![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/56390ea8-942c-4e44-ab1d-3481004ae575.jpeg)
UATelugu2h 41m
కేరళకు చెందిన ముగ్గురు బెంగళూరులోని ఇంజనీరింగ్ కాలేజీలో చేరతారు. ఓ రోజు సీనియర్లు వారిని ర్యాగింగ్ చేసి అవమానిస్తారు. దీంతో ప్రతీకారం కోసం వారు మలయాళీ లోకల్ గుండా రంగా (ఫహద్ ఫాసిల్)తో పరిచయం పెంచుకుంటారు. అనూహ్య ఘటనల తర్వాత రంగ వారు రంగాకు శత్రువులుగా మారతారు? ఆ తర్వాత ఏమైంది? రంగా వారిని ఎందుకు చంపాలనుకున్నాడు? అన్నది కథ.
ఇంగ్లీష్లో చదవండి
మూవీ & ఓటీటీ అప్డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Primeఫ్రమ్
ఇన్ ( Malayalam )నాట్ అవైలబుల్ ఇన్ తెలుగు
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Fahadh_Faasil_250_250.jpeg)
ఫహద్ ఫాసిల్
హిప్స్టర్
మిథున్ జై శంకర్
రోషన్ షానవాజ్
మిధుట్టి
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Mansoor_Ali_Khan_(actor).jpeg)
మన్సూర్ అలీ ఖాన్
కృష్ణ కుమార్
నీరజా రాజేంద్రన్
ప్రమోద్ వెలియనద్
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Ashish_Vidyarthi.jpeg)
ఆశిష్ విద్యార్థి
సిబ్బంది
జిత్తు మాధవన్దర్శకుడు
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Nazriya_Nazim_250_250.jpeg)
నజ్రియా నజీమ్
నిర్మాత![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Anwar_Rasheed.jpeg)
అన్వర్ రషీద్
నిర్మాతజిత్తు మాధవన్రచయిత
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Sushin_Shyam_250_250.jpeg)
సుశీన్ శ్యామ్
సంగీతకారుడుసమీర్ తాహిర్
సినిమాటోగ్రాఫర్వివేక్ హర్షన్
ఎడిటర్ర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
![<strong>IMDB 2024 Report: ఐఎండీబీ రిపోర్టులో టాలీవుడ్ హవా.. ఆ మూవీస్ కోసం దేశం మెుత్తం ఎదురుచూస్తోందట!</strong>](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/07/24155958/123.-2024-07-24T155954.976.jpg)
IMDB 2024 Report: ఐఎండీబీ రిపోర్టులో టాలీవుడ్ హవా.. ఆ మూవీస్ కోసం దేశం మెుత్తం ఎదురుచూస్తోందట!
ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) ప్రతీ ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాలు, మోస్ట్ అవైటెడ్ భారతీయ చిత్రాల జాబితాలను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ జాబితాలను ప్రపంచవ్యాప్తంగా IMDBకి ఉన్న 250 మిలియన్లకు పైగా నెలవారీ విజిటర్స్ రియల్ పేజ్ వ్యూస్ ఆధారంగా రూపొందించారు. 2024లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ మూవీగా 'కల్కి 2898 AD' నిలవగా, అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రంగా 'పుష్ప 2: ది రూల్' నిలిచాయి. ఐఎండీబీ రిపోర్టుకు సంబంధించిన పూర్తి విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
2024లో మోస్ట్ పాపులర్ చిత్రాలు ఇవే!
ఐఎండీబీ మోస్ట్ పాపులర్ మూవీస్ - 2024 జాబితాలో ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) అగ్రస్థానంలో నిలిచింది. మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన 'మంజుమ్మెల్ బాయ్స్' (Manjummel Boys) మూవీ ఈ జాబితాలో రెండో స్థానం కైవసం చేసుకుంది. హృతిక్ రోషన్, దీపికా పదుకునే కలిసి నటించిన 'ఫైటర్' (Fighter) మూవీ 3వ స్థానంలో నిలవగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన 'హనుమాన్' (Hanuman) సినిమా నాలుగో స్థానం సంపాదించింది. అజయ్ దేవగన్, ఆర్.మాధవన్, జ్యోతిక కలిసి నటించిన 'సైతాన్' (Shaitaan) ఆ తర్వాతి ప్లేస్ లో ఉంది. కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్' (Laapataa Ladies) 6వ స్థానం, యామీ గౌతమ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన 'ఆర్టికల్ 370' (Article 370) 7వ స్థానం, నస్లేన్ కె. గఫూర్, మమితా బైజు జంటగా నటించిన మలయాళ మూవీ 'ప్రేమలు' (Premalu) 8వ స్థానంలో నిలిచాయి. మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ హీరోగా చేసిన 'ఆవేశం' (Aavesham), హీందీలో మంచి విజయం సాధించిన 'ముంజ్య' (Munjya)చిత్రాలు 9, 10 స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.
https://twitter.com/IMDb_in/status/1815619130948771914
2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలు
IMDB రిలీజ్ చేసిన ‘మోస్ట్ యాంటిసిపేటెడ్ అప్ కమింగ్ ఇండియన్ మూవీస్’ (Most Anticipated Upcoming Indian Movies Of 2024) జాబితాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం టాప్లో నిలిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న 'దేవర' (Devara) చిత్రం సెకండ్ ప్లేస్ దక్కించుకుంది. అక్షయ్ కుమార్ నటిస్తున్న 'వెల్ కమ్ టూ ది జంగిల్' (Welcome To The Jungle), కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ (Vijay) హీరోగా నటిస్తున్న 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (The Greatest Of All Time) సినిమాలు వరుసగా 3, 4 స్థానాల్లో ఉన్నాయి.
తమిళ హీరో సూర్య నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ 'కంగువ' (Kanguva) ఐదో స్థానంలో నిలవగా, అజయ్ దేవగన్ నటిస్తున్న ‘సింగం అగైన్’ (Singam Again) ఆరో స్థానంలో ఉంది. కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న 'భూల్ భూలయ్యా 3', చియాన్ విక్రమ్ 'తంగలాన్', 'ఔరోన్ మే కహన్ దమ్ థా', 'స్త్రీ 2' ఆ తర్వాతి స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.
https://twitter.com/IMDb_in/status/1815645100988379418
జూలై 24 , 2024
![Fahadh Faasil: పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్కు అరుదైన వ్యాధి.. లక్షణాలు ఇవే!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/05/28163822/ace32361d7dafd451cc41660a2e870ba.jpg)
Fahadh Faasil: పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్కు అరుదైన వ్యాధి.. లక్షణాలు ఇవే!
‘పుష్ప’ (Pushpa) సినిమాతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) అందరి దృష్టిని ఆకర్షించాడు. సినిమాలో చివరి 30 నిమిషాలు అల్లు అర్జున్ (Allu Arjun)తో పోటీ పడి మరి నటించాడు. విలన్ షేడ్స్ ఉన్న ఎస్పీ భన్వర్సింగ్ షెకావత్ పాత్రలో ఫహాద్ను తప్ప మరొకరిని ఊహించుకోలేము. ఆ స్థాయిలో ఆయన తన పాత్రపై ముద్ర వేశాడు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ కావడంతో ఫహాద్కు నేషనల్ వైడ్గా క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం అతడు వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఫహాద్ తాజాగా ఓ అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
ఫహాద్కు వచ్చిన వ్యాధి ఇదే!
మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్.. అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD)అనే వ్యాధి బారిన పడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా తెలియజేసిన ఫహాద్.. ఇది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పారు. దీని వల్ల దేనిపైనా ఎక్కువ శ్రద్ద పెట్టలేకపోతున్నట్లు చెప్పారు. కొన్నిసార్లు అతి ప్రవర్తన, తొందరగా ఆవేశపడటం వంటివి గమనించినట్లు చెప్పారు. తన సమస్య గురించి డాక్టర్ను అడిగినట్లు ఫహాద్ తెలిపాడు. 41 ఏళ్ల వయసులో దీనికి చికిత్స చేయించుకోవచ్చా లేదా అన్న వివరాలు తెలుసుకుంటున్నట్లు వివరించాడు.
ADHD వ్యాధిని ఎలా గుర్తించాలి?
ADHD రుగ్మత పిల్లల్లో చాలా సాధారణం. కానీ, పెద్దల్లో మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆజాగ్రత్తగా తప్పులు చేయడం, స్థిరంగా ఒక చోట కూర్చోలేకపోవడం, పరిగెత్తడం, గెంతడం, అతిగా మాట్లాడటం, తరచూ చేతులు కాళ్లు కదిలిస్తూ ఉండటం చెప్పిన విషయాలు మర్చిపోవడం, అర్థం చేసుకోలేకపోవడం,, ప్రతీ దానికి తొందరపడటం, ఇతరుల వస్తువులను అనుమతి లేకుండా తీసుకోవడం వంటివి ఈ వ్యాధి లక్షణాలుగా వైద్యులు చెబుతుంటారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.
ADHD వ్యాధి ఎలా వస్తుంది?
ఒక వ్యక్తి ADHD వ్యాధి ఎలా వస్తుందని చెప్పడానికి నిర్దిష్ట కారణాలు ఏవీ లేవని వైద్యులు తెలిపారు. పూర్తి స్థాయి చికిత్స కూడా అందుబాటులో లేదు. ఇప్పటికీ దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రుగ్మతతో బాధపడే పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారుతుంటుంది. ఇటువంటి పిల్లలను నియంత్రించడానికి థెరపీ, కొన్ని మందులు అవసరం. అవసరమైతే మానసిక నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది. అటు పెద్దలు కూడా ఇదే ఫార్మూలాను అనుసరించాల్సి ఉంటుందని సమాచారం.
కెరీర్లో బిగ్గెస్ట్ హిట్
ఇటీవలే ‘ఆవేశం’ (Aavesham) సినిమాతో ఫహాద్ ఫాజిల్ సూపర్ హిట్ను అందుకున్నాడు. ఆ సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. జీతూ మాధవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రూ. రూ.150 కోట్లు కొల్లగొట్టింది. ఈ ఏడాది భారీ వసూళ్లు చేసిన మలయాళ చిత్రాల జాబితాలో నిలిచింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఫహాద్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
ప్రస్తుతం ఫహాద్.. అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 'పుష్ప 2' (Pushpa 2: The Rule) లో నటిస్తున్నాడు. మొదటిభాగంతో పోలిస్తే రెండో పార్ట్లో ఆయన పాత్ర నిడివి ఎక్కువగా ఉండనుంది. హీరోకు, ఆ పాత్రకు మధ్య చాలా యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయి. ఇప్పటికే ఆయనకు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం. భారీ అంచనాల మధ్య ఈ సీక్వెల్ ఆగస్టు 15న విడుదలకు సిద్ధమైంది. అలాగే తమిళంలో 'మారీసన్' (Maareesan), రజనీకాంత్తో 'వట్టైయాన్' (Vettaiyan) చిత్రంలో నటిస్తున్నాడు.
మే 28 , 2024
![Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/05/18163443/Untitled-design-8.png)
Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
ప్రస్తుతం భారతీయ సినిమా మరింత సరళంగా మారింది. ఒక భాషలో రిలీజైన సినిమాలను మరో భాషలోని ప్రేక్షకులు చూసి ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి గత రెండేళ్లలో తెలుగులోకి చాలా చిత్రాలు వివిభ భాషల నుంచి డబ్ అయ్యాయి. వాటిలో సూపర్ హిట్ అయిన మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలతో పాటు అవి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉన్నాయో ఓసారి చూద్దాం.
[toc]
Best malayalam movies in telugu
ప్రేమలు
రీసెంట్గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. యూనిక్ కథాంశంతో యూత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం కథంతా హైదరాబాద్ కేంద్రంగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక సినిమా కథలోకి వెళ్తే..సచిన్.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని కలలు కంటాడు. వీసా రిజెక్ట్ కావడంతో గేట్ కోచింగ్ కోసం హైదరాబాద్ వస్తాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అప్పటికే లవ్లో ఫెయిలైన సచిన్.. రీనూకు తన ప్రేమను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవరు? సచిన్ - రీనూ చివరకు కలిశారా? లేదా? అన్నది కథ.
మంజుమ్మెల్ బాయ్స్
ఈ చిత్రం మంచి ఎమోషనల్ బ్యాక్డ్రాప్లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. కేరళ కొచ్చికి చెందిన కుట్టన్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్లో భాగంగా గుణ కేవ్స్కు వెళ్తారు. అక్కడ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్ను కాపాడి తీసుకురావడానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ.
ఆవేశం
ఇటీవల మలయాళంలో బ్లాక్ బాస్టర్ అయిన ఆవేశం చిత్రం అన్ని భాషల్లోనూ అదే హవా కొనసాగించింది. ఈ చిత్రం ఏకంగా రూ.150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కామెడీ యాక్షన్ జొనర్లో వచ్చి మంచి ఎంటర్టైనింగ్ అందించింది. ఈ సినిమా కథలోకి వెళ్తే..కేరళకు చెందిన బీబీ (మిథున్ జై శంకర్), అజు (హిప్స్టర్), మరియు శాంతన్ (రోషన్ షానవాజ్) ముగ్గురు స్నేహితులు బెంగళూరులోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతుంటారు. కాలేజీలో సీనియర్లు కారణం లేకుండా కొడుతుంటారు. దీంతో వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఈక్రమంలో గ్యాంగ్స్టర్ అయిన రంగాతో(ఫాహద్ ఫాసిల్) ఫ్రెండ్షిప్ చేస్తారు. రంగా స్నేహం వారి జీవితాలను ఏవిధంగా మార్చిందనేది కథ.
ది గోట్ లైఫ్
ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ
RDX
మార్షియల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది.
2018
కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన చిత్రమిది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఆంథోని జోసెఫ్ డైరెక్ట్ చేశాడు.
కింగ్ అఫ్ కొత్త
ఖన్నా భాయ్ (డ్యాన్స్ రోజ్ షబీర్) కోతా పట్టణంలో డ్రగ్స్ వ్యాపారి. సిఐ షాహుల్ హాసన్ (ప్రసన్న) పట్టణంలో డ్రగ్స్ మాఫియాను నిర్మూలించాలని కంకణం కట్టుకుంటాడు. కొన్నేళ్ల క్రితం కోతా... రాజు (దుల్కర్ సల్మాన్) నియంత్రణలో ఉందని, ఒకప్పుడు ఖన్నా భాయ్ రాజుకి ప్రియమైన స్నేహితుడని షాహుల్ తెలుసుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల రాజు మరియు ఖన్నా భాయ్ ఇద్దరూ విడిపోయారు. వారిని వేరు చేసింది ఏమిటి? అప్పుడు సీఐ షాహుల్ హాసన్ ఏం చేశాడు? అనేది కథ
రోమాంచం
రోమాంచం చిత్రం మలయాళంలో వచ్చిన కామెడీ హర్రర్ చిత్రం. ఈ చిత్రాన్ని జితు మాధావన్ తెరకెక్కించారు. ఈ సినిమా నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. కథలోకి వెళ్తే…. బెంగుళూరులోని ఓ ఇంట్లో ఉండే ఏడుగురు బ్యాచిలర్ స్నేహితుల కథే ఈ చిత్రం. అందులో ఒకరు ఉద్యోగం చేస్తుంటారు, మరొకరు వ్యాపారాలు చేస్తూ విఫలమవుతుంటాడు. ఇద్దరు ఇంటర్వ్యూని క్రాక్ చేస్తారు కానీ ఇంకా ఆఫర్ లెటర్ అందదు. ఒకరు పెట్రోల్ పంపులో పనిచేస్తున్నారు. మిగిలిన ఇద్దరూ ఏమీ చేయకుండా తమ జీవితాలను సాగిస్తుంటారు. ఇలా సాగుతున్న వీరి జీవితాల్లోకి ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంటుంది. ఇంతకీ ఎంటా పరిణామం? దాని వల్ల వీరి జీవితాలు ఎలా మారాయి అనేది కథ.
