణంగా చాలా అవకాశాలు మిస్సయ్యాయట. ఎదురుగా చెప్పకున్నా, తాను వెళ్లిపోయాక నలుపు రంగులో ఉందంటూ రిజెక్ట్ చేసేవారని గుర్తు చేసుకొనేది. కానీ, ఇప్పుడు ప్రతిభకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం సానుకూల పరిణామమని అభిప్రాయపడింది.
హిందీలో ‘అత్రాంగి రే’ సినిమాలో చిన్న పాత్ర పోషించింది. పరభాషా చిత్రాలు మరిన్ని చేయాలని డింపుల్ అనుకుంటోందట.
డింపుల్కి ఓ పెంపుడు శునకం ఉంది. వాడి పేరు భగీరథ్. తన ఇన్స్టాగ్రాంలో తరచూ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. ఫిట్నెస్కు ప్రియారిటీ ఇస్తుంది. ఆరోగ్యకరమైన ఫుడ్ని తీసుకోవడానికి ఇష్టపడుతుంది.
ఇన్స్టాలో డింపుల్కి 6.5లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం ఓ తెలుగు, తమిళ సినిమాలకు ఓకే చెప్పిందీ బ్యూటీ.
మే 01 , 2023