భ్రమయుగం
తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్మూటీ (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు? అన్నది కథ.
అన్వేషిప్పిన్ కండెతుమ్
ఈ సినిమా మంచి సస్పెన్స్ను క్యారీ చేస్తూ.. ఆసక్తికరంగా కథనం సాగుతుంది. ఎస్సై ఆనంద్ నారాయణ్ ఓ కారణం చేత సస్పెండ్ అవుతాడు. ఓ యువతి హత్య కేసు మిస్టరీగా మారుతుంది. దీంతో ట్రాక్ రికార్డ్ ఆధారంగా ఆనంద్ను రంగంలోకి దింపుతారు. ఈ కేసును హీరో ఎలా సాల్వ్ చేశాడు? విచారణకు వెళ్లిన ఆనంద్కు ప్రజలు ఎందుకు సహకరించలేదు? అన్నది స్టోరీ.
మలైకోట్టై వాలిబన్
స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిని ఎదురించి పోరాడిన ఓ నాయకుడి కథతో ఈ మూవీ తెరకెక్కింది. ఈ పోరాటంలో వాలిబాన్ (మోహన్లాల్)కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఆ ప్రాంత ప్రజలకు అతడు హీరోగా ఎలా నిలిచాడు? అన్నది కథ.
నెరు
కళ్లు కనిపించని సారా మహ్మద్ అనే యువతిపై ఒక బడా వ్యాపారి కొడుకు అత్యాచారం చేస్తాడు. పోలీసులు అతడ్ని అరెస్టు చేసినప్పటికీ నిందితుడు తన పలుకుబడితో వెంటనే బెయిల్పై బయటకొస్తాడు. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్ విజయ్ మోహన్ (మోహన్లాల్)ని ఆశ్రయిస్తారు. అతడు సారాకు ఎలా న్యాయం చేశాడు? అన్నది కథ.
మాలికాపురం
ఎనిమిదేళ్ల చిన్నారి షన్ను అయ్యప్ప స్వామి భక్తురాలు. షన్ను కుటుంబంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. దీంతో సోదరుడు బుజ్జితో కలిసి షన్ను శబరిమలై బయలుదేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? పిల్లలు కిడ్నాప్ చేసే గ్యాంగ్ షన్నును ఎలా ఇబ్బంది పెట్టింది? కథలో ఉన్ని ముకుందన్ పాత్ర ఏంటి? అన్నది కథ.
Best Tamil movies in telugu
డియర్
అర్జున్ (జీవి ప్రకాష్) న్యూస్ రీడర్గా గొప్ప పేరు తెచ్చుకునేందుకు యత్నిస్తుంటాడు. అయితే నిద్రలో చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కిపడి లేస్తుంటాడు. అటువంటి అర్జున్ లైఫ్లోకి భార్యగా దీపిక వస్తుంది. ఆమెకున్న గురక సమస్య.. అర్జున్కు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? అన్నది కథ.
ఓటీటీ: నెట్ఫ్లిక్స్
సైరన్
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించనప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక సినిమా కథలోకి వెళ్తే..భార్యను (అనుపమ)ను చంపిన కేసులో తిలగన్ (జయం రవి) జైలుకు వెళ్తాడు. పెరోల్పై బయటకొచ్చిన తిలగన్.. వరుసగా పొలిటిషియన్స్ను హత్య చేస్తుంటాడు. పోలీస్ ఆఫీసర్ నందిని (కీర్తిసురేష్) అతడ్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. అసలు తిలగన్ ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు? తన భార్యను తిలగన్ నిజంగానే చంపాడా? లేదా? అన్నది కథ.
ఓటీటీ: హాట్ స్టార్
లియో
హిమాచల్ ప్రదేశ్లోని ఓ చిన్న పట్టణంలో పార్తీబన్ (విజయ్) కాఫీ షాప్ నడుపుతుంటాడు. భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలతో అతడి జీవితం సంతోషంగా సాగుతుంటుంది. ఈ క్రమంలోనే ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను పార్తీబన్ కాపాడటంతో అతడి ఫోటోలు పేపర్లలో వస్తాయి. ఇదే సమయంలో ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) & గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. లియో దాస్గా ఉన్న పార్తీబన్ కోసం వెంటాడుతారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? అతని గతం ఏమిటి? అనేది మిగిలిన కథ.
ఓటీటీ: నెట్ఫ్లిక్స్
జైలర్
ఈ చిత్రం సరైన హిట్లేక సతమతమవుతున్న రజినీకాంత్కు సాలిడ్ విజయాన్ని అందించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. చాలా రోజుల తర్వాత వింటేజ్ రజనీకాంత్ ఈ సినిమాలో కనిపిస్తాడు. ముత్తు వేలు(రజనీకాంత్) నీతి నిజాయితి కలిగిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి. అతని కొడుకు ఏసీపీ అర్జున్ తండ్రిలాగే నీతి నిజాయితి కలిగిన పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకుంటాడు. ఈక్రమంలో విగ్రహాల దొంగతనం ముఠా నాయకుడు వర్మ(వినాయకన్) వల్ల అర్జున్ చనిపోతాడు. ఆ తర్వాత ముత్తు వేలు ఏం చేశాడు? వర్మపై ఏవిధంగా ప్రతికారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ.
ఓటీటీ; హాట్ స్టార్
విక్రమ్
ఈ సినిమా మరోసారి వింటేజ్ కమల్ హాసన్ను గుర్తు తెచ్చింది. ప్రతి ఫ్రేమ్లోనూ కమల్ హాసన్ తన యాక్టింగ్తో అదరగొట్టాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక కథలోకి వెల్తే.. డ్రగ్ మాఫియా కేసును విచారిస్తున్న ఏజెంట్ విక్రమ్ సస్పెండ్ అయిన తర్వాత అండర్ గ్రౌండ్కు వెళ్తాడు. ఈ క్రమంలో డ్రగ్ మాఫియా డాన్ సంతానం మిస్ అయిన ఓ భారీ డ్రగ్ కంటైనర్ కోసం వెతుకుతుంటాడు. అండర్గ్రౌండ్లో ఉన్న విక్రమ్ తన కొడుకు చావుకు కారణమైన వ్యక్తిని చంపుతాడు. అసలు విక్రమ్ కొడుకును చంపిందెవరు? డ్రగ్ కంటైనర్ను దక్కించుకునేందుకు సంతానం ఎలాంటి క్రూరత్వాన్ని ప్రదర్శించాడు? విక్రమ్, సంతానం మధ్య వైరం ఎందుకొచ్చింది అన్నది మిగతా కథ.
ఓటీటీ; హాట్ స్టార్, జీ5
కాల్వన్
ఓ అడవిలో రాత్రి వేళ హత్యలు జరుగుతుంటాయి. కెంబన్ ఆ అడవి సమీపంలో అనాథలా జీవిస్తూ రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తుంటాడు. హీరోయిన్ అతడి జీవితంలోకి రావడం.. కెంబన్ గురించి ఓ నిజం తెలుసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.
ఓటీటీ: హాట్స్టార్
అయాలన్
భవిష్యత్లో ఇంధన అవసరం చాలా ఉందని గ్రహించిన ఆర్యన్ (శరద్ ఖేల్కర్) భూమిని చాలా లోతుకు తవ్వాలని అనుకుంటాడు. దీంతో భూమిపై ఉన్న జీవరాశులకు ముప్పు ఉందని గ్రహించిన ఓ ఏలియన్ భారత్లో ల్యాండ్ అవుతుంది. అలా వచ్చిన ఏలియన్కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో శివకార్తికేయన్కు ఏలియన్కు మధ్య సంబంధం ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: సన్ నెక్ట్స్
మెర్రీ క్రిస్మస్
ఆల్బర్ట్ (విజయ్ సేతుపతి) ఏడేళ్ల తర్వాత బాంబేకు వస్తాడు. ఓ సినిమాకు వెళ్లగా అక్కడ కూతురుతో వచ్చిన మరియా (కత్రినా కైఫ్)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె క్రిస్మస్ వేడుకలకు ఇంటికి ఆహ్వానిస్తుంది. అయితే ఇంట్లో మరియా భర్త హత్యకు గురై కనిపిస్తాడు. ఆ హత్య చేసింది ఎవరు? ఆల్బర్ట్ గతం ఏంటి? అన్నది స్టోరీ.
ఓటీటీ: నెట్ఫ్లిక్స్
అన్నపూర్ణి: ది గాడెస్ ఆఫ్ ఫుడ్
ఈ చిత్రం కాస్త వివాదాస్పదం అయింది. తమిళంలో హిట్ అయినప్పటికీ.. మిగతా భాషల్లో పెద్దగా ఆడలేదు. ఇక సినిమా కథలోకి వెళ్తే.. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్ చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి తండ్రిని చూసి చెఫ్ కావాలని అనుకుంటుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె నాన్ వెజ్ ముట్టుకోవడం పాపం అని తండ్రి అంటాడు. మరి కలలు కన్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? లేదా? అన్నది కథ.
జపాన్
ఈ చిత్రం కార్తీ నటించిన 25వ చిత్రం. ఈ సినిమాలో పేరుమోసిన దొంగ పాత్రలో కార్తీ అద్భుతంగా నటించాడు. అతని పాత్ర హెలెరియస్గా ఉంటుంది. హైదరాబాద్లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అంతా అనుమానిస్తారు. జపాన్ను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు వెతుకుతుంటారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్ కోసం గాలిస్తుంటారు. తన ప్రేయసిని కలిసే ప్రయత్నంలో జపాన్ దొరికిపోతాడు. అయితే ఆ సొత్తు జపాన్ దొంగలించలేదని విచారణలో తేలుతుంది. మరి ఆ నగల దొంగతనం చేసింది ఎవరు?
ఓటీటీ: నెట్ఫ్లిక్స్
కెప్టెన్ మిల్లర్
కథ 1930 బ్యాక్డ్రాప్లో సాగుతుంది. ఈసా (ధనుష్) నిమ్న కులానికి చెందిన యువకుడు. ఊరిలోని కుల వివక్షను భరించలేక గౌరవ మర్యాదల కోసం బ్రిటీష్ ఆర్మీలో చేరతాడు. తన పేరును కెప్టెన్ మిల్లర్గా మార్చుకుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో మిల్లర్ దొంగల గ్యాంగ్లో చేరి బ్రిటిష్ వారికి కావాల్సిన బాక్స్ను ఎత్తుకెళ్తాడు. దీంతో బ్రిటిష్ ఆర్మీ అధికారి మిల్లర్ను పట్టుకోవడం కోసం అతడి ఊరి ప్రజల్ని బందిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మిల్లర్ ఊరి ప్రజల కోసం తిరిగి వచ్చాడా? మిల్లర్ కొట్టేసిన బాక్స్లో ఏముంది? సినిమాలో శివరాజ్కుమార్, సందీప్ కిషన్ పాత్రలు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
చిన్నా
మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం చేసుకునే చిన్నా ( సిద్ధార్థ్) తన అన్న చనిపోవడంతో... అతని కూతురు చిట్టి (సహస్ర శ్రీ) బాధ్యతలు తీసుకుంటాడు. ఈ క్రమంలో చిట్టి స్నేహితురాలేన మున్ని(సబియా) లైంగిక దాడికి గురవుతుంది. లైంగిక దాడి చేసింది చిన్నానే అని ఓ వీడియో బయటకు వస్తుంది. ఇంతలో చిట్టి కనిపించకుండా పోతుంది. నిజంగా మున్నిపై లైంగిక దాడి చేసింది చిన్నానేనా? అదృశ్యమైన చిట్టిని చిన్నా ఎలా కనిపెడుతాడు? అనేది మిగతా కథ
800
ఈ చిత్రంలో తొలుత విజయ్ సేతుపతి నటించినప్పటికీ.. తమిళనాడు నుంచి పెద్దఎత్తున ఆందోళనలు రావడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక కథలోకి వెళ్తే.. తేయాకు తోటల్లో పనిచేస్తున్న తమిళ కుటుంబంలో ముత్తయ్య మురళీధరన్ జన్మిస్తారు. శ్రీలంకలోని కాండీలో ఆ కుటుంబం బిస్కెట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే సింహళులు, తమిళుల మధ్య ఘర్షణలు చెలరేగుతాయి. దాంతో ముత్తయ్య కుటుంబం ప్రాణ భయంతో దూరంగా వెళ్లి తలదాచుకుంటుంది. 70వ దశకంలో చెలరేగిన ఘర్షణల ప్రభావం తన బిడ్డపై పడకూడదని ముత్తయ్య తల్లిదండ్రులు ఏం చేశారు? ముత్తయ్యకి క్రికెట్పై ఆసక్తి ఎలా ఏర్పడింది? శ్రీలంక జట్టులో ఎలా చోటు సంపాదించాడు? ఎలాంటి అవమానాల్ని, సవాళ్లని ఎదుర్కొని ఆటగాడిగా నిలబడ్డాడు? అనేది మిగతా కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
మార్క్ ఆంటోనీ
మార్క్ (విశాల్) మెకానిక్గా పనిచేస్తుంటాడు. అతని స్నేహితుడు చిరంజీవి( సెల్వ రాఘవన్) ఒక టెలిఫోన్ మిషన్ను కనుగొంటాడు. ఆ టెలిఫొన్ మెషిన్ ద్వారా భూతకాలానికి చెందిన వ్యక్తులతో మాట్లాడవచ్చు. అయితే మార్క్ చనిపోయిన తన తండ్రి ఆంటోనికి కాల్ చేయాలనుకుంటాడు. ఆ క్రమంలో మార్క్ తన తండ్రిని కొంతమంది చంపాలనుకుంటున్నారన్న విషయం తెలుసుకుంటాడు.
ఓటీటీ: ప్రైమ్
నాయకుడు
అణగారిన వర్గానికి చెందిన మహారాజు రామాపురం ఎమ్మెల్యే. అయితే, అతడు, అతని కుమారుడు రఘు వీరకు కొన్నేళ్ల నుంచి మాట్లాడుకోవడం మానేశారు. మహారాజు జీవితంలో జరిగిన ఒక సంఘటన తండ్రి కోసం పోరాడేందుకు రఘుని ప్రేరేపిస్తుంది. ఇంతకు ఆ సమస్య ఏమిటి? వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఎందుకు మానేశారు?చివరికి ఏమి జరిగింది అనేది మిగిలిన కథ
ఓటీటీ: నెట్ఫ్లిక్స్
సార్
బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ
ఓటీటీ: నెట్ఫ్లిక్స్
Best Kannada movies in telugu
కబ్జ
ఆర్కేశ్వర (ఉపేంద్ర), భారత వైమానిక దళ అధికారి, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. అతను సంపన్నమైన అమ్మాయి అయిన మధుమతి (శ్రియా శరణ్)ను ప్రేమిస్తాడు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇదేక్రమంలో అమరాపురను తమ అధికారం కోసం భయంకరమైన గూండాలు మరియు రాజకీయ నాయకులు ఓ క్రైమ్ వరల్డ్గా మార్చేస్తారు. అయితే అర్కేశ్వర క్రైమ్ ప్రపంచంలోకి ప్రవేశించి ఆ ప్రాంతానికి నాయకుడు ఎలా అవుతాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనేది మిగతా కథ.
సప్తసాగరాలు దాటి సైడ్ బి
మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి వచ్చాక ఓ ఉద్యోగంలో చేరతాడు. తాను ప్రేమించిన ప్రియ (రుక్మిణి వసంత్) జ్ఞాపకాలే గుర్తుకు వస్తుండటంతో తనని వెతుకుతాడు. ప్రియ భర్త గోపాల్ దేశపాండే వ్యాపారంలో నష్టాలు రావడంతో తాగుడికి బానిసైపోయి ఇంటిని పట్టించుకోడు. దీంతో ప్రియ కష్టపడుతూ ఇంటిని నడుపుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా లేదని తెలిసిన మను ఆమెని సంతోషంగా ఉంచడానికి ఏం చేశాడు ? వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాడు? అన్నది మిగతా కథ.
ఓటీటీ; ప్రైమ్ వీడియో
ఘోస్ట్
బిగ్ డాడీ అలియాస్ ఘోస్ట్ తన గ్యాంగ్తో కలిగి ఓ జైలును ఆక్రమిస్తాడు. మాజీ సీబీఐ అధికారి వామన్ శ్రీనివాస్ కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రభుత్వం చరణ్ రాజ్ని రంగంలోకి దించుతుంది. ఇంతకీ ఈ బిగ్ డాడీ ఎవరు ? అతని గతం ఏమిటి ? అసలు అతను ఘోస్ట్గా ఎందుకు మారాడు ? అన్నది మిగతా కథ.
ఓటీటీ: జీ5
బాయ్స్ హాస్టల్
ఓ బాయ్స్ హాస్టల్లో తన ఫ్రెండ్స్తో కలిసి ఉండే అజిత్ (ప్రజ్వల్) ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. తమని టార్చర్ చేసే హాస్టల్ వార్డెన్ను తన ఫ్రెండ్స్తో కలిసి చంపేసినట్లుగా స్క్రిప్ట్లో రాసుకుంటాడు. అయితే నిజంగానే వార్డెన్ చనిపోతాడు. సుసైడ్ నోట్లో అజిత్, అతడి ఫ్రెండ్స్ పేరు రాయడంతో కథ మలుపు తిరుగుతుంది.
ఓటీటీ: ఈటీవీ విన్
కాటేరా
ఈ సినిమా కన్నడ నాట బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక కథలోకి వెళ్తే.. భూస్వామిని చంపిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కాటేరా (దర్శన్) పెరోల్ మీద బయటకు వస్తాడు. దీంతో కాటేరాను చంపేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. వారందరూ ఎవరు? కాటేరా భూస్వామిని ఎందుకు చంపాడు? భూస్వాములతో కాటేరాకు ఏంటి విరోధం? అన్నది కథ.
ఓటీటీ: జీ5
టోబి
టోబి చిన్నప్పటి నుంచి ఎన్నో వేధింపులకు గురవుతాడు. కోపం వస్తే అందరితో దారుణంగా ప్రవరిస్తుంటాడు. నిజానికి అమాయకుడైన టోనీని ఊరిపెద్ద ఆనంద హత్యలు చేసేందుకు ఉపయోగించుకుంటాడు. తనను వాడుకుంటున్నారని తెలుసుకున్న టోబి ఏం చేశాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
ఓటీటీ: సోనీ లీవ్
Best Hindi movies in telugu
అమర్ సింగ్ చమ్కిలా
జానపద గాయకుడు అమర్ సింగ్ చమ్కిలా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పేద కుటుంబంలో జన్మించిన ఆయన సింగర్ కావడాని కసితో ఎలా ఎదిగాడు? 27 ఎళ్లతో ఎంతో ఫేమస్ అయిన అతన్ని ఎవరు చంపారు అన్నది మిగతా కథ.
ఓటీటీ: నెట్ఫ్లిక్స్
యానిమల్
ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సినిమాలో సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విజయంతో రణ్బీర్ కపూర్ మార్కెట్ దేశవ్యాప్తంగా పెరిగింది. దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
ఓటీటీ: నెట్ఫ్లిక్స్
మైదాన్
1952లో జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో భారత ఫుట్బాల్ జట్టు.. విఫలమవుతుంది. దీంతో జట్టును టార్గెట్ చేస్తూ విమర్శలు వస్తాయి. అప్పుడు కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ (అజయ్ దేవగన్) ఏం చేశాడు? కొత్త ఆటగాళ్లతో తన ప్రయాణాన్ని ఎలా మెుదలుపెట్టాడు? ఒలింపిక్స్లో ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన చేసింది? భారత జట్టు కోచ్గా అతడు ఏం సాధించాడు? అన్నది కథ.
ఓటీటీ: నెట్ఫ్లిక్స్
లస్ట్ స్టోరీస్ 2
లస్ట్ స్టోరీస్ 2లో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. మొదటి కథలో మృణాల్, అంగన్ బేడీ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెద్దలు కూడా ఒప్పుకుంటారు. అయితే మృణాల్ నానమ్మ.. పెళ్లికి ప్రేమ కంటే బలమైన శారీరక సంబంధం ముఖ్యమని స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత మృణాల్- బేడీ ఎం చేశారన్నది ఫస్ట్ కథ. రెండో కథలో ఓనర్ లేనప్పుడు పనిమనిషి తన భర్తను తెచ్చుకుని లైంగికానందం పొందుతుంది. అయితే వీరిద్దరిని చూసిన ఓనర్ ఏం చేసింది అనేది రెండో కథ. ఇక మూడో కథలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ వర్మ కొన్నేళ్ల తర్వాత తమన్నను కలుస్తాడు. వీరిద్దరు శారీరకంగా దగ్గరైన తర్వాత ఏం జరిగింది అనేది కథ. నాల్గొ కథలో కామంతో రగిలిపోతున్న తన భర్త విషయంలో కాజల్ ఏమి చేసింది అనేది కథ.. ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని చెప్పవచ్చు.
ఓటీటీ: నెట్ఫ్లిక్స్
మర్డర్ ముబారక్
రాయల్ ఢిల్లీ క్లబ్లో ఓ మృతదేహం కలకలం సృష్టిస్తుంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ సింగ్ రంగంలోకి దిగుతాడు. క్లబ్లో సభ్యులుగా ఉన్న బాంబి (సారా అలీఖాన్), నటి షెహనాజ్ నూరాని (కరిష్మా కపూర్), రాయల్ రన్విజయ్ (సంజయ్ కపూర్), లాయర్ ఆకాష్ (విజయ్ వర్మ)లపై అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇంతకీ ఆ మర్డర్ చేసింది ఎవరు? దర్యాప్తులో తేలిన అంశాలేంటి? అన్నది కథ.
ఓటీటీ: నెట్ఫ్లిక్స్
భక్షక్
జర్నలిస్టు వైశాలి.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్థానిక వార్తలు అందిస్తుంటుంది. ఊరిలోని అనాథ బాలికల వసతి గృహంలో లైంగిక దాడులు జరుగుతున్నట్లు ఆమెకు తెలుస్తుంది. అయితే దానిని రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి నిర్వహిస్తుంటాడు. అతడి దారుణాలను వైశాలి ఎలా బయటపెట్టింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: నెట్ఫ్లిక్స్
గంగూభాయి కతియావాడి
ఈ చిత్రం అలియా భట్ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. గంగూబాయి హర్జీవందాస్ (అలియా భట్) గుజరాత్లోని ఓ పెద్ద కుటుంబంలో పుడుతుంది. ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని ఆసరా చేసుకున్న గంగుభాయ్ లవర్ ఆమెను ముంబై తీసుకొచ్చి అక్కడ వేశ్య గృహానికి అమ్మేస్తాడు. తప్పని పరిస్థితుల్లో ఆమె వేశ్యగా కొనసాగుతుంది. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత.. గంగూబాయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏమిటి? వేశ్యల అభ్యున్నతి ఆమె ఏం చేసింది అనేది మిగతా కథ.
ఓటీటీ; నెట్ఫ్లిక్స్
83
1983 నాటి క్రికెట్ ప్రపంచకప్ను ఇండియా గెలుచుకున్న నేపథ్యాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఆ క్రమంలో ఆటగాళ్లు ఎదురుకున్న సమస్యలు, ప్రత్యర్థుల నుంచి వచ్చిన సవాళ్ళను ఎలా అధిగమించారు ? ఎలా కప్ గెలిచారు ? అనేది మిగతా కథ
ఓటీటీ; డిస్నీ హాట్ స్టార్
జవాన్
సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తాను ఎవర్ని అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? పిల్లాడితో అతనికి ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ.
ఓటీటీ: నెట్ఫ్లిక్స్
గదర్ 2
బాలీవుడ్లో చిత్రాలు వరుసగా ప్లాఫ్ అవుతున్న క్రమంలో వచ్చిన ఈ సినిమా విజయం ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. తారా సింగ్ (సన్నీ డియోల్) భారత సరిహద్దుల్లో కనిపించకుండా పోతాడు. పాక్ అతడ్ని బంధించిందని భావించిన అతడి కొడుకు.. మారువేషంలో శత్రు దేశానికి వెళ్తాడు. అనూహ్యాంగా ఇంటికి తిరిగొచ్చిన తారా సింగ్.. కొడుకు పాక్లో ఉన్న సంగతి తెలుసుకుంటాడు. బిడ్డను కాపాడేందుకు పాక్ వెళ్తాడు. అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
మే 20 , 2024
![Fahadh Faasil: ‘పుష్ప’ సినిమాపై ఫహాద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్.. ఒరిగిందేమి లేదని అసంతృప్తి!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/05/07135749/Untitled-design-2024-05-07T135725.194.jpg)
Fahadh Faasil: ‘పుష్ప’ సినిమాపై ఫహాద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్.. ఒరిగిందేమి లేదని అసంతృప్తి!
టాలీవుడ్ ఖ్యాతిని పాన్ ఇండియా లెవల్కు తీసుకెళ్లిన చిత్రాల్లో పుష్ప ఒకటి. ఇందులో బన్నీ కెరీర్ బెస్ట్ నటనతో ఆకట్టుకున్నాడు. ఇందులో విలన్గా చేసిన మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్తెలుగుతో పాటు జాతీయ స్థాయిలో అందరికీ పరిచయమయ్యాడు. బన్నీ తర్వాత ఆ స్థాయిలో పుష్పలో ఆకట్టుకున్నాడు ఫహాద్ ఫాసిల్. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్యూలో ఫాహాద్ ఫాజిల్ పుష్ప చిత్రంపై సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.
‘పుష్ప నాకు చేసిందేమీ లేదు’
తాజాగా ఫిల్మ్ కంపానియన్కు ఇచ్చిన ఇంటర్యూలో కేరళ నటుడు ఫహాద్ ఫాజిల్ మాట్లాడాడు. ‘పుష్ప’ సినిమాపై యాంకర్ అడిగిన ప్రశ్నలకు షాకింగ్ రిప్లై ఇచ్చాడు. ‘పుష్ప’ తర్వాత ఫహాద్.. కేరళ హద్దులు దాటి పాన్ ఇండియా నటుడిగా మారారని అనుకుంటున్నట్లు యాంకర్ అన్నారు. ఇందుకు అందుకు ఫహాద్ బదులిస్తూ.. ’అలాంటిదేమీ లేదు. పుష్ప నాకు చేసిందేమీ లేదు. ఇదే విషయం సుక్కు సర్కు కూడా చెప్పాను. అందులో దాచుకోవాల్సిందేమీ లేదు. నేను ఇక్కడ మలయాళంలోనే సినిమాలు చేస్తున్నాను. ఎవరినీ అగౌరవపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. కానీ ఇది నిజం. పుష్పతో నా నుంచి ప్రేక్షకులు మ్యాజిక్ ఆశిస్తారని అనుకోవడం లేదు’ అని అన్నారు.
‘సుకుమార్ కోసమే ఒప్పుకున్నా’
ఓ సందర్భంలో మీతో పాటు కూర్చోడానికి బాలీవుడ్ నటుడు కాస్త వెనకడుగు వేశాడని.. మీ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిందని యాంకర్.. ఫహాద్తో అన్నారు. పుష్ప వల్లనే మీరు ఈ స్థాయికి చేరారని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. అప్పుడు ఫహాద్ స్పందిస్తూ.. ‘పుష్ప కేవలం సుకుమార్పై ఉన్న ప్రేమతో మాత్రమే చేశా. ఇప్పుడు మలయాళం తెలియని ప్రేక్షకులు కూడా మలయాళ సినిమాలు చూస్తున్నారు. అది నాలో ఉత్సాహం నింపుతోంది. అంతే తప్ప పుష్ప నన్ను ఎక్కడికో తీసుకెళ్లింది అని మాత్రం నేను అనుకోవడం లేదు’ అని ఫహాద్ స్పష్టం చేశాడు.
నా ఫేవరేట్ స్టార్స్ వారే: ఫహాద్
యాంకర్ అడిగిన మరో ప్రశ్నకు సమాధానమిస్తూ తాను పాన్ ఇండియా స్టార్ను కాదని కేవలం నటుడిని మాత్రమేనని ఫహాద్ తేల్చి చెప్పాడు. ఇక తనకు రాజ్ కుమార్ మంచి నటుడని తెలిపాడు. రణ్బీర్ కపూర్ దేశంలోనే అత్యుత్తమ యాక్టర్ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల ఫహాద్ నటించిన ఆవేశం చిత్రం బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఫహాద్ పుష్ప 2 సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కానుంది.
మే 07 , 2024
![This Week Movies: ఈ వారం రాబోతున్న ఇంట్రస్టింగ్ చిత్రాలు/సిరీస్లు.. ఓ లుక్కేయండి!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/05/06120749/Untitled-design-2024-05-06T120635.994.jpg)
This Week Movies: ఈ వారం రాబోతున్న ఇంట్రస్టింగ్ చిత్రాలు/సిరీస్లు.. ఓ లుక్కేయండి!
ఎప్పటిలాగే ఈ వారం (This Week Movies) కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్సిరీస్లు ఎంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు
కృష్ణమ్మ
టాలీవుడ్ నటుడు సత్యదేవ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’ (Krishnamma). వివి గోపాల కృష్ణ దర్శకుడు. అథిరా రాజ్ హీరోయిన్గా చేసింది. ఈ చిత్రాన్ని అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. మే 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి.
ప్రతినిధి 2
నారా రోహిత్ కథానాయకుడిగా మూర్తి దేవగుప్తపు తెరకెక్కించిన చిత్రం ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2). ఈ సినిమాలో సిరీ లెల్లా కథానాయిక. గతంలో వచ్చిన ‘ప్రతినిధి’ చిత్రానికి కొనసాగింపుగా ఈ మూవీ రూపొందింది. సప్తగిరి, దినేష్ తేజ్, జిషు సేన్ గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. మే 10న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. వాస్తవానికి ఏప్రిల్ 25న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
జితేందర్ రెడ్డి
ఉయ్యాల జంపాల ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో రూపొందిన లేటేస్ట్ చిత్రం ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). రాకేశ్ వర్రే కథానాయకుడిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమాను నిర్మించారు. 1980లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా మూవీని తీర్చిదిద్దారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆరంభం
మోహన్ భగత్ , సుప్రిత సత్యనారాయణ్ , భూషణ్ కళ్యాణ్ , రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆరంభం’ (Aarambham). వి. అజయ్ నాగ్ (Ajay Nag) దర్శకత్వం వహించారు. ఎమోషనల్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏవీటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై అభిషేక్ వీటీ ఈ చిత్రాన్ని నిర్మించారు.
కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్
హాలీవుడ్లో ‘రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ ఫ్రాంఛైజీ నుంచి వచ్చే చిత్రాలకు భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ సిరీస్లో వస్తోన్న నాల్గో చిత్రం ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ (kingdom of the planet of the apes). వెస్బాల్ దర్శకుడు. మే 10న ఈ సినిమా ఇంగ్లిష్తో పాటు, భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది. ‘మనుషులపై యుద్ధం ప్రకటించిన ప్రాక్సిమస్ సీజర్ అనే కోతితో ఓ యువతి ఎలాంటి పోరాటం చేసింది. అందుకు మరో కోతి ఎలాంటి సహకారం అందించింది’ అన్నది కథ.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / సిరీస్లు
గీతాంజలి మళ్లీ వచ్చింది
హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గీతాంజలి మళ్లీ వచ్చింది' (Geethanjali Malli Vachindi). 2014లో వచ్చిన ‘గీతాంజలి’ చిత్రానికి కొనసాగింపుగా ఈ సినిమా రూపొందింది. ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మే 8 నుంచి ఆహా వేదికగా ఓటీటీలో రాబోతోంది. మరి ఓటీటీ ప్రేక్షకులను ఏమేరకు ఈ చిత్రం అలరిస్తుందో చూడాలి.
ఆవేశం
పుష్ప ఫేమ్ విలన్ ఫహాద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో చేసిన లేటెస్ట్ చిత్రం 'ఆవేశం'. ఇటీవల మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ఏకంగా రూ.130 కోట్ల కలెక్షన్లు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కాగా ఈ చిత్రాన్ని మే 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా ఓటీటీలోకి తీసుకున్నారు. తెలుగు, మలయాళంతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో ఈ సినిమాలో అందుబాటులోకి రానుంది.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateBodkin SeriesEnglishNetflixMay 09Mother Of The BrideMovieEnglishNetflixMay 09Thank You NextSeriesEnglishNetflixMay 09AaveshamMovieTelugu/MalayalamAmazon primeMay 09The GoatSeriesEnglishAmazon primeMay 09YodhaMovieHindiAmazon primeMay 108AM MetroMovieHindiZee 5May 10All Of Us StrangersMovieEnglishDisney+HotstarMay 8Un Dekhi 3SeriesHindiSonyLIVMay 10RomeoMovieTamilAhaMay 10Dark MatterSeriesEnglishApple Plus TvMay 8Hollywood Con QueenSeriesEnglishApple Plus TvMay 8
మే 06 , 2024
![Pedda Kapu 1 Review: డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గ్రేట్ కమ్బ్యాక్ ఇచ్చినట్లేనా? సినిమా ఎలా ఉందంటే!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/09/29141016/Untitled-design-2023-09-29T140938.529.jpg)
Pedda Kapu 1 Review: డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గ్రేట్ కమ్బ్యాక్ ఇచ్చినట్లేనా? సినిమా ఎలా ఉందంటే!
నటీనటులు: విరాట్ కర్ణ, ప్రగతి శ్రీ వాస్తవ, శ్రీకాంత్ అడ్డాల, రావు రమేష్, నాగ బాబు, రాజీవ్ కనకాల, ఈశ్వరి రావు, ఆడుకలం నరేన్
డైరెక్టర్: శ్రీకాంత్ అడ్దాల
సంగీతం: మిక్కీ జే. మేయర్
సినిమాటోగ్రఫీ: ఛోటా కే. నాయుడు
నిర్మాత: మిర్యాల రమేష్, మిర్యాల సత్యనారాయణ
క్లాస్ దర్శకుడిగా పేరొందిన శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ ఫిల్మ్ ‘పెదకాపు 1’ (Peda Kapu 1). టైటిల్ని బట్టి చాలామంది ఈ సినిమా ఓ సామాజిక వర్గం నేపథ్యంలో రూపొందిందని అనుకుంటున్నారు. కానీ, ఇది క్యాస్ట్కు సంబంధించి కాదు ఓ సామాన్యుడి సంతకం అని దర్శకుడు స్పష్టం చేశారు. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యుడు విరాట్ కర్ణ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రగతి శ్రీవాస్తవ కథానాయిక. ఈ సినిమాతో శ్రీకాంత్ అడ్డాల తన పంథా మార్చడం ఓ విశేషమైతే ఇందులో నెగెటివ్ ఛాయలున్న పాత్రలో ఆయన నటించడం మరో విశేషం. అయితే ఈ చిత్రం ఇవాళ (సెప్టెంబర్ 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా పూర్తి రివ్యూ మీకోసం.
కథ:
1980లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన సందర్భం అది. లంక గ్రామాన్ని సత్యరంగయ్య (రావు రమేష్), బయన్న (నరేన్) అనే ఇద్దరు వ్యక్తులు శాసిస్తుంటారు. హింసని ప్రేరేపిస్తూ తమ అధికారం కోసం మిగతా జనాల్ని బలిపశువులుగా మారుస్తుంటారు. పెదకాపు (విరాట్ కర్ణ) తన అన్నతో కలిసి సత్యరంగయ్య వద్ద పని చేస్తుంటారు. అనుకోని పరిస్థితిలో సత్యరంగయ్య తరపున పెదకాపు అన్న జైలుకి వెళ్ళాల్సివస్తుంది. అలా జైలుకి వెళ్ళిన పెదకాపు అన్న కనిపించకుండా పోతాడు. ఈ క్రమంలోనే 1983 సంవత్సరంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభిస్తాడు. బడుగు, బలహీన వర్గాలు సంక్షేమం కోసం సరైన వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్లాన్ చేస్తారు. ఈ పరిస్థితుల్లో ఆ గ్రామంలో ఆవేశంతోపాటు ఆలోచన ఉన్న పెద్దకాపు (విరాట్ కర్ణ) తెలుగుదేశం జెండాను గ్రామంలోని నడిబొడ్డున పాతి సత్య రంగయ్య, బయన్నకు సవాల్ విసురుతాడు. పెదకాపు.. వారిని ఎలా ఎదిరించాడు? లంక గ్రామాల్లో అల్లర్లు చేలరగడానికి కారణం ఏమిటి? ఈ కథలో కన్నబాబు ( శ్రీకాంత్ అడ్డాల), అక్కమ్మ (అనసూయ), పార్టీ ఇంచార్జ్ (నాగబాబు) పాత్రల స్వభావం ఏమిటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా సాగిందంటే?
ఫస్టాఫ్లోని ప్రథమ భాగమంతా గోదావరి జిల్లాలో కులాల కొట్లాటల చుట్టే తిరుగుతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టడంతో బడుగు, బలహీన వర్గాల తరపున హీరో టీడీపీ జెండాను పాతే ఎపిసోడ్ సినిమాకు హైలెట్గా నిలుస్తుంది. ఆ సీన్ కథలోని ఇంటెన్సిటీ ఏమిటో చెబుతుంది. ఇక సత్య రంగయ్య, బయన్న అరాచకాలు, వాటి మధ్య నలిగే గ్రామీణ ప్రజలు, పెద్దకాపు నేతగా ఎదిగే తీరును ఫస్టాఫ్లో డైరెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. అయితే కొన్ని సీన్లు మరి సాగదీతల అనిపిస్తాయి. ఇక సెకండాఫ్లో కథ ఊపందుకుంటుంది. సత్య రంగయ్య హఠాన్మరణం, పెద్దకాపు అన్నయ్య కిడ్నాప్, పెద్దకాపు కాబోయే వదిన హత్య, అనసూయ ఎంట్రీ సినిమాను మరో రేంజ్కు తీసుకెళ్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు కథలో ఎమోషన్స్, యాక్షన్ దట్టించిన విధానం సినిమాలోని ఇంటెన్సిటీని ఎలివేట్ చేసేందుకు దోహదపడ్డాయి. అనసూయ పాత్ర సినిమాకు మరింత బలాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు.
ఎవరేలా చేశారంటే
పెదకాపు పాత్ర చేసిన విరాట్ కర్ణకు ఇదే తొలి సినిమా అయినప్పటికీ నటుడిగా తనకు మంచి భవిష్యత్ ఉందని అతడు నిరూపించుకున్నాడు. యాక్షన్ సీన్స్లో బాగా నటించాడు. చాలా సహజంగా కనిపించే ప్రయత్నం చేశాడు. అయితే ఎమోషన్ సీన్స్, భారీ డైలాగులు చెప్పేటప్పుడు మాత్రం కాస్త తడబడినట్లు కనిపించింది. హీరోయిన్ ప్రగతి పాత్రకు యాక్టింగ్ స్కోప్ లేకపోవడంతో తెరపై ఆమె కంట్రీబ్యూషన్ తక్కువే. ఇక సినిమాకు అనసూయ నటనే హైలెట్ అని చెప్పవచ్చు. అక్కమ్మ పాత్రలో ఆమె ఇరగదీసింది. అయితే రంగమ్మత్తలా ఓన్ చేసుకునే పాత్ర ఐతే కాదు. సత్యరంగయ్య పాత్రలో రావు రమేష్ అదరగొట్టాడు. బయన్న పాత్రలో నరేన్ కూడా మంచి నటన కనబరిచారు. కన్నబాబు పాత్రలో శ్రీకాంత్ అడ్దాల నిజంగానే సర్ప్రైజ్ చేశారు. తనికెళ్ల భరణి, నాగబాబు, రాజీవ్ కనకాల ఎప్పటిలాగే తమ నటనతో మెప్పించారు.
టెక్నికల్గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సి ఛోటా కె. నాయుడు కెమెరా పనితనం. ఆయన తన నైపుణ్యంతో సినిమాకు కలర్ఫుల్ రంగులు అద్దారు. నిజంగా కొత్త గోదావరిని చూపించారు. జెండాపాతే సన్నివేశం, గౌరీ ఉరి సన్నివేశం, జాతర పాటని చిత్రీకరించిన తీరు చాలా బావుంది. మిక్కీ జె. మేయర్ పాటలు సినిమాకి కలిసిరాలేదు. నేపథ్య సంగీతం మాత్రం బావుంది. మాటలు, పాటలతో కథ చెప్పే శ్రీకాంత్ అడ్డాల ఆ విషయంలో కాస్త గతి తప్పినట్లు కనిపించింది. ఒకట్రెండు మినహా సినిమాలో గుర్తుండిపోయే డైలాగులు పెద్దగా కనిపించవు. నిర్మాణ విలువలు బాగున్నాయి. నాణ్యత విషయంలో నిర్మాతలు రాజీపడినట్లు ఎక్కడా కనిపించదు.
ప్లస్ పాయింట్స్
స్క్రీన్ ప్లేవిరాట్, అనసూయ నటననేపథ్య సంగీతంసినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
సాగదీత సీన్స్పాటలు
రేటింగ్ : 3/5
సెప్టెంబర్ 29 , 2023
![Gaddar Super Hit Songs: పాటలతో ఉద్యమస్ఫూర్తిని రగిలించిన గద్దర్.. ఈ సాంగ్స్ వింటే పూనకాలే!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/08/07112831/Untitled-design-44.jpg)
Gaddar Super Hit Songs: పాటలతో ఉద్యమస్ఫూర్తిని రగిలించిన గద్దర్.. ఈ సాంగ్స్ వింటే పూనకాలే!
ప్రజా గాయకుడు గద్దర్ (74) తుది శ్వాస విడిచారు. హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఆగస్టు 6) కన్నుమూశారు. అయిదే గద్దర్ గురించి ఈ తరం వారికి పెద్దగా తెలియనప్పటికీ కిందటి తరం వారికి ఆయన గొప్ప విప్లవకారుడు. ముఖ్యంగా ఆయన స్వరం ప్రజల్లో చైతన్యాన్ని నింపుతుంది. ఆయన సాహిత్యం.. పౌరులను ఆలోచింపజేస్తుంది. తన ఆటపాటలతో ప్రజా ఉద్యమాలను నడిపించిన గొప్ప ధీశాలి గద్దర్. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ గద్దర్ తన పాటలతో ఆకట్టుకున్నారు. అయితే ఆయన సాంగ్స్ ఎందుకంత స్పెషల్. ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన పాటలు ఏవి? ఈ కథనంలో చూద్దాం.
బండెనక బండి కట్టి
గద్దర్ పాడిన వాటిలో 'బండెనక బండి కట్టి' అనే పాట చాలా స్పెషల్. 'మా భూమి' సినిమాలోని ఈ పాట అప్పట్లో ఓ ఊపు ఊపింది. జనాలు ఈ గీతాన్ని, టేప్ రికార్డుల్లో మళ్లీ మళ్లీ వినేలా చేసింది. ఈ సాంగ్తో గద్దర్ ఒక్కసారిగా అందరిలో దృష్టిలో పడ్డారు.
https://www.youtube.com/watch?v=8T3F4IuYarM
మల్లెతీగకు పందిరివోలె
1995లో వచ్చిన 'మల్లె తీగకు పందిరివోలె’ పాట సైతం గద్దర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ పాటను గద్దర్ స్వయంగా రాశారు. ఈ సాంగ్ ఏకంగా లిరిక్ రైటర్ కేటగిరీలో నంది అవార్డుని సైతం సొంతం చేసుకుంది. వందేమాతరం శ్రీనివాస్ ఈ పాట పాడారు. ఆర్. నారాయణ మూర్తి నటించిన 'ఒరేయ్ రిక్షా' సినిమాలోనిది ఈ పాట.
https://www.youtube.com/watch?v=8BxYfk0WhYI
పొడుస్తున్న పొద్దుమీద
గద్దర్ పాడిన ‘పొడుస్తున్న పొద్దుమీద’ పాట తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది. ఈ పాట విన్న ఎంతో మంది యువకులు ఉద్యమం వైపు నడిచారు. ఈ పాటకు గాను బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ కేటగిరీలో గద్దర్ నంది అవార్డు అందుకున్నారు. 'జై బోలో తెలంగాణ' అనే సినిమాలోనిది ఈ సాంగ్.
https://www.youtube.com/watch?v=vywBbz6QL7g
నా రక్తంతో నడుపుతా
ఓరేయ్ రిక్షా సినిమాలోని ‘నా రక్తంతో నడుపుతాను రిక్షాను’ అనే పాట కూడా అప్పట్లో ఎంతగానో పాపులర్ అయ్యింది. గద్దర్ ఆవేశంతో రాసిన లిరిక్స్కు అంతకు మించిన నటనతో ఆర్. నారాయణమూర్తి రక్తి కట్టించారు.
https://www.youtube.com/watch?v=XhbiuSTugNc
అమ్మ తెలంగాణా
తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను తెలియజేస్తూ ‘అమ్మా తెలంగాణమా.. ఆకలి కేకల గానమా’ అనే పాటను రాశారు. తన స్వరంతో ఆ సాంగ్కు ప్రాణం పోశారు. ఇది విన్న తెలంగాణ ప్రజలు కదం తొక్కారు. ఉద్యమం వైపు కాలు కదిపారు. ఈ పాటను రాష్ట్ర గీతంగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించడం విశేషం.
https://www.youtube.com/watch?v=pXgjUMosLWY
మరిన్ని పాటలు
పైన పేర్కొన్న పాటలతో పాటు 'అడవి తల్లికి వందనం', 'పొద్దు తిరుగుడు పువ్వా', 'భద్రం కొడుకో', 'జం జమలబరి', 'మేలుకో రైతన్న' లాంటి గీతాలు ఇప్పటికీ సంగీత ప్రియుల్ని అలరిస్తూనే ఉన్నాయి. గద్దర్ ఇలా చనిపోవడం అందరినీ బాధపెట్టినా సరే ఆయన పాటలు ఎప్పటికీ మనతోనే ఉంటాయనేది నిజం.
ఆగస్టు 07 , 2023
![Tollywood: రాకేష్ మాస్టర్పై ఇంత చిన్నచూపా?... టాలీవుడ్లో కనీసం ఒక్క హీరో అయినా స్పందించారా? మీకంటే వాళ్లే నయం!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/06/20120254/Untitled-design-2023-06-20T120250.258.png)
Tollywood: రాకేష్ మాస్టర్పై ఇంత చిన్నచూపా?... టాలీవుడ్లో కనీసం ఒక్క హీరో అయినా స్పందించారా? మీకంటే వాళ్లే నయం!
టాలీవుడ్లో ఒకప్పటి స్టార్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్( Rakesh Master) ఆదివారం తుది శ్వాస విడిచారు. చాలా రోజుల నుంచి రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం ఉదయం హన్-మ్యాన్ అనే సినిమా షూటింగ్లో ఆయనకు రక్త విరేచనాలు అయ్యాయి. అక్కడే రాకేష్ మాస్టర్ను పరిశీలించిన వైద్యులు ఆరోగ్యం విషమించినట్లు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్ను మూశారు.
అయితే ఆయన మృతిపై ఏ ఒక్క టాలీవుడ్ ప్రముఖుడు సంతాప సందేశం విడుదల చేయలేదు. రామ్గోపాల్ వర్మ నుంచి చిరంజీవి వరకు ఏ ఒక్కరు స్పందించలేదు. రాకేష్ మాస్టర్ చిన్న వ్యక్తి ఏమి కాదు.. దాదాపు 1500 సినిమాలకు కొరియోగ్రఫి చేశారు. ప్రభాస్, రామ్పొత్తినేని, రవితేజ, వేణు వంటి హీరోలు, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, సత్య మాస్టర్ వంటి స్టార్ కొరియోగ్రాఫర్లు కేరీర్ ఆరంభంలో ఆయన నుంచి డ్యాన్స్ మెళకువలు నేర్చుకున్నవారే. రామ్పొత్తినేని నటించిన దేవదాసు మూవీకి రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. కనీసం ఆయన పనిచేసిన సినిమాలకు చెందిన నిర్మాతలు కానీ, హీరోలు కానీ స్పందిస్తే బాగుండేది.
వివాదాలే ఒంటరిని చేశాయి..
యూట్యూబ్ వేదికగా రాకేష్ మాస్టర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని అనేకమంది హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామ్ గోపాల్ వర్మ, ఎన్టీఆర్, శ్రీరెడ్డి, బాలకృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు, మంచు లక్ష్మిలను లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. అలాగే తన శిష్యులైన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లపై పలు ఇంటర్వ్యూల్లో అసభ్య పదజాలంతో దూషించారు. వారికి అవకాశాలు ఇచ్చి అందలం ఎక్కిస్తే.. చివరికి తనను పట్టించుకోలేదని చాలా సార్లు కంటతడి పెట్టుకున్నారు. ముక్కుసూటి తనం, నిజాలను నిర్భయంగా చెప్పడం వంటి లక్షణాలు ఆయన్ను ఇండస్ట్రీ నుంచి దూరం చేశాయి. దీంతో ఆయనకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.
పొట్ట కూటి కోసం..
అవకాశాలు తగ్గడంతో పొట్ట కూటి కోసం రాకేష్ మాస్టర్ డ్యాన్స్ స్కూల్ రన్ చేశారు. దీంతో పాటు SRK ENTERTAINMENT అనే యూట్యూబ్ ఛానెల్ను ఓపెన్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫాలోవర్లను భారీగా పెంచుకున్నారు. డ్యాన్స్ ఈవెంట్లతో పాటు జబర్దస్త్ లాంటి కామెడీ షోల్లో నటించారు. ఒకనొకప్పుడు ఖరీదైన కార్లలో కనిపించిన రాకేష్ మాస్టర్.. చనిపోయే నాటికి అద్దె ఇంట్లో ఉండే పరిస్థితికి పడిపోయారు.
వ్యక్తిగతంగా ఎలా ఉన్నా.. రాకేష్ మాస్టర్ మాత్రం సేవా దృక్పథం కలవారు. కోవిడ్ సమయంలో తన దగ్గర ఉన్న డబ్బునంత ఖర్చు చేశారు. రోజుకు 200 మందికి అన్నదానం చేశారు. వారికి కావాల్సిన సామాగ్రిని కొనిచ్చారు. ఇంత చేసినా ఏరోజు ఆయన బయటకు చెప్పుకోలేదు.
వీళ్లే నయం..!
తాను చనిపోతానని ముందే తెలిసిన రాకేష్ మాస్టర్... చివరి రోజులు ఆనందంగా గడపాలని నిర్ణయించుకున్నారు. సోషల్ మీడియా స్టార్లతో ఓ పొగ్రాంను ఏర్పాటు చేశారు. ఆవేశం స్టార్, స్వాతినాయుడు, అగ్గిపెట్ట మచ్చతో కలిసి 'మ్యాన్షన్ హౌత్ విత్ మై హౌస్' అనే షోలో చాలా సంతోషంగా గడిపారు. తమను చేరదీసి ఆశ్రయం కల్పించిన రాకేష్ మాస్టర్ మృతి చెందటంతో వారంతా కన్నీరుమున్నీరయ్యారు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మాత్రం రాకేష్ మాస్టర్ కడసారి చూపుకు నోచుకున్నారు. రాకేష్ మాస్టర్ భౌతిక కాయాన్ని చూసి శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ బోరున విలపించారు.
ఏ సంబంధం లేనివారే ఇంత బాధపడితే... ఆయన నుంచి సినిమాలు చేయించుకున్న ప్రొడ్యూసర్లు, హీరోలు, డైరెక్టర్లు కనీసం ఒక్క సంతాప సందేశం కూడ విడుదల చేయకపోవడం నిజంగా విచారకరం. చనిపోయిన వ్యక్తితో ఎన్ని వివాదాలు ఉన్నా, ఎంత శత్రుత్వం ఉన్నా... ఆ వ్యక్తి చనిపోయాడు కదా..! మీ మీ బిజీ షెడ్యూల్స్ వల్ల రాకేష్ మాస్టర్ కడసారి చూపుకు వెళ్లకపోయినా కనీసం మానవత్వం చాటుకోవాల్సిన బాధ్యత ఇండస్ట్రీ పెద్దలకు లేదా? అని సినీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
జూన్ 20 , 2023
![Highest Box office collections 2024: దేశంలోనే నెం.1 చిత్రంగా ‘హనుమాన్’.. హృతిక్, మహేష్ను వెనక్కినెట్టిన తేజ సజ్జ!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/05/22173126/Untitled-design-2024-05-22T173120.686.jpg)
Highest Box office collections 2024: దేశంలోనే నెం.1 చిత్రంగా ‘హనుమాన్’.. హృతిక్, మహేష్ను వెనక్కినెట్టిన తేజ సజ్జ!
ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ (Teja Sajja) హీరోగా నటించిన ‘హనుమాన్’ జాతీయ స్థాయిలో విశేష ఆదరణ పొందింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. తెలుగు సినిమా ఖ్యాతిని మరో స్థాయికి తీసుకెళ్లడంలో తనవంతు పాత్ర పోషించింది. అటు థియేటర్లతో పాటు ఓటీటీ, టెలివిజన్ ప్రీమియర్స్లోనూ సత్తా చాటింది. ఈ క్రమంలోనే ‘హనుమాన్’ మరో ఘనత సాధించింది. దేశంలో ఈ ఏడాది ఇప్పటివరకూ విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. యంగ్ హీరో తేజ సజ్జా కలెక్షన్ల పరంగా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ (Hrithik Roshan), మహేష్ బాబు (Mahesh Babu), అజయ్ దేవగణ్ (Ajay Devgan) చిత్రాలను వెనక్కి నెట్టాడు. ఈ ఏడాది హైయస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్-10 చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
హనుమాన్ (HanuMan)
తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన హనుమాన్ చిత్రం.. వరల్డ్ వైడ్గా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఈ సినిమాను రూ.40 కోట్ల బడ్జెట్తో నిర్మించడం గమనార్హం. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో.. అమృత అయ్యర్ హీరోయిన్గా చేసింది. వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా ‘జీ 5’ (Zee 5)లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఫైటర్ (Fighter)
హృతిక్ రోషన్ (Hrithik Roshan), దీపికా పదుకొనే (Deepika Padukone), అనిల్ కపూర్ (Anil Kapoor) ప్రధాన పాత్రల్లో చేసిన బాలీవుడ్ చిత్రం 'ఫైటర్'.. ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. సుమారు రూ.250 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద రూ. 337.2 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ వేదికగా హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది.
మంజుమ్మెల్ బాయ్స్ (Manjummel Boys)
మలయాళం సెన్సేషన్ ‘మంజుమ్మెల్ బాయ్స్’.. ఈ ఏడాది దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. రూ.20 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా రూ.242.3 కోట్లు కొల్లగొట్టింది. అటు మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా ఆల్టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఇది హాట్స్టార్లో తెలుగు భాషలో స్ట్రీమింగ్లో ఉంది.
షైతాన్ (Shaitaan)
బాలీవుడ్ లేటెస్ట్ చిత్రం 'షైతాన్' ఈ జాబితాలో నాల్గో స్థానంలో ఉంది. అజయ్ దేవగణ్ (Ajay Devgan), మాదవన్ (Madhavan), జ్యోతిక ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ.. రూ.211.06 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా బడ్జెట్ రూ.40 కోట్లు. ఇందులో విలన్గా కనిపించిన మాధవన్.. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ‘షైతాన్’ మూవీ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో హిందీ భాషలో అందుబాటులో ఉంది.
గుంటూరు కారం (Guntur Kaaram)
మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'గుంటూరు కారం'.. ప్రస్తుత జాబితాలో టాప్ - 5లో నిలిచింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్గా రూ. 171.5 కోట్లు రాబట్టింది. ఇందులో మహేష్కు జోడీగా శ్రీలీల నటించింది. ప్రకాష్ రాజ్, జయరామ్, రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా ఉన్నారు. ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో వీక్షించవచ్చు.
ది గోట్ లైఫ్ (The Goat Life)
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) లీడ్ రోల్లో చేసిన 'ది గోట్ లైఫ్'.. తెలుగులో ఆడు జీవితం అనే పేరుతో విడుదలైంది. ఈ మూవీ వరల్డ్వైడ్గా రూ.158.15 కోట్లు సాధించి టాప్ - 6లో నిలిచింది. ఈ మూవీ నిర్మాణానికి రూ. 82 కోట్లు ఖర్చు అయ్యింది. కాగా, ఈ మూవీ మే 26 నుంచి హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్లోకి రానుంది.
క్రూ (Crew)
టబూ, కరీనా కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో చేసిన 'క్రూ' (Crew) ఈ ఏడాది మంచి వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. రూ.75 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.156.36 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం మే 24 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్లోకి రానుంది.
ఆవేశం (Aavesham)
ఈ ఏడాది విడుదలై మంచి వసూళ్లు సాధించిన మలయాళ చిత్రం ‘ఆవేశం’. పుష్ప ఫేమ్ ఫహద్ ఫాజిల్ (Fahad Faasil) లీడ్ రోల్లో చేసిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్గా రూ. 155 కోట్లు రాబట్టింది. ఈ చిత్ర నిర్మాణానికి రూ. 30 కోట్లు ఖర్చు అయ్యింది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్లో ఉంది.
ప్రేమలు (Premalu)
మలయాళం సెన్సేషన్ ప్రేమలు కూడా.. రూ.136 కోట్ల వసూళ్లు సాధించి ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. రూ. 3 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రంలో నస్లెన్ కె. గఫూర్, మమితా బైజు ముఖ్యపాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ + హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో వీక్షించవచ్చు.
టిల్లు స్క్వేర్ (Tillu Square)
సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా చేసిన లెటేస్ట్ చిత్రం.. టిల్లు స్క్వేర్ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో టాప్ 10లో నిలిచింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్గా రూ.135 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో సిద్ధూకు జోడీగా అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) చేసింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్లో ఉంది.
మే 22 , 2024
![Shaakuntalam Review: శకుంతలగా సమంత ఓకే.. మరి డైరెక్టర్గా గుణశేఖర్ సక్సెస్ అయ్యాడా?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/04/15164751/Review-copy61-1.jpg)
Shaakuntalam Review: శకుంతలగా సమంత ఓకే.. మరి డైరెక్టర్గా గుణశేఖర్ సక్సెస్ అయ్యాడా?
నటినటులు: సమంత, దేవ్ మోహన్, మోహన్బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ల, ప్రకాశ్రాజ్, గౌతమి, అల్లు అర్హ
దర్శకత్వం: గుణశేఖర్
సంగీతం : మణిశర్మ
సినిమాటోగ్రఫీ: శేఖర్ వి. జోసెఫ్
నిర్మాణ సంస్థ: గుణ టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరైన సమంత గతేడాది ‘యశోద’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అయితే ఆ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన కలెక్షన్స్ రాలేదు. ఈ నేపథ్యంలో సామ్ ఇవాళ (ఏప్రిల్ 14) ‘శాంకుతలం’ సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చింది. సమంత తొలిసారి పౌరాణిక పాత్రలో కనిపిస్తుండటంతో సినిమాపై అంచనాలను పెంచాయి. దానికి తోడు గుణశేఖర్ డైరెక్టర్ కావడం, దిల్ నిర్మాతగా ఉండటంతో సినిమాపై బజ్ క్రియేట్ అయింది. దీనికి తగ్గట్టుగానే పాటలు, ప్రచార చిత్రాలు, ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటంతో శాకుంతలంపై ఆసక్తి రెట్టింపు అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? సమంత, గుణశేఖర్లకు హిట్ తెచ్చి పెట్టిందా? వంటివి రివ్యూలో చూద్దాం.
కథ:
విశ్వామిత్రుడి తపస్సు భగ్నం చేయడానికి ఇంద్రుడు ఆదేశంతో మేనక (మధుబాల) భూమిపైకి వస్తుంది. తన అందంతో తపస్సును నాశనం చేయడమే కాకుండా విశ్వామిత్రుడికి శారీరకంగా దగ్గరై పాపకు జన్మనిస్తుంది. ఆ పాపకు కణ్వ మహర్షి (సచిన్ ఖడేకర్) శాంకుతల(సమంత)గా పేరు పెట్టి కన్నబిడ్డలా పెంచుతాడు. శాంకుతల పెద్దయ్యాక ఓ రోజు కణ్వ అశ్రమానికి వచ్చిన దుష్యంత మహారాజు(దేవ్ మోహన్) ఆమె అందచందాలు చూసి ఇష్టపడతాడు. గాంధర్వ వివాహంతో ఒక్కటవుతారు. త్వరలోనే తిరిగి వచ్చి రాజ్యానికి తీసుకెళ్తానని దుష్యంతుడు హామి ఇస్తాడు. ఈ క్రమంలో సమంత గర్భవతి అవుతుంది. ఈ నేపథ్యంలో దుష్యంతుడు, సమంత ఎలా కలిశారు? వారు విడిపోవడానికి దుర్వాస మహాముని (మోహన్బాబు)కి ఉన్న సంబంధం ఏంటి? అనేది అసలు కథ. ఇది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే:
శకుంతల పాత్రకు సమంత పూర్తిగా న్యాయం చేసింది. భావోద్వేగ సన్నివేశాలను బాగా పండించింది. అయితే ఈ పాత్రకు సమంత సొంతగా డబ్బింగ్ చెప్పుకోవడం మైనస్ అని చెప్పొచ్చు. పౌరాణిక పాత్ర కావడంతో సమంత వాయిస్ అతికినట్లు అనిపించదు. భరతుడి పాత్రలో అల్లు అర్హ ఆకట్టుకుంది. ఎంతో చలాకీగా నటించింది. ముద్దుముద్దు మాటలతో అలరించింది. అటు దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటన ఆకట్టుకుంటుంది. సమంత, దేవ్ మోహన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక దుర్వాస మహర్షి పాత్రకు మోహన్బాబు నిండుదనం తీసుకొచ్చారు. ఆయన తెరపై కనిపించేంది కొద్దిసేపే అయినప్పటికీ తన నటనతో అందరినీ కట్టిపడేస్తాడు. సచిన్, అనన్య, మధుబాల, జిషు సేన్ గుప్తా వంటి నటులు తెరపై చాలా మందే ఉన్నప్పటికీ నటనపరంగా వారికి పెద్దగా అవకాశం దక్కలేదు.
టెక్నికల్గా:
శాకుంతలం సినిమాను తీయడంలో డైరెక్టర్ గుణశేఖర్ తడబడినట్లు కనిపిస్తోంది. అందరికీ తెలిసిన ప్రేమ కావ్యాన్ని ఓ దృశ్య కావ్యంలా ఆవిష్కరించడంలో డైరెక్టర్ విఫలమయ్యారు. గ్రాఫిక్స్ విజువల్స్ విషయంలో మరింత శ్రద్ధ వాహించి ఉంటే బాగుండేది. దుష్యంతుడు రాజుగా కంటే కమర్షియల్ సినిమాల్లో హీరోగానే ఎక్కువగా అనిపిస్తాడు. పైగా శాంకుతలం కథ దుష్యంతుడి కోణంలో చెప్పుకుంటూపోవడం ప్రేక్షుకులకు అంతగా రుచించలేదు. అయితే మణిశర్మ సంగీతం ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. ఆయన అందించిన నేపథ్య సంగీతం, పాటలే సినిమాలో హైలెట్ అని చెప్పొచ్చు. ఇక నిర్మాణ విలువలు కూడా పర్వాలేదు.
ప్లస్ పాయింట్స్
సమంత నటనమణిశర్మ సంగీతం విరామ, పతాక సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
నెమ్మదిగా సాగే కథనంగ్రాఫిక్స్సాగదీత సన్నివేశాలు
రేటింగ్: 2/5
ఏప్రిల్ 15 , 2023
![Shivarathri: శివరాత్రి రోజున శివ భక్తులు తప్పక చూడాల్సిన 5 సినిమాలు ఇవే..](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/02/16151540/cropped-ws_640px-Shiva_Bijapur-1.jpg)
Shivarathri: శివరాత్రి రోజున శివ భక్తులు తప్పక చూడాల్సిన 5 సినిమాలు ఇవే..
]జగద్గురు ఆదిశంకరఆదిశంకరాచార్యుల జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పూర్తిగా ఆధ్యాత్మిక బాటలో సాగుతుందీ సినిమా. నాగార్జున, సాయికుమార్, మోహన్ బాబు, కమలిని ముఖర్జీ తదితరులు కీలక పాత్ర పోషించారు. శంకరచార్యులుగా కౌశిక్ బాబు నటించాడు.Watch Now
ఫిబ్రవరి 16 , 2023
![SSMB29: హమ్మయ్యా..! మొత్తానికి పూర్తి చేశారు… త్వరలో అప్డేట్!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/04/01173648/Untitled-design-2024-04-01T173644.472.jpg)
SSMB29: హమ్మయ్యా..! మొత్తానికి పూర్తి చేశారు… త్వరలో అప్డేట్!
దర్శక దిగ్గజం SS రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కాంబోలో వస్తున్న చిత్రం SSMB29 (వర్కింగ్ టైటిల్). ఈ సినిమా అప్డేట్ గురించి మహేష్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది ? ఎలా ఉండబోతుంది అనే వాటిపై సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సమ్మర్లో కనీసం ఒక్క అప్డేట్ అయినా ఇస్తారా? లేదా? అంటూ మదన పడుతున్నారు. సోషల్ మీడియాలో తమ ఆవేదనను పంచుకుంటున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం గురించి ఓ రూమర్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తయిందని, ప్రస్తుతం సంభాషణలపై కసరత్తు చేస్తున్నారని తెలిసింది. డైలాగ్స్ రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి మాటలు రాస్తున్నట్లు సమాచారం. ఆయన గతంలో RRR చిత్రానికి మాటలు రాసిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ థ్రిల్లర్గా కథ రాసుకున్నట్లు రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను, రాజమౌళి సౌతాఫ్రికా రైటర్ విల్బర్ స్మిత్ వీరాభిమానులం అని చెప్పుకొచ్చారు. ఆయన నవలల ఆధారంగానే స్క్రిప్ట్ వర్క్ చేసినట్లు వెళ్లడించారు. దీంతో ఈ చిత్రం అడ్వెంచర్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనుంది.
మహేష్ లుక్పై జాగ్రత్తలు
SSMB 29లో మహేష్ లుక్(Mahesh look) ఎలా ఉండనుందన్న ఆసక్తి ప్రస్తుతం ఫ్యాన్స్ అందరిలోనూ నెలకొంది. ఈ క్రమంలో మహేష్ తన ఇన్స్టాగ్రామ్లో ‘లేజర్ ఫోకస్’ అంటూ కొత్త ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ పిక్లో మహేష్ క్లీన్ షేవ్ అండ్ లాంగ్ హెయిర్తో కనిపించాడు. మరి ఈ లుక్ SSMB29 కోసమేనా? లేదా నార్మల్ లుక్? అన్న దానిపై చిత్ర యూనిట్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే రాజమౌళి చిత్రం కోసం ఈ లుక్ను ఫిక్స్ చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ కూడా రానుంది.
మహేష్ సరసన అలియా భట్?
'SSMB 29' సినిమాలో మహేష్కు జోడీగా అలియా భట్ (Alia Bhatt) అయితే ఎలా ఉంటుందని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో దర్శకుడు రాజమౌళి.. అలియా భట్తో పని చేశారు. ఇందులో అలియా భట్ నటన నచ్చడంతో మళ్లీ ఆమెను రిపీట్ చేసే అవకాశముందని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాగా, హాలీవుడ్ నటి చెల్సియా ఇస్లాన్ కూడా 'SSMB 29' చిత్రానికి ఎంపికైనట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వార్తను కూడా మేకర్స్ ఇప్పటివరకూ ధ్రువీకరించలేదు.
SSMB 29.. టైటిల్ ఇదేనా?
దర్శకధీరుడు రాజమౌళి.. తన సినిమాల టైటిల్ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తుంటారు. ఇప్పటివరకూ ఆ తీసిన మూవీల పేర్లను గమనిస్తే.. చాలా కొత్తగా ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఈ క్రమంలోనే 'SSMB 29' సినిమాకు కూడా రాజమౌళి ఓ పేరును పరిశీలిస్తున్నారట. మహేష్ చిత్రానికి 'మహారాజ' అనే టైటిల్ను అనుకుంటున్నట్లు టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ పేరులో మహా.. రాజమౌళిలలో 'రాజ' తీసుకొని ఈ టైటిల్ను క్రియేట్ చేశారట. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.
ఏప్రిల్ 01 , 2024
![Shivathmika Rajashekar: ఎద అందాలతో హద్దులు చెరిపేసిన శివాత్మిక..!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/02/16173419/123.-10.jpg)
Shivathmika Rajashekar: ఎద అందాలతో హద్దులు చెరిపేసిన శివాత్మిక..!
రాజశేఖర్ - జీవిత నట వారసురాలు శివాత్మిక (Shivathmika Rajashekar) సోషల్ మీడియాలో మరోమారు రెచ్చిపోయింది.
తాజా ఫొటో షూట్లో హద్దులన్నీ చెరిపేసిన ఈ చిన్నది నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎద అందాలను చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది.
శివాత్మిక అందాలను చూసిన నెటిజన్లు మైమరిచిపోతున్నారు. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని గ్లామర్ ఆమెదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
2019లో ‘దొరసాని’ చిత్రం ద్వారా శివాత్మిక తెలుగు తెరకు పరిచయమైంది. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయిన శివాత్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి.
దొరసానిలో శివాత్మిక నటనకు సైమా అవార్డ్ లభించింది. ఉత్తమ తొలి పరిచయ హీరోయిన్గా పురస్కారం అందుకుంది.
దొరసాని తర్వాత ‘పంచతంత్రం’, ‘ఆకాశం’ చిత్రాలతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది శివాత్మిక. అయితే ఆ చిత్రాలు కూడా కమర్షియల్గా పెద్దగా ఆకట్టుకోలేదు.
ఇటీవల ‘రంగమార్తండ’ సినిమాలో శివాత్మిక మెరిసింది. బంగారం పాత్రలో ఆమె నటనకు మంచి ప్రశంసలే దక్కాయి.
స్టార్ హీరోయిన్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్న శివాత్మిక.. తెలుగులో అవకాశాలు తగ్గడంతో సోషల్మీడియాపై ఫోకస్ పెట్టింది.
తనలో హోమ్లీ లుక్ మాత్రమే కాదు మోడ్రన్ లుక్ కూడా ఉందని దర్శక నిర్మాతలకు తెలిసేలా ఫోటో షూట్స్ చేస్తోంది.
హాట్ డోస్ను రెట్టింపు చేస్తూ ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోలను పంచుకుంటోంది. చురకత్తుల్లాంటి చూపులతో ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది.
శివాత్మిక తీరుతో ఆమెకు పాపులారిటీ దక్కడమే గాకుండా ఫాలోయింగ్ కూడా పెరుగుతూ వస్తోంది. నిత్యం నెటిజన్లు శివాత్మిక సోషల్ మీడియా వాల్పై కన్నేస్తున్నారు.
ఈ స్టార్ కిడ్ ఎప్పుడు ఎలాంటి ట్రీట్ ఇస్తుందా అని నెటిజన్లు ఆశగా ఎదురు ఈ స్టార్ కిడ్ ఎప్పుడు ఎలాంటి ట్రీట్ ఇస్తుందా అని నెటిజన్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం శివాత్మిక ఇన్స్టాగ్రామ్ ఖాతాను 3 లక్షల 95 వేల మంది ఫాలో అవుతున్నారు.
ఫిబ్రవరి 16 , 2024
![Hanuman Viral Video: ‘హనుమాన్’ చూస్తూ థియేటర్లో మహిళ వింత ప్రవర్తన.. కారణం దైవమా? దెయ్యమా?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/01/30165913/Untitled-design-2024-01-30T165905.255.jpg)
Hanuman Viral Video: ‘హనుమాన్’ చూస్తూ థియేటర్లో మహిళ వింత ప్రవర్తన.. కారణం దైవమా? దెయ్యమా?
సంక్రాతికి విడుదలైన హనుమాన్ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను కొల్లగొడుతూ తన జైత్రయాత్రను ఇప్పటికీ కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఈ మూవీ క్లైమాక్స్ చూస్తే గూస్బంప్స్ రావడం పక్కా అని వీక్షకులు చెబుతున్నారు. సినిమాలోని చివరి 20 నిమిషాలు ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తుందని చిత్రం విడుదలైనప్పటికీ నుంచి ఆడియన్స్ పేర్కొంటూ వస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలను నిజం చేస్తూ తాజాగా ఓ వీడియో (Hanuman Viral Video) బయటకి వచ్చింది. ప్రస్తుతం నెట్టింట అది వైరల్ అవుతోంది.
మహిళ విచిత్ర ప్రవర్తన
హనుమాన్ క్లైమాక్స్ చూస్తూ ఓ మహిళ పూనకంతో ఊగిపోయింది. ఒంట్లోకి ఎవరో ఆవహించినట్లు విచిత్రంగా ప్రవర్తించింది. ఈ ఘటనతో సినిమా చూస్తున్నవారు షాకయ్యారు. ఆ మహిళను సాధారణ స్థితిలోకి తీసుకువచ్చేందుకు యత్నించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
https://twitter.com/i/status/1752014453342969952
ఒంట్లోకి దేవుడు వచ్చాడా?
ఉప్పల్లోని ఏసియన్ మాల్లో ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. హనుమాన్ సినిమా చివర్లో వచ్చే పాటను చూస్తూ ఆ మహిళ పూనకం వచ్చినట్లు ప్రవర్తించిందని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత వీడియోను చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఆ మహిళ ఒంట్లోకి దేవుడు పూనాడని అందుకే ఆమె అలా ప్రవర్తించి ఉండొచ్చని అంటున్నారు. గ్రామ దేవతలు ఆవహించినప్పుడు కొందరి ప్రవర్తన సరిగ్గా ఇలాగే ఉంటుందని గుర్తు చేస్తున్నారు.
దుష్టశక్తే ఈ పని చేసిందా?
మరికొందరు నెటిజన్లు మరో విధంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆమె శరీరంలో నెగిటివ్ ఎనర్జీ ఉండి ఉండవచ్చని అంటున్నారు. హనుమాన్ మూవీ చూస్తున్న క్రమంలో అది ఒక్కసారిగా బయటకు వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. హనుమాన్ దెబ్బకి ఆ దుష్టశక్తి ఆమె ఒంట్లో నుంచి వెళ్లిపోయి కూడా ఉంటుందని పోస్టులు పెడుతున్నారు. ఈ రెండు విభిన్నమైన వాదనలలో ఏది నిజమో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు.
అసలు నిజం ఇదే!
ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. సినిమా చూస్తున్న క్రమంలో ఆమెకు ఒక్కసారిగా ఫిట్స్ వచ్చాయని మహిళ సన్నిహితుల ద్వారా తెలిసింది. అందుకే ఆమె ఊగిపోయిందని సమాచారం. కొద్ది సేపటి తర్వాత సదరు మహిళ సాధారణ స్థితిలోకి వచ్చేసిందని చెబుతున్నారు. అసలు నిజం బయటకు వచ్చేలోపే వీడియో వైరల్ కావడంతో విభిన్నమైన అభిప్రాయాలు బయటకొచ్చాయి.
రూ.300 కోట్ల దిశగా పరుగులు
ఇక హనుమాన్ సినిమా (Hanuman Collections) విషయానికి వస్తే.. ఈ చిత్రం ఇప్పటివరకూ రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం రూ.300 కోట్ల మార్క్ను అందుకునేందుకు చకా చకా అడుగులు వేస్తోంది. హనుమాన్ మ్యానియా థియేటర్లలో కొనసాగుతుండటంతో ఈ వారంలోనే రూ.300 కోట్ల గ్రాస్ వచ్చేస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ స్క్రిప్ట్ను రెడీ చేస్తూ సీక్వెల్పై ఫోకస్ పెట్టారు.
జనవరి 30 , 2024
![Shivathmika: స్టన్నింగ్ లుక్స్లో శివాత్మిక అందాలు అదరహో..!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/11/16151824/Untitled-design-2023-11-16T151806.456.jpg)
Shivathmika: స్టన్నింగ్ లుక్స్లో శివాత్మిక అందాలు అదరహో..!
యంగ్ బ్యూటీ శివాత్మిక రాజశేఖర్ మరోమారు తన అందచందాలతో సోషల్మీడియాను ఆకర్షించింది. ఈ అమ్మడి లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.
తాజా ఫొటోల్లో మోడ్రన్ డ్రెస్లో కనిపించిన ఈ భామ లేలేత అందాలను ఆరబోసింది. ఎద, నడుము ఒంపులను చూపిస్తూ అభిమానులను ఆకట్టుకుంది.
స్టార్ హీరోయిన్ కావాలని భావిస్తున్న ఈ భామ తన ఒంపుసొంపులను ప్రదర్శించడంలో ఏ మాత్రం వెనకాడటం లేదు.
తనలో హోమ్లీ లుక్ మాత్రమే కాదు మోడ్రన్ లుక్ కూడా ఉందని దర్శకనిర్మాతలకు తెలిసేలా ఫోటో షూట్స్ చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఫ్యాషన్ డ్రెస్ వేసిన శివాత్మిక కెమెరాకు పోజులిచ్చింది.
ప్రముఖ నటులు జీవిత-రాజశేఖర్ కుమార్తె అయిన శివాత్మిక 2019లో వచ్చిన దొరసాని సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీలో శివాత్మిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
దొరసాని తర్వాత ‘పంచతంత్రం’, ‘ఆకాశం’ చిత్రాలతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది శివాత్మిక. అయితే ఆ చిత్రాలు కూడా కమర్షియల్గా పెద్దగా ఆకట్టుకోలేదు.
తాజాగా ‘రంగమార్తండ’ సినిమాలో శివాత్మిక మెరిసింది. బంగారం పాత్రలో ఆమె నటనకు మంచి ప్రశంసలే దక్కాయి.
గత కొన్ని రోజులుగా శివాత్మిక సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటోంది. హాట్ హాట్ ఫొటోలతో ఫ్యాన్స్ను అలరిస్తోంది.
శివాత్మిక పెట్టిన ఫొటోలను ఆమె ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఆమె అందాలపై పొగడ్తల వర్షం కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
నవంబర్ 16 , 2023
![Actress Samantha: స్విమ్ సూట్లో రెచ్చిపోయిన సమంత.. వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/11/09165814/F-eU1z2XMAAek9U-822x1024-1.jpg)
Actress Samantha: స్విమ్ సూట్లో రెచ్చిపోయిన సమంత.. వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన గ్లామర్ ఫొటోతో మరోమారు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్విమ్ సూట్ డ్రెస్లో ఉన్న ఈ భామ బోల్డ్ ఫొటో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ ‘బజార్’ (Bazar) సమంతపై ఫోటో షూట్ చేసింది. బ్లాక్ డిజైనర్ అవుట్ ఫిట్లో సమంతను సూపర్ హాట్గా ప్రజెంట్ చేసింది.
బికినీని పోలిన డ్రెస్లో సమంత హాట్ క్లీవేజ్ షో చేసింది. అమాంతం టెంపరేచర్ పెంచేసింది. సమంత బోల్డ్ పిక్ను చూసిన ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
ఈ మ్యాగజైన్ ఇంటర్యూలో పాల్గొన్న సమంత.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తిక వ్యాఖ్యలు చేసింది. తన జీవితంలో ఎదురైన ఒడిదొడుకులపై వివరణ ఇచ్చింది.
విడాకులు, వరుస ఫ్లాప్లు, ఆరోగ్య సమస్యలు అన్నీ ఒకేసారి చుట్టుముట్టడంతో తాను ఎంతో కుంగిపోయినట్లు సమంత ఆవేదన వ్యక్తం చేసింది.
ఒకవైపు ఆరోగ్యం దెబ్బతింటుంటే.. మరోవైపు తన వైవాహిక బంధం కూడా ముగిసిందని సమంత బాధ పడింది. అదే సమయంలో తాను నటించిన సినిమాలకు కూడా ప్రేక్షకాదరణ లభించలేదని పేర్కొంది.
గత రెండేళ్లుగా ఎంతో బాధకు, కుంగుబాటుకు లోనైనట్లు సమంత చెప్పింది. ఆ సమయంలో ఎంతో మంది నటీనటుల గురించి చదివానని చెప్పుకొచ్చింది.
ఆ నటులు తమ ఆరోగ్య సమస్యలను ఎలా ఎదుర్కొన్నారు? ట్రోలింగ్ను తట్టుకొని ఎలా నిలబడ్డారు? వంటి విషయాలను తెలుసుకున్నట్లు సమంత చెప్పింది.
కష్టకాలంలో వారి గురించి చదవడం ఎంతో ఉపయోగపడిందని, వారు చేయగలిగినప్పుడు తాను కూడా ఎదుర్కోగలనన్న నమ్మకం కలిగిందన్నారు. ఆ ధైర్యంతోనే జీవితంలో ముందుకు సాగుతున్నట్లు సమంత పేర్కొంది.
ఒక నటిగా గుర్తింపు పొందటం అందమైన బహుమతి అని సమంత అభిప్రాయపడింది. అందుకే నటిగా తన బాధ్యతను నిర్వర్తించడంలో ఎంతో నిజాయితీగా ఉంటానని స్పష్టం చేసింది.
నటీనటుల జీవితాలంటే ఎప్పుడూ సినిమాల ఫలితాలు, అవార్డులు, వాళ్ల దుస్తులు మాత్రమే కాదని సామ్ అభిప్రాయపడింది. వాళ్లకు కూడా ఎన్నో కష్టాలు, బాధలు ఉంటాయని స్పష్టం చేసింది.
‘నా ఒడుదొడుకులు అందరికీ తెలిసినందుకు నేనేం బాధపడను. నాలాంటి వాళ్లు ఎంతో మంది ఉన్నారు. వారంతా నాలాగే పోరాడే శక్తిని పొందాలని నేను ఆశిస్తున్నా’ అని సమంత ఇంటర్యూలో చెప్పుకొచ్చారు.
నవంబర్ 09 , 2023
![RAKESH MASTER: ఏపీ కల్తీ మద్యమే రాకేష్ మాస్టర్ను చంపేసిందా?... ఇవిగో సాక్ష్యాలు!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/06/19102959/collage.jpg)
RAKESH MASTER: ఏపీ కల్తీ మద్యమే రాకేష్ మాస్టర్ను చంపేసిందా?... ఇవిగో సాక్ష్యాలు!
టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ తీవ్ర అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే రాకేష్ మాస్టర్ మృతి కారణాల పట్ల సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాకేష్ మాస్టర్ చనిపోవడానికి ఏపీలో అమ్ముతున్న చీప్ లిక్కర్, కల్తీ మద్యమే కారణమని వైసీపీ సర్కారును ట్రోల్ చేస్తున్నారు. అక్కడ విరివిగా లభించే 'బూమ్ బూమ్' బీర్లను రాకేశ్ మాస్టర్ ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యం చెడిపోయి ప్రాణాలు కోల్పోయారని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు వీడియోలను షేర్ చేస్తున్నారు.
https://twitter.com/mana_Prakasam/status/1670462301533765632?s=20
ఏపీలో మద్యపానం నిషేధం పేరిట తొలుత మద్యం ధరలు భారీగా పెంచారని గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత నకిలీ, కల్తీ మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇచ్చి విచ్చలవిడిగా అమ్ముతున్నారనీ ఆరోపించారు. వీటి తయారీ వెనుక ఉన్నది వైసీపీ నేతలే ఉన్నారని గతంలో ప్రతిపక్షాలు కూడా పెద్దఎత్తున విమర్శించిన సంగతి తెలిసిందే. బ్రాండెడ్ మద్యం అమ్మకం వల్ల ప్రభుత్వానికి ఆదాయం రాదని.. అందుకే చీప్ మద్యానికి అనుమతించారని కామెంట్లు చేస్తున్నారు. కల్తీ మద్యానికి రాకేష్ మాస్టర్ బలి అయ్యారని పోస్టులు పెడుతున్నారు.
https://twitter.com/apramayanam/status/1670464153348190209?s=20
మరణం ముందే తెలుసు..
ఎప్పుడూ యూట్యూబ్లో ఎంటర్టైన్ చేసే రాకేష్ మాస్టర్ మృతిని చూసి తట్టుకోలేని అభిమానులు ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. రాకేష్ మాస్టర్ తాను చనిపోతాననే విషయం తనకు ముందే తెలుసు. తన అనారోగ్యం గురించి తెలిసినా... అందర్ని నవ్విస్తూ కడుపులోనే తన బాధను దాచుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాకేశ్ మాస్టర్ మృతిపై సోషల్ మీడియాలో నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులు పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ.. "నా శరీరంలో మార్పు కనిపిస్తోంది. అది నాకు తెలుస్తోంది. నువ్వు ఉదయించే సూర్యుడివి నువ్వు అయితే… నేను అస్తమించే సూర్యుడిని. అమ్మా, నాన్నలను బాగా చూసుకో'' అంటూ వీడియోలో చెబుతున్నట్లు ఉంది. దీంతో తాను చనిపోతానన్న విషయం తనకు ముందే తెలుసని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.
https://twitter.com/Devineni_Hari/status/1670424465300402177?s=20
రాకేష్ మాస్టర్ చివరి కోరిక
ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్యూ ఇచ్చిన రాకేష్ మాస్టర్ తన చివరి కోరిక ఏమిటో చెప్పారు. ఆయన చనిపోయాక ఎక్కడ సమాధి చేయాలో పేర్కొన్నారు. 'ఇల్లు, దుస్తులు, శరీరం ఏదీ శాశ్వతం కాదు. నా మామగారి సమాధి పక్కన వేప మెుక్క నాటా. దాన్ని పెంచుతా. నేను చనిపోయిన తర్వాత ఆ చెట్టు కిందే నన్ను సమాధి చేయండని యూట్యూబ్ ఛానెల్స్కు విజ్ఞప్తి చేశా' అని మాస్టర్ అన్నారు.
డాక్టర్లు ఏమన్నారు?
రాకేశ్ మాస్టర్ మృతిపై గాంధీ ఆస్పత్రి వైద్యులు బులెటెన్ విడుదల చేశారు. ఉదయం రక్త విరేచనాలు కావడంతో మధ్యాహ్నం గాంధీ ఆసుపత్రిలో రాకేష్ మాస్టర్ అడ్మిట్ అయ్యారు. ఆయనకు డయాబెటిస్, సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ తీవ్రంగా ఉండటంతో శరీరంలోని చాలా అవయవాలు దెబ్బతిన్నాయి అని గాంధీ సూపరింటిండెంట్ రాజారావు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు రాకేశ్ మాస్టర్ తుదిశ్వాస విడిచారని పేర్కొన్నారు.
ప్రభాస్కు డ్యాన్స్ శిక్షణ
రాకేశ్ మాస్టర్కి ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరుంది. దాదాపు 1500కు పైగా సినిమాలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఈయన దగ్గర శిక్షణ తీసుకున్నవారే. కెరీర్ ఆరంభంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హీరో వేణు ప్రత్యూష మొదలైన సినీ నటులు రాకేష్ మాస్టర్ వద్ద శిక్షణను పొందారు. లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు మొదలైన సినిమాలలోని పాటలకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అలాగే ఈటీవీ వేదికగా ప్రారంభమైన డ్యాన్స్ షో ఢీ లో బషీర్ అనే కంటెస్టెంట్కు మాస్టర్గా వ్యవహరించాడు. ఆయన మృతికి తెలుగు చిత్ర పరిశ్రమ నివాళులు అర్పిస్తోంది.
https://twitter.com/CreatorYog/status/1670510684935962625?s=20
జూన్ 19 , 2023
![RAKESH MASTER: ప్రభాస్, రామ్ పొత్తినేని, రవితేజకు డ్యాన్స్ నేర్పింది రాకేష్ మాస్టరే!.. ఇవిగో వీడియోలు!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/06/19120538/Untitled-design-98.png)
RAKESH MASTER: ప్రభాస్, రామ్ పొత్తినేని, రవితేజకు డ్యాన్స్ నేర్పింది రాకేష్ మాస్టరే!.. ఇవిగో వీడియోలు!
రాకేష్ మాస్టర్ హ్యాష్ ట్యాగ్(#RakeshMaster) సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ఆయన గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూల తాలుకు వీడియోలను ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. ఎంతో మంది డ్యాన్స్ మాస్టర్లు, హీరోలకు శిక్షణ ఇచ్చిన రాకేష్ మాస్టర్ చివరి రోజుల్లో అందరికీ దూరమై ఏకాకిగా మిగలడంపై పలువరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముక్కు మీద కోపం, నిజాలను నిర్భయంగా చెప్పడం, ఎవర్నీ లెక్కచేయని మనస్తత్వం రాకేష్ మాస్టర్ను ఒంటరి చేసిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ప్రభాస్కు మాస్టర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ తొలి రోజుల్లో ఆయనకు డ్యాన్స్ శిక్షణ అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాస్కు రాకేష్ మాస్టర్ శిక్షణ ఇస్తున్న ఫొటోను నెటిజన్లు షేర్ చేశారు.
https://twitter.com/SumanthOffl/status/1670414528235073537?s=20
RAPOకు డ్యాన్స్ శిక్షణ
యంగ్ హీరో రామ్ పొత్తినేని కూడా రాకేష్ మాస్టర్ దగ్గర డ్యాన్స్లో మెళకువలు నేర్చుకున్నవాడే. ఆయన నటించిన దేవదాసు సినిమాకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఆ సినిమాలోని డ్యాన్స్... RAPOకు ఎంత పేరు తెచ్చిందో తెలిసిందే.
https://twitter.com/RamUniversal1/status/1670429314993594368?s=20
మాస్ మహారాజా రవితేజ నటించిన ఓ సినిమాలోని ఫుల్ సాంగ్లో రాకేష్ మాస్టర్ రవితేజతో కలిసి డ్యాన్స్ చేశారు.
https://twitter.com/avinashgoud00/status/1670430461372534785?s=20
1500 సినిమాలకు కొరియోగ్రఫీ
రాకేశ్ మాస్టర్ ఒకానొక దశలో టాలీవుడ్లో టాప్ కొరియోగ్రాఫర్గా కొనసాగారు. దాదాపు 1500కు పైగా సినిమాలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఈయన దగ్గర శిక్షణ తీసుకున్నవారే. ఈటీవీ డ్యాన్స్ షో ద్వారా రాకేష్ మాస్టర్ ప్రతిభ చాలా మందికి తెలిసింది.
https://twitter.com/CreatorYog/status/1670510684935962625?s=20
జనసేనకు ఓటు వేస్తా..
తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తిగతంగా ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో రాకేష్ మాస్టర్ తెలిపారు. జనసేనకే తాను ఓటు వేస్తానని బహిరంగంగా ప్రకటించారు. జనసేనపై అభిమానంతో చేతిపై వేసుకున్న టాటూను చూపించారు. ఓటు వేసేటప్పుడు కులాలు పట్టించుకోనని స్పష్టం చేశారు. తాను రెడ్డి సామాజిక వర్గమైనా ఓటు మాత్రం పవన్ కళ్యాణ్కే వేస్తానని పేర్కొన్నారు.
https://twitter.com/Vamsitweetzz/status/1670428040638386181?s=20
శేఖర్కు లైఫ్ ఇచ్చాడు..
తన తమ్ముడు ఎంతో మందికి లైఫ్ ఇచ్చాడు అని రాకేష్ మాస్టర్ అక్కగారు అన్నారు. శేఖర్, జానీ, సత్య మాస్టర్లు చాలా కాలం పాటు తన తమ్ముడి ఇంట్లోనే ఉండేవారని చెప్పారు. రాకేష్ మాస్టర్ ఎవరికీ అన్యాయం చేయలేదని వివరించారు. డ్యాన్స్ ప్రొఫెషన్ వల్ల కుటుంబానికి దూరమయ్యానరని వెల్లడించారు. ఈ మధ్య ఫొన్ చేసి మమ్మల్ని కలవాలని ఉందని చెప్పుకొచ్చారు. అనారోగ్య సమస్యల వల్ల తననే ఇక్కడకు రావాలని కోరినట్లు చెప్పారు. అంతలోనే తన తమ్ముడు చనిపోవడం బాధకలిగిస్తోందని కన్నీటి పర్యంతం అయ్యారు.
https://www.facebook.com/watch/?v=188462650858056
శేఖర్ మాస్టర్తో చెడింది ఇక్కడే..
శేఖర్ మాస్టర్ను తన కన్న కొడుకులాగా చూసుకున్నాని పలు ఇంటర్వ్యూల్లో రాకేష్ మాస్టర్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ 150 సినిమాలో రెండు పాటలకు కొరియోగ్రఫీ చేసే అవకాశం శేఖర్ మాస్టర్కు వచ్చింది. అయితే ఆ విషయం తనకు శేఖర్ చెప్పలేదని రాకేష్ మాస్టర్ తెలిపారు. ఇంట్లో భార్యకు చెప్పాడు కానీ తనకు చెప్పలేదని పేర్కొన్నారు. ఇతరులతో తాము ఎలా ఉన్నా.. తమ మధ్య మాత్రం అబద్దాలు, దాపరికాలు తావు ఉండొద్దని ప్రతిజ్ఞ చేశామని చెప్పుకొచ్చారు. కానీ ఆ విషయాన్ని శేఖర్ మరిచాడని ఆరోపించారు. తనకు వచ్చిన అవకాశాలను శేఖర్కు ఇప్పించానని చెప్పుకొచ్చారు. తాను చనిపోతే... తన శవాన్ని కూడా శేఖర్ తాకొద్దని రాకేష్ మాస్టర్ అన్నారు.
అయితే ఇదే విషయమై శేఖర్ మాస్టర్ కూడా స్పందించారు. ఖైదీ 150 సినిమాలో రెండు పాటలకు అవకాశం వచ్చిందని కానీ అవి కన్ఫర్మ్గా తెలియదని వెల్లడించాడు. కన్ఫర్మ్ అయ్యాక రాకేష్ మాస్టర్కు చెబుదామని అనుకున్నాని పేర్కొన్నాడు. తనను ఏరా పోరా అన్నా పడుతానని.. కానీ తన భార్యకు కాల్ చేసి అసభ్యంగా మాట్లాడరని శేఖర్ చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచే వీరి మధ్య దూరం పెరిగింది. మరి ఈరోజు రాకేష్ మాస్టర్ అంత్య క్రియలకు శేఖర్ మాస్టర్ వస్తారో లేదో చూడాలి మరి..
జూన్ 19 , 2023
![Shivathmika Rajashekar: సమ్మర్లో మరింత హీట్ పెంచుతున్న శివాత్మిక అందాలు](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/04/04182121/Featured-image-34.jpg)
Shivathmika Rajashekar: సమ్మర్లో మరింత హీట్ పెంచుతున్న శివాత్మిక అందాలు
రాజశేఖర్ నట వారసురాలు శివాత్మిక సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. తాజాాగా కొన్ని ఫోటోలను షేర్ చేసిన ఈ బామ ఎద అందాలతో రెచ్చిపోయింది.
నడుము, ఎద అందాలను చూపిస్తూ సెల్ఫీలకు ఫోజులు ఇచ్చింది. సినిమాల్లో ట్రెడిషనల్గా కనిపించే ఈ భామను హాట్ లుక్స్లో చూసి నెటిజన్లు షాకవుతున్నారు.
2019లో దొరసాని చిత్రం ద్వారా శివాత్మిక తెలుగు తెరకు పరిచయమైంది. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయిన శివాత్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి.
దొరసానిలో శివాత్మిక నటనకు సైమా అవార్డ్ లభించింది. ఉత్తమ తొలి పరిచయ హీరోయిన్గా పురస్కారం అందుకుంది.
దొరసాని తర్వాత పంచతంత్రం, ఆకాశం చిత్రాలతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది శివాత్మిక. అయితే ఆ చిత్రాలు కూడా కమర్షియల్గా పెద్దగా ఆకట్టుకోలేదు.
తాజాగా ‘రంగమార్తండ’ సినిమాలో శివాత్మిక మెరిసింది. బంగారం పాత్రలో ఆమె నటనకు మంచి ప్రశంసలే దక్కాయి.
గత కొన్ని రోజులుగా శివాత్మిక సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటోంది. హాట్ హాట్ ఫొటోలతో ఫ్యాన్స్ను అలరిస్తోంది.
శివాత్మిక పెట్టిన ఫొటోలను ఆమె ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఆమె అందాలపై పొగడ్తల వర్షం కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ఏప్రిల్ 04 , 2023
![<strong>Indian 2 Weekend Collections: దారుణంగా పడిపోయిన ‘భారతీయుడు 2’ వసూళ్లు.. వీకెండ్ ఎంతంటే?</strong>](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/07/15154055/Untitled-design-2024-07-15T154052.100.jpg)
Indian 2 Weekend Collections: దారుణంగా పడిపోయిన ‘భారతీయుడు 2’ వసూళ్లు.. వీకెండ్ ఎంతంటే?
కమల్ హాసన్ (Kamal Haasan), శంకర్ (Director Shankar) కాంబినేషన్లో వచ్చిన 'భారతీయుడు 2' (Bharateeyudu 2) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది. తొలి ఆట నుంచే ఈ మూవీకి నెగిటివ్ టాక్ రావడంతో దాని ప్రభావం వసూళ్లపై స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో తొలిరోజుతో పాటు శని, ఆదివారాల్లోనూ ఈ మూవీకి తక్కువ వసూళ్లే వచ్చాయి. ఫలితంగా ఈ మూవీ వీకెండ్ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. దీంతో ఈ చిత్రం డిజాస్టర్గా మిగిలిపోతుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది.
వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
‘భారతీయుడు 2’ చిత్రం ఈ వీకెండ్ (Bharateeyudu 2 Weekend Collections)లో రూ.59 కోట్లు మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. తొలిరోజు ఈ చిత్రానికి రూ.25 కోట్లు రాగా, శని, ఆది వారాల్లో అది రూ.18.2 కోట్లు, రూ.15.1 కోట్లకు పడిపోయినట్లు పేర్కొన్నాయి. శనివారం తమిళ వెర్షన్కు రూ.13.7 కోట్లు, తెలుగుకు రూ.3.2 కోట్లు, హిందీలో రూ.1.3 కోట్లు వచ్చినట్లు తెలిపాయి. ఇక ఆదివారం కలెక్షన్స్ పెరగాల్సింది పోయి మరింత తగ్గినట్లు చెప్పాయి. ఆదివారం (జులై 14) ఇండియాలో ఈ సినిమాకు రూ.15.1 కోట్లు రాగా అందులో తమిళ వెర్షన్కే రూ.11 కోట్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. తెలుగులో రూ.2.8 కోట్లు, హిందీ వెర్షన్లో రూ.1.3 కోట్లు మాత్రమే ‘భారతీయుడు 2’ రాబట్టగలిగిందని వెల్లడించాయి.
ఇకపై మరింత పతనం!
తొలి వీకెండ్లో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోవడంతో చిత్ర యూనిట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మెుదటి వారంతంలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో కలెక్షన్స్ ఏ స్థాయికి దిగిపోతాయోనని ఆవేదన వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల తాకిడి లేకపోవడంతో ‘భారతీయుడు 2’ ప్రసారాలను థియేటర్ యజమానులు నిలిపేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎక్కువగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సోమవారం నుంచి ‘భారతీయుడు 2’ వసూళ్లు మరింత దారుణంగా ఉండే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నాయి. కేవలం తమిళ మార్కెట్ ఒక్కటే ‘భారతీయుడు 2’కు ఆశా కిరణంగా ప్రస్తుతం కనిపిస్తోందని పేర్కొన్నాయి.
డే1 కలెక్షన్స్ ఎంతంటే?
‘భారతీయుడు 2’ (Bharateeyudu 2 Day 1 Collections)పై వచ్చిన నెగిటివ్ రివ్యూస్ తొలిరోజు కలెక్షన్స్పై ప్రభావం చూపింది. ఈ చిత్రం మెుదటి రోజు రూ.25.6 కోట్ల వసూళ్లను (GROSS) రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఒక్క తమిళ వెర్షన్లోనే అత్యధికంగా రూ.16.5 కోట్లు కలెక్ట్ చేసినట్లు పేర్కొన్నాయి. తెలుగులో రూ.7.9 కోట్లు, హిందీలో కేవలం రూ.1.2 కోట్లు మాత్రమే రాబట్టినట్లు ప్రకటించాయి. హిందీ ఆడియెన్స్ను ఆకట్టుకోవడంలో ఈ మూవీ పూర్తిగా విఫలమైందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అందుకే నార్త్లో ఈ మూవీ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయని చెప్పాయి. అటు తెలుగు ఆడియన్స్ సైతం ఈ మూవీపై ఆసక్తి కనబరచడం లేదని తెలియజేశాయి.
ఆ చిత్రాలతో పోలిస్తే భారీ కోత!
కమల్ హాసన్ గత చిత్రం 'విక్రమ్' (Vikram)తో పోలిస్తే 'భారతీయుడు 2' డే 1 కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. విక్రమ్ తొలి రోజున ఏకంగా రూ.60 కోట్ల వసూళ్లను సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. రీసెంట్గా కమల్ హాసన్ విలన్గా చేసిన 'కల్కి 2898 ఏడీ' తొలిరోజున రూ.190 కోట్లకు పైగా కలెక్షన్స్ దక్కించుకొని శభాష్ అనిపించుకుంది. అంతేకాదు డైరెక్టర్ శంకర్ గత చిత్రం ‘రోబో 2.0’ సైతం తొలిరోజు రూ.93 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. అయితే శుక్రవారం విడుదలైన 'భారతీయుడు 2' (Indian 2) మాత్రం ఆ చిత్రాలకు దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. ఆయా మూవీల డే1 కలెక్షన్స్లో కనీసం సగం కూడా రాబట్టలేకపోవడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేశాయి.
అందుకే వసూళ్లు తగ్గాయా?
‘భారతీయుడు 2’ డే 1 కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడానికి ప్రధాన కారణం ఆ మూవీ అంచనాలను అందులేకపోవడమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాయి. ఔట్ డేటెడ్ స్టోరీతో రావడం, స్క్రీన్ప్లే చాలా పేలవంగా ఉండటం ఈ సినిమాను దెబ్బతీసింది. సోషల్ మెసేజ్ సినిమాకు కాస్త బలాన్ని చేకూర్చినా, ‘భారతీయుడు’లో లాగా తండ్రి కూతురు సెంటిమెంట్ లేకపోవడం మైనస్గా మారింది. పాటలు కూడా వినసొంపుగా లేకపోవడం కూడా సినిమాపై నెగిటివ్ ప్రభావం చూపించింది. అన్ని విధాలుగా ఈ సీక్వెల్లో సేనాపతి (కమల్ హాసన్) తమను నిరాశకు గురిచేశారని నెటిజన్లు సైతం పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. ఈ కారణాల వల్ల ‘భారతీయుడు 2’ వసూళ్లు పడిపోయి ఉండొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
కథేంటి
చిత్ర అరవిందన్ (సిద్ధార్థ్), అతని ఫ్రెండ్స్ దేశంలోని అవినీతి, అన్యాయాలపై పోరాటం చేస్తుంటారు. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వారంతా భారతీయుడు మళ్లీ రావాలంటూ పోస్టులు పెడతారు. దీంతో గతంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు సేనాపతి (కమల్ హాసన్) తిరిగి ఇండియాకి వస్తాడు. దారుణమైన అవినీతి చేసిన వారిని, ప్రజల సొమ్మును దోచుకున్న కొందర్ని చంపేస్తాడు. అలాగే యూత్ను మోటివేట్ చేస్తాడు. అయితే అనూహ్య ఘటనలతో భారతీయుడుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అసలు ఏం జరిగింది? సామాన్య జనం సేనాపతిని ఎందుకు నిందించారు? వారి కోపానికి కారణం ఏంటి? భారతీయుడు తిరిగి వచ్చిన లక్ష్యం నెరవేరిందా? లేదా? అనేది కథ.
జూలై 15 , 2